ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

FULL PURANA STORY OF DURVASA MAHARISHI / MAHA MUNI IN TELUGU


దూర్వాస మహర్షి కధ - హనుమాద్గాదా తరంగిణి అనే హనుమద్ చరితామృతం 

దూర్వాస మహర్షి అంటే కోపానికి ప్రతి రూపం అని అందరికి తెలుసు .అయితె ఆయనను గురించిన కధలు చాయా వున్నాయి అవి అందరికి తెలియవు .కొన్ని కధలను తెలుసు కొందాం
దూర్వాసుడు అతి పురాతన మహర్షి .మహా సిద్ధుడు .మహాయోగి .కనుక తనకు ఇష్టమైనప్పుడు మరణించే సిద్ధి వుందాయనకు .మార్కండేయుని వంటి చిరంజీవి .మహా మంత్ర శాస్త్రాలన్నీ ఆపోసన పట్టిన మహాత్ముడు .పుణ్య వంతుడు ,ప్రజ్ఞా శీలి,.. ఆయన జన్మ గురించి రెండు రకాల కధలున్నాయి .పూర్వం త్రిపురాసుర సంహారం చేసి శివుడు చంకలో ఒక బాణం పెట్టు కోని వస్తున్నాడు.దారిలో ఇద్దరు దేవ పురుషులు కని పించారు .వారికి శివుడి చంక లో వున్న బాణం శిశు రూపం లో వున్న శివుని లాగా కన్పించిందట .వారు శివుణ్ణి ఆ శిశువు ఎవరని అడిగారు .అప్పుడు శివుడు ఆతడు తన కుమారుడని ,పేరు దూర్వాసుడు అని చెప్పాడు .వెంటనే ఆ బాణం శివానుగ్రహం తో శిశువు గా మారి ,క్రమ క్రమం గా పెరిగి మహా మేధావి, జ్ఞాని అయిన దుర్వాస మహర్షి గా వృద్ధి చెందాడు .ఇది దూర్వాసుని గురించిన మొదటి కధ .
రెండవ కధ – అత్రి మహర్షి కి అనసూయా దేవి అనే మహా పతి వ్రత భార్య గా వుంది .అనసూయ దేవ హోతీ ,కర్దము ల కుమార్తె .అత్రి అనసూయలు చక్కని ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసు కొంటు వున్నారు .ఒక సారి త్రిమూర్తులైన బ్రహ్మ ,విష్ణు మహేశ్వరులు తమ వాహనాల మీద తిరుగుతూ ,అత్రి మహర్షి ఆశ్రమం మీదగా ప్రయాణిస్తుంటే ఆ వాహనాలు కదల కుండా ఆగి పోయాయి .కారణం వారికేవారికి తెలియ లేదు .అప్పుడు గరుత్మంతుడు విష్ణు మూర్తి తో ”స్వామీ !కింద అత్రి మహా ముని ఆశ్రమం వుంది .దాని మీద నుంచి ,దానిని ,అతిక్రస్మించి ఎవరు పొరాదు .పోవటం సాధ్యం కూడా కాదు ”అని విన్న వించాడు .సరే అని వారంతా చుట్టూ తిరిగి వెళ్ళారు .అప్పుడు వారికి ఒక కోరిక కలిగింది .అత్రి మహర్షి ,,అంతటి మహిమావితుడా ?అయితె పరీక్షించాలి అను కొన్నారు .వాహనాలను చాలా దూరం లో ఆపేసి మ్ బ్రాహ్మణ వేషాలు వేసుకొని అత్రి మహర్షి ఆశ్రమం చేరారు త్రిమూర్తులు .ఆకలి గా వుందని ,తమకు భోజనం పెట్ట మని మహర్షిని వేడు కొన్నారు .
