The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
WATER - MILK
పాలు – నీళ్ళు
కథ వినండి
అనగా అనగా ఒక రాజు. ఆ రాజు గారికి తన అధికారం మీద చాలా నమ్మకం. తన శాసనాలను ప్రజలు తు. చ. తప్పకుండా పాటిస్తారని అనుకునే వాడు. మంత్రి మణివర్మ రాజు గారి నమ్మకాన్ని పరీక్షిద్దామని అన్నాడు. రాజు ఒప్పుకున్నాడు.
ఒక రోజు రాజ్యంలో ఇలా దండోరా వేయించారు, “ఈ రోజు చీకటి పడిన తర్వాత, నగరంలోని ప్రజలందరూ రాజ భవనం ముందు ఉన్న కొలనులో ఒక కుండెడు పాలు పొయ్యవలసిందని రాజు గారి ఆజ్ఞ.”
ప్రజలకు రాజు గారి ఆజ్ఞ వింతగా తోచింది. ప్రతి ఒక్కరూ మనసులో, ” నగరంలో ప్రజలంతా రాజు గారికి భయపడి పాలు తెచ్చి పోస్తారు. నేను ఒక్కడినీ నీళ్ళు పోస్తే రాజు గారికి తెలియదులే. పాలలో నీళ్ళు కలిసిపోతాయి,” అనుకుని తలా ఒక కుండెడు నీళ్ళు తీసుకు వచ్చి కొలనులో పోశారు.
తెల్ల వారి రాజు గారు వచ్చి చూస్తే కొలను నిండా నీళ్ళే ఉన్నాయి, ఒక్క చుక్క కూడా పాలు లేవు!
|
TELUGU STORY OF THE GREAT LEGEND SRI KRISHNA DEVARA AND SRI MAHA MANTHRI THIMMARASU -
చిన్న గీత, పెద్ద గీత
కథ వినండి .
అనగా అనగా ఒక అబ్బాయి.
ఆ అబ్బాయి బాగా తెలివైన వాడని అందరూ అంటూ ఉండే వారు.
ఆ విషయం రాజు గారిని చేరింది.
రాజు గారు ఆ అబ్బాయి తెలివి తేటలని పరీక్షించాలనుకున్నారు.
ఆ అబ్బాయి బాగా తెలివైన వాడని అందరూ అంటూ ఉండే వారు.
ఆ విషయం రాజు గారిని చేరింది.
రాజు గారు ఆ అబ్బాయి తెలివి తేటలని పరీక్షించాలనుకున్నారు.
అతనిని పిలిపించారు.
ఒక పలక మీద రెండు గీతలు గీశారు.
ఒక గీత చిన్నది.
ఇంకో గీత దానికన్నా కొంచెం పెద్దది.
“పెద్ద గీతను చెరపకూడదు. కానీ ఆ గీతను చిన్న గీత చెయ్యాలి,” అన్నారు.
ఒక పలక మీద రెండు గీతలు గీశారు.
ఒక గీత చిన్నది.
ఇంకో గీత దానికన్నా కొంచెం పెద్దది.
“పెద్ద గీతను చెరపకూడదు. కానీ ఆ గీతను చిన్న గీత చెయ్యాలి,” అన్నారు.
ఆ అబ్బాయి ఆలోచించాడు.
బలపం తీసుకున్నాడు.
చిన్న గీతను పెంచాడు.
పక్కనున్న పెద్ద గీతకన్నా పొడవు పెంచాడు.
అంతే, చెరపకుండానే పెద్ద గీత చిన్న గీత అయిపోయింది!
బలపం తీసుకున్నాడు.
చిన్న గీతను పెంచాడు.
పక్కనున్న పెద్ద గీతకన్నా పొడవు పెంచాడు.
అంతే, చెరపకుండానే పెద్ద గీత చిన్న గీత అయిపోయింది!
ఆ అబ్బాయి ఎవరో కాదు, (మహామంత్రి) తిమ్మరుసు అని అంటారు.
CATEGORY:
TELUGU KIDS STORY - NAME OF LORD RAMA
రామ నామం
కథ వినండి .
అనగా అనగా ఒక పండితుడు. తన పాండిత్యం మీద ఆయనకి అపారమైన విశ్వాసం.
తనకు గొప్ప మంత్రాలు తెలుసుననీ, వాటిని నిష్ఠగా, తప్పులు లేకుండా జపించగలననీ గర్వం కూడా.
తనకు గొప్ప మంత్రాలు తెలుసుననీ, వాటిని నిష్ఠగా, తప్పులు లేకుండా జపించగలననీ గర్వం కూడా.
