ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

POTATO RICE - SPECIAL RECIPE IN TELUGU





కావలసిన వస్తువులు : బియ్యం - 2 కప్పులు, బంగాళదుంపలు - అరకిలో, ఉల్లిపాయలు - 4, పచ్చిమిరపకాయలు -15, టమోటాలు -8, పోపుసామాను - 2 టేబుల్‌స్పూన్లు, నెయ్యి-2 టేబుల్‌ స్పూన్లు, సన్నగా తరిగిన కొత్తిమీర-2 టేబుల్‌ స్పూన్లు, పసుపు-1/2 టీస్పూను
ధనియాలు-1/2 టీస్పూను, జీలకర్రపొడి-1/2 స్పూను
గరం మసాలాపొడి-1 టీస్పూను, జీడిపప్పు-20 బద్దలు, కొత్తిమీర - 1 కట్ట
నూనె - తగినంత, ఉప్పు- తగినంత
నూరుకోవలసినవి
అల్లం -2 ముక్కలు, వెల్లుల్లి - 10 రేకులు
దాల్చినచెక్క - 2 ముక్కలు, లవంగాలు - 10
తయారు చేసే విధానం
ముందుగా టమెటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను నీళ్లు కలపకుండా మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. బంగాళదుంపల పొట్టు తొలగించి, అంగుళం ముక్కలుగా తరగాలి. అల్లం, వెలుల్లి దాల్చినచెక్క లవంగాలను నూరి మసాలా సిద్ధం చేసుకోవాలి. బియ్యం శుభ్రంగా కడిగి అన్నం వండాలి. అన్నాన్ని వెడల్పాటి పళ్లెంలో వేసి పలుచగా సర్దాలి. బంగాళదుంపల ముక్కల్ని నూనెలో చిప్స్‌ మాదిరిగా వేయించి తీసుకోవాలి. జీడిపప్పును ముక్కలుగా చేసి నేతిలో వేయించి తీసుకోవాలి. తరువాత ఒక బాణలిలో నూనె పోసి స్టౌమీద వేడి చేయాలి. ఇందులో ముందుగా ఆవాలు, మిగిల్చిన అల్లం, వెల్లుల్లి, దాల్చినచెక్క, లవంగాలతో కూడిన మసాలా ముద్దను వేడి తడి ఆరిపోయేంతవరకు మీడియం సెగలో వేయించాలి. అందులో జీలకర్రపొడి, ధనియాలు, గరంమసాలా పొడి, పసుపు వేసి బాగా కలపాలి. ఇందులో గ్రైండ్‌ చేసి సిద్ధంగా వుంచుకున్న టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని తగినంత ఉప్పు వేసి మగ్గించాలి. తరువాత చల్లారబెట్టిన అన్నం వేయాలి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను కలిపి గరిటెతో బాగా కలియబెట్టాలి. వేయించి సిద్ధంగా వుంచుకున్న బంగాళదుంప ముక్కలు, జీడిపప్పు ముక్కలను కలిపి, అన్నం మిశ్రమం వేడెక్కిన తరువాత బాణలిని స్టౌమీద నుంచి దించుకోవాలి. బంగాళాదుంపల అన్నం రెడీ. వేడివేడిగా అతిథులకు వడ్డించాలంతే.