The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
BEAUTIFUL LONG HAIR TIPS
తలస్నానంతో చుండ్రుమాయం!
తలమీదజుట్టు మెత్తగా, నున్నగా నిగనిగలాడుతూ ఉండాలి. అందుకని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మనం ఎక్కడెక్కడో తిరిగినప్పుడు దుమ్మూ, ధూళీ, తలపైనపేరుకుపోతుంది. అది పోవడానికి రోజూ తలస్నానం చేయటం మంచిది. రోజూ వీలుకాకపోతే కనీసం వారానికి ఒకసారన్నా తలస్నానం చేయటానికి మంచిది. రోజూ వీలు కాకపోతే కనీసం వారానికి ఒకసారన్నా తలస్నానం చేయాలి. అప్పుడే జుట్టు అందంగా వుంటుంది.మానవులకు ఎన్నో జబ్బులు వస్తూ ఉంటాయి. వాటి అన్నిటిలాగానే జుట్టుకుే కూడా జబ్బులు వస్తూ ఉంటాయి. ఆ జబ్బుల్లో ఒకటి చుండ్రు. ఇది జుట్టుకు ప్రధాన శత్రువు. చుండ్రు ఉంటే చాలు-తల తరచూ దురద పుడుతూ ఉంటుంది. ఈ దురదను మాన్పుకోవడానికి గీరుతూ ఉండవలసిందే. తలపైన చర్మం ఉన్నది. దానిలోని గ్రంథులు నూనెలాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. దానికి దుమ్ము, దూళిల మిశ్రమం తోడయిందనుకోండి చుండ్రు బయలు దేరుతుంది. మొదట కొద్దిగా జిలగా ప్రారంభం అవుతుంది. అదేపెద్ద దురదగా మారుతుంది.ఒక్కోసారి చర్మం పలుచని పొరలు పెచ్చులుగా ఊడిపోతూవుంటుంది. ఇది మాత్రం చుండ్రు కాదు. చుండ్రు పోవడానికి చక్కగా తలస్నానం చేయడం ఒక్కటే మంచి మార్గం. తలస్నానం తోపాటు జుట్టు మాయకుండా చూసుకోవాలి.చుండ్రుఎక్కువైతే అది తగ్గిపోవటానికి డాక్టర్లు కొన్ని మందులు వాడతారు. సల్ఫర్, సలిసిలిక్ యాసిడ్, తారు కలిపిన అయింటుమెంట్లు లేక లోషన్లు అవి.వీటిని రాత్రి పూటతలకు పట్టించాలి. ఉదయాన్నే చక్కగా తల స్నానం చేయాలి. స్నానం చేసి జుట్టును చక్కగా తుడిచి , ఆరబెట్టాలి. దానితో కాస్తన్నా ఉపశమనం కలుగుతుంది.
IF U WANTS LIFE IS BEAUTIFUL FOLLOW STEPS
ప్రశాంత జీవనానికి 25 సూత్రాలు!
1. రోజూ 10-30 నిమిషాల నడక అలవరుచుకోండి. నడిచేటప్పుడు మంచి విషయాలను గుర్తుచేసుకుంటూ చిరునవ్వుతో ముందుకుసాగండి. ఇలా చేస్తే మీకు నిరుత్సాహం నుండి కొంత ఉపశయం లభిస్తుంది.
2 ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మౌనంగా కూర్చోండి.
3. ప్రొద్దున నిద్రలేచిన వెంటనే హడావిడిగా పరుగులు తీయకుండా ఓరెండు నిమిషాలు దేవుని స్మరించుకొని, ఈ రోజు బాగుండాలని కోరుకోండి.
4.చెట్లకు కాసేవాటిని ఎక్కువగా తినడం అలవరుచుకోండి. అంటే తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మొదలగునవి.
5.టీ అలవాటున్న వాళ్ళు గ్రీన్ టీనితాగండి. ఎక్కువ మంచి నీళ్ళు తాగడం ఉత్తమం. బ్లూ బెర్రీస్, బ్రాంకోలీ,బాదం వంటివి ఎక్కువ తింటుండండి.
6.ఒక రోజులో కనీసం ముగ్గురినైనా నవ్వించండి.