ఒక రోజు ఆయన వద్దకు ఒక భక్తుడు వస్తాడు. ఏదైనా మంత్రం ఉపదేశించమని ప్రార్థిస్తాడు.
ఏమీ చదువుకోని వాడు కనక అతను మంత్రాలు సరిగా పలకలేడనీ, మంత్రం సరిగ్గా పలకకపోతే అది పాపం అనీ చెప్తాడు పండితుడు.
తను పలక గలిగే మంత్రమేదైనా ఉపదేశించమని వేడుకుంటాడు ఆ భక్తుడు.
ఏమీ చదువుకోని వాడు కనక అతను మంత్రాలు సరిగా పలకలేడనీ, మంత్రం సరిగ్గా పలకకపోతే అది పాపం అనీ చెప్తాడు పండితుడు.
తను పలక గలిగే మంత్రమేదైనా ఉపదేశించమని వేడుకుంటాడు ఆ భక్తుడు.
ఏమీ తెలియదు కదా అని అతనిని ఆటపట్టిద్దామని అనుకుంటాడు పండితుడు.
“రామ” నామాన్ని తిరగేసి, “మరా” అని ఉపదేశిస్తాడు.
“రామ” నామాన్ని తిరగేసి, “మరా” అని ఉపదేశిస్తాడు.
ఆ భక్తుడు శ్రద్ధగా “మరా మరా మరా” అని జపిస్తూ ధ్యానం చేస్తాడు.
కొన్నాళ్ళకు భగవంతుడు ప్రత్యక్షమై ఆ భక్తుడిని ఆశీర్వదిస్తాడు.
కొన్నాళ్ళకు భగవంతుడు ప్రత్యక్షమై ఆ భక్తుడిని ఆశీర్వదిస్తాడు.
ఆ సంగతి తెలిసిన పండితుడు, తన గురువు గారిని కలిసి,
“గురు వర్యా, దేవుడి పేరు తప్పుగా పలికిన అతనికి దేవుడు ఎలా కనిపించాడు?” అని అడుగుతాడు.
గురువు గారు పండితుడిని, “మరామరామరామ” అని అనమంటారు.
పండితుడు “మరామరామరామ” అంటాడు.
చివరికి “రామ” అని ఆగడం గమనిస్తాడు.
“గురు వర్యా, దేవుడి పేరు తప్పుగా పలికిన అతనికి దేవుడు ఎలా కనిపించాడు?” అని అడుగుతాడు.
గురువు గారు పండితుడిని, “మరామరామరామ” అని అనమంటారు.
పండితుడు “మరామరామరామ” అంటాడు.
చివరికి “రామ” అని ఆగడం గమనిస్తాడు.
తను “మరా” అని చెప్పినా, తీరా జపించేటప్పుడు అది “రామ” నామమే అయ్యిందని గ్రహిస్తాడు.
తప్పు తెలుసుకుంటాడు.
తప్పు తెలుసుకుంటాడు.
EARTH INFORMATION IN TELUGU
భూమి
భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది.
ఆ సమయాన్ని మనం ఒక రోజు అంటాము.
భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలూ, రాత్రీ ఏర్పడతాయి.
ఆ సమయాన్ని మనం ఒక రోజు అంటాము.
భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలూ, రాత్రీ ఏర్పడతాయి.
భూమి సూర్యుడి చుట్టూ ఒక సారి తిరగడానికి 365 రోజులు పడుతుంది.
ఆ సమయాన్ని మనం ఒక ఏడాది, లేదా సంవత్సరము అంటాము.
ఆ సమయాన్ని మనం ఒక ఏడాది, లేదా సంవత్సరము అంటాము.
|
INDRA DHANASU - RAINBOW COLOURS INFORMATION IN TELUGU
ఇంద్ర ధనస్సు
ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు ఉంటాయి.
అవి:
వంకాయ రంగు, నీలిమందు రంగు, నీలం, ఆకుపచ్చ, పసుపు పచ్చ,కాషాయం (నారింజ రంగు), ఎరుపు.
ఎరుపు రంగు అన్నిటికన్నా పైన కనిపిస్తుంది.
వాన వెలిసి ఎండ వచ్చేటప్పుడు ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపించే అవకాశం ఉంది.
సూర్య రశ్మి వాతావరణంలోని తేమలో ఉన్న నీటి బిందువుల ద్వారా ప్రయాణించినప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది.
|
DIWALI FESTIVAL VIDEOS FOR TELUGU CHILDREN
దీపావళి
దీపావళి పండగ దీపాల పండగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం.
