The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
PRIYA MAINA AMMA KI - TELUGU KAVITHA
మాతృత్వం
మాతృత్వం
ఆకృతి పొందని ఆకారమేదొ
కడుపులో.....కదలిక మొదలెట్టగానె
నాలో ఎదో తీయని భావన...
నేనెంతో సాధించినట్లు, ఏదో గెలిచినట్లు
ఈ నాలుగు మాసాల కాలనికే
నాకు నేనే అపురూపంగా... మురిపెంగా అనిపిస్తూ..
రోజు రోజుకూ వచ్చే కొత్త మార్పులకు
మనసుల్లసిల్లుతుంటే..... యదపొంగుతుంటె
ఉదరంలో శిశువు మరికొంత పెరిగి
బుల్లిబుల్లి పాదాలతో కదలి.. బుడుంగుమంటూ
బుజ్జిగాడి అల్లరి మొదలయి
ఏడుమాసాల పాపాయిగా ఎదిగినాక
ఎపుడూలేని ఆనందం.... అనుభూతిలో ఉండగానె
తొమ్మిదవ మాసం ప్రవేశించి...యిక
చిన్నారి రాకకోసం ఎదురుచూపు
చిత్రమయిన అనుభూతి
ఆ అనుభవం ఎలా వుంటుందో అని
కొంత అలజడి , అదొరకం ఆందోళన
ఇంతలోనె… అనుకున్న ఆ క్షణం రానేవచ్చింది.
అదోలా నడుములో... అర్ధంకాని నొప్పి
అంగుళం అంగుళం కదులుతూ
పాపాయి పొట్ట చీల్చుకుంటూ వస్తున్న భావన
భరించలేక మెలితిరుగుతూ... అనుకున్నా..
బుద్దుంటె మరింక కనకూడదు.. అని
అలాగె.. ఆ రాత్రంతా నన్నేడిపిస్తూ,
నాకు.. నరకాన్ని చుపిస్తూ..
తెల్లారెసరికి వచింది కేర్ కేర్ మంటూ...
మెత్తని పొత్తిళ్ళలో మరింత మెత్తగా
లేతగులబి మొగ్గలా.. ముద్దుగా.
సొలిపొతున్న కళ్ళను విప్పార్చి చుసుకున్నా
ఎంత ముద్దుగా ఉందో నా బంగారుతల్లి
ఎంత గర్వమో నాలో ఆకాశంలా
మనసంతా ఆనందమె నిండగా
అపురూపంగా గుండెలకదుముకుంటుంటె
అనిపించింది.... యిలాంటి చిన్నారులను
ఎంతమందినయినా కనొచ్చని.
నా మనసు నన్ను చూచి నవ్వింది
మరెంతసేపయిందనీ...బుద్దుంటే
కనకూడదు అనుకుని
యింతలొ అంత బుద్దీ ఏమయినట్లు ..?
అదేకదా విచిత్రం... అమ్మమనసు చిత్రం
యిలాంటి అనుభూతి కోసం,
ఈ ఆనందంకోసం , ఈ ఆత్మవిశ్వాసంకోసం
ఈ తృప్తి కోసం.... ఏ నరకమయినా భరించి
పేగులు తెంచుకుంటూ వచ్చే చిన్నారులను
కనాలనె అనుకుంటుంది... ఆడది
అందుకేనేమొ అది "మాతృత్వం " అయింది
ఎప్పటికీ కొత్తదిలా, ఎప్పుడూ కావాలనిపించేలా
ఏ తల్లీ మరువలేనిది మరపురానిది
ఈ "మాతృత్వం"... అదే "మాతృతత్వం"
రచయిత్రి ; దేవి
IAM WAITING FOR U DEAR - TELUGU KAVITHA-2
2. "సాంప్రదాయం "
చీర.. రవికలో
చూడ చక్కని సుందరి
నుదుట కుంకుమ.. చేతి కంకణాలె
భరత జాతి కన్నెకు పసిడి ఆభరణాలు
కవ్వించే జాబిలి
పుష్పించే పూలసందడి
ఆమెను ఆవిష్కరిస్తున్నాయేగాని
అవధులు దాటించలేదు
చిరుగాలి సరాగమాడి
పరువాల పరువును పలుకరించబోయినా
చాలులె... అంటూ
చేతిలో అడ్డుకుందిగానీ
ప్రకృతికి కూడా
తాను పలుచపడలేదు
కలువ కన్నులో కనిపించె ముగ్ధత్వం
మోములో అగుపించె అమాయకత్వం
వరించి వచ్చే విభునికోసం
ఎదురుచూస్తున్న వధువులా లేదూ...
అదీ మన సంస్కారం
అదే మన మాన ప్రాణం
అందుకె అందుతోంది మనకు
దేశ విదేశాల నమస్కారం.
* * * * * * * * * * * * * *
3. "మధ్యమం"
ఓ అందాల అతివా
నీ కన్నుల కలువలలో ఆ గుబులెందుకో
అందుకేనా .... ఆదమరపులో అరజారెను
పరువాల పసిడి పైటంచు
చల్లగ వీచే చిరుగాలి,
అల్లన సాగె అలల అల్లరి,
తొంగి చూచె కొంటె జాబిల్లి
వెన్నెల విరిసే హాయయిన వేళలో
ఎవరికోసమో ఈ ఎదురుచూపు ?
ఓ.. తెలిసిందిలే
ఈ లాహిరి లాలనలో
నిను లాలించే..
విభుని కోసమేకదా ఈ నీ నిరీక్షణ.
నీ చెలుని చేతిలోని
మల్లెల మత్తువాసనలు
ఏ కబురంపినాయో
కురుల కుబుసాల మిసమిసలు
వడివడిగ ముడివీడినాయి
అలివేణీ... యిక నీ ఆశ
నెరవేరే సమయం
నీ చెంతకు చేరనుంది
నీకు మధురమయిన
విందునందిచనుంది
సఖియా శెలవా మరియిక.