7.పిచ్చాపాటి మాట్లాడటంలో, గడిచిపోయిన వాటి గురించి ఆలోచించడంలో, బాధపడటం, ఏం చేస్తే ఏం జరుగుతుందో అనే నెగెటివ్గా ఆలోచించడంతో మీ బలాన్ని, సమయాన్ని వృధా చేయకండి ఏదైనా మంచిగా, పాజిటివ్గా జరిగే విషయాల గురించి ఆలోచించండి. మీ బలాన్ని, సమయాన్ని సద్వినియోగ పరుచుకోండి
.8.ఓ మహారాజు తరహాలో బ్రేక్ఫాస్ట్, రాకుమారునిలా లంచ్ మరియు చాలిచాలని డబ్బులున్న స్టూడెంట్లా డిన్నర్ చేయండి.
9. జీవితం అద్భుతంగా వుండకపోవచ్చు కాని బాగుంటుందన్న విషయం మరవవద్దు.
10. ద్వేషించేందుకు జీవిత కాలం సరిపోదు కాబట్టి క్షమించడం అలవర్చుకోండి.
11. మీగురించి మీరే అతిగా ఆలోచించకండి. ఎవరు ఎవర్ని పట్టించుకోరు. అంత సమయం ఎవరికీ లేదు. కాబట్టి మీకు నచ్చింది చేయండి. మీకు నచ్చిన విధంగా వుండండి.
12. ప్రతివాదనలో మీరే నెగ్గాల్సిన అవసరం లేదు కనుక కొన్నింటిని ఒప్పుకోవడం మంచిది.
13. పాత జ్ఞాపకాలను మరచిపోయి, ప్రశాంతంగా జీవితాన్ని ఆశ్వాదించడం నేర్చుకోండి. ఇది మీకు కొంత మనోల్లాసాన్ని కలిగిస్తుంది.
14. మీ జీవితాన్ని పక్కవారితోనో, ఇంకొకరితోనో పోల్చుకోవద్దు. వారి పయనం ఎంత వరకో, వారి గమనం ఎంటో మనకు తెలియదు కదా!
15. మీ సంతోషానికి మీరు బాధ్యులు. ఇంకెవరో కాదు అనేవి గుర్తుంచుకోండి!
16. ఏదైనా చెడు ఘటన సంభవించినప్పుడు మిమ్మల్ని మీరే సమర్థించుకోండి. ఓ ఐదేళ్ళ తర్వాత నేటి ఘటన ప్రాధాన్యత ఎంతవరకు అన్నది అలోచించండి.. మీకే అర్థమవుతుంది.
17. అవసరంలో వున్న వారికి మీకు చేతనైన సహాయం చేయండి. విజ్ఞతగా ప్రవర్తించండి.ఎప్పుడూ ఇవ్వడం తప్పతీసుకోవడం అలవర్చుకోవద్దు.
18.మీ గురించి ఎవరు ఏమనుకుంటున్నారన్న ఆలోచన కూడా మీకు అనవసరంఅన్నది గుర్తుంచుకోండి!
19. అన్నింటికీ సమయమే ఔషధం.
20. ఎంత మంచి స్థితి, లేదా కఠిన పరిస్థితులు ఎదురైనా మీరు మాత్రం మారవద్దు. ఎందుకంటే అవి మారిపోతాయి కాబట్టి.
21. మీకు అవసరమైనప్పుడు, అనారోగ్యంగా వున్నప్పుడు మీ ఉద్యోగం అన్నివేళలా సహకరించదు - కావున కుటుంబ సభ్యులను, మిత్రులను దూరం చేసుకోవద్దు.
22. ఒకరిని చూసి కుళ్ళు కోవటం కేవలం మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవడమే. మీకు అవసరాన్ని బట్టి మీ వద్ద అన్నీ వున్నాయన్న విషయాన్ని మర వద్దు.
23. రాత్రి నిద్రపోయే ముందు ఈ రోజెలా గడిచింది, ఈ రోజూ సుఖంగా గడిచిపోయినందుకు దేవునికి కృతజ్ఞత చెప్పటం అలవరుచుకోండి. ఇది మీ మనసుకు శాంతిని, కొంత ప్రశాంతతను చేకూరుస్తుంది.
24. మీ దగ్గర అన్నీ వున్నాయి, అందరి ఆశీస్సులూ వున్నాయి అని గ్రహించండి, ఆనందంగా జీవించండి. అనవసరంగా ఆందోళనకు లోనుకావద్దు.
