ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Beautiful Alekhya Angel hd pics






INCOME TAX RIDING


LADIES FINGER IS THE BEST FOOD ITEM TO ASTHAMA PATIENTS - HEALTH TIPS WITH VEGETABLES - BENDAKAYA - LADIES FINGER


మీ ఆరోగ్యానికి అండ.. బెండ

సీజన్లతో పనిలేకుండా ఎప్పుడు కూరగాయల మార్కెట్‌కు వెళ్లినా ఆకుపచ్చరంగులో తాజాదనాన్ని నింపుకుని ఆకర్షిస్తుంది బెండ. కూరలు, వేపుళ్లు, పచ్చడి ఏది చేసిన బెండకాయ రుచే వేరు. అయితే చాలామంది జిగురుగా ఉంటుందనిచెప్పి.. బెండను తరచూ తినడానికి ఇష్టపడరు. ఇందులోని పోషక విలువలు, అధిక పీచుపదార్థం తెలుసుకున్న తర్వాత తినకుండ ఉండలేరు. వంద గ్రాముల బెండలో 1.5 శాతం శక్తినిచ్చే క్యాలరీలు ఉంటాయి., ఏడుగ్రాముల కార్పోహైడ్రేడ్లు, రెండు గ్రాముల ప్రొటీన్‌తోపాటు అతి తక్కువ కొవ్వులను కలిగి ఉంటుందీ కాయగూర. శరీరంలో జీర్ణశక్తిని మెరుగుపరిచి, పేవుల్ని శుభ్రం చేసే శక్తి పీచుపదార్థానికి ఉంది. ఈ పీచును ఆహారం రూపంలో తక్కువ మోతాదులో తీసుకోవడం వల్లే.. ఉదరకోశ సమస్యలు వస్తున్నాయి. అందుకని బెండను తీసుకోవాలి. ఇందులో తొమ్మిది శాతం పీచు లభిస్తుంది. విటమిన్‌ ఇ, సి, కెతో పాటు మెగ్నీషియం, ఫాస్పరస్‌లు కూడా లభిస్తాయి. దీంతో రక్తనాళాల్లో రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు తోడ్పడుతుంది. మధుమేహంతో బాధపడేవాళ్లకు బెండ అండగా నిలుస్తుంది. ముఖ్యంగా మహిళలలో అయితే రుతుక్రమంలో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. ఇక, బెండలోని విటమిన్‌ కెతో ఎన్నో లాభాలు. రక్తనాళాలు చిట్లకుండా చేస్తుంది. ఎముకలు బలిష్టంగా తయారయ్యేందుకు తోడ్పడుతుంది.

ఆస్మాకు అద్భుత ఔషధం..!

వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చాలు.. ఆస్మా బాధితుల తిప్పలు అన్నీఇన్నీకావు. ఇలాంటి వాళ్లకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది బెండ. భోజనంలో ఏదో ఒక రూపంలో రెగ్యులర్‌గా తీసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి బెండను తినడం వల్ల సమస్య తొలగిపోతుంది. ఒక్కోసారి ఏ కాలమైన కాస్త ఎండవేడికే వడదెబ్బ కొట్టే ప్రమాదం సంభవిస్తుంది. వేడికి గురైన శరీరాన్ని చల్లబరిచే గుణం బెండకు ఉంది. ఆధునిక జీవనశైలి తెస్తుస్న ముప్పులో మొదటిది అధిక బరువు సమస్య. కూర్చుని చేసే ఉద్యోగాలకుతోడు, మానసిక ఒత్తిళ్ల మధ్య పనిచేస్తుండే వాళ్లను ఒబెసిటీ వేధిస్తున్నది. దీనికి చక్కటి ఔషధం బెండ. అధిక బరువును తగ్గించడమే కాకుండా.. చెడు కొవ్వులను శరీరంలో పేరుకుపోకుండా జాగ్రత్త పడుతుంది.