దీపావళి రోజు బాణా సంచా కూడా కాలుస్తారు.
ఈ పండుగ అక్టోబరు లేదా నవంబరు నెలలో వస్తుంది.
తెలుగు క్యాలెండరు ప్రకారం, ఆశ్వయుజ అమావాస్య నాడు జరుపుకుంటారు.
అంతకు ముందు రోజు, అంటే ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజు, నరక చతుర్దశి అంటారు.
ఆ రోజు శ్రీ కృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు అంటారు.
అప్పుడు ప్రజలు సంతోషంతో దీపాలు వెలిగించి పండగ చేసుకున్నారట.
దీపావళి రోజు బాణాసంచా కూడా కాలుస్తారు.
చిచ్చుబుడ్లూ, మతాబులూ, కాకరపువ్వొత్తులూ, భూచక్రాలూ, విష్ణు చక్రాలూ రంగు రంగుల వెలుగులని విరజిమ్ముతాయి.
టపాకాయలూ, సిసింద్రీలూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తాయి.
దీపావళి ప్రార్థన |
COLOURS COLOURS TELUGU STORY AND POETRY
రంగులు
నవ్వే రంగులు కాబోలు విచ్చుకున్న పువ్వుల రేకులు
రంగులకే రెక్కలొస్తే అవుతాయేమో అవి సీతాకోకచిలుకలు
రాలే ముందు ఆకులు రంగులతో ఆడుకుంటాయేమో మరి
వాన చినుకులలో విడిపోయిన ఏడు రంగులు వాన విల్లై వంగుతాయి
WATER KNOWS DOWN FALL AND GOD KNOWS THE EXACT TRUTH - TELUGU KIDS SPECIAL
నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
కరిగి కరిగి మంచుగడ్డ ముక్కగా మిగిలిందట
నీటి విత్తనమనుకుని దానిని నేలలో నాటారట
మొత్తం కరిగి కళ్ళముందే అది మాయమైతే
దానికోసం తవ్వి తవ్వి మొదటి బావి కనుగొన్నారట.
MAHA NATI SAVITHRI - THE LEGEND OF SOUTH INDIAN CINEMA - ESPECIALLY TELUGU FILM INDUSTRY - A BRIEF PROFILE OF HER WORKINGS AND PERSONAL BIO DATA
మహా నటి సావిత్రి ఒక లెజెండ్
మహా నటి సావిత్రి ఒక లెజెండ్
సిని ప్రపంచంలో ధ్రువతారలా ఎప్పటికి నిలిచి వుండే మరపురాని నటిమణి సావిత్రి.
(మహానటి సావిత్రి జన్మదిన సందర్భం గా ఈ చిరు నివాళి.)
మహానటి సావిత్రి నటజీవితం ఒక మహాకావ్యం(ఒక లెజండ్)జగతి మరువలేని అందాల నటి సావిత్రి నటనాకౌశలం ఒక అపూర్వ గ్రంధాలయం. ఎన్ని తరాలుమారినా ఆమె జీవించిన చిత్రరాజాలు ఆంధ్రుల మదిలో ఎన్నటికీ మరువలేనివి.తెలుగు చిత్ర రంగంలోతిరుగులేని నటీమణి.పుట్టిననెల... గిట్టిన నెల డిసెంబరు మాసం కావటం కాకతాళీయం. డిసెంబరు6,1937, మరణం 26, శనివారం 1981.వారి జీవిత కాలం 44సంవత్సరాలు మాత్రమే(చిన్నవయసులోనే మృత్యువుతో పోరాడిన ఆమె సినీ జీవితంలో అత్యన్నత స్ధానాన్ని అధిరోహించినా చివరికి నిజ జీవితంలో అతిఘోరంగా విఫల మైన ఆమె జీవితం అందరికీ ఒక పాఠం కావాలి.)
బాల్యంగుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో డిసెంబరు 6న నిస్సాంకురమ్ గురవయ్య, సుభద్రమ్మలకు జన్నించారు. నాట్యంలోనూ, సంగీతంలోనూ ప్రవీణ్యురాలై, ఎన్నో ప్రదర్శనలిచ్చింది. నందమూరి తారకరామారావు, జగ్గయ్య వంటి మహా నటులు ఆరోజుల్లో నడిపిన నాటకప్రదర్శనలలోనూ స్టేజీమీద ప్రదర్శనలిచ్చారు. తరువాత నవభారత నాట్యమండలి అనే నాటక కంపెనీని స్ధాపించారు.బుజ్జిబాబు రచించిన ఆత్మ వంచన నాటకం ప్రసిద్ధి చెందింది.