రచయిత్రి : దేవి
IAM WAITING FOR U DEAR - TELUGU KAVITHA-1
ఎదురుచూపులు
1 . "శృంగారం"
సుమ కోమల
కోమలి మదిలో గుబులు రేపుతూ
వెన్నెల రేడుకు వేడుకేమిటో
సగం దాగి సంగతేమిటంటున్నాడు.
గుబురు గున్నమామిడి
తోట పక్కన ఏటి ఒడ్డులో
మిసమిసల గుసగుసలేవో
సంగమించాలని వేచిన వేళ
అల్లరి అలలు అల్లన సాగి
అలజడి చేస్తున్నాయెందుకో
అసలె... పొంగే పరువం
ఆపై... రగిలే విరహం
ఏంతకూ... వినరాని
విభుని పాదాల సవ్వడికై
కాచుకున్న తరుణంలో
చిరు చిరు రుసరుసల కసుబుసులతో
నిలువని పసిడి పైటంచు
పైయ్యెదపై జారిపోతుంటె
అందుకు సై అంటూ
మరింత కవ్వించి... సహకరించె
చల చల్లని చిరుగాలి సందడి
మురిపెంగా విసిగిస్తుంటే
కడియాలందెలు, ముత్యాలదండలు
చెలి జూకాల భారాలు
యిక మోయలేనని
తనువు సొదపెడుతుంటె..
యింకెంతసేపో..
ఈ ఎదురుచూపు
నేనోపలేనని.. మది
మర్యాద మరచిపోతుంటె...
అతివా... నీ కలువకళ్ళలొ
రవ్వంత దిగులు తొంగిచూస్తొంది.
అయినా... అలివేణీ
విరహముకుడా మధురమె అన్నారు కదా !
వేచిన మనసుకి
వేయి వసంతాల సందడి తేదా……
హాయిని పంచే ఆతని అనురాగం
నీ సొంతం కాదా
అదిగో... అడుగుల సవ్వడి
అతడేనేమో... యిక
ఈ రేయి తని తీరదేమో.
* * * * * * * * * * * * * *
MOTHER - AMMA - TELUGU KAVITHA
జనని
"జనని"
మాత్రుత్వమనే అత్యుత్తమమైన స్థాయికి చేరుకుంటూ
ఓ స్త్రీ మూర్తి మనకిచ్చే అపురూప వరం "జననం"
మనకు జన్మనిచ్చి ఆ స్త్రీ మూర్తి "జనని" అవుతుంది
"జనని" అనే పదవిని పొందటానికి తను
పడిన బాధనంతా మర్చిపోతుంది ఆ
పసికందు నవ్వుల పువ్వుల్లో
అటువంటి జనని రుణం తీర్చుకోవటానికి
మనకు సరిపోదీ చిన్న జీవితం
అందుకే ఆ జననికి నే జన్మించే
ప్రతీ జన్మ అంకితం.... పునరంకితం.......
రచయత ; వంశీకృష్ణ సుజిత్
మాతృదినోత్సవ శుభాకాంక్షలు .
SPECIAL LADIES FESTIVALS IN TELUGU - UNDRALLA THADDHI FESTIVAL - HOW TO PERFORM PUJA, PERFORMANCE AND ITS IMPORTANCE
ఉండ్రాళ్ళతద్దె
ప్రతి సంవత్సరమూ భాద్రపద బహుళ తదియ నాడు నోచుకునే నోము ఉండ్రాళ్ళ తదియ.ముందు రోజు ఐదుగురు ముత్తైదువులకి గోరంటాకు ముద్ద ,పసుపు కుంకుమలు ,కుంకుడు కాయలు ,నువ్వులనూనె ఇచ్చి మాయింటికి తాంబూలము తీసుకోవటాని కి రండి అని ఆహ్వానించాలి.
ఉండ్రాళ్ళతద్దె లోని ప్రత్యేకత తెల్లవారుఝాము భోజనాలు.భోజనాలయాక ఉయ్యాలలూగుతారు.
మద్యాహ్నం గౌరీ పూజ.గౌరిని షొడశోపచారాలతో పూజించిన వారికి సమస్త శుభాలు సమకూరుతాయంటారు.ఐదు దారపు పోగులు పోసి,ఐదు ముడులు వేసి , ఏడుతోరాలను అమ్మవారి పక్కనే వుంచి పూజించాలి. ఒక తోరం అమ్మవారికి, ఒకటి నోముకున్నవారికి , మిగితా ఐదు, ఐదుగురు ముత్తైదువులకు కట్టాలి. బియ్యపు పిండిలో బెల్లము కలిపి ,పచ్చి చలిమిడి చేసి ,ఐదు ఉండ్రాలను చేసి , నైవేద్యం పెట్టాలి.
పూజ తరువాత చేతిలో అక్షింతలనుంచుకొని కథచెప్పుకోవాలి.ఈ వ్రత కథ ఏమిటంటే , పూర్వం ఓ వేశ్య ,తన సౌందర్యం తో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది.ఒక ఉండ్రాళ్ళతద్దె నాడు ,రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు.ఆమె అహంకారముతో దైవ నింద చేసీన నోముకో లేదు. పలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్ళారు.మహా వ్యాది బారాన పడ్డది.తరువాత రాజ పురోహితుడి సలహాతో ఉండ్రాల తద్దె నోము నోచుకొని, తన సంపద ని తిరిగి పొంది, ఆరోగ్యస్తు రాలై శేష జీవితాన్ని ఆద్యాత్మికంగా గడిపి ,మరణానంతరం గౌరీ లోకానికి వెళ్ళింది.
ఒక గర్విష్టికే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా ! సత్ప్రవర్తన తో ఉండి నోచినవారికి ఇంక ఎంత ఉన్నతమైన పలితముంటుందో ఊహించుకొని సన్మార్గం లో నడవండి ! అనేది ఈ కథలోని నీతి.
