ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MAHABHARATHA PURANA STORIES COLLECTION - HOW ARJUNA GET PASUPATHASTRAM FROM LORD MAHADEV AND GET HIS NAME AS VIJAYA


అర్జునుని కోసం కిరాతకుడిగా మారిన మహాశివుడు

పూర్వం ఒకనాడు ధర్మరాజు తన తమ్ముడైన అర్జునునితో... ‘‘దేవేంద్రుని దగ్గరున్న దివ్య వస్త్రాలను తీసుకుని రా’’ అని చెబుతాడు. అన్న ఆజ్ఞను శిరసావహించి అర్జునుడి బయలుదేరి ఇంద్రలోకానికి చేరుతాడు. అయితే వాటిని పొందడం కోసం ముందుగా పరమశివునిని ప్రసన్నం చేసుకోమని ఇంద్రుడు, అర్జునునితో అంటాడు. దాంతో అతను శివుని కోసం ధ్యానం చేయడం మొదలుపెడతాడు. అయితే శివుడు అతనిని వెంటనే కరుణించకుండా... ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకుంటాడు.

* అర్జునునికి పరీక్ష పెట్టిన శివుడు :

అర్జునుడు ధ్యానం చేస్తుండగానే... అతను కూర్చున్న ప్రదేశంలో మూకాసురునుని సూకర (పంది) రూపంలో వెళ్లమని ఆదేశించాడు. శివుని ఆజ్ఞమేరకు మూకాసురుడు పందిరూపంలో అర్జునుడు ధ్యానం చేస్తున్న ప్రదేశానికి చేరుకుంటాడు. అదే సమయంలో మహాశివుడు కూడా ఆ పందిని వేటాడే వేషంలో కిరాతకుడిగా మారిపోతాడు. అప్పుడు శివుని త్రిశూలం విల్లంబుగా, నెలవంక నెమలి ఈకగా, రుద్రాక్షమాల పూసలదండగా మారిపోతాయి. పార్వతీదేవి కూడా కిరాతకుని భార్యగా అవతరించి, శివుని వెంటే బయలుదేరుతుంది.

భక్తిశ్రద్ధలతో తపస్సు చేసుకుంటున్న అర్జునునికి... పంది అటుఇటుగా తిరుగుతున్న శబ్దం తపోభంగం గావిస్తుంది. దాంతో అతను విసిగిపోయి వెంటనే పందివైపుగా బాణాన్ని ప్రయోగించాడు. ఆ సమయంలోనే పందిని వెంటాడుతూ కిరాతకుని రూపంలో వచ్చిన శివుడు కూడా దానిపై బాణాలు వేశాడు. అటు అర్జునుడు, ఇటు కిరాతకుడు ఇద్దరూ కలిసి ఒకేసారి బాణాలు ప్రయోగించడంతో ఆ సూకరం ప్రాణాలను కోల్పోతుంది. అప్పుడే వారిద్దరి మధ్య వాగ్యుద్ధం మొదలవుతుంది.

పందిని నేను చంపానంటూ శివుడు అంటే.. లేదు నేనే చంపాను అంటూ అర్జునుడు వాగ్యుద్ధానికి దిగుతాడు. ఇలా కొనసాగిన కొద్దిసేపటి తరువాత ఇద్దరి మధ్య జరుగుతున్న వాగులాట కాస్త ఘర్షణగా మారిపోతుంది. అప్పుడు అర్జునుడు... ‘‘నేను విలువిద్యలో సాటిలేని వాడిని. నన్ను ఓడించినవాడు ఇంతవరకూ ఎవరూ పుట్టలేదు. నేను ఉపయోగించిన బాణంతోనే ఈ సూకరం మరిణించింది అని అంటాడు. అదేవిధంగా కిరాతకుడు కూడా... ‘‘జంతువులను వేటాడటం మా వృత్తి. మేము ప్రయోగించిన బాణంతో ఏ జంతువు కూడా తప్పించుకోలేదు. అది నా బాణానికే ప్రాణాలను కోల్పోయింది’’ అని సమాధానమిస్తాడు.

కిరాతకుని మాటలు విన్న అర్జునుడు ఒక్కసారిగా రగిలిపోతూ శర పరంపర కురిపించాడు. కానీ ఆ బాణాలు కిరాతకుని రూపంలో వున్న శివునిని ఏమీ చేయలేకపోయాయి. శివుడు కూడా అర్జునుని మీద ఒకే ఒక్క బాణం వదులుతాడు. దాంతో అర్జునుడు కిందపడిపోతాడు. దాంతో అతను ఓటిమిని అంగీకరించకుండా కోపంతో తన శక్తినంతటిని ఉపయోగించి, విల్లును సంధిస్తాడు. దాంతో ఒక్కసారిగా మూల్లోకాలన్నీ కంపించాయి. నాలుగువైపులా ఘోర గాలులు వీస్తూ, భూ ప్రపంచం అంతా వినాశనం అవుతున్నట్టు కనిపించింది.

అప్పుడు అర్జునుడు జ్ఞానోదయం కలుగుతుంది. తన ముందున్నది కిరాతక దంపతులు కాదనీ.. ఆ రూపంలో వున్నది శివపార్వతులేనని గ్రహిస్తాడు. వెంటనే తన తప్పును తెలుసుకుని పశ్చాత్తపంతో క్షమించమని వాళ్లిద్దరి కాళ్లమీద పడతాడు. శివుడు చిరునవ్వుతో ఆశీర్వదించి, పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి అదృశ్యమవుతాడు. ఇలా ఈ విధంగా అర్జునుని అనుగ్రహించేందుకు ఒక పరీక్షను పెట్టి, కిరాతకుని రూపాన్ని ధరించాడు.