The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
TELUGU HOUSE WIFE'S KITCHEN TIPS FOR GET RID OF PIMPLES
మొటిమల నివారణకు అద్భుతమైన చిట్కాలు
సొంటి, లవంగాలు నీటితో నూరి లేపనం తయారుచేసి రాస్తూ వుంటే మొటిమలు తగ్గుతాయి.
ముల్తాని మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ఫలితం కనిపిస్తుంది. చర్మం పొడిగా, సున్నితంగా ఉంటే ఈ ప్యాక్ వేసుకోకూడదు.
జాజికాయను నీటితో అరగదీసి ఆ లేపనాన్ని ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి.
నీరుల్లి గడ్డను సగానికి కోసి ఆ ముక్కను మొటిమలపై రుద్దుతూ వుంటే తగ్గుతాయి.
బియ్యం కడిగిన నీటిని మొటిమలపైన మృదువుగా రుద్దితే తగ్గుతాయి.
మొటిమ గనుక చితికినట్లయితే దానిమీద ఐస్ క్యూబ్ ఉంచి సుతిమెత్తగా రుద్దినట్లయితే అందులో ఉన్న రసి అంతా వచ్చేస్తుంది.
బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి.
వేప ఆకులను నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని బకెట్ నీళ్ళలో కలుపుకుని స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇలా చేయడంవల్ల మొటిమలే కాదు అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.
కస్తూరి పసుపును నిమ్మరసంతో కలిపి ఆ మిశ్రమాన్ని రాస్తే మొటిమలు తగ్గుతాయి. చిటికెడు పసుపు ముఖానికి రాసి, కొద్దిసేపటి తర్వాత ముఖం కడుక్కోవడం ద్వారా మొటిమలను తగ్గించుకోవచ్చు.
పుదీనా ఆకులను ముఖాన పరచి ఉంచి పావుగంట తర్వాత తీసి చల్లటి నీళ్ళతో ముఖాన్ని కడుక్కోవాలి. ఆకులను రుద్దనవసరం లేదు. అలా చేస్తే మొటిమలు మరింత నొప్పిచేస్తాయి.
కొంచెం నీటిలో దాల్చిన చేక్కపొడి వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకుని మొటిమలకు పట్టిస్తే ఫలితం ఉంటుంది
మొటిమలు ఎక్కువగా ఉన్న వారు మాంసాహరం తగ్గించాలి.
మొటిమలు ఉన్నాయి కదా అని ఏక్రీం పడితే అవి రాసెయ్యకూడదు.దీనివల్ల మీ ముఖం ఇన్ ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.
టమోటా పండు రసం తీసి మొటిమలు మీద రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది.
కొంచెం నిమ్మరసంలో వేపాకుపొడి వేసి బాగా కలుపుకుని మొటిమల మీద రాస్తే మొటిమలు నుండి విముక్తి పొందవచ్చు .
బొప్పాయి మొటిమల తాలూకు మచ్చల్ని సులువుగా నివారిస్తుంది.బాగా మగ్గిన బొప్పాయి పండు గుజ్జులో రెండు చుక్కల తేనే , కొద్దిగా పాలమీగడ కలిపి ముఖానికి పూతలా వేయాలి . పదిహేను నిమిషాలయ్యాక కడిగేయాలి. చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది
SANSKRIT SLOKAS OF PRAYING GODDESS SRI MAHA LAKSHMI AND ITS MEANING IN TELUGU
లక్ష్మీ దేవి ఎక్కడెక్కడ ఉండేదీ చెప్పడానికి సంస్కృత భాషలో అనేక శ్లోకాలున్నాయి.
యత్ర పుత్రో గురోః పూజాం దేవానాం చ తథా పితుః
పత్నీ చ భర్తుః కురుతే తత్రా అలక్ష్మీ భయం కుతః
ఏ ఇంట పుత్రులు తల్లిదండ్రులను, గురువులను, దేవతలను పూజిస్తూ ఉంటారో, భార్య భర్తను పూజిస్తూ ఉంటుందో అక్కడ అలక్ష్మీ భయం అనగా దారిద్ర్యానికి అవకాశం ఉండదు. అలాగే ...
పంక్తి భేదే పృథక్పాకే పాకభేదే తథాకృతే
నిత్యం చ గేహకలహే భవితా వసతి స్తవ
ఒకే పంక్తి లోని వారికి భేదంగా వడ్డించే చోట, వేరు వేరు పొయ్యిలు పెట్టి వండుకునే చోట, ఒకే ఇంట్లో ఎవరికి వారు తమకు తోచిన రకాలుగా వంటలు వండుకునే చోట, అసలే వండుకోని ఇంట, కుటుంబ కలహాలతో నిండి ఉన్న ఇంట పెద్దమ్మ కాపురం చేస్తుంది. చిన్నమ్మ అనగా లక్ష్మీ దేవి అటువంటి ఇళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది
విలువైన మాణిక్యాలలో జాతి ముత్యాలలో, పూలమాలలోనూ, వజ్రాలలో, మంచి గంధంలో, పాలలో, అందమైన చెట్లకొమ్మలలో, తొలకరి నీలిమేఘాలలో లక్ష్మీకళ తేజరిల్లుతుంటుంది. లక్ష్మీదేవిని మొట్ట మొదట వైకుంఠంలో శ్రీమన్నారాణుడు పూజించాడు. తరువాత లక్ష్మిని బ్రహ్మ పూజిం చాడు. పిమ్మట శంకరుడు భక్తితో ఆమెను పూజించాడు. విష్ణువు పాలసముద్రంలో కూడా ఒకసారి లక్ష్మిని పూజించాడట. స్వయంభువు మనువు, పలువురు రాజులు, ఋషులు, మునులు, ఉత్తమ గృహస్థులు లక్ష్మీదేవిని పూజించారు. పిమ్మట గంధర్వులు పాతాళంలోని నాగులు లక్ష్మీదేవిని కొలిచారు. బ్రహ్మ భాద్రపద శుక్లాష్టమినాడు లక్ష్మీదేవిని పూజించి కృతార్ధుడయ్యాడు.