హిందు సాంప్రదాయములో నోములు ,పూజలకి పెద్ద పీటనే వేసారు. నోము నోచుకుంటేనే సుమంగళిగా వుంటామా ? అందుకోసం వ్రతాలు చేయాలా ? అని వితండ వాదం చేసే వారికి ఏమీ చెప్పలేను . అంత పరిజ్ఞానము నాకు లేదు. నోముకుందాము అనుకోగానే ఇల్లు శుభ్రం చేసి , మామిడాకులు కట్టి, ముగ్గేసి, దేవుడి పీఠానికి పూలూ ,ఆకులు అలంకరించి , ధూప దీప నైవేద్యాల తో పూజించి ,ముత్తైదువులకు ,తాంబూల మిచ్చి , ఆశీస్సులు తీసుకోవటము తో ఇంటికి ఓ కళ వస్తుంది. మనసు లో ఓ ప్రశాంతత ఏర్పడుతుంది.ఇంట్లో పాజిటివ్ వేవ్స్ వచ్చినట్లుగా వుంటుంది. కుటుంబ శ్రేయస్సు ,ఆద్యాత్మికానందం కలుగుతుంది.
ఉండ్రాళ్ళతద్దె లోని ప్రత్యేకత తెల్లవారుఝాము భోజనాలు.భోజనాలయాక ఉయ్యాలలూగుతారు.
మద్యాహ్నం గౌరీ పూజ.గౌరిని షొడశోపచారాలతో పూజించిన వారికి సమస్త శుభాలు సమకూరుతాయంటారు.ఐదు దారపు పోగులు పోసి,ఐదు ముడులు వేసి , ఏడుతోరాలను అమ్మవారి పక్కనే వుంచి పూజించాలి. ఒక తోరం అమ్మవారికి, ఒకటి నోముకున్నవారికి , మిగితా ఐదు, ఐదుగురు ముత్తైదువులకు కట్టాలి. బియ్యపు పిండిలో బెల్లము కలిపి ,పచ్చి చలిమిడి చేసి ,ఐదు ఉండ్రాలను చేసి , నైవేద్యం పెట్టాలి.
పూజ తరువాత చేతిలో అక్షింతలనుంచుకొని కథచెప్పుకోవాలి.ఈ వ్రత కథ ఏమిటంటే , పూర్వం ఓ వేశ్య ,తన సౌందర్యం తో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది.ఒక ఉండ్రాళ్ళతద్దె నాడు ,రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు.ఆమె అహంకారముతో దైవ నింద చేసీన నోముకో లేదు. పలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్ళారు.మహా వ్యాది బారాన పడ్డది.తరువాత రాజ పురోహితుడి సలహాతో ఉండ్రాల తద్దె నోము నోచుకొని, తన సంపద ని తిరిగి పొంది, ఆరోగ్యస్తు రాలై శేష జీవితాన్ని ఆద్యాత్మికంగా గడిపి ,మరణానంతరం గౌరీ లోకానికి వెళ్ళింది.
ఒక గర్విష్టికే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా ! సత్ప్రవర్తన తో ఉండి నోచినవారికి ఇంక ఎంత ఉన్నతమైన పలితముంటుందో ఊహించుకొని సన్మార్గం లో నడవండి ! అనేది ఈ కథలోని నీతి.
హిందు సాంప్రదాయములో నోములు ,పూజలకి పెద్ద పీటనే వేసారు. నోము నోచుకుంటేనే సుమంగళిగా వుంటామా ? అందుకోసం వ్రతాలు చేయాలా ? అని వితండ వాదం చేసే వారికి ఏమీ చెప్పలేను . అంత పరిజ్ఞానము నాకు లేదు. నోముకుందాము అనుకోగానే ఇల్లు శుభ్రం చేసి , మామిడాకులు కట్టి, ముగ్గేసి, దేవుడి పీఠానికి పూలూ ,ఆకులు అలంకరించి , ధూప దీప నైవేద్యాల తో పూజించి ,ముత్తైదువులకు ,తాంబూల మిచ్చి , ఆశీస్సులు తీసుకోవటము తో ఇంటికి ఓ కళ వస్తుంది. మనసు లో ఓ ప్రశాంతత ఏర్పడుతుంది.ఇంట్లో పాజిటివ్ వేవ్స్ వచ్చినట్లుగా వుంటుంది. కుటుంబ శ్రేయస్సు ,ఆద్యాత్మికానందం కలుగుతుంది.
SPECIAL LADIES FESTIAL - ATLA THADDHI - A BRIEF ARTICLE, PUJA, PERFORMANCE AND ITS IMPORTANCE
అట్లతద్దె
మా అత్తగారు ,మా వదినగారితో చాలా నోములు పట్టించారట .వదినగారు అవన్నీ ఈమధ్య ఒకొటొకటిగా తీర్చటము మొదలు పెట్టారు. అందులో బాద్రపదమాసములో ఉండ్రాలతద్దె తీర్చారు. ఇప్పుడు అశ్వయుజమాసం బహుళతదియ ( 7 వ తారీకు అక్టోబర్ ) నాడు అట్లతద్దే తీరుద్దామనుకున్నారు ,కాని ,దేవీనవరాత్రులలో కుడా తీర్చవచ్చు అని నవరాత్రులలో అట్లతద్దె నోము ఉద్యాపన చేసారు.
ఆవిడ చిన్నతనములోనే ఈ నోము పట్టారట . ఐదుగురు కన్నెపిల్లలకు ముందురోజు రాత్రి గోరంటాకు పెట్టాలి. తెల్లవారుఝాముననే ఐదుగురితో కలిసి చద్ది అన్నము తిని ఉయ్యాలలూగాలి. ఆ తరువాత వారికి తలస్నానము చేయించి, తనుకూడా చేసి , గౌరీదేవినిపూజించి ఐదు అట్లను ,కొంచము బెల్లము ముక్కను పెట్టి నివేదన చేయాలి. ఐదుగురు కన్నెపిల్లలకు తలా ఐదు అట్ట్లను , బెల్లము తో ( ఆ రోజులలో అట్లు బెల్లము తోనే తినేవారుట ! ) . వాయనము ఇవ్వాలి.ఇలా ఐదు సంవత్సరములు వివాహమునకు పూర్వమే నోచుకోవాలి. వివాహము తరువాత ఎప్పుడైనను ఉద్యాపన చేయవచ్చు.