12 సంవత్సరాల వయస్సులో మద్రాసు చేరిన ఆమె సినిమాలలో ప్రయత్నం చేశారు. తెలుగులో తొలి అవకాశం యల్.వి.ప్రసాద్ గారి సంసారం సినిమాతో మొదలయింది.అనంతరం పాతాళభైరవిలోనూ నృత్యపాత్రలో కనిపించిన ఆమె చిన్నచిన్న పాత్రలు చేసినా ఆమె పెళ్ళిచేసి చూడు, అర్ధాంగి, మిస్సమ్మ ఇలా ఎన్నో సినిమాలలో మంచి నటిగా గుర్తింపు పొందింది.వివాహ జీవితం
13 ఏళ్ళ వయసులోనే సావిత్రి జెమిని గణేశన్ ని మొదటి సారి చూసారు. యువకుడు, అందగాడు అయిన ఆటను జెమిని స్టుడియోలో స్టిల్ ఫోటోగ్రాఫర్ సావిత్రి స్టిల్ ఫొటోస్ ఆయనే తీసారు. అతనికి అలమేలు, పుష్పవల్లి అని ఇద్దరు భార్యలు,పిల్లలువున్నారు
జెమిని గణేశన్ తో జంటగా |
ఆమె తమిళ హీరో జెమినీగణేష్ తోనూ, శివాజీ గణేశన్ తోనూ అనేక చిత్రాలలో నటించారు.
1949లో అగ్ని పరీక్షలో అవకాశం వచ్చినా అప్పటి ఆమె ఆపాత్రకి సరిపోరనిచిన్న పిల్లని.ఇంకామెచ్యూరిటీ కావలసి వస్తుంధని ఆసినిమాలో ఆమె ఎంపిక కాలేదు. ʻమనంపోల మాంగల్యమ్ʼ తమిళ్ సినిమా (1953)లో నటించారు. హీరో జెమినీ గణేష్. ఆసమయంలోనే ప్రేమ మత్తులో పడి పద్దెనిమిది ఎల్లా వయసులో 1953లోనే ఆమె జెమినీగణేష్ ని ఎవరికీ చెప్పకుండా వివాహం చేసుకున్నారు. మూడేళ్ళ తరువాత ప్రపంచానికి తెలిసింది వారి పిల్లలు అయిన కూతురు విజయ చాముండేశ్వరి, కొడుకు సతీష్ లను చాలా స్ట్రిక్ట్ గా డిసిప్లిన్ తో పెంచారు.
టి.వి.లు లేని ఆరోజుల్లో 16ఎం.ఎం. ప్రొజెక్టర్ పెట్టి ఇంట్లోనే సినిమాలు చూసేవారు.
మాయాబజార్లో శశిరేఖ పాత్ర అంటే సావిత్రిలా వుంటుంది అనిపిస్తుంది. మిస్సమ్మలో మిస్ మేరి కూడా తక్కువేం కాదు.
కదాబలం, తారా బలంతో పాటు సావిత్రి నటన ఆ చిత్రానికి హైలైట్గా నిలిచింది. ఇప్పటికి ఆ చిత్రాలు ఏ చానెల్ లో వచ్చినాకళ్ళప్పగించి చూసే వారు చాలామందే వున్నారు. మహా నటి అంటే సావిత్రే! ఇంకొకఋ ఎవరు ఆ స్థానం పొందలేరు, ఆక్రమించలేరు.
ఆమె సహజ నటి. ఎటువంటి పాత్రనైన సులువుగా నటిస్తుంది. ఒకే టేక్ లో పూర్తీ చేస్తుంది. ఎక్కువ టేక్ లు చెప్పడం, రీల్ వేస్ట్ చేసేవారు కాదు పాత్రలలో లీనమై నటించేవారు. షూటింగ్ పూర్తీ అయినా ఇంకా అదే మోషన్ లో ఉండేవారు
ఇక ఈ సీన్ లోనైనా కన్నీరు కార్చవలసి వస్తే గ్లిసరిన్ వాడే వారు కాదు. చాల కంట్రోల్ గా ఈ కన్ను లోనించి ఎన్ని బొట్లు నీరు రావాలన్న అంటే రప్పించేవారు. కంటి చూపుతో నయగారాలు,చిన్నపెదవి విరుపుతో భావాలు, ఎంతని వర్ణించిన తరగని అందం అమెది.
తరగని ఆస్తి ... కానీ ...