మహా సాధ్వి అనసూయా దేవి ,భ్హర్త అను మతి తో వారికి పీటలు వేసి ,విస్తళ్ళు పరిచి వడ్డించ టానికి సిద్ధ పడింది .అప్పుడు ఆ బ్రాహ్మణ వేషం లోని త్రిమూర్తులు ”అమ్మా !మాకు ఒక నియమం వుంది .మాకు వడ్డించే వారు దిస మొల తో వడ్డిస్తేనే మేం భోజనం చేస్తాం ”అన్నారు .వీరి ని గుర్తించిన సాధ్వి ,వెంటనే వారిపై మంత్రోదకాన్ని చల్లింది .వారు పసి పాపలు గా మారి పోయారు .అప్పుడు వారికి వారు కోరి నట్లే వడ్డించి ,మళ్ళీ నీళ్ళు చల్లింది .మళ్ళీ యధా రూపం పొందారు వారు .వాళ్ళు భోజనం చేసిన తర్వాత మళ్ళీ మంత్రోదకం చల్లి పసి పాపలు గా మార్చి ఉయ్యాల లో ఊపుతూ ,పెంచసాగింది .అక్కడ త్రిమూర్తుల భార్యలు భర్తల రాక కోసం ఎదురు చూస్తూ ఎంతకీ రాక పోయే సరికి ఏదో కీడు శంకించి ,చివరికి వారు అత్రి ముని ఆశ్రమం లో అనసూయమ్మ ఒడిలో పెరుగు తున్నారని తెలుసు కోని వెంటనే అక్కడికి చేరారు .తమ పాతివ్రత్యం అనసూయా దేవి పాతివ్రత్యం ముందు ఎందుకూ పనికి రాకుండా పోయిందని గ్రహించి ,నిజ రూపాలైన లక్ష్మీ సరస్వతి ,పార్వతి రూపాలతో అక్కడికి చేరారు .తమ నాదులను తమకు ఇవ్వ వలసినది గా అనసూయా దేవిని ప్రార్ధించారు .జగన్మాతలు తమ ఆశ్రమం కు వచ్చిన కారణం తెలుసు కొన్న అనసూయ దేవి వారి అతిధి మర్యాదలు చేసి సభక్తి గా పూజించించింది .వారి కోరికను మన్నించి ,ఆ పసి బాలురను మళ్ళీ త్రిమూర్తులను గా మార్చి వేసింది మంత్ర జలం ప్రభావం తో .అప్పుడు బ్రహ్మ విష్ణు ,మహేశ్వరులు నిజ రూపం పొంది ,అనసూయా దేవి పాతి వ్రత్యానికి అబ్బుర పడి ,నమస్సు లర్పించి ,తాము పరీక్షించా టానికి వచ్చినందుకు సిగ్గు పడు తున్నామని తెలిపి ఆమె కు వరాలు ఇవ్వాలని అనుకొంటున్నామని కోరుకో మని విన్న వించారు .అనసూయ తమకు తల్లి అయి, ఇప్పటి దాకా లాలించి పాలించి నందుకు గర్వ పడు తున్నామని సవినయం గా తెలిపారు .ఆ అమ్మ త్రిమూర్తులు తనకు కుమారులు గా జన్మించి ,ఆస లైన పుత్ర ప్రేమ ను కల్గించ మని కోరింది .వారు మువ్వురు తధాస్తు అన్నారు .త్రిమూర్తులు ,జగన్మాటలు అత్రి ,అనసూయాదేవి ల అనుగ్రహం పొంది వారి ఆశీస్సులు గ్రహించి వారి వారి పట్ట నాలకు వారి వారి వాహనాల పై వెళ్ళారు .కొంత కాలమ్ తర్వాత బ్రహ్మ అంశ తో అనసూయ గర్భం లో చంద్రుడు జన్మించాడు .విష్ణువు అంశ తో దత్తాత్రేయ మహర్షి ,శివాంశ తో దూర్వాస మహర్షి ఆమె కు జన్మించారు .ఇలా దూర్వాస మహర్షి మహా తపస్సంపన్ను లైన అత్రి ,అనసూయ దంపతుల కు శివాంశ వల్ల జన్మించిన కుమారుడు అని రెండో కధ వివ రిస్తోది .మిగిలిన కధలు తరువాత తెలుసు కొందాం .

