ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

DOG POWER


TOO LATE


DESA BHASHA LANDHU TELUGU LESSA - POWER OF TELUGU


BEST RECIPE IN THE WORLD


HAIR OIL


SWEET SMILE


POWER OF A STUDENT


BEAUTIFUL TELUGU ACTRESS SUNITHA VERMA






TREE PLANTATIONS


DONT ASK ME AGAIN


NEVER STOP


HAPPY DASARA FESTIVAL


ASTA DASA SAKTHI PEETALU LIST IN TELUGU - NAMES OF 18 GODDESS SRI KANAKA DURGA SAKTHI PEETALU / TEMPLES


FESTIVAL BEAUTY MINU KURIAN


USE 3 LAMPS FOR PRAYING GODDESS SRI KANAKA DURGA ON DASARA FESTIVAL FOR GOOD RESULTS


విజయదశమి నాడు 3 ప్రమిదెలు, 9 వత్తులు తీసుకోండి!

శరన్నవరాత్రుల్లో చివరి రోజైన విజయదశమి నాడు సూర్యోదయమునకు ముందే నిద్ర లేవాలి. ఉదయం ఐదింటికి నిద్రలేచి.. తలస్నానము చేసి పూజామందిరము, ఇల్లు శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరమును రంగవల్లికలతో అలంకరించుకోవాలి.
ఎర్రటి పట్టు వస్త్రాలను ధరించి పూజకు రాజరాజేశ్వరి ఫోటో గానీ దుర్గాదేవి ప్రతిమను ఫోటోను సిద్ధం చేసుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి కనకాంబరములు, నల్ల కలువపూవులు, నైవేద్యానికి పొంగలి, పులిహోర, అరటి పండ్లు సిద్ధం చేసుకోవాలి.
సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు విజయదశమి పూజ చేయవచ్చు. ఈ పర్వదినము శుక్రవారం పూట వస్తే చాలామంచిది. పూజకు ముందు రాజరాజేశ్వరి అష్టకం, రాజరాజేశ్వరి సహస్ర నామాలు, దేవి భాగవతమును పారాయణము చేయాలి.
ఇంకా విజయదశమి రోజున దుర్గాదేవి, శ్రీశైలం ఆలయాలను దర్శించుకోవడం శుభఫలితాలనిస్తుంది. ఆలయాల్లో రాజరాజేశ్వరి అష్టోత్తర పూజ, లలితాసహస్రనామము, నవరాత్రి వ్రతము, శ్రీదేవి లీలామృతం, రాజరాజేశ్వరి నిత్యపూజ, నవరాత్రి ఉత్సవములు, కోటి కుంకుమార్చన వంటి పూజలు.. పంచామృతముతో అభిషేకము నిర్వహించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయి.
దీపారాధనకు మూడు ప్రమిదెలు, 9 వత్తులు తీసుకోవాలి. హారతికి ఆవునేతిని, దీపారాధనకు నువ్వుల నూనెను వాడాలి. నుదుట కుంకుమను ధరించి, శ్రీ మాత్రేనమః అనే మంత్రాన్ని 108 మార్లు జపించి అనంతరం దీపారాధన చేయాలి. పూజచేసేటప్పుడు తామరమాల ధరించి, ఆగ్నేయము వైపు కూర్చోవాలని పండితులు చెబుతున్నారు

PRAY AND VISIT GODDESS SRI KANAKA DURGA AMMA VARI TEMPLES DURING THE PERIOD OF NAVARATHRULU - DASARA FESTIVAL OCCASION - WHICH RESULTS ALWAYS GOOD TO YOUR FAMILY


దుర్గాష్టమి రోజున శక్తిపీఠాలను దర్శించుకోండి!

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. ఎనిమిదవ రోజు.. అంటే ఆశ్వయుజ అష్టమి దుర్గాష్టమి లేదా మహాష్టమి పర్వదినం. ఈ రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు.

పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది. కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టుకు భక్తిగా పూజలు చేస్తారు.

మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు.