నోచుకునేటప్పుడు అదుగురు కన్నెపిల్లలు , ఉద్యాపనకు పదిమందిమంది ముత్తదువులు కావాలి. మా పదిమందికీ , ముందు రోజే గోరింటాకు కోన్లు, షాంపూ పాకెట్స్ ఇచ్చారు. ఉదయము 8 గంటలకు చిక్కడపల్లి లోని మావదినగారంటికి వెళ్ళాము. అంతకు ముందే ఆవిడ గౌరీ పూజ చేసుకున్నారు. పది అట్లు అమ్మవారికి నివేదన చేసారు. అందరికీ పది అట్లు కొంచము బెల్లము ముక్క తో , ఒక జాకిట్ బట్ట ,పసుపు ,కుంకుమ , గాజులు , పూలు ,దక్షిణ ,తాంబూలం ఇచ్చారు. తిమ్మనం ( బియ్యపండి ,పాల తో చేసే ఓ పాయసము ) కూడ వాయనము తో పాటు ఇచ్చారు. ఉద్యాపన అప్పుడు , ఉయ్యాలలూపటము , చద్ది అన్నము పెట్టటము అవసరము లేదట. వాయనము ఇచ్చిన తరువాత , బోజనము పెట్టారు.
మా ఇంటి పద్దతి అని ఇలా చేసారు . కాని, కథ లో వేరుగా వుంది .
కథ ---
ఒక రాజుగారి అమ్మాయి ,తన చెలికత్తెలతో కలిసి అట్ల తద్దె నోమునోచుకుంది.చెలికత్తెలందరూ ఉపవాసమున్నారు ,కాని రాచకన్య మాత్రము ఉండలేక ,సాయంకాలమైయ్యేసరికి సొమ్మసిల్లి పడిపోయింది .ఆమె సోదరుడు అరిక ( గడ్డి ) కుప్పకు నిప్పుపెట్టి , చెట్టుకి ఒక అద్దము వేళ్ళాడ తీసి , మంట చూపించి ,చంద్రోదయం అయ్యింది భోజనము చేయవచ్చునని చెప్పాడు. అదినిజమనుకొని ఆ రాచకన్య వాయనము అందించి , భోజనము చేసింది వ్రతలోపము కలుగుట వల్ల ఆమెకు మంచి సంబంధము దొరకలేదు .ఆమె చెలికత్తెలందరికి వివాహాలైనాయి . ఆమె విచారించి , గ్రామమున కల కాళికాలయమునకు వెళ్ళి, అమ్మా! అందరిలా నేనూ వ్రతమాచరించాను ,వారందరికి వివాహాలైనాయి నాకు మాత్రం కాలేదు అందుకు కారణము తెలుపుమమ్మా ! అని అడిగింది .అంత గౌరి ఆమె చేసిన లోటును , పొరపాటును తెలిపి మరల చేయమంది .రాచకన్య మరల నోచింది .ఆనాడే అశ్వయుజమాసం, బహుళ తదియ కావటమువలన ఆమె యధావిధి గా వ్రతం ఆచరించింది .వ్రత పలితముగా ఆమెకు మంచి భర్త లభించాడు .ఆమె తన భర్త తో హాయిగా జీవించింది .
ఉద్యాపన -
ఈ వ్రతం అశ్వయుజమాసం ,బహుళ తదియనాడు ఉపవాసం చేసి ,చంద్రోదయం అయ్యేవరకు ఏమీ తినకూడదు . గౌరీ దేవికి పది అట్లు నివేదన చేయాలి .అలా తొమ్మిది సంవత్సరములు చేసి ,10 వ సంవత్సరమున , 10 మంది ముత్తైదువులను పిలిచి , వారికి తలంటు స్నానము చేయించి , 10 అట్లు ,పసుపు ,కుంకుమ , రవికల బట్ట , దక్షిణ తాంబూలము సమర్పించి , సంతృప్తిగా భోజనము పెట్టవలెను.
ఈ నోము నోచుకుంటే కన్నెలకు మంచి మొగుడొస్తాడని , పెళ్ళైన స్త్రీలకి నిడు ఐదవతనం కలుగుతుందని ,భర్తలు ఆయురారోగ్యాలతో విలసిల్లుతారని నమ్మకము.
ఈ పండగ వైభవము పట్టణాలకంటే పల్లెలో ఎక్కువగా కనిపిస్తుంది.అందరూ ఉత్సాహము గా జరుపుకుంటారు .తొలి కోడి కూసినప్పుడే లేచి ఉట్టికింద కూర్చొని గోంగూరపచ్చడి , కందిపులుసు మొదలైన వాటి తో చద్ది అన్నము తిని తాంబూలం వేసుకుంటారు.ఇక అప్పటి నుండి నిద్ర పోరు .ఆట పాటల తో గడుపుతారు .అట్లతద్దోయ్ ఆరట్లో , ముద్దపప్పోయ్ మూడట్లోయ్ అని పాటలు పాడుతూ ఉయ్యాలలూగుతారు. ఉయ్యాలలు ఇంట్లోకాక తోటలలో పెద్ద పెద్ద చెట్లకి వేస్తారు .ఈ పండుగ ని అందరూ జరుపుకుంటారు. అందుకే అస్టాదశ వర్ణాలవారికి అట్లతద్దె అనే పేరు వచ్చింది.
THE ABOVE ARTICLE IS AS IT IS COLLECTED FROM SAHITHI BLOG
AND IT IS VERY USEFUL
BRIEF ARTICLE ON SPECIAL OCCASION - KARTHIMA MASAM - PUJA PERFORMANCE AND ITS IMPORTANCE IN TELUGU
కార్తీకమాసము
మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తిక మాసము. శివ కేశవులకిద్దరికీ ప్రీతికరమైనది .ఏంతో మహత్యము కలది. కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణములో నుండగా ఆచరించె స్నాన , దాన , జప,పూజాదులు విశేష పలితాలనిస్తాయి. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవ రూపము ధరించి సమస్త నదీ జలాలలోనికి చేరుతుంది. కాబట్టి ఈ నెలలంతా నదీ స్నానము చేస్తే శరీరము , మనసు రెండూ పవిత్రమవుతాయి . నదులు దగ్గరలేక పోతే చెరువులో , వాగులో , ఏవీ దగ్గర లేకపోతే కనీసము ఇంటిలోనైనా సూర్యోదయానికి ముందే " గంగేచ యమునే చైన గోదావరి సరస్వతి ! నర్మదే సింధు , కావేరీ జలెస్మిన్ సన్నిధిన్ కురు " అనే శ్లోకాన్ని పఠిస్తూ తలస్నానము చేసి నిర్మల హృదయము తో భగవదారాధన చేయాలి.