దూర్వాస మహర్షి కధ –2
శివామ్ష తో జన్మించిన దూర్వాసుడు ,అన్ని విద్యలు నేర్చి ,గంధమాదన పర్వతం మీద తీవ్ర తపస్సు చేస్తున్నాడు .అప్పుడు దేవ దాసీ తిలోత్తమ ,ఆమె ప్రియుడు సాహసి అనే వాడు ఈ మహర్షిని గమనించ కుండా రాతి క్రీడలో పాల్గొన్నారు .వారి మాటలు ,చేష్టలు మహర్షి తపస్సు కు భంగం కల్గించాయి .ఆయన కళ్ళు తెరచి ,వారి కామోద్రేకానికి కినిసి ,వారిద్దరిని రాక్షసు లు గా జన్మించ మని శపించాడు .సాహసి ”గర్దభాసురుడు ”గా జన్మించాడు .ఇతడు మహా విష్ణువు చేతిలో మరణం చెండాడు .ఏమైనా భరద్వాజుని ఏకాగ్రత దెబ్బ తిండి .కామ వికారం కల్గి ,పెళ్లి చేసుకోవాలనే కోర్కె పెరిగింది .అదే సమయం లో చ్యవన మహర్షి కుమారుడు ”ఔర్వుడు ”అనే ఆయన ,తన కుమార్తె ”కందళి ”తో అక్కడికి వచ్చి ,మహర్షి మనసు లోని ఆట తెలుసు కోని ,తన కూతురు కందళి నిచ్చి దూర్వాసునికి వివాహం చేశాడు .
కందళి గంప గయ్యాళి .ఆమె ను భరించటం కష్టం గా వుంది ..ఆమె కోపాన్ని భరించ లేక ,ఆమెను వదిలి ,మళ్ళీ తపస్సు కు వెళ్ళాడు .ఆమెకు భర్త ను వదలటం ఇష్టం లేక ,ఆతడిని అనుసరించింది .కొంత దూరం వెళ్ళిన తర్వాత ,దివ్య రూపం లో వున్న ఒక పిల్ల వాడు అక్కడికి వచ్చి మహర్షితో కందలిక ను విడిచి పెట్ట వద్దనీ ,ఆమెయే తగిన అర్ధాంగి అవుతుందని చెప్పి వెళ్లి పోయాడు .కందలిక తన పేరు మీద కదళీ వృక్ష జాతిని సృష్టించింది.కందళి కడలి గా ,రంభా గా అరటి గా పేరు మారింది . .
దూర్వాస మహర్షి గురించిన మూడో కధ .పూర్వం ”నాభాగుడు ”అనే రాజు వుండే వాడు .ఆయన కుమారుడే అంబరీషుడు .అంబరీషుడు విష్ణు భక్తుడు .ఏకాదశీ వ్రతాన్ని భ క్తీ శ్రర్ధ లతో చేసే వాడు .ఒక సారి ఏకాదశి ఉపవాసం వుంది ,మర్నాడు ద్వాదశి నాడు పారాయణ చేయటానికి సిద్ధ మైన సమయం లో దూర్వాసుడు ,ఆయనకు అతిధి గా వచ్చి స్నానం చేయటానికి నదికి వెళ్ళాడు .ద్వాదశి ఘడియలు పూర్తి ఆయె సమయం అయినా మహర్షి రాలేదు .అక్కడున్న మార్షుల అనుమతి తో ,కొద్దిగా జలాన్ని తీర్ధం గా త్రాగాడు .తర్వాత దూర్వాసుడు వచ్చి ,జరిగిన దానికి కోప పది తన శిరస్సు లోని ఒక జడ ను పీకి దాన్ని పిశాచిగా మార్చి భక్త అంబరీషుని పైకి పంపాడు .అది అతి భయంకరం గా మీదకు రావటం గ్రహించి ,రాజు ,శ్రీ హరిణి మనసు లో ధ్యానించాడు .వెంటనే విష్ణు చక్రం ఉద్భవించి ,పిశాచాన్ని చంపి ,,దుర్వాసుని చంప టానికి మీదకు వెళ్ళింది .