వాటన్నిటికీ తోడు చర్మ సౌందర్యంలోను దీని ప్రాముఖ్యం అధికం. ఇందులోని విటమిన్‌ సి చర్మాన్ని యుక్తవయసులో ఉన్నట్లు చేస్తుంది. జబ్బులు దరి చేరనీయదు. జుట్టు రాలడాన్ని అరికట్టి, రోగనిరోధకశక్తిని పెంచి, కంటిచూపును మెరుగుపరిచి, ఎనీమియా, డయాబెటిస్‌ను రాకుండా చూస్తుందీ బెండ.

Pretty Star Tattoo designs






HOW TO PERFORM PUJA IN SIVALAYAM - STEPS TO PERFORM PUJA MOVING ROUND THE TEMPLE IN SIVALAYAM


FABULOUS BEAUTY GAYATHRI VENKITAGIRI





THE GREAT WARRIOR SIVAJI


KERALA STYLE DANCING BEAUTY MINU KURIAN


FAMILY BEAUTY MINUKURIAN


STYLISH BEAUTY MINU KURIAN




MALAYALAM STAR ACTRESS MINU KURIAN IN BEAUTIFUL BLUE SAREE


HANUMA STHOTRAM - LORD SRI HANUMAN PRAYER IN TELUGU


హనుమ స్తోత్రం

మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ |
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ||
బుద్ధిర్బలం యశొధైర్యం నిర్భయత్వ-మరోగతా |
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్-స్మరణాద్-భవేత్ ||

REVATHI - ACTRESS IN BEAUTIFUL RED SAREE


ACTRESS MADHAVI IN BEAUTIFUL GOLDEN JEWELLARY AND ORNAMENTS





SWEET AND HOT KAMNA




STORY OF A GREAT KING RUTHUMBHARUDU - TELUGU PURANA KATHALU COLLECTION



పూర్వం తేజః పురము అనే పట్టణాన్ని ఋతంభరుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు అనేకమంది భార్యలున్నారు. ఆయన పరమధార్మికుడు. ఉత్తముడు, మహా ఐశ్వర్య సంపన్నుడు. ఆయన రాజ్యంలో ఎక్కడ చూచినా నిరతాన్నదానం జరిగేదట. యతులకు, బ్రాహ్మణులకు, బ్రహ్మచారులకు సమస్త సౌకర్యాలు ఎక్కడ పడితే అక్కడ దొరికేవత. అలాంటి రాజ్యం ఆయనది. అయినా ఆయనకు సంతానం కలుగలేదు. ఆయన జాబాలి దర్శనం చేసుకున్నాడు. ఆ ఋతంభర రాజు ఆయనకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి గౌరవించి తనకు సంతానం లేదని, పుత్రభిక్ష పెట్టమని అడిగాడు.

అందుకు బదులుగా జాబాలి మహర్షి ఆయనతో, "రాజా! సంతానం లేని వాళ్లకు సంతానం కలగాలంటే మూడే మార్గాలున్నాయి. అవి వాసు దేవార్చనము (విష్ణు పూజ), వామదేవార్చనము (శివపూజ), గోసేవ. అందుకనే సుదక్షిణా దేవిని, దిలీప చక్రవర్తిని వసిష్ఠుడు సంతానం కోసం గోసేవ చేయమన్నాడు. ఈ సేవల వలన ఎంత పాపం చేసిన వాడికయినా, ఎంత పుణ్యం లేని వాడికయినా కూడా సత్సంతానం కలుగుతుంది. నీకు ముఖ్యంగా గోసేవ చేయమని చెప్తున్నాను. అది నీకు మంచిది. ఎందుకంటే గోవు శరీరంలో దేవతలుంటారు. ప్రతిదినము గోవుకు గడ్డి పెట్టి దానికి సేవచేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. సంతానాన్ని ఇస్తారు.