కోట్ల విలువ చేసే నాలుగు బంగ్లాలులతో పాటు కొడైకెనాల్ లో, విజయవాడలో, హైదరాబాడ్లలో
భవంతులు,కృష్ణా జిల్లాలో విజయ్ స్పిన్నింగ్ మిల్స్, వ్యవసాయ ఎస్టేట్ల తో పాటు సావిత్రి ప్రొడక్షన్స్ అనే సినీ ప్రొడక్షన్ కంపెనీ వుండేది. ఆరు కార్లు ఇంటినిండా పనివారు..అంతా వైభోగమే. అన్ని కుడా ఆమె తన నట జీవితంలో సంపాదించినవే! తన భర్త నుంచి ఏమిఆశించలేదు. ఆమె దినసరి ఆదాయం ఐదువేల పైనే ఆ రోజుల్లో. ఆమె ఏడాదికి ఎనిమిది లక్షలకి పైగా ఆదాయపు పన్ను కట్టేవారు..
కానీ సినిమాలు తీసి భారీగా నష్టపోవటం, లక్షలకి లక్షలు దానాలు ఇవ్వటం, మత్తు పదార్ధాలకి బానిస కావటం, సంపాదించిన దానిపై అజమాయిషీ లేకపోవటం, 1972 తరువాత సిని అవకాశాలు తగ్గిపోవటం, భర్తతో విబేధాలు, మానసిక క్రుంగుబాటు.... అన్ని కలిసి ఆమె జీవితాని అధ పాతాళానికి నెట్టి వేసాయి. అంతటి ఆస్తిపరురాలు చివరికి అద్దె ఇంట్లో వుంటూ,
నె ల్లతరబడి కోమాలో వుంటూ చాల భాదాకరమైన జీవితాన్ని అనుభవించారు. ఉత్తుంగ తరంగంలా ఎగసిపడిన ఆమె జీవితం నేలకి ఒరిగిన కడలి తరంగంలా అయింది.
సినీ సామ్రాజ్ఞి....తెలుగు వారు మరచిపోలేని పాత్ర దేవదాసులోని పారు. ఆచిత్రం చాలామంది వందల సార్లు వీక్షించారు.ఇఫ్పటికీ వన్నె తరగని చిత్రమది. అలాగే మాయాబజార్ లోని శశిరేఖ పాత్ర. ఇప్పటికీ ʻఅహనా పెళ్ళంట....ʼ పాటని ఆసన్నివేశాన్ని మరువలేరు ఎవరూ. చూపులతోనూ, పెదవి కదలికలతోనూ తన నటనతో ఎందరినో మంత్రముగ్ధులను చేశారు ఆమె. నర్తనశాల, శ్రీకృష్ణపాండవీయం, సుమంగళి, నాదీ ఆడజన్మే, నవరాత్రి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు ఆమె నటనాకౌశలానికి దీపికలు. దొంగరాముడు, తోడికోడళ్ళు, అభిమానం, మురిపించేమువ్వలు,(1960) మంచిమనసులు(1961), డా. చక్రవర్తి (1964) దేవత(1965) మనసే మందిరం (1971)... ,వంటి చిత్రాలు ఆమె నటనకి మైలు రాళ్ళు.తెలుగు తమిళ, హిందీ చిత్రాలన్నిటిలో కలిపి 318 సినిమాలలో నటించారు.హిందీలో....బహుత్ దిన్ హుమై, ఘర్ బసాకే దేఖో, బలరామ్ శ్రీకృష్ణ, గంగాకి లహరే... మొదలైనవి.సావిత్రిని దక్షిణాది మీనాకుమారిగా అభివర్ణించేవారు.దర్శకురాలిగా...మాతృదేవత, వింత సంసారం, చిన్నారి పాపలు, చిరంజీవి మొదలైన చిత్రాలు.నిర్మాతగా...చిన్నారి పాపలు, ఏక్ చిట్టీ ప్యార్ భరీ చిత్రం బాగుందన్నా... ఆర్ధికంగా బాగా దెబ్బతిన్నది.గాయనిగా..నవరాత్రి సినిమాలో ఒక పాట పాడారు.మానవసేవే మాధవ సేవ...అడిగినవారికి లేదనకుండా దానమిచ్చే దానశీలి. అధిక భాగం ఆమె సంపాదనలో అధిక భాగం దానాలకే ఖర్చయ్యేది. అందరినీ నమ్మేది.లాల్ బహుదూర్ శాస్తిగారి సమక్షంలో తన వంటిమీద నున్న నగలని ప్రధాన మంత్రి సహాయ నిధికి దానమిచ్చింది.అభిరుచులు...ఆమెకి క్రికెట్ అన్నా, ఛెస్ అటలంటే ప్రీతి. ఆమెకి ఎడమచేతి వాటం ఎక్కువ.పిల్లలని ప్రేమతో చూసుకునేది.అవార్డులు...తమిళ్ రాష్ర్ర ప్రభుత్వంచే కలైమామణి...తనడిగర్ తిలగమ్... నటశిరోమణి...ఎన్నో అవార్డులు అందుకున్నారు....మహానటి.... ఉత్తమ నటీమణి...