భయం తో దుర్వాసుడు పారి పోవటం ప్రారంభించాడు .చక్రం ఆయన్ను వెన్నంటే వెళ్తోంది .మూడు లోకాలూ తిరిగి నా ఎవరూ,దుర్వాసునికి అభయం ఇవ్వ లేదు .చివరికి విష్ణువు ఆజ్ఞా తో మళ్ళీ అమ్బరీశున్నే శరణు వేడాడు .అంబరీషుడు అతన్ని క్షమించాడు .వెంటనే చక్రం అదృశ్య మైంది .భగవంతుని కంటే ,భక్తుడే శక్తి కల వాడు అని ఈ కధ మనకు తెలియ జేస్తుంది .
ద్వాపర యుగం లో కుంతిభోజుడు అనే రాజు దగ్గరకు దుర్వాసుడు వచ్చాడు .ఆయన కుమార్తె కుంటే దేవిని చూసి ,ఆమె భక్తికి మెచ్చి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశిచాడు .ఆ మంత్రాన్ని ఏ దేవుడిని ఉద్దేశించి జపిస్తే ,ఆయన వల్ల మంచి సంతానం కలుగుతుందని చెప్పాడు .కుంటే దేవి బుద్ధి చాపల్యం తో ఆమంత్ర ప్రభావాన్ని పరీక్షించాలను కొంది .సూర్యుని గురించి ప్రార్ధించింది .ఆయన వరం వల్ల ఆమెకు కర్ణుడు జన్మించాడు కుంతికి వివాహం అయిన తర్వాత ధర్మ దేవత ,వాయుదేవుడు ,ఇంద్రుడు ,అశ్వినీ దేవతలను దుర్వాసుని మంత్రం తో స్మరించి ,క్రమంగా ధర్మ రాజు ,భీముడు ,అర్జునుడు ,నకుల సహ దేవులను కన్నది .వీరే పంచ పాండవులు .కర్ణుడిని నదిలో వదిలి పెడితే ఆతడు సూతుది కి దొరికి అక్కడ పెరిగి కుమారాస్త్ర విద్యా ప్రదర్శన లో తన సామర్ధ్యం రుజువు చేసు కోని ,దుర్యోధనుని మనసు గెల్చి ,అంగ రాజ్యానికి అభిషిక్తుడై ,కౌరవ పక్షం లో ముఖ్యుడైన సంగతి మనకు తెలిసిందే.
దూర్వాసుడు వైష్ణవ ,శాక్తేయాది మహా మంత్రాలన్నీ జపించి నప్పటికీ మనశ్శాంతి లేకుండా పోయింది .చివరికి ”శ్రీ హనుమత్సంజీవినీ విద్య ”నేర్చి జపించాడు .అప్పుడు హనుమ ఒకే ముఖం తో 18 భుజాలతో దర్శన మిచ్చాడు .దుర్వాసుడు పరవశించి ఆన్జనేయుడిని భక్తీ తో కీర్తించాడు .చక్కని శ్లోకం తో ఆయన్ను వర్ణించాడు -
”శక్తిం ,పాశం చ కుంతం ,పరశు మపి హలం తోమరం ,ఖేతకం వా
శంఖం చక్రం త్రిశూలం ముసలమపి గడం పట్టాసం ముద్గరం చ
గాండీవం బాణ పద్మం ,ద్వినవ వర భుజైహ్,ఖడ్గ మస్యావదానం
వందేహం వాయుసూనుం ,సురరిపు మధనం ,భక్త రక్షా దురీణం .”
ఈ శ్లోకం విన గానే ,ఆంజనేయుడు మిక్కిలి సంతోషించి దుర్వాసునికి మనశ్శాంతిని ప్రసాదించి ,అదృశ్యమైనాడు .అప్పటి నుంచి దుర్వాసుడు ఆంజనేయ మంత్రాన్ని అత్యంత భక్తీ శ్రద్ధ లోతో జపిస్తూ మనశ్శాంతి ని పొందుతూ ,కోపం లేని వాడై ,గంధమాదన పర్వతం ఈదే నివశిస్తూ ,మహా యోగి యై శివుని వలె నిత్య ప్రాతస్మరనుడు అయాడు ..కనుక మానషిక శాంతి లభించాలి అంటే శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధించాలి అనిదుర్వాసుని కధల వల్ల మనకు తెలుస్తోంది .దుర్వాసముని కధ సమాప్తం.