25. అందరితో కలిసిమెలిసి, బేధాలు, విబేధాలు లేకుండా స్నేహంగా వుండటం నేర్చుకోండి. ఇవన్నీ పాటిస్తే మీరు సుఖసంతోషాలతో వర్థిల్లుతారన్నదే ఆశ.
ghee helps kids for healthy growing
ఎదిగే పిల్లలకు మేలు చేసే నెయ్యి!!
నెయ్యిలో ఔషధగుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.పాలు, పాల పదార్థాలు కొందరికి నచ్చదు అలాంటి వారు లాక్టోజ్ శాతం తక్కువగా ఉండే నెయ్యిని వాడొచ్చు. ఇందులో లభించే పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. కాలేయం, పేగులు, గొంతులోని మలినాలను బయటకు పంపుతుంది. నెయ్యి తీసుకొంటే కొలెస్ట్రాల్ సమస్య వస్తుందని అందరి నమ్మకం. అయితే ఇది అందర్నీ బాధిస్తుందని మాత్రం చెప్పలేం. ముందు నుంచి కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు నెయ్యి వాడకం తగ్గించాలి. ఒక్కోసారి శరీరంలో కొవ్వు శాతం పెరగడానికి శారీరక మార్పులు, ఇతర మార్పులు, ఇతర ఆహార పదార్థాలుకూడా కారణమయ్యే అవకాశం ఉంది. నెయ్యి బలహీనంగా ఉన్న వారికి చాలా మేలు చేస్తుంది. వాతాన్ని తగ్గిస్తుంది. చర్మానికి కాంతిని ఇస్తుంది. మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది. నిపుణులు దీన్ని మానసిక సమస్యలకు ఔషధంగా కూడా ఇస్తారు. ఇంకా తీసుకొన్ని ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆకలి మందగించినప్పుడు మిరియాల పొడిలో నెయ్యి కలిపి మొదటి ముద్దలో తీసుకొంటే చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఎదిగే పిల్లలకు ఎముక పుష్టిగా ఉండేందుకు గ్లాసు పాలలో చెంచా నెయ్యి వేసి తాగిస్తే మంచిది. అరటి పండు గుజ్జులో, కాసిని పాలు, కొద్దిగా నెయ్యి కలిపి పిల్లలకు తినిపిస్తే అవయవాలు దృఢంగా అవుతాయి. బరువు పెరుగుతారు.
పొడి చర్మతత్వం,ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలతో బాధపడేవారు పావు చెంచా వేప గింజల పొడిలో, పావుచెంచా నెయ్యి జోడించి మొదటి ముద్దతో కలిపి తింటే సత్వర ఉపశమనం దొరుకుతుంది. కాలిన బొబ్బల మీద నెయ్యిని పైపూతగా రాస్తుంటే మచ్చలు పడకుండా త్వరగా మానిపోతాయి. ముక్కు నుంచి రక్తస్రావమవుతుంటే రంధ్రాల్లో మూడు నాలుగు చుక్కలు నెయ్యి వేస్తే ఫలితం కనిపిస్తుంది. పసి పిల్లలకు నెయ్యి లేదా వెన్నను ఒంటికి రాసి కాసేపయ్యాక స్నానం చేయిస్తే చర్మం మృదువుగా మారుతుంది. క్షయవ్యాధి, మలబద్ధకం, విరేచనాలు, జ్వరంతో బాధపడేవారు, వృద్ధులు నెయ్యికి దూరంగా ఉండాలి.
sankranthi festival special article on telugu muggulu
ముగ్గు ముచ్చట
సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. రంగవల్లుల సందడీ మెుదలైరుు్యంది. అంటే తెలుగు లోగిళ్లు రంగురంగల ముగ్గులతో ముస్తాబైయ్యారుు. చూడడానికి రెండు కళ్లూ చాలవు. ఇక మన ఇంటి ఆడపచులు రోజూ ఉద యాన్నే లేచి ఇంటిముందు కళ్లాపి చల్లుతారు. ఈ కళ్లాపి అంటే మామూలు నీటితో కాకుండా ఆవుపేడను నీళ్లల్లో కలిపి ఆనీటిని ఇంటి ముందంతా కళ్లాపిగా చల్లుతారు. తరువా త బియ్యంపిండితోగానీ, ముగ్గు పిండితో కానీ అందమైన రంగవల్లులను తీర్చిదిద్దుతారు. ఆ రంగవల్లులమీద ఆవుపేడతో చేసిన ముద్ద నుంచుతారు. వీటిని గొబ్బెమ్మ లు అంటారు. ఈ గొబ్బెమ్మ లను కుంకుమ, పసుపుతో అద్ది పైన ఒక గుమ్మడిపూవుతో అలంకరించి అందమైన ముగ్గుపై పెట్టి అలంకరిస్తారు.