ఎవ్వరూ ఇవ్వలేని అవార్డు..
ʻʻప్రజల హృదయాలలో చిరంజీవిʼʼ
అంతిమ జీవితం.....ఆమె ఎంతో ఇష్టపడి, ప్రేమించి వివాహం చేసుకున్న ఆమె వివాహం జీవితం ముళ్ళబాటలోనే నడిచింది. నమ్మిన వ్యక్తులు మోసపుచ్చి, నట్టేట ముంచారు ఆమెను. ఎంతో సుసంపన్నురాలైన ఆమె వ్యాపారాలపేరిట, మోసాలపేరిట, దానాలపేరిట సంపాదించిందంతా పోగొట్టుకున్నారు. వివాహం సంబంధాలు ఇరువురి మధ్య తెగిపోయాయి. జీవితంలో తట్టుకోలేని సమస్యలు, మెంటల్ టెన్షన్ లు ఎక్కువయ్యాయి. చివరికి వ్యసనాలకి బానిస అయ్యారు. ఆల్కహాలు, నిద్రమాత్రలు, డ్రగ్స్ ఇత్యాది వాటికి అలవాటు పడ్డారు. అనేక మార్లు ఆస్పత్రిలో చేరి చికిత్సనూ పొందారు. డాక్టర్లు మత్తు పదార్ధాలు వలదని వారించినా ఫలితం లేకపోయేది.
చివరిసారిగా ఆమె బెంగుళూరు సమీపంలో తెలుగు చిత్రానికి షూటింగ్ లో పాల్గొనటానికి వెళ్లి(మత్తులో) పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయారు. డయాబెటిక్ వ్యాధిగ్రస్ధురాలు కూడా అయిన ఆమె అంతిమ దశలోకి (టర్మినల్ కోమా) చేరుకున్నారు. ఇద్దరు పిల్లలు, నర్సు సంరక్షణలో, అద్దె భవనంలో, అతి భయంకరమైన పరిస్ధితిలో.... దాదాపు 18 నెలల సుదీర్ఘ పోరాటం అనంతరం డిసెంబరు 26 శనివారు రాత్రి 11గం.లకు (1981)లో తుది శ్వాస విడిచారు. ఆమె మరణించడానికి ముందు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛేంబర్ గోల్డెన్ కమిటీ ఆమెకి 10,000 రూపాయలు విరాళం అందింది. అవి ఆమె వైద్యానికి ఎంత మాత్రం సహాయ పడేవో అర్ధం కాదు...
BRAIN LESS DONKEY - TELUGU MORAL AND KIDS STORY BY SRI KOTHAPALLI
మెదడు లేని గాడిద
మెదడు, గుండె , కాలేయం ఉంచుకుంటే మంచిది- ఎందుకో ఇదిగో, ఈ కథ చదివితే తెలుస్తుంది...
అందుకని ఒకపని చెయ్యి - నీ తెలివితేటలను ఉపయోగించి, అడవిలో కనబడ్డ ఏ దున్నపోతునో, గాడిదనో, గుర్రాన్నో నా గుహ దగ్గరికి తీసుకురా. నేను ఒక్క ఉదుటన దాని మీదికి దూకి చంపేస్తాను. అట్లా నీకూ ఎంతో కొంత తినటానికి దొరుకుతుంది కూడాను.
చూడు, మరి!" అన్నది.
నక్క అడవిలో కొద్దిసేపు తిరిగిందో, లేదో, దానికి మన గాడిద కనబడింది. నక్క దాని దగ్గరికి వెళ్లి మర్యాదగా పలకరించి, "గాడిద బావా! ఏంటి, నీ కథ? ఇంత చిక్కిపోయావెందుకు? మేత సరిగ్గా దొరకటం లేదా? అడవి అంతా మంచి పచ్చగడ్డి, కొల్లగా ఉంది గద?" అన్నది.
"అంతా దైవేచ్ఛ! దేవుడి ఇష్టం ప్రకారమే యీ జగత్తులో ఏదైనా జరుగుతుంది, ప్రాణాలు కులాసాగా తిరగాలన్నా, రోగాలతో బాధపడాలన్నా - దేనికైనా ఆ భగవంతుడి సంకల్పం అవసరం. ఆయన శక్తి ముందు మనం ఏపాటి?" అన్నది గాడిద.