కార్తీకమాసము ముప్పై రోజులు పర్వదినాలుగా భావించి నదీ స్నానాలు , వుపవాసాలు , సాయంత్రము కాగానే ఇంటి ముందు దీపాలు వెలిగించటము , స్త్రీలు దీపాలను నదిలో వదలటము ,వనభోజనము చేయటము , వివిధ దానాలను , ముఖ్యముగా దీప దానము , సాలంకృత కన్యాదానము చేయటము మొదలైనవి నిర్వహిస్తారు. ఈ మాసము లో ఉపనయన దానము ,కన్యాదానము చాలా పలితమిస్తుంది .భక్తి తో సాలంకృత కన్యా దానమిచ్చినట్లు ఐతే అన్ని పాపాలు తొలిగిపోయి పితృదేవతల యొక్క స్తానాన్ని,బ్రహ్మ పదాన్ని పొందుతారంటారు. దశమి ,ఏకాదశి ,ద్వాదశి తిధులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోనూ , కమలపూల తోనూ పూజిస్తే జీవించినన్నాళ్ళూ ధనానికి లోటులేకుండా వుండి , సమస్త సౌఖ్యాలు కలగటముతో పాటు అంత్యమున జన్మరాహిత్యము కలుగుతుందట. అదేవిధముగ ఆరుద్ర నక్షత్రము రోజున , మాస శివరాత్రినాడు , సోమవారమునాడు , కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి , బిల్వదళాలతోనూ , రుద్రాక్షల తోనూ పూజించినవారికి అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యము పొందుతారని కార్తీకపురాణం చెబుతోంది .
లింగాష్టకం
బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం
దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకర లింగం
రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం
సర్వసుగంధి సులేపితలింగం బుద్దివివర్ధన కారణలింగం
సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం
కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభిత లింగం
దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం
కుంకుమచందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం
సంచితపాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం
దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభి రేవచలింగం
దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం
అష్టదళో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం
అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం
సురగురు సురవరపూజితం లింగం సురవరపుష్ప సదార్చితలింగం
పరమపదపరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం
లింగాష్టక మిదంపుణ్యం యఃపఠేచివసన్నిధౌ
శివలోక మవాపోత్ని శివేన సహమోదతే .
AN ARTICLE ON KARTHIKA MASAM AND ITS PERFORMANCE AND ITS IMPORTANCE
కార్తీకమాసము - పర్వదినములు
కార్తీకమాసమంతా స్నానాలు, ఉపవాసాలు , దీపదానాలు , పూజలూ ,వ్రతాలూనూ . ఏపూజకాపుజే విశిష్టమైనది .
ప్రతి రోజు దేవునికి దీపము వెలిగించలేని వారు ఈ రోజు 365 వత్తులను ఆవునేయితో ఏఏదైనా దేవాలయములో , వీలుకాకపోతె ఇంటిలో దేవుని వద్ద వెలిగిస్తే రోజూ వెలిగించిన ఫలము వస్తుంది అంటారు .
ఈ మాసములోని పర్వదినాలలో శుక్లపక్ష ద్వాదశి రోజున చేసే క్షీరాభ్ధిద్వాదశి పూజ ప్రధానమైనది .ఈ రోజున కృతయుగములో దేవతలు , రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించిన రోజు కనుక క్షీరాభ్ధిద్వాదశి అని పేరు. క్షీరసాగరము లోనుండి వచ్చిన మహాలక్ష్మిని ఈ రోజు శ్రీమహావిష్ణువు వివాహమాడాడు . అందుకని ఈ రోజు శ్రీమహావిష్ణువు , శ్రీ మహాలక్ష్మిల కల్యాణము చేస్తారు. ఎప్పుడూ క్షీరసాగరములో శయనించే విష్ణువు ఈ రోజున మహాలక్ష్మి తో పాటు బృందావనానికి వస్తాడని అంటారు. అందుకే ఈ రోజు తులసి మొక్క వద్ద , ఈ కార్తీకమాసములో సమస్త దేవతలూ , మునులుకూడా ఆశ్రయించుకొని వుండే ఉసిరిక కొమ్మని పెట్టి పూజిస్తారు.
కార్తీకమాసములో శనిత్రయోదశి సోమవారముకంటే చాలా ఎక్కువ ఫలితమిస్తుంది . ఆ శనిత్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి వందరెట్లు ఫలితమిస్తుంది . పౌర్ణమి కంటే కార్తీక పాడ్యమి నూరురెట్లు అధిక పలమిస్తుంది . ఆ కార్తీక పాడ్యమి కంటే బహుళ ఏకాదశి కోటిరెట్లు ఎక్కువ పలితానిస్తుంది . ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి విస్తారమైన పలితానిస్తుంది అని పెద్దలంటారు.
కార్తీకపురాణములో ఇలా చెప్పారు.
కార్తీక శు. పాడ్యమి : తెల్లవారు జామునే లేచి ,స్నానము చేసి , దేవాలయానికి వెళ్ళి , కార్తీకవ్రతం సంకల్పము చెప్పుకొని ,ఆకాశదీపాని దర్షించుకోవాలి .
విదియ : ఈ రోజు సోదరి ఇంటికి వెళ్ళి భోజనము చేసి , కానుకలిచ్చి రావాలి .
తదియ : అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవటము వల్ల సౌభాగ్యసిద్ది .
చవితి : ఈ రోజు నాగులచవితి సంధర్భముగా పుట్టలో పాలు పోయాలి .
