The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
DON'T DO CERTAIN ITEMS AFTER LUNCH - TIPS FOR GOOD LUNCH BREAK
భోజనం తరువాత చేయకూడని ఆరు ముఖ్యమైన
పనులు:
1) DON’T SMOKE:
ధూమపానము చేయరాదు.
భోజనము చేసినతరువాత ఒక cigarette
కాల్చితే పది cigarettesకు సమానము అని
చెబుతున్నారు. కాన్సెర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయట.
2) DON’T EAT FRUITS:
పళ్ళు తినకూడదు. భోజనము చేసిన తరువాత
పళ్ళు తినడం వలన కడుపు మొత్తం గాలితో
నిండిపోతుంది. అందుకే పళ్ళు తినాలనుకునేవారు రెండు గంటలు ముందు కానీ తరువాతగాని తింటే మంచిది.
3) DON’T DRINK TEA:
టీ తాగకూడదు. టీవలన పెద్దమొత్తంలో ఆసిడ్ విడుదల చేసి ఆహరం జీర్ణం అవ్వడం కష్టంఅవుతుంది.
4) DON’T LOOSEN YOUR BELT:
బెల్టు లూస్ చేయకూడదు(పెట్టుకునే వారు)
దీనివల లోపల ఎక్కడన్నా ఇరుక్కున్న
ఆహరం సరిగ్గా జీర్ణం కాదు.
5) DON’T BATH:
స్నానం చేయకూడదు. భోజనం చేసినవెంటనే స్నానం చేస్తే రక్తం అంతా చేతులకి కళ్ళకి మొత్తం ఒంటికి
పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణప్రక్రియని నెమ్మది చేస్తుంది. దీనివల
జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం తగ్గిపోతుంది.
6) DON’T SLEEP:
నిద్ర పోకూడదు. భోజనం చేసిన వెంటనే పడుకుంటే
ఆహరం సరిగ్గా జీర్ణం అవ్వక gastric & infection వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మాములుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా సరే నిద్ర వస్తుంది. తప్పకుండా పడుకోవాలి అంటే ఒక పదిహేను నుండి ఇరవైనిముషాలు కంటే ఎక్కువగా
పడుకోకుండా ఉంటె మీ ఆరోగ్యానికి మంచిది
పనులు:
1) DON’T SMOKE:
ధూమపానము చేయరాదు.
భోజనము చేసినతరువాత ఒక cigarette
కాల్చితే పది cigarettesకు సమానము అని
చెబుతున్నారు. కాన్సెర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయట.
2) DON’T EAT FRUITS:
పళ్ళు తినకూడదు. భోజనము చేసిన తరువాత
పళ్ళు తినడం వలన కడుపు మొత్తం గాలితో
నిండిపోతుంది. అందుకే పళ్ళు తినాలనుకునేవారు రెండు గంటలు ముందు కానీ తరువాతగాని తింటే మంచిది.
3) DON’T DRINK TEA:
టీ తాగకూడదు. టీవలన పెద్దమొత్తంలో ఆసిడ్ విడుదల చేసి ఆహరం జీర్ణం అవ్వడం కష్టంఅవుతుంది.
4) DON’T LOOSEN YOUR BELT:
బెల్టు లూస్ చేయకూడదు(పెట్టుకునే వారు)
దీనివల లోపల ఎక్కడన్నా ఇరుక్కున్న
ఆహరం సరిగ్గా జీర్ణం కాదు.
5) DON’T BATH:
స్నానం చేయకూడదు. భోజనం చేసినవెంటనే స్నానం చేస్తే రక్తం అంతా చేతులకి కళ్ళకి మొత్తం ఒంటికి
పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణప్రక్రియని నెమ్మది చేస్తుంది. దీనివల
జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం తగ్గిపోతుంది.
6) DON’T SLEEP:
నిద్ర పోకూడదు. భోజనం చేసిన వెంటనే పడుకుంటే
ఆహరం సరిగ్గా జీర్ణం అవ్వక gastric & infection వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మాములుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా సరే నిద్ర వస్తుంది. తప్పకుండా పడుకోవాలి అంటే ఒక పదిహేను నుండి ఇరవైనిముషాలు కంటే ఎక్కువగా
పడుకోకుండా ఉంటె మీ ఆరోగ్యానికి మంచిది
BRIEF DESCRIPTION ABOUT ASTA MURTHY LINGAMULU
అష్టమూర్తి లింగములు
పంచభూతలింగములు అనగానే అయిదు క్షేత్రములు గుర్తుకు వస్తాయి.