ఋతుమతి అయిన కుమార్తె అవివాహితగా ఉండడం, పశువుల కొట్టంలో ఆవు ఆకలితో ఉండడం, నిర్మాల్యం తీయనటువంటి దేవతార్చనము - ఈ మూడు కార్యములు పుణ్యం నశించడానికి హేతువులు. కాబట్టి శుభ్రం చేసి దేవతార్చన చేయాలి" అని బోధించాడు.

గోవుల ఆకలి తీర్చటం, దేవతార్చన చేయటం ఒకటేనన్నమాట. గడ్డి తినే ఆవుకు అడ్డం వచ్చి ఈ గడ్డి నాది అని దెబ్బలాడతాడు ఒకడు. తన పెరట్లో గడ్డి తింటుంటే ఆవును కొట్టాడంటే ఆ గడ్డి తనదేనని అన్నట్లే కదా! అంటే గడ్డి అది తానూ తినాలి వెంటనే! ఎంత తప్పు అది! కాబట్టి అది మహాపాపం అని చెప్పాడాయన) "గడ్డి తినే ఆవును అడ్డగించిన వాడు పితృదేవతలను బాధించినట్లే. ఆవును కాళ్ళతో తన్నరాదు. అట్టివాడు యమలోకానికి పోతాడు" అని కూడా జాబాలి మహర్షి చెప్పాడు.

సద్గురు శ్రీ శివానందమూర్తి గారి "మార్గదర్శకులు - మన మహర్షులు" నుంచి

BRIEF STORY OF RAMAYAN


NO TV SERIALS


SUPER SMILE OF SRI REDDY


HAPPY BIRTHDAY BLACK CAKE DESIGN


SNAKE MUGGU - NAGULACHAVITHI FESTIVAL SPECIAL MUGGU


TELUGU PURANA STORIES COLLECTION - SAGARA MADHANAM - STORY ABOUT LORD SRI MAHA VISHNU'S KURMAVATHAR


కూర్మావతారము

హిందూమత పురాణాల లో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాల లో రెండవ అవతారం కూర్మావతారము. కూర్మము అనగా తాబేలు. దేవదానవులు అమృతము కోసము పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాలసముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే, విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు. ఇది కృతయుగం లో సంభవించిన అవతారం.

ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి "దేవతలు శక్తిహీనులగుదురు" అని శపించాడు. అందువలన దానవులచేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా "సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి" అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు.
దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమకంటె శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకొన్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీరసముద్ర మథనం మొదలయ్యింది. కాని మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది.
అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి ఆ కొండను భరించెను. ఆ అవతారాన్ని పోతన తన భాగవతంలో ఇలా వర్ణించాడు.
సవరనై లక్ష యోజనముల వెడల్పై కడు గఠోరంబైన కర్పరమున
నదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖ గహ్వరంబు
సకల చరాచర జంతురాసులనెల్ల మ్రింగి లోగొనునట్టి మేటి కడుపు
విశ్వంబుపై వేఱు విశ్వంబు పైబడ్డ నాగిన గదలనియట్టి కాళ్ళు
వెలిగి లోనికి జనుదెంచు విపుల తుండ
మంబుజంబుల బోలెడి యక్షియుగము
సుందరంబుగ విష్ణుండు సురలతోడి
కూర్మి చెలువొందనొక మహా కూర్మమయ్యె.
అలా దేవదేవుని అండతో సముద్రమథన కార్యం కొనసాగింది. ముందుగా జగములను నాశనము చేయగల హాలాహలము ఉద్భవించినది. దేవతల మొర విని, కరుణించి, పరమశివుడు హాలాహలాన్ని భక్షించి, తన కంఠంలోనే నిలిపాడు. అందుచేత ఆయనను గరళకంఠుడు అనీ, నీలకంఠుడు అనీ అంటారు. తరువాత సుర (మధువు), ఆపై అప్సరసలు, కౌస్తుభము, ఉచ్ఛైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము వచ్చాయి. ఆ తరువాత త్రిజన్మోహినియైన శ్రీలక్ష్మీదేవి ఉద్భవించింది. సకలదేవతలు ఆమెను అర్చించి, కీర్తించి, కానుకలు సమర్పించుకొన్నారు. ఆమె శ్రీమహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు. తరువాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు.