పంచమి : దీనికి జ్ఞాన పంచమి అని పేరు . ఈ రోజు సుబ్రమణ్యప్రీత్యర్ధము అర్చనలు చేయించుకున్న వారికి జ్ఞాన వృద్ది కలుగుతునది .
షస్టి : నేడు బ్రహ్మచారికి ఎర్రగళ్ళ కండువా దానము చేస్తే సంతానప్రాప్తి కలుగుతుందని ప్రతీతి .
సప్తమి : ఈ రోజు ఎర్రని వస్త్రములో గోధుమలు పోసి దానమివ్వటము వలన ఆయుషు వృద్ది అవుతుంది .
అష్టమి : ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది .
నవమి : నేటినుంచి మూడు రోజుల పాటు విష్ణుత్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి .
దశమి : ఈ రోజు రాత్రి విష్ణు పూజ చేయాలి .
ఏకాదశి : ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు. ఈ రోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమగతులు కలుగుతాయి .
ద్వాదశి : ఈ క్షీరాబ్ధి ద్వాదశి రోజు సాయంకాలము ఉసిరిమొక్క , తులసి మొక్కలను పూజించి ,దీపాలను వెలిగించటము సర్వపాపాలనూ నశింప చేస్తుంది .
త్రయోదశి : ఈ రోజు సాలగ్రామ దానము చేయటము వలన సర్వకష్టాలు దూరమవుతాయి .
చతుర్దశి : పాషాణ చతుర్దశి వ్రతము చేసుకునేందుకు నేడు మంచిది .
కార్తీక పూర్ణిమ : మహా పవిత్రమైన ఈ రోజు నదీస్నానము చేసి , శివాలయము వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవటము వల్ల సర్వపాపాలు ప్రక్షాళనమవుతాయి .
ఇంకా ఈ మాసములో చేసే ఈశ్వరార్చనా , అభిషేకం అపమృత్యు దోషాలను ,గ్రహ బాధలను తొలిగిస్తాయి .
సర్వేజనాః సుఖినోభవస్తు .
కార్తీకమాసమంతా స్నానాలు, ఉపవాసాలు , దీపదానాలు , పూజలూ ,వ్రతాలూనూ . ఏపూజకాపుజే విశిష్టమైనది .
ప్రతి రోజు దేవునికి దీపము వెలిగించలేని వారు ఈ రోజు 365 వత్తులను ఆవునేయితో ఏఏదైనా దేవాలయములో , వీలుకాకపోతె ఇంటిలో దేవుని వద్ద వెలిగిస్తే రోజూ వెలిగించిన ఫలము వస్తుంది అంటారు .
ఈ మాసములోని పర్వదినాలలో శుక్లపక్ష ద్వాదశి రోజున చేసే క్షీరాభ్ధిద్వాదశి పూజ ప్రధానమైనది .ఈ రోజున కృతయుగములో దేవతలు , రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించిన రోజు కనుక క్షీరాభ్ధిద్వాదశి అని పేరు. క్షీరసాగరము లోనుండి వచ్చిన మహాలక్ష్మిని ఈ రోజు శ్రీమహావిష్ణువు వివాహమాడాడు . అందుకని ఈ రోజు శ్రీమహావిష్ణువు , శ్రీ మహాలక్ష్మిల కల్యాణము చేస్తారు. ఎప్పుడూ క్షీరసాగరములో శయనించే విష్ణువు ఈ రోజున మహాలక్ష్మి తో పాటు బృందావనానికి వస్తాడని అంటారు. అందుకే ఈ రోజు తులసి మొక్క వద్ద , ఈ కార్తీకమాసములో సమస్త దేవతలూ , మునులుకూడా ఆశ్రయించుకొని వుండే ఉసిరిక కొమ్మని పెట్టి పూజిస్తారు.
కార్తీకమాసములో శనిత్రయోదశి సోమవారముకంటే చాలా ఎక్కువ ఫలితమిస్తుంది . ఆ శనిత్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి వందరెట్లు ఫలితమిస్తుంది . పౌర్ణమి కంటే కార్తీక పాడ్యమి నూరురెట్లు అధిక పలమిస్తుంది . ఆ కార్తీక పాడ్యమి కంటే బహుళ ఏకాదశి కోటిరెట్లు ఎక్కువ పలితానిస్తుంది . ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి విస్తారమైన పలితానిస్తుంది అని పెద్దలంటారు.
కార్తీకపురాణములో ఇలా చెప్పారు.
కార్తీక శు. పాడ్యమి : తెల్లవారు జామునే లేచి ,స్నానము చేసి , దేవాలయానికి వెళ్ళి , కార్తీకవ్రతం సంకల్పము చెప్పుకొని ,ఆకాశదీపాని దర్షించుకోవాలి .
విదియ : ఈ రోజు సోదరి ఇంటికి వెళ్ళి భోజనము చేసి , కానుకలిచ్చి రావాలి .
తదియ : అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవటము వల్ల సౌభాగ్యసిద్ది .
చవితి : ఈ రోజు నాగులచవితి సంధర్భముగా పుట్టలో పాలు పోయాలి .
పంచమి : దీనికి జ్ఞాన పంచమి అని పేరు . ఈ రోజు సుబ్రమణ్యప్రీత్యర్ధము అర్చనలు చేయించుకున్న వారికి జ్ఞాన వృద్ది కలుగుతునది .
షస్టి : నేడు బ్రహ్మచారికి ఎర్రగళ్ళ కండువా దానము చేస్తే సంతానప్రాప్తి కలుగుతుందని ప్రతీతి .
సప్తమి : ఈ రోజు ఎర్రని వస్త్రములో గోధుమలు పోసి దానమివ్వటము వలన ఆయుషు వృద్ది అవుతుంది .
అష్టమి : ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది .
నవమి : నేటినుంచి మూడు రోజుల పాటు విష్ణుత్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి .
దశమి : ఈ రోజు రాత్రి విష్ణు పూజ చేయాలి .
ఏకాదశి : ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు. ఈ రోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమగతులు కలుగుతాయి .
ద్వాదశి : ఈ క్షీరాబ్ధి ద్వాదశి రోజు సాయంకాలము ఉసిరిమొక్క , తులసి మొక్కలను పూజించి ,దీపాలను వెలిగించటము సర్వపాపాలనూ నశింప చేస్తుంది .