తమ పిల్లలను తల్లిదండ్రులు ఇతర రోజుల కంటే దుర్గాష్టమి లేదా విజయదశమి రోజున విద్యాభ్యాసం చేయించడం ఉత్తమంగా భావిస్తారు. ఈ రోజుల్లో గనుక చిన్నారుల చేత ''ఓంకారం'' రాయించి విద్యాభ్యాసం చేయిస్తే చదువు బాగా వస్తుందని విశ్వసిస్తారు. వ్యాపారులు తమ షాపులు లేదా సంస్థలను పూవులతో అలంకరించుకుని దుర్గాదేవి పూజ చేసుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో ఆరంభించడం శుభసూచకంగా భావిస్తారు. అందుచేత దుర్గాష్టమి రోజున శక్తిపీఠాలను దర్శించుకోవడం లేదా సమీపంలోని అమ్మవారి ఆలయాలను సందర్శించడం చేయాలని పండితులు చెబుతున్నారు.

SOLUTION FOR BAD DREAMS IN NIGHT - USE NEELAM JEWEL ACCORDING TO YOUR RAASI FOR BAD DREAMS PROTECTION


రాత్రిపూట పీడ కలలు వస్తున్నాయా?

చాలా మందికి రాత్రిపూట అంటే నిద్రలో పీడకలలు, భయానక కలలు వస్తుంటాయి. ఇలాంటి రాత్రి అవుతుందంటే భయంతో వణికిపోతుంటారు. కొందరైతే రాత్రంతా నిద్రపోకుండా అలానే కూర్చొని వుంటారు. ఇలాంటి రత్నాల శాస్త్ర ప్రకారం తమ రాశులకు అనుగుణంగా ఉండే కొన్నింటిని ధరిస్తే ఈ కలల నుంచి ఉపశమనం పొందవచ్చని రత్నాల శాస్త్ర నిపుణులు చెపుతున్నారు. 

రాత్రిపూట పీడ కలలు వచ్చే వారు నవరత్నాలలో నీల రత్నాన్ని ధరిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. అకస్మాత్తుగా జరిగే దొంగతనాలు, దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే నీలరత్నాన్ని ధరంచడం మంచిదని వారు చెబుతున్నారు.

అలాగే, ముఖకాంతికి, నేత్రకాంతికి నీలం రత్నాన్ని ధరించడం మంచిదని రత్నాల శాస్త్రం చెబుతోంది. శనిగ్రహదోషాలను, ఏలినాటి శని దోషాలను నివారించేందుకు నీలంను ధరిస్తే శ్రేయస్కరమని ఆ శాస్త్రం చెపుతోంది. అలాగే, ఆయుష్షు, బుద్ధి, బలము వృద్ధి చెందేందుకు నీలరత్నధారణ ఎంతో ఉపయోగపడుతుందని విశ్వాసం.

ముఖ్యంగా కుంభరాశి జాతకులు నీలంరత్నాన్ని ధరిస్తే మంచి ఫలితాలుంటాయని చెపుతున్నారు. శాంత స్వభావం, ధర్మకర్మల యందు ఆసక్తి కలిగి ఉండే కుంభరాశి జాతకులు నీలరత్నాన్ని ధరించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

నీలం ఎక్కువగా శుభ్రముగా ఉండవు. చారలు కలిగి ఉండే అసలైన నీలంను, నీరు నింపిన గ్లాసులో వేస్తే ఆ నీటి నుంచి నీల కిరణాలు వెలువడుతాయి. అదేవిధంగా అసలైన నీలంను ఎండలో వుంచినట్లైతే నీలపు కిరణాలను వెదజల్లుతాయి.

ఎలా ధరించాలంటే.. శనివారం సూర్యోదయానికి ముందే ధరించాలి. వెండి లోహంతో పొదిగించుకుని ఎడమచేతి మధ్యవేలుకు ధరించాలి. ధరించేందుకు ముందు పాలులో గానీ, గంగాజలంలో గానీ నీలరత్నాన్ని శుద్ధిచేయాలి. అదేవిధంగా శనిధ్యాన శ్లోకంను 190 సార్లు ధ్యానించి ధరించడం ద్వారా దారిద్ర్యాలు తొలగిపోతాయని నమ్మకం.