ఇలా రోజూ సంక్రాంతి పండగ వరకూ మహిళలు తెల్లవారుఝా మునే కోడికూచే వేళ లేచి అందమైన రంగవల్లులను పోటీపడి మరీ వేస్తారు. ఈ పోటీలో రోజుకొక అందమైన రంగవల్లిని వేస్తూ తోటివారితో ఆ రంగవల్లుల గురించి చర్చలు కూడా చేస్తారు. తమ ముగ్గే అందరూ చూడాలనే తపన, ముగ్గు బాగుందని మెచ్చుకోలు కోసం పోటీ పడతారు. ఈ పోటీ కూడా మంచి సహృదయతతో ఉంటుంది. ఈ పోటీలో కోపతాపాలకు తావుండదు. ఇలా సంక్రాంతి పండుగ రోజుల్లో ఆడవారిలో చాలా ఉత్సాహం వెల్లివిరుస్తుంది.
అయితే ఈ ముగ్గులలో కూడా రకరకాల ముగ్గులున్నాయి.
చుక్కలముగ్గు : చుక్కను పెట్టి కలుపుతూ వేసే ముగ్గు చుక్కలముగ్గు. దీన్ని ఆడవాళ్లు చాలా సులభంగా వేస్తారు.
మెలిక ముగ్గు : చుక్కకూ చుక్కకూ మెలికతిప్పుతూ చివరికి మొదటి చుక్క దగ్గరికి వస్తుంది. అంటే మొదలుపెట్టిన దగ్గరి నుంచీ చివరి వరకూ ఒకే లైనును కలుపుతూ వేస్తారు. కొద్దిగా లైను మారిందంటే ముగ్గంతా తప్పుగా మారి మొట్టమొదటి చుక్కదగ్గరికి రాలేము. అం దుకే మన ఇళ్లల్లో మహిళలు భోజనాలైనాక అందమైన ముగ్గులను గంటలకొద్దీ ప్రాక్టీసు చేస్తారు.
రంగవల్లికలు : రంగుల ముగ్గును వేసి ఆ ముగ్గు భాగంలో డిజైన్గా రంగులను అద్దు తారు. వీనినే రంగవల్లిక ముగ్గులు అంటారు.
గీతల ముగ్గు : గీతల ముగ్గంటే రథం ముగ్గును కూడా గీతల ముగ్గుగా చెప్పవచ్చు. రథం ముగ్గులో నిలువు గీతలను వరుసలలో వేస్తారు. పైన రెండవ వరుసలో గీతలు కింది వరుసలోని మధ్యమధ్యకు వేస్తారు. ఇలా చివరి పైవరుసకు వచ్చేసరికి ఒకే గీతల వరుస ఉంటుంది. ఇలా వేసిన రథం ముగ్గులో కింది వరుస గీతలను పైవరుసకు కలుపుకుంటూ చివరికి రథం ఆకారంలో రంగవల్లిని పూర్తిచేస్తారు. ఇపుడు రథం ముగ్గు తయారైపోతుంది.
ఈ రథానికి కింద రెండు చక్రాలను కూడా దిద్దుతారు. దీంతో అందమైన రథంముగ్గు తయారౌతుంది. ఈర థాని కి తాడులా ముగ్గువేసి పక్కింటి వారి రథానికి కలుపుతారు. ఇపుడు రథం ముగ్గుపై పసుపు, కుంకుమను చల్లి పూలతో అలంకరిస్తారు. ఈ రథం ముగ్గును సంక్రాంతి చివరి రోజునవేస్తారు. దీనితో సంక్రాంతి సంబరాలు, రంగవల్లుల సందళ్లు ముగుస్తాయి.