ముల్లోకాల్లోని వారు లక్ష్మిని భాద్రపద శుక్లపక్షం నాడు పది హేను రోజులు పూజిస్తారు. చైత్ర భాద్రపద పుష్య మాసాలు మంగళవారాలలో లక్ష్మీదేవి కి మహోత్సవాలు జరుపుతారు. ఏడాది చివర లో పుష్య సంక్రాంతి, మాఘ పూర్ణిమనాడు మంగళ కలశ మందావాహన చేసి మనువు మోక్షలక్ష్మిని పూజించాడు. సర్వమంగళ మాం గల్య రూపిణి అయిన లక్ష్మిని ఇంద్రుడు పూజించి అమితైశ్వర్య సంపన్నుడయ్యాడు. ముల్లోకాల్లో ఎందరెందరో మహాలక్ష్మిని కొలి చి కృతార్థులయ్యారు. లక్ష్మి సకలైశ్వర్యసంప దలకు ప్రతిరూపం అని నారదునికి నారాయ ణుడు లక్ష్మీ చరిత్రను తెలియజేశాడు.
యత్ర పుత్రో గురోః పూజాం దేవానాం చ తథా పితుః
పత్నీ చ భర్తుః కురుతే తత్రా అలక్ష్మీ భయం కుతః
ఏ ఇంట పుత్రులు తల్లిదండ్రులను, గురువులను, దేవతలను పూజిస్తూ ఉంటారో, భార్య భర్తను పూజిస్తూ ఉంటుందో అక్కడ అలక్ష్మీ భయం అనగా దారిద్ర్యానికి అవకాశం ఉండదు. అలాగే ...
పంక్తి భేదే పృథక్పాకే పాకభేదే తథాకృతే
నిత్యం చ గేహకలహే భవితా వసతి స్తవ
ఒకే పంక్తి లోని వారికి భేదంగా వడ్డించే చోట, వేరు వేరు పొయ్యిలు పెట్టి వండుకునే చోట, ఒకే ఇంట్లో ఎవరికి వారు తమకు తోచిన రకాలుగా వంటలు వండుకునే చోట, అసలే వండుకోని ఇంట, కుటుంబ కలహాలతో నిండి ఉన్న ఇంట పెద్దమ్మ కాపురం చేస్తుంది. చిన్నమ్మ అనగా లక్ష్మీ దేవి అటువంటి ఇళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది
విలువైన మాణిక్యాలలో జాతి ముత్యాలలో, పూలమాలలోనూ, వజ్రాలలో, మంచి గంధంలో, పాలలో, అందమైన చెట్లకొమ్మలలో, తొలకరి నీలిమేఘాలలో లక్ష్మీకళ తేజరిల్లుతుంటుంది. లక్ష్మీదేవిని మొట్ట మొదట వైకుంఠంలో శ్రీమన్నారాణుడు పూజించాడు. తరువాత లక్ష్మిని బ్రహ్మ పూజిం చాడు. పిమ్మట శంకరుడు భక్తితో ఆమెను పూజించాడు. విష్ణువు పాలసముద్రంలో కూడా ఒకసారి లక్ష్మిని పూజించాడట. స్వయంభువు మనువు, పలువురు రాజులు, ఋషులు, మునులు, ఉత్తమ గృహస్థులు లక్ష్మీదేవిని పూజించారు. పిమ్మట గంధర్వులు పాతాళంలోని నాగులు లక్ష్మీదేవిని కొలిచారు. బ్రహ్మ భాద్రపద శుక్లాష్టమినాడు లక్ష్మీదేవిని పూజించి కృతార్ధుడయ్యాడు.
ముల్లోకాల్లోని వారు లక్ష్మిని భాద్రపద శుక్లపక్షం నాడు పది హేను రోజులు పూజిస్తారు. చైత్ర భాద్రపద పుష్య మాసాలు మంగళవారాలలో లక్ష్మీదేవి కి మహోత్సవాలు జరుపుతారు. ఏడాది చివర లో పుష్య సంక్రాంతి, మాఘ పూర్ణిమనాడు మంగళ కలశ మందావాహన చేసి మనువు మోక్షలక్ష్మిని పూజించాడు. సర్వమంగళ మాం గల్య రూపిణి అయిన లక్ష్మిని ఇంద్రుడు పూజించి అమితైశ్వర్య సంపన్నుడయ్యాడు. ముల్లోకాల్లో ఎందరెందరో మహాలక్ష్మిని కొలి చి కృతార్థులయ్యారు. లక్ష్మి సకలైశ్వర్యసంప దలకు ప్రతిరూపం అని నారదునికి నారాయ ణుడు లక్ష్మీ చరిత్రను తెలియజేశాడు.
Subscribe to:
Posts (Atom)