౧. పృథ్వీలింగం - కాంచీపురంలోని ఏకామ్రేశ్వర లింగము
౨. జలలింగం - తమిళనాడులోని తిరుచునాపల్లి శ్రీరంగానికి సమీపంలోని జంబుకేశ్వర లింగం
౩. అగ్నిలింగం - అరుణాచలంలోని అరుణాచలేశ్వర లింగం
౪. వాయులింగం - శ్రీకాళహస్తీశ్వర మహాలింగం
౫. ఆకాశలింగం - చిదంబరేశ్వర లింగం
ఈఅయిదు ఉన్న క్షేత్రం ఈ శరీరం.
6. సూర్యలింగం: ప్రొద్దున్నే ఆకాశంలో చూస్తే కనపడుతుంది. సూర్యలింగం ప్రత్యక్షం. ఇది కోణార్క్ లో ఉన్నది. ఇది శిల్పులు చెక్కిన ఆలయం కాదు. దీని గురించి పురాణాలలో ఉన్నది. కాశీలో గభస్తీశ్వరుడు, లోలార్కేశ్వరుడు అను పేర్లతో శివుడు సూర్య రూపంలో ఉన్నాడు.
7. చంద్రలింగం: ఇదీ ప్రత్యక్షమే. ప్రభాస క్షేత్రంలో ఉన్న సోమనాధ జ్యోతిర్లింగం. ఇది జ్యోతిర్లింగం అయినప్పటికీ చంద్రకళలతో ఉంది. సోమశిల సోమేశ్వర క్షేత్రమే. పంచారామాలలో సోమారమమనే క్షేత్రం మనకి కనపడుతూ ఉన్నది. ఇక్కడ విశేషం ఏమిటంటే శుక్లపక్షంలో తెల్లదనం రోజు రోజుకూ పెరుగుతూ ఉంటుంది. కృష్ణపక్షంలో క్రమంగా తరుగుతూ ఉంటుంది. భారతీయ దేవాలయాలలో వైజ్ఞానిక దైవత్వ రహస్యం అత్యంత ఆశ్చర్యకరం. ఇటువంటి దివ్య క్షేత్రాలు భారతదేశంలో అందునా హిందువులకు మాత్రమే ఉన్నాయి అని మనం సగర్వంగా, సానందంగా చెప్పుకోవచ్చు.
8. యజమాన లింగం: నేపాల్ క్షేత్రంలో పశుపతి లింగం పేరుతో మనకి కనపడుతూ ఉన్నది.
మానవశరీరంలో షట్చక్రములు ఉన్నాయి. అవి
౧. మూలాధారం: ౨. స్వాధిష్ఠానము ౩. మణిపూరము ౪. అనాహతము ౫. విశుద్ధము
ఇవి మానవశరీరంలో పంచభూత క్షేత్రములు. భ్రూమధ్య స్థానం జ్యోతిర్లింగ క్షేత్రంగా చెప్పబడుతున్నది. ప్రపంచానికంతటికీ వెలుగునిస్తున్నాడు కాబట్టి జ్యోతిర్లింగం అన్నారు. జ్యోతి అంటే వెలుగు, చైతన్యము. ఈభూమియందు మనకు వెలుగు చైతన్యం ఇచ్చే వాడు సూర్యుడు. ఆసూర్య మండలంలో వెలుగు పరమేశ్వరుడు. ఆదిత్యమండలాంతరవర్తి. ఒక్కొక్క మాసంలో ఒక్కోలా ప్రకాశిస్తున్నాడు. ఈవిధంగా పన్నెండు రకాలుగా ఉన్న సూర్యుడిని ద్వాదశాదిత్యులు అంటాం. మనకు కనిపించే జ్యోతిర్లింగ స్వరూపమైన సూర్యుడిని ద్వాదశ సంఖ్యలో చెప్తున్నాం కనుక జ్యోతిర్లింగ స్వరూపుడైన శివునికి కూడా ద్వాదశ సంఖ్య వచ్చింది. పన్నెండులో ప్రళయకాలాలలో కూడా నశించని గొప్ప జ్యోతిర్లింగ క్షేత్రం విశ్వేశ్వర లింగం. భ్రూమధ్య స్థానానికి కాశీ అని పేరు. ఇడ పింగళ నాడులకు మధ్య సుషుమ్న నాడి ఉంటుంది. ఇడ, పింగళ నాడులు వరణ, అసి అనుకుంటే సుషుమ్న నాడి గంగ. ఈమూడు ఉన్న స్థలం వారణాశి.
సహస్రారం కైలాసం. కం - సుఖం, ఆనందం; కైలాసం అంటే ఆనందం లాస్యం చేసే చోటు. శిరస్సుకు ’కం’ అని పేరు. శిరస్సుపై శివశక్తులు కలిసి లాస్యం చేసే చోటు కైలాసం. సహస్రారమే శివశక్త్యైక్య రూపము, మహాకైలాసనిలయా మృణాళ మృదోర్లతా అని చెప్పబడుతున్నది. సహస్రారం కైలాసం, భ్రూమధ్యం కాశీక్షేత్రం. విశుద్ధి చక్రం నుంచి మూలాధారం వరకు పంచభూతలింగములు. ఇవి మానవశరీరంలోని శివలింగ క్షేత్రములు. నీలో ఉన్నశివుడిని తెలుసుకుంటే అప్పుడు శివోహం అనే స్థాయికి చేరతాము.