"అయ్యో! బావా! నువ్వు ఎక్కడో తప్పుగా అర్థం చేసుకున్నావు. 'తృప్తి' అంటేనూ, 'దైవేచ్ఛ' అంటేనూ ఏమిటో నీకు సరిగా అర్థం అయినట్లు లేదు. 'నీ జీవితానికి అధారమైన ఆహారాన్ని మిగిలిన అన్ని ప్రాణులలాగానే నువ్వూ వెతుక్కోవాలి' - ఇదే దైవేచ్ఛ అంటే" అన్నది నక్క.
గాడిద అన్నది - "నక్క బావా! తృప్తిగా ఉండటం వల్ల చచ్చిపోయిన వాడెవరూ నాకు ఇంత వరకూ కనబడలేదు. అట్లాగే , ఆశగా కోరినంత మాత్రాన రాజైపోయిన వాణ్ణీ నేనెన్నడూ చూడలేదు.
"పో, బావా! నీ వేదాంతం అంతా తప్పు" అన్నది నక్క.
రెండూ ఈ వరసలో కొంత సేపు వాదులాడుకున్నాక, నక్క తన చివరి అస్త్రాన్ని 'ఆశ' అనేదాన్ని - ప్రయోగించింది". చూడు బావా! ఇవన్నీ వట్టి మాటలు, నాకు ఇవేమీ చెప్పకు, ఇక్కడికి దగ్గర్లోనే దుబ్బలు దుబ్బలుగా పచ్చగడ్డి పెరిగిన ప్రదేశం ఒకటి ఉన్నది. నీలాంటి జంతువులకు స్వర్గం అంటే అదే. నువ్వు అక్కడికి వస్తానంటే రా, దారి చూపిస్తాను, లేకపోతే నా దారిన నేను పోతాను," అన్నది.
నిరంతరం ఆకలితో అలమటించిపోతున్న గాడిద మొహం ఆ మాటలకు వికసించింది. తన వాదనలను కట్టి పెట్టి అది నక్క వెంబడి, అది చూపిస్తానన్న స్వర్గాన్ని అనుభూతి చెందటం కోసం బయలు దేరింది.
చాలా దూరం నుండే దాన్ని చూసింది సింహం. మరుక్షణం దానికి నోట్లోనీళ్లు ఊరటం మొదలు పెట్టాయి. గాడిద ఆత్రం కొద్దీ ఇంకా దూరంగా ఉండగానే అది దాని వైపుకు లంఘించి బోయింది. కానీ అది చాలా బలహీనంగా ఉందేమో, గాడిదను చేరకనే బొక్క బోర్లా పడి, ఇక లేవలేక గట్టిగా మూలిగింది! గాడిద కంగారుగా వెనక్కి తిరిగి పరుగో పరుగు!
నక్క సింహం దగ్గరికి వచ్చి నిలబడి - "ప్రభూ! తమరు ఇంకొంచెం ఓపిక పట్టి, మరి కాస్త తెలివివిని ప్రదర్శించి ఉంటే సరిపోయేది కదా, యీ గాడిద తమరి భోజనం అయి కూర్చొనేది!" అన్నది విచారంగా.
తొందర పాటు వల్ల చేతికందిన ఆహారాన్ని పోగొట్టుకున్న సింహం గట్టిగా నిట్టూర్చి - "నన్ను క్షమించు మిత్రమా! నువ్వున్నది నిజం. తొందర పాటు ఎంత చేటో చూడు, అయినా నీ ప్రయత్నం గొప్పది; నీ తెలివి అమోఘమైనది. విరమించుకోకు, మరొక్కసారి ఆ
గాడిదను ఏదో ఒక విధంగా ఇక్కడికి తీసుకురా; కాదనకు. యీ సారి నేను ఏం చేస్తానో చూడు" అన్నది.
"ప్రభూ! నేను ఇంకో సారి ప్రయత్నించి చూస్తాను, ఏదో ఒక మాయ చేసి, ఆ గాడిదను మళ్లీ మీ గుహ దగ్గరికి తెస్తాను. కానీ యీ సారి తమరు తొందరపడకండి-నిగ్రహంతో పనిని సాధించాలి" అని చెప్పి, తిరిగి గాడిదను వెతుక్కుంటూ బయలుదేరింది నక్క.