DASARA FESTIVAL - NAVARATHRULU - GODDESS SRI KANAKA DURGA AVATHAR AS GODDESS SRI SARASWATHI DEVI


చదువుల తల్లి సరస్వతీదేవిగా దర్శనమిచ్చిన కనకదుర్గ

కనకదుర్గమ్మవారి జన్మనక్షత్రం సందర్భంగా అమ్మవారు శనివారం సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతీ దేవిగా దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు.
అమ్మవారిని జన్మ నక్షత్రాన అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఇక అమ్మవారి ఐదో అవతారం గురించి కాస్త తెలుసుకుందాం...
* స్కందమాత...
దుర్గామాత ఐదో స్వరూపం స్కందమాత. స్కందుడు అంటే కుమారస్వామి. ఈయనకే కార్తికేయుడు అని పేరు. ఈయన దేవ, అసుర యుద్ధంలో దేవతల సేనకు అధిపతిగా ఉన్నాడు. మయూర వాహనుడు. స్కందునికి తల్లి కాబట్టి దుర్గాదేవి ఐదో అవతారంలో స్కందమాతగా నవరాత్రుల్లో పూజలందుకుంటోంది.
ఈమె మూర్తిలో బాలస్కందుడు చిన్నచిన్న ఆరుతలలతో తల్లి ఒడిలో కూర్చుని ఉంటాడు. స్కందమాత చతుర్భుజి. ఒక చేతిలో కొడుకును పట్టుకుని ఉంటుంది. కమలం, పద్మం పట్టుకుని మరో చేత్తో అభయముద్ర ఇస్తుంటుంది. శ్వేతవర్ణశోభిత, సింహ వాహనురాలు, పద్మాసన అని కూడా పిలుస్తారు. స్కందమాతను ఉపాసించడం వల్ల భక్తుల కోరికలన్నీ తీరుతాయి. ఈమెకు చేసిన పూజలు స్కందునికి చేరతాయి. భక్తులు శాంతిసుఖాలు అనుభవిస్తారు.

HELMET


THE SECRET BEHIND RINGING BELL IN TEMPLES


గంట శబ్ధం ఎంత దూరం వినిపిస్తుందో.. దుష్ట శక్తులు..?

మనం నిత్యం పూజ చేసేటప్పుడు గంటను తప్పనిసరిగా ఉపయోగిస్తాం. అయితే గంటను శబ్ధం చేస్తూ పూజ చేయడం వెనుక గల ఆంతర్యమేమిటో కొందరికే తెలిసివుండొచ్చు. అదేంటంటే... గంట శబ్దం ఎంత దూరం వరకైతే వినిపిస్తుందో, అంతదూరం వరకూ దుష్ట శక్తులు ప్రవేశించలేవని పురాణాలు చెబుతున్నాయి.

ఈ కారణంగానే ప్రతి దేవాలయంలోను గంటలు వరుసగా వేళ్లాడదీసి కనిపిస్తాయి. ఆలయంలోకి ప్రవేశించిన తరువాత ... తిరిగి వెళుతున్నప్పుడు మాత్రమే గంటను మోగించాలనే నియమం ఉంది. గంట శబ్దం శుభాన్ని సూచిస్తుంది.

గంట మోగించడం వలన వచ్చే ధ్వని తరంగాలు ఆధ్యాత్మిక భావాలను మోసుకొస్తాయి ... మానసిక రుగ్మతలను దూరంచేస్తూ ప్రశాంతతను ప్రసాదిస్తాయి.

ఇక పూజా మందిరాల్లో చిన్నగంటలను ఉపయోగిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. పూజలో దైవ చిహ్నంగల గంటను మాత్రమే ఉపయోగించాలని శాస్త్రం చెబుతోంది. ఒక్కో దైవ చిహ్నం కలిగిన గంటను మోగించడం వలన ఒక్కో ఫలితం ఉంటుంది. అలాగే గంటను ఇష్టానుసారంగా ... గందరగోళంగా కాకుండా లయబద్ధంగా మోగించాలి.

ముఖ్యంగా ధూప .. దీప .. నైవేద్యాల సమయంలోను, హారతినిచ్చే సమయంలోను గంటను తప్పనిసరిగా మోగించాలి. ఈ విధమైన నియమాలను పాటిస్తూ గంటను మోగించడం వలన పూజకి సంబంధించిన ఫలితం పరిపూర్ణంగా పొందడం జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

SECRET


TELUGU ACTRESS SAHANA




THE IMPORTANCE OF VISITING GODDESS SRI KANAKA DURGA ON THE DAYS OF NAVARATHRI


నవరాత్రులు: అమ్మవారిని దర్శించుకుంటే..?