జయదేవుని స్తోత్రంలో కూర్మావతార వర్ణన
క్షితిరతి విపులతరే తవ తిష్ఠతి పృష్టే
ధరణి ధరణ కిణ చక్ర గరిష్ఠే
కేశవ! ధృత కచ్ఛప రూప!
జయ జగదీశ హరే!

శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్ణానికి 15 కి.మీ. దూరంలో శ్రీకూర్మం అనే పుణ్య క్షేత్రం ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. కూర్మావతారం మందిరం దేశంలో ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి.
పుణ్యక్షేత్రం యొక్క ప్రధాన ఆకర్షణలు
కూర్మ, విష్ణు, పద్మ, బ్రహ్మాండ పురాణాల లో మూలాలు.
మహావిష్ణువు కూర్మావతారము రూపంలో పూజ్యమైన ప్రపంచంలో ఏకైక స్వయంభు ఆలయం (తాబేలు) అవతారం.
విష్ణు ప్రముఖ దశావతారాలలో 2 వ అవతారం.
విగ్రహం పశ్చిమ ముఖంగా ఉంది, రెండు ద్వజస్థంబాల తో ప్రపంచంలో ఉన్న కొన్ని దేవాలయాలులో ఒకటి.
రోజువారీ అభిషేకం నిర్వహించే ప్రపంచంలో కొన్ని విష్ణు దేవాలయాలులో ఒకటి.
అజంతా ఎల్లోరా గుహలు మాదిరిగా శతాబ్దాల అరుదైన కుడ్య చిత్రాలు తో ఉన్న దేవాలయాలులో ఒకటి.
దుర్గా మాత వైష్ణోదేవి రూపం లో ఉన్న ప్రపంచ రెండవ ఆలయం., ఇతర వైష్ణోదేవి ఆలయం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లో ఉంది.
దీని శిఖరం రాతి శిల్పం - గాంధార శిల్పకళా అని అంటారు., ఇతర స్థంభాలతో పోలిక లేకుండా కొన్ని స్థంభాలు క్రింద వృథాగా లేకుండా పైకప్పు నిర్మాణానికి వేలాడుతూ అద్భుతంగా చెక్కిన 108 రాతి స్థంభాలు ఉన్నాయి.
వారణాసి (కాశి) వెల్లడానికి సొర్ంగ మార్గం ఉంది ,ప్రస్థుతం దీన్ని మూసివేసారు.
వారణాసి / పూరీ (ఒడిషా) ల వలె , మరణించినవారి అంతిమ కర్మలు ,మోక్ష స్థానం ఇక్కడ నిర్వహిస్తారు .
ఆది శంకరాచార్య, రామానుజాచార్య, నరహరి తీర్థ, చైతన్య మహా ప్రభు అనేక గొప్ప రాజులు మరియు సెయింట్స్ ఋషులు దేవాలయాన్ని సందర్శించారు

KOORMA AVATAR

Second incarnation of Lord Vishnu. As per legend Lord Vishnu took this Avathar to hold the mountain called Mandara, when Devas and Asuras churn the ocean to get Amirtham.
Once there was a war between Devas (gods) and the demons (Asuras), in that war Devas lost and the prayed to Lord Vishnu to save them from Demons. Lord Vishnu suggested for a truce, that was both sides should get together and churn the ocean. That truce was agreed by both sides.
The great mountain Mandara was used as a rod and Snake Vasuki was used as a rope to churn the ocean. All Devas holding the tail of Vasuki and Asuras holding head of the snake.
Both teams started churning but the mountain Mandara had no base so Lord Vishnu changed his form in to Tortoise and gave balanced to the mountain.