నక్కని చూసి గాడిద వణికి పోయింది- "బావా! ఏమిటిది? 'స్వర్గాన్ని చూపిస్తాను' అని తీసుకెళ్లి నన్ను నేరుగా సింహం నోట్లోకే తోశావే! నీకు నేనేం అపకారం చేశానని, ఇంత పని చేశావు?" నిలదీసింది అది, నక్కని.
నక్క ఆశ్చర్యాన్ని నటిస్తూ - "ఏంటి?! సింహమా?! అదెక్కడున్నది?! యీ అడవిలో ఇన్నేళ్లుగా ఉంటున్నాను - ఒక్కటంటే ఒక్క సింహమూ కనబడలేదే, నాకు?! నీకెక్కడ కనబడింది?!" అన్నది.
"ఊరుకో గాడిద బావా! నీకు భ్రమ రోగం ఏదో ఉన్నట్లుంది. లేకపోతే, నాకు కనబడని సింహం నీకు కనబడటమేమిటి, నీ ప్రక్కన నేనుండగానే అది నీ మీదికి దూకటం ఏంటి, మళ్లీ నిన్ను వది లెయ్యటం ఏంటి? నిజంగా సింహం నోటచిక్కి తప్పించుకోగలరా, ఎవరన్నా?! నీ భ్రమనిక కట్టిపెట్టు" అన్నది నక్క, గాడిద అనుభవాన్ని కొట్టిపారేస్తూ.
గాడిద ఆ మాటలకు ఒట్టి గాడిదే అయిపోయింది: తన అనుభవాన్ని తానే అనుమానించింది. "అవునా! నిజంగానే?! నేను భ్రమ పడ్డట్లున్నాను! ఎంత భయపడ్డానో చూడు, అనవసరంగా! అసలక్కడ సింహమే లేదు! నా వెర్రిభయం కూల! పద, వెళ్లి హాయిగా గడ్డి మేస్తాను పద" అని అది మళ్లీ నక్క వెంబడి బయలుదేరి వచ్చింది.
యీ సారి సింహం ఓపిక పట్టింది. అది బాగా దగ్గరికి వచ్చాక దొరికించుకొని దాన్ని ఒక్క దెబ్బకే విజయవంతంగా చంపేసింది.
అయితే ఆ సరికి దానికి బాగా దాహం అవుతున్నది. 'ముందు నీళ్లు త్రాగి వస్తే, ఆనక కడుపారా మాంసం తినచ్చు' అని అది గాడిద శరీరానికి నక్కని కాపలాగా ఉంచి, తను నది దగ్గరికి వెళ్లింది. అట్లా వెళ్లిన సింహం వెనక్కి తిరిగి వచ్చేంత వరకు తాళలేక పోయిందినక్క!
అది గబగబా గాడిద మెదడును, గుండెను, రుచిగా ఉండే ఇతర భాగాలను గుటుక్కుమనిపించి, ఏమీ ఎరగని దాని తీరున, మామూలుగా కూర్చున్నది.
సింహం వచ్చి చూసే సరికి, గాడిద శరీరంలో ముఖ్యమైన భాగాలేవీ లేవు.
"అరే, దీని మెదడు, గుండె, కాలేయం ఏమైనాయి?" అని అడిగిందది నక్కని, ఆశ్చర్యపోతూ.
"అయ్యో! యీ గాడిదకు అసలు అవేవీ లేవు ప్రభూ! మెదడు, గుండె ఏ కొంచెం ఉన్నా ఆ గాడిద రెండోసారి తమరి గుహ దగ్గరికి వచ్చేందుకు సాహసించేదా, మీరే చెప్పండి " అన్నది నక్క వినయం నటిస్తూ.
LORD SRI VENKATESWARA SWAMY VARI TEMPLE AT VYKUNTA PURAM, TENALI, GUNTUR DISTRICT, ANDHRA PRADESH, INDIA
శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠపురం తెనాలి
ఈదేవాలయం తెనాలి కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రంలో వేంకటేశ్వర స్వామి శ్రీలక్ష్మి పద్మావతి సహితంగా కొలువుదీరి ఉన్నాడు.
ఈ క్షేత్రంలో భూవరాహస్వామి, హనుమ, నాగేంద్రుడు ఉపాలయాలు ఉన్నాయి.
దేవాలయ ముఖమండపంలో శ్రీనివాసుని అవతార విశేషాలు తెలిపే చిత్రాలు గోడలపై నలుదిశల కడురమణీయంగా కొలువుదీరి ఉన్నాయి.
ఈ క్షేత్రంలో శ్రీలక్ష్మి పద్మావతి అర్ఛా మూర్తులు నిలబడి దర్శనమిస్తారు.
Subscribe to:
Posts (Atom)