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు. నవరాత్రులంటే మహిళలు దేవిని స్మరిస్తూ పండగ చేసుకుంటారు. ఈ అమ్మవారి ఆరాధనా మహోత్సవాన్ని 'శరన్నవరాత్రి ఉత్సవాలు'గా, 'దేవీనవరాత్రులు'గా పిలుస్తుంటారు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజించడం జరుగుతుంటుంది.
భక్తులు ఈ తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేపట్టి, ఏకభుక్త వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శరన్నవరాత్రులలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే తనని పూజిస్తారో, వాళ్లు తనకి అత్యంత ప్రీతిపాత్రులని అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి.
దేవీ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి, మహా పవిత్రమైనవి. ఈ తొమ్మిది రోజుల పాటు ఒక్కోరోజు ఒక్కో రూపంగా అలంకరించబడిన అమ్మవారిని దర్శించుకోవడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. ఇలా తొమ్మిది రోజుల పాటు నవదుర్గలను ఆరాధించడం వలన ధనధాన్యాలు ... సంతాన సౌభాగ్యాలు ... సుఖశాంతులు చేకూరుతాయని పండితులు అంటున్నారు.

BEAUTIFUL TRADITIONAL SAREE BEAUTY


DASARA FESTIVAL NAVARATHRULU - LIST OF FOOD ITEMS TO BE PREPARED FOR GODDESS SRI KANAKA DURGA AMMA VARI PUJA


నవరాత్రులు: సమర్పించాల్సిన నైవేద్యాలు ఏమిటి?

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ గల ఈ తొమ్మిది రోజులను 'దేవీ నవరాత్రులు'గా పిలుచుకుంటూ వుంటారు. ఈ తొమ్మిది రోజులలో ఒక్కోరోజున అమ్మవారిని ఒక్కో రూపంగా అలంకరించి, ఆ రూపాలకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తున్నారు.

శరన్నవరాత్రులలో అమ్మవారిని మొదటి రోజున 'శైలపుత్రి'గా అలంకరించి ఆ తరువాత రోజుల్లో వరుస క్రమంలో 'బ్రహ్మచారిణి' .. 'చంద్రఘంట' .. 'కూష్మాండ' .. 'స్కందమాత' .. 'కాత్యాయని' .. 'కాళరాత్రి' .. 'మహాగౌరీ' .. 'సిద్ధి దాత్రి' రూపాలుగా ఆరాధిస్తూ ఉంటారు.

శైలపుత్రికి కట్టుపొంగలి, బ్రహ్మచారిణికి పులిహోర, చంద్రఘంటకు కొబ్బరి కలిపిన అన్నం, కూష్మాండకు అల్లంతో చేయబడిన గారెలు, స్కందమాతకు దధ్యోదనం, కాత్యాయనికి కేసరీబాత్, కాళరాత్రికి వివిధరకాల కూరముక్కలతో కలిపి వండిన అన్నం, మహాగౌరీకి చక్రపొంగలి, సిద్ధిదాత్రికి పాయసం అత్యంత ప్రీతికరమైనవని పండితులు చెబుతున్నారు.