BRIEF BIODATA PARTICULARS OF SRI GOSWAMY TULASIDAS WHO WRITES HANUMAN CHALISA IN HINDI
హనుమాన్ చాలిసాను హింది అవధిబాషలో రచించినది శ్రీ గోస్వామి తులసీదాసు.
వీరు యమునా తీరంలో రాజపుర గ్రమాన క్రీ II శ్ II 15 వ శతాబ్దిలో (1497) విప్ర కుటుంబాన జన్మించారు తండ్రి ఆత్మారాం . తల్లి తండ్రులు రామభక్తులు కావడం చేత,కుమారుడు చిన్నతనంలోనే రామభక్తుడై నిరంతరం రామ నామ జపం చేస్తూ ఉండేవారు.అందుకే అతనికి "రాంబోలా" అనే నామం వచ్చింది.
తులసీదాసు వివాహితుడై ధర్మపత్ని రత్నావళీదేవి యెడ అమితమైన ప్రేమతో ఉండేవాడు. క్షణమైనా భార్యను విడిచి ఉండలేని తులసీదాసుకు ఒకసారి రత్నావళి చెప్పకుండా పుట్టింటికి వెళ్ళడంతో దిగులు కలిగింది. అతడు వర్షాన్ని సైతం లెక్కించక,పొంగిన యమునా నదిని దాటి ,పామును తాడుగా బ్రహ్మించి , దాని సహాయంతో అత్తవారింటికి గోడను దుమికి,అర్ధరాత్రి భార్యను సమీపించాడు. ఆమే ఆశ్చర్యపడి " శల్యమాంసమయమైన ఈ దేహం పై మీకెంత మమత ఉందో,అందులో సగమైనా శ్రీ రామునిపై ఉంటే భవభీతి నశించేది" అన్నది.
దానితో ఆయన మనస్సు చివుక్కుమని, భక్తి ప్రపూరితమైన అతని మనస్సు పరిపాకం చెంది ఉండదంతో,వెంటనే ఆయనకు గాఢవిరక్తి కలిగి ఆయన జీవితంలో గొప్ప మార్పుకు నాంది ఏర్పడింది.
పధ్నాలుగు ఏళ్ళ తీర్థ యాత్ర చేసి నరహార్యానందులవారిని గురువుగా స్వీకరించి "తులసీదాసు" అయ్యాడు. శ్రీ హనుమంతుని అనుగ్రహంతో 1550 IIసంII లో శ్రీ రామ దర్శనం చేసుకున్నాడు, 1575 IIసంII శ్రీ రామ నవమి మంగళవారం "రామ చరిత మానసం " అనే రామాయణాన్ని ప్రారంభించి 2 IIసం II 7 మాసాల 26 రోజులలో పూర్తి చేసారు.
ఈ గ్రంధం భక్తి రసంతో కూడినది. రాముడు భగవంతుడనే అవతార తత్త్వముగా తెలిపే ఆధ్యాత్మ రామాయణాన్ని ఈయన అనుకరించడు. ప్రాంతీయమైన " అవధి" లో సామాన్యునికి కూడా అర్ధమయ్యేటట్లు రచించాడు. రామచరిత మానసాన్ని తెలియనివాడు,ముఖ్యంగా ఉత్తర హిందు దేశంలో ఉండరు . అదోక ధర్మ శాస్త్రం. దీనిని చదివి తరించారు. అవధి భాష అయోధ్యా పరిసరాలలో వాడే భాష. దీనిని అవధూతభాష అని కూడా అంటారు. శ్రీ తులసిదాసు గారిది "తుక్బంధీ" కవిత్వం. అనగ పాదములకు అంత్యనియమముంచాడు . అది శ్రవణ యోగ్యం.
శ్రీ తులసి దాసుగారు రచించిన గ్రంధాలు అనేకాలు. వాటిలో రామచరిత మానసం,వినయ పత్రిక , గీతావళి, హనుమాన్ బహుక్, హనుమాన్ చాలిసా మొదలైనవి ముఖ్యమైనవి. అనేక సంవత్సరాలు తపస్సు చేసి, ఆ తపస్సును ధారబోసి, మంత్రశక్తితో నిండి ఉన్నవి, ఆయన రచనలు. IIక్రిII శ్II 1623 II సం IIశ్రావణ శుద్ధ సప్తమి శనివారం రోజు శ్రీ తులసి దాసు గారు దాదాపు 120 సం బ్రతికి పరమపదించారు.
Subscribe to:
Posts (Atom)