రంగవల్లుల్లో ఆరోగ్యం : ముగ్గుల్లో కూడా ఈ సంక్రాంతి రోజులలో ఆరోగ్యం ఇమిడి ఉంది. ఇంటిముందు ఆవుపేడతో కలిపిన నీళ్లను చల్లడం వలన మనకు అనారోగ్యాన్ని కలిగించే బ్యాక్టీరియా ఇంటి లోపలికి రాదని అంటారు. ఆవు మనకు పూజనీయమైనది. ఆవు మూత్రం, ఆవుపేడ, ఆవుపాలు మనకు ఆరోగ్యాన్ని స్తాయి. అందుకే మనం నిత్యజీవితంలో ఆవును పూజిస్తాము. అలాగే మన గ్రామీణ వాతావరణంలో మహిళలు ముగ్గును వేయడానికి బియ్యంపిండిని వాడతారు. ఈ ఆచరణలోకూడా జీవ వైవి ధ్యం మనకు స్పష్టంగా కన్పిస్తుంది.
ఈ ముగ్గు పిండిగా వాడే బియ్యం పిండిని చీమలు, చిన్నచిన్న పురుగులు ఆహారం గా తీసుకుంటాయి. తోటి జీవులకు ఆహారాన్నివ్వడం మనసంస్కృతిలో ఒక భాగ మైంది. అంతేకాదు ఈనాటికీ రైతులు పంటరాగానే వరి కం కుల్ని ఇంటి ముందు గుత్తిగా చేసి కట్తారు .ఎందుకంటే పిచ్చుకలు, చిన్నచిన్న పిట్టలకు ఆహారాన్ని ఇవ్వడం కూడా చూస్తుంటాము.
ముగ్గుల్లో గణితం : ఇక ముగ్గుల్లో కూడా గణితం కూడా ఇమిడి ఉంది. ఎం దుకంటే చుక్కలు పెట్టేప్పుడు ఒక లెక్క ప్రకారం పెట్తారు. అలా పెట్తేనే ముగ్గు అందంగా వస్తుంది. అంటే చుక్కలుగానీ, గీతలు కానీ లెక్కగా పెడితేనే ముగ్గు సరి గా అందంగా వస్తుంది. ఆ చుక్కలు పెట్టే లెక్కలు సరిగా లేకుంటే ముగ్గు అస్తవ్యస్తంగా ఉంటుంది. అంటే మన సంస్కృతి, సంప్రదా యాలలో అందం,ఆరోగ్యంతోపాటు గణితం కూడా ఇమిడి ఉన్నాయనేది నిర్వివాదాంశం.
ఇలా రోజూ సంక్రాంతి పండగ వరకూ మహిళలు తెల్లవారుఝా మునే కోడికూచే వేళ లేచి అందమైన రంగవల్లులను పోటీపడి మరీ వేస్తారు. ఈ పోటీలో రోజుకొక అందమైన రంగవల్లిని వేస్తూ తోటివారితో ఆ రంగవల్లుల గురించి చర్చలు కూడా చేస్తారు. తమ ముగ్గే అందరూ చూడాలనే తపన, ముగ్గు బాగుందని మెచ్చుకోలు కోసం పోటీ పడతారు. ఈ పోటీ కూడా మంచి సహృదయతతో ఉంటుంది. ఈ పోటీలో కోపతాపాలకు తావుండదు. ఇలా సంక్రాంతి పండుగ రోజుల్లో ఆడవారిలో చాలా ఉత్సాహం వెల్లివిరుస్తుంది.
అయితే ఈ ముగ్గులలో కూడా రకరకాల ముగ్గులున్నాయి.
చుక్కలముగ్గు : చుక్కను పెట్టి కలుపుతూ వేసే ముగ్గు చుక్కలముగ్గు. దీన్ని ఆడవాళ్లు చాలా సులభంగా వేస్తారు.
మెలిక ముగ్గు : చుక్కకూ చుక్కకూ మెలికతిప్పుతూ చివరికి మొదటి చుక్క దగ్గరికి వస్తుంది. అంటే మొదలుపెట్టిన దగ్గరి నుంచీ చివరి వరకూ ఒకే లైనును కలుపుతూ వేస్తారు. కొద్దిగా లైను మారిందంటే ముగ్గంతా తప్పుగా మారి మొట్టమొదటి చుక్కదగ్గరికి రాలేము. అం దుకే మన ఇళ్లల్లో మహిళలు భోజనాలైనాక అందమైన ముగ్గులను గంటలకొద్దీ ప్రాక్టీసు చేస్తారు.