LORD HANUMAN


ARTICLE ABOUT LORD SRI RAMA



రా జీవపత్రలోచన!
రాజేంద్ర కిరీట ఘటిత రత్న మరీచి
బ్రాజితపాదాంభోరుహ!
భూజనమందార! నిత్యపుణ్యవిచారా!
కలువరేకుల వంటి కన్నులు కల వాడా! మహారాజుల కిరీటాలలోని మణుల కాంతులు ప్రతిఫలిస్తున్న పాదపద్మాలు కల వాడా! భూలోకవాసుల పాలిటి కల్పవృక్షమా! మంచివారిని ఎల్లప్పుడు పాలించు వాడా! శ్రీరామా నమస్కారము.
ఇది ప్రథమ స్కంధాంత స్తోత్రం. కళ్ళు కలువరేకులవలె అందంగా ఉన్నాయి అంటే స్వామి చక్కటి అనుగ్రహాల్ని వర్షిస్తుంటావు అని. లోకంలోని మహారాజులు సైతం నీకు పాదాభివందనాలు చేస్తుంటారు కనుక వారి కిరీటాలలోని మణుల కాంతులు నీ పాదాలపైన నిత్యం పడుతుంటుంది అంటే అంతటి శక్తిసామర్థ్యాలతో మమ్ము పాలిస్తావు అని. భూలోకులకు మందార అంటే ఆ మహారాజులు నుండి జనసామాన్యం వరకు అందరిని అజ్ఞానం తొలగించి కల్పవృక్షంలా అనుగ్రహిస్తావు అని. ఎప్పుడు పుణ్యాత్ముల క్షేమ సమాచారాలు చూస్తుంటావు అంటే పుణ్యులమైన మమ్ము పాలిస్తుంటావు అని.
1-528-ka.
raajeevapatralOchana!
raajaeMdra kireeTa ghaTita ratna mareechi
braajitapaadaaMbhOruha!
bhoojanamaMdaara! nityapuNyavichaaraa!
రాజీవ = తామర; పత్ర = రేకుల వంటి; లోచన = కన్నులు ఉన్న వాడా; రాజ = రాజులలో; ఇంద్ర = శ్రేష్టుల యొక్క – మహా రాజుల యొక్క; కిరీట = కిరీటములలో; ఘటిత = పొదగ బడిన; రత్న = రత్నముల యొక్క; మరీచి = కాంతి చేత; బ్రాజిత = ప్రకాశించుచున్న; పాద = పాదములు అను; అంభోరుహ = పద్మములు కల వాడా; భూ = భూమి పై; జన = జనించిన జీవులకు; మందార = కల్పవృక్షమా {మందార - కల్పవృక్షము వలె కోరికలు తీర్చు వాడు / మంద + ఆర = అజ్ఞాన ఛేధకుడు}; నిత్య = నిత్యమును; పుణ్య = పుణ్యాత్ముల గురించి; విచారా = ఆలోచించు వాడా – పాలించు వాడా.

శ్రీకర! పరిశోషిత ర
త్నాకర! కమనీయగుణగణాకర! కారు
ణ్యాకర! భీకరశర ధా
రాకంపితదానవేంద్ర! రామనరేంద్రా!
శ్రీరామచంద్రప్రభు! సకల సంపదలను కలుగజేసేవాడ! సముద్రాన్ని ఇంకింప జేసిన మహాశక్తిశాలి! మనోహరమైన గుణగణాలకు నిలయమా! దయాసాగరా! భయంకర మైన బాణపరంపరలతో రాక్షసులను కంపింపజేసిన వాడ! నీకు వందనములు.
దశమస్కంధ ఉత్తరభాగం ఆరంభంలోని ప్రార్థన పద్యమిది.
10.2-1-ka.
Sreekara! pariSOshita ra
tnaakara! kamaneeyaguNagaNaakara! kaaru
Nyaakara! bheekaraSara dhaa
raakaMpitadaanavaeMdra! raamanaraeMdraa!
శ్రీకర = శ్రీరామ {శ్రీకరుడు - శ్రీ (సంపదలను) కరుడు (కలుగజేయు వాడు), రాముడు}; పరిశోషిత రత్నాకర = శ్రీరామ {పరిశోషిత రత్నాకరుడు - పరిశోషిత (ఇంకిపోవునట్లు చేసిన) రత్నాకరుడు (సముద్రుడు కలవాడు), రాముడు}; కమనీయ గుణగ ణాకర = శ్రీరామ {కమనీయగుణగణాకరుడు - కమనీయ (మనోజ్ఞములైన) గుణగణ (గుణముల సమూహము) లకు ఆకరుడు (నిధి వంటి వాడు), రాముడు}; కారుణ్యాకర = శ్రీరామ {కారు ణ్యాకరుడు - కారుణ్య (దయ)కి ఆకరుడు (నిధి వంటి వాడు), రాముడు}; భీకర శరధారాకంపిత దానవేంద్ర = శ్రీరామ {భీకరశరధారాకంపితదానవేంద్రుడు - భీకర (భయంకరమైన) శర (బాణముల) దారా (పరంపరలచే) కంపిత (వణికింపబడిన) దానవేంద్రుడు (రాక్షస ప్రభువులు కలవాడు), రాముడు}; రామనరేంద్రా = శ్రీరామ {రామనరేంద్రుడు - రాముడు అనెడి నరేంద్రుడు (రాజు), రాముడు}.

DASARA FESTIVAL SRI KANAKA DURGA AMMA VARI PUJA PICS




SRI KANAKA DURGA AMMA VARU