త్రయోదశి : ఈ రోజు సాలగ్రామ దానము చేయటము వలన సర్వకష్టాలు దూరమవుతాయి .
చతుర్దశి : పాషాణ చతుర్దశి వ్రతము చేసుకునేందుకు నేడు మంచిది .
కార్తీక పూర్ణిమ : మహా పవిత్రమైన ఈ రోజు నదీస్నానము చేసి , శివాలయము వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవటము వల్ల సర్వపాపాలు ప్రక్షాళనమవుతాయి .
ఇంకా ఈ మాసములో చేసే ఈశ్వరార్చనా , అభిషేకం అపమృత్యు దోషాలను ,గ్రహ బాధలను తొలిగిస్తాయి .
సర్వేజనాః సుఖినోభవస్తు .
EAT GARELU NO DRINK
గారెలు తాగరు తింటారు
అనగనగా ఒకానొక వూరిలో ఒక అమ్మ , ఒక నాన్న . వారికో గారాల కూతురు సుందరి . కందిపప్పుకు శెనగపప్పు కు తేడా తెలీకుండా మురిపెంగా , ముచ్చటగా పెరిగింది సుందరి . దానితో పాపం చదువూ అంతగా అబ్బలేదు . పోనీలే చదువుకొని , వూళ్ళేలా ????? వుద్యోగాలు చేయాలా ????? మనకేమీ లేదా పోదా అనుకొని సుందరి నాన్న , సుందరికి పెళ్ళిచేద్దామని ఆంధ్రదేశమంతా జల్లెడ పట్టి , అందగాడు . . . బాగా చదువుకున్నవాడు . . . వుద్యోగస్తుడు . . . నెమ్మదస్తుడు . . . బరువు బాద్యతలు లేనివాడు . . . ఇంకా బోలెడు డు లు వున్నవాడైన , అచ్చతెలుగు అబ్బాయి సుబ్బారావు కు ఇచ్చి అంగరంగ వైభోగం గా పెళ్ళి చేసి , అమ్మాయి, అల్లుడితో కొత్తకాపురం పెట్టించి . . . ఊహ్ . . . ఊపిరి పీల్చుకున్నాడు .
కొత్తకాపురం * * * మొదటిరోజు * * * పెళ్ళిలో అమ్మలక్కలందరూ , మగవాడి హృదయానికి దారి కడుపునుంచేనే అమ్మాయి . చక్కగా వంటచేసి పెట్టి మొగుడిని కొంగున ముడేసుకో అని సుందరి చెవులు కోరికేసారు . అది గుర్తొచ్చి సుందరి , ఆ ప్రయత్నమేదో మొదటి రోజు నుంచే చేద్దామని నిశ్చయించుకొని , " సుబ్బూ . . . సుబ్బూ నీకోసం తినటానికి ఏమిచేసిపెట్టను ?" అని గారంగా అడిగింది . ముద్దుల భార్య , గారాల మోము చూసి ముద్దైపోయి , " సుందూ , నాకు గారెలంటే ఇష్టం . చేసిపెట్టరా " అని అని ముద్దు ముద్దుగా అడిగి ఆఫీసుకెళ్ళిపోయాడు . గారెలా అవేమిటి ఎలా వుంటాయో , ఎలా చేయాలో తెలీదే అని కాసేపు సోచాయింపులో పడి , పోనీ పక్కింటి పిన్నిగారిని అడుగుదాము అనుకొని ,గోడ దగ్గరికి వెళ్ళి పిన్నిగారు , పిన్నిగారూ అని పిలిచింది సుందరి .
ఏమిటమ్మాయ్ అంటూ వచ్చారు పిన్నిగారు .
" పిన్నిగారు , మావారు గారెలు తినాలని వుంది అన్నారు . గారెలా చేస్తారో చెప్పరూ ప్లీజ్ " అని అడిగింది సుందరి .
" ఓస్ గారెలే కదమ్మా . చేయటం చాలా సులభం . ముందుగా మినపప్పు తీసుకోవాలి ."
" మినపప్పు తీసుకోవాలా ? నాక్తెలుసు , నాక్తెలుసు " అంటూ ఇంట్లోకి పరిగెత్తింది సుందరి .
వంటింట్లోకి వెళ్ళి చూస్తే మినపప్పు ఏదో తెలీలేదు . మళ్ళీ గోడ దగ్గరకు వచ్చి " పిన్నిగారూ . . . పిన్నిగారూ " అని కేకేసింది .ఏమిటమ్మాయ్ అంటూ పిన్నిగారు వచ్చారు .
" మినపప్పు ఎలా వుంటుంది పిన్నిగారు ."
ఇదో అమ్మా ఇలా వుంటుంది అని మినపప్పు తెచ్చి చూపించి , ఈ పప్పు గిన్నెలోకి తీసుకొని అని చెప్పబోతుండగా " నాక్తెలుసు . . . నాక్తెలుసు " అని ఇంట్లోకి పరిగెత్తింది సుందరి .
ఓ గ్లాసెడు మినపప్పు గిన్నెలోకి తీసుకుంది . ఆ తరువాత ఏం చేయాలి చెప్మా ! అనుకొని మళ్ళీ గోడ దగ్గరికి వచ్చి , పిన్నిగారి ని పిలిచి , ఆ పప్పును ఏమిచేయాలండి ? అనీడిగింది . కడిగి నాన బోసి , , , అని చెపుతుండగానే "నాక్తెలుసు . . . నాక్తెలుసు " అని ఇంట్లోకి పరిగెత్తింది .
సరె పప్పు నానబోసింది . ఆ తరువాత ????? మళ్ళీ పిన్నిగారూ . . . పిన్నిగారూ అని కేకేసింది . ఏమిటమ్మాయ్ అంటూ మళ్ళీ వచ్చారు పిన్నిగారు . నానబోసిన పప్పును ఏమిచేయాలండి అని అడిగింది . దానిని రుబ్బుకోవాలి . ఆ పైన , అబ్బే వినే దాకా ఎక్కడ " నాక్తెలుసు . . . నాక్తెలుసు " అని ఇంట్లోకి వెళ్ళిపోయింది . " బాగానే వుంది సంబడం " అనుకుంటూ పిన్నిగారూ లోపలికి వెళ్ళిపోయారు .