రంగవల్లికలు : రంగుల ముగ్గును వేసి ఆ ముగ్గు భాగంలో డిజైన్గా రంగులను అద్దు తారు. వీనినే రంగవల్లిక ముగ్గులు అంటారు.
గీతల ముగ్గు : గీతల ముగ్గంటే రథం ముగ్గును కూడా గీతల ముగ్గుగా చెప్పవచ్చు. రథం ముగ్గులో నిలువు గీతలను వరుసలలో వేస్తారు. పైన రెండవ వరుసలో గీతలు కింది వరుసలోని మధ్యమధ్యకు వేస్తారు. ఇలా చివరి పైవరుసకు వచ్చేసరికి ఒకే గీతల వరుస ఉంటుంది. ఇలా వేసిన రథం ముగ్గులో కింది వరుస గీతలను పైవరుసకు కలుపుకుంటూ చివరికి రథం ఆకారంలో రంగవల్లిని పూర్తిచేస్తారు. ఇపుడు రథం ముగ్గు తయారైపోతుంది.
ఈ రథానికి కింద రెండు చక్రాలను కూడా దిద్దుతారు. దీంతో అందమైన రథంముగ్గు తయారౌతుంది. ఈర థాని కి తాడులా ముగ్గువేసి పక్కింటి వారి రథానికి కలుపుతారు. ఇపుడు రథం ముగ్గుపై పసుపు, కుంకుమను చల్లి పూలతో అలంకరిస్తారు. ఈ రథం ముగ్గును సంక్రాంతి చివరి రోజునవేస్తారు. దీనితో సంక్రాంతి సంబరాలు, రంగవల్లుల సందళ్లు ముగుస్తాయి.
రంగవల్లుల్లో ఆరోగ్యం : ముగ్గుల్లో కూడా ఈ సంక్రాంతి రోజులలో ఆరోగ్యం ఇమిడి ఉంది. ఇంటిముందు ఆవుపేడతో కలిపిన నీళ్లను చల్లడం వలన మనకు అనారోగ్యాన్ని కలిగించే బ్యాక్టీరియా ఇంటి లోపలికి రాదని అంటారు. ఆవు మనకు పూజనీయమైనది. ఆవు మూత్రం, ఆవుపేడ, ఆవుపాలు మనకు ఆరోగ్యాన్ని స్తాయి. అందుకే మనం నిత్యజీవితంలో ఆవును పూజిస్తాము. అలాగే మన గ్రామీణ వాతావరణంలో మహిళలు ముగ్గును వేయడానికి బియ్యంపిండిని వాడతారు. ఈ ఆచరణలోకూడా జీవ వైవి ధ్యం మనకు స్పష్టంగా కన్పిస్తుంది.
ఈ ముగ్గు పిండిగా వాడే బియ్యం పిండిని చీమలు, చిన్నచిన్న పురుగులు ఆహారం గా తీసుకుంటాయి. తోటి జీవులకు ఆహారాన్నివ్వడం మనసంస్కృతిలో ఒక భాగ మైంది. అంతేకాదు ఈనాటికీ రైతులు పంటరాగానే వరి కం కుల్ని ఇంటి ముందు గుత్తిగా చేసి కట్తారు .ఎందుకంటే పిచ్చుకలు, చిన్నచిన్న పిట్టలకు ఆహారాన్ని ఇవ్వడం కూడా చూస్తుంటాము.
ముగ్గుల్లో గణితం : ఇక ముగ్గుల్లో కూడా గణితం కూడా ఇమిడి ఉంది. ఎం దుకంటే చుక్కలు పెట్టేప్పుడు ఒక లెక్క ప్రకారం పెట్తారు. అలా పెట్తేనే ముగ్గు అందంగా వస్తుంది. అంటే చుక్కలుగానీ, గీతలు కానీ లెక్కగా పెడితేనే ముగ్గు సరి గా అందంగా వస్తుంది. ఆ చుక్కలు పెట్టే లెక్కలు సరిగా లేకుంటే ముగ్గు అస్తవ్యస్తంగా ఉంటుంది. అంటే మన సంస్కృతి, సంప్రదా యాలలో అందం,ఆరోగ్యంతోపాటు గణితం కూడా ఇమిడి ఉన్నాయనేది నిర్వివాదాంశం.
Subscribe to:
Posts (Atom)