మినపప్పు రుబ్బటం ఐపోయింది . ఆ తరువాత ఏమి చేయాలి ? పిన్నిగారినే అడగాలి . . .
" పిన్నిగారూ . . . పిన్నిగారూ . . . "
" ఏమిటమ్మాయ్ ?"
" పప్పు రుబ్బేసానండి . ఇప్పుడేమి చేయాలి? "
" గ్లాస్ లో వేసుకొని నీళ్ళు కలుపుకొని , సుబ్బరంగా తాగెయ్యాలి ." విసిగిపోయిన పిన్నిగారి జవాబు .
" ఓస్ ఇంతేనా ! నాక్తెలుసు . . . నాక్తెలుసు."
సుబ్బారావు గారెలు తిందామని లొట్టలేసుకుంటూ వచ్చాడు . సుందరి అంతకన్నా ప్రేమగా గ్లాసెడు గారెలు ఇచ్చి , " సుబ్బూ . . . ఎంచక్కా గారెలు తాగేసేయ్ . నీకోసం పక్కింటి పిన్నిగారిని అడిగి చేసాను తెలుసా " అని వూరిస్తూ ఇచ్చింది .
" గారెలు తాగటమేమిటే సుందూ " అంటూ బిత్తరపోయాడు సుబ్బు .
" పక్కింటి పిన్నిగారు ఇలాగే చెప్పారు . నీకేమీ తెలీదు .తొందరగా తాగేయ్ సినిమా టైం ఐపోతోంది " అని తొందర చేసింది సుందు .
" గారెలు తాగరే * * * తింటారు " .ఏడుపు మొహం పెట్టాడు సుబ్బు :(((((
నీతి ; అతితెలివి అనర్ధదాయకం .
సామెత ; తోచీ తోచనమ్మ ఇలాంటి తొక్క కథలే చెప్పును :)
STORY COLLECTED FROM THE BLOG :
http://sahiti-mala.blogspot.in/search/label/%E0%B0%95%E0%B0%A5
telugu kids songs and games - Oppula Kuppa Oyari Bhama
ఒప్పుల కుప్పా వయ్యారి భామా
ఒప్పులకుప్పా వయ్యారి భామా ,
సన్నా బియ్యం చాయాపప్పూ ,
బిస్తీ బిస్తీ బీరాకాయా .
గుడు గుడు గుంచం గుండేరాగం ,
పాముల పట్టం పడగేరాగం,
పెద్దన్నపెళ్ళీ పోదము రండీ ,
చిన్నన్న పెళ్ళీ చూతము రండి .
ఏకాలమైయిందీ ఈ ఆటలన్నీ ఆడి . ఈ మద్య మా ఫ్రెండ్ ఈ బొమ్మలు ఎక్కడి నుండో తెచ్చి చూపించింది . అంతే తేనతుట్టె కదిలింది :)
బిస్తి గీస్తూ ఎంత గిర్రున తిరిగే వాళ్ళమో :) ఎవరు ముందు వదిలేస్తే వాళ్ళూ ఓడినట్లు . నా మొహం గెలిచినవాళ్ళూ , అంత స్పీడ్ లో తిరుగుతూ వాళ్ళు వదిలేయగానే వీళ్ళూ ధన్ మని కింద పడిపోయేవారు :) కాని కళ్ళు తిరిగే వరకూ తిరగటం ఎంత మజా :)
గుడు గుడు గుంచం నుంచి , కాళ్ళా గజ్జా దాకా వచ్చి చక్కిలింతలు కలిగితే అదో ఆనందం .
రింగులు తిప్పికుంటూ బాల్యం లోకి వెళ్ళిపోయాను :)
ఈ మధ్య ఎక్కడో చదివాను , ఈ పాటలల్లో సైంటిఫిక్ రీజన్ వుంది అని వివరిస్తూ రాసారు . ఎక్కడ చదివానో గుర్తు రావటం లేదు .గుర్తొచ్చి , దొరికితే పెడతాను :)
ఒప్పులకుప్పా వయ్యారి భామా ,
సన్నా బియ్యం చాయాపప్పూ ,
బిస్తీ బిస్తీ బీరాకాయా .
గుడు గుడు గుంచం గుండేరాగం ,
పాముల పట్టం పడగేరాగం,
పెద్దన్నపెళ్ళీ పోదము రండీ ,
చిన్నన్న పెళ్ళీ చూతము రండి .
ఏకాలమైయిందీ ఈ ఆటలన్నీ ఆడి . ఈ మద్య మా ఫ్రెండ్ ఈ బొమ్మలు ఎక్కడి నుండో తెచ్చి చూపించింది . అంతే తేనతుట్టె కదిలింది :)
బిస్తి గీస్తూ ఎంత గిర్రున తిరిగే వాళ్ళమో :) ఎవరు ముందు వదిలేస్తే వాళ్ళూ ఓడినట్లు . నా మొహం గెలిచినవాళ్ళూ , అంత స్పీడ్ లో తిరుగుతూ వాళ్ళు వదిలేయగానే వీళ్ళూ ధన్ మని కింద పడిపోయేవారు :) కాని కళ్ళు తిరిగే వరకూ తిరగటం ఎంత మజా :)
గుడు గుడు గుంచం నుంచి , కాళ్ళా గజ్జా దాకా వచ్చి చక్కిలింతలు కలిగితే అదో ఆనందం .
రింగులు తిప్పికుంటూ బాల్యం లోకి వెళ్ళిపోయాను :)
ఈ మధ్య ఎక్కడో చదివాను , ఈ పాటలల్లో సైంటిఫిక్ రీజన్ వుంది అని వివరిస్తూ రాసారు . ఎక్కడ చదివానో గుర్తు రావటం లేదు .గుర్తొచ్చి , దొరికితే పెడతాను :)
Subscribe to:
Posts (Atom)