BLACK ANTS vs RED ANTS - STORY FOR KIDS IN TELUGU


GOVIND AND THE BELL STORY IN TELUGU


SAFETY FIRST


HIGH RESOLUTION PHOTO STILL OF MILKY BEAUTY TAMANNA


HINDU GOD LORD SRI MAHA VISHNU'S ONE OF THE DASAVATHAR'S - MATYSAVATHAR HD PICS




TELUGU PURANA STORY ABOUT LORD SRI MAHA VISHNU'S MATSYA AVATAR


MATSYA AVATAR -మత్స్యావతారము

హిందూమతం పురాణాలలో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో మొదటి అవతారం మత్స్యావతారం. మత్స్యం అనగా చేప. ఈ అవతారంలో విష్ణువు రెండు పనులు చేసినట్లుగా పురాణ గాధ (1) ప్రళయకాలంలో జీవరాసులను నావలో జలనిధిని దాటించడం. (2) వేదాలను కాపాడడం.

భాగవత పురాణ గాధ: ఒకనాటి కల్పాంత సమయమున మహాయుగసంధిలో (ఛాక్షుస మన్వంతరము ముగిసి, వైవస్వత మన్వంతరము ఆరంభమగుటకు ముందు) జరిగిన కథ ఇది.

వివస్వతుడు అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడ గలదు. ఆ సత్యవ్రతుడు కృతమాలిక అనే నదిలో అర్ఘ్యం ఇస్తున్నాడు. అప్పుడు అతని చేతిలోనికి ఒక చేపపిల్ల వచ్చింది. దానిని తిరిగి వదలి పెట్టబోగా అది తనను కాపాడమని కోరింది. సరే అని ఇంటికి తీసికొని వెళ్ళగా అది ఒక్క ఘడియలో చెంబుకంటె పెద్దదయ్యింది. ఇంకా పెద్ద పాత్రలో వేస్తే ఆ పాత్ర కూడా పట్టకుండా పెరిగింది. చెరువులో వేస్తే చెరువు చాలనంత పెరిగింది. నదిలో వేస్తె ఇంకా పెద్దయ్యింది. అప్పుడు రాజు "నీవెవరవు?" అని ఆ చేపను ప్రార్ధించగా ఆ చేప తాను మత్స్యాకృతి దాల్చిన విష్ణువునని చెప్పింది. "శ్రీ లలనాకుచవీధీ కేళీ పరతంత్రబుద్ధిన్ క్రీడించు శ్రీహరీ! తామసాకృతిన్ ఏలా మత్స్యంబవైతివి?" అని రాజు ప్రశ్నించాడు.

అప్పుడా మత్స్యం ఇలా జవాబిచ్చింది. "రాజా! నేటికి 7వ దినమునకు బ్రహ్మదేవునకు ఒక పగలు పూర్తియై రాత్రి కావస్తున్నది. అప్పుడు సకల ప్రపంచమూ జలమయమౌతుంది. నా మహిమ వల్ల ఆ ప్రళయసాగరంలో ఒక నావ వస్తుంది. ఆ నావలో నిన్నూ, తపోమూర్తులైన మునులనూ, ఓషధులను, తిరిగి సృష్టికోసం అవుసరమైన మూలబీజాలనూ పదిలం చేసి నా శృంగము (ఒంటి కొమ్ము) తో ఆ నావను లాగి ప్రళయాంబోధిని దాటింతును" అని చెప్పెను.

మత్స్య అవతారం - మరొక చిత్రం.

సృష్టి కార్యంలో అలసిన బ్రహ్మ ఆ కల్పాంత సాయంసంధ్యలో రవ్వంత కునుకు తీసెను. ఇదే అదనుగా చూసుకొని హయగ్రీవుడనే రాక్షసుడు బ్రహ్మ దగ్గరనుండి వేదాలను చేజిక్కించుకొని మహాసముద్రంలోకి ఉరుకెత్తాడు. శ్రీమన్నారాయణుడు మత్స్యరూపంలో ఆ రాక్షసుని వెదకి, చంపి, వేదములను తిరిగితెచ్చి బ్రహ్మకిచ్చాడు.
ఆ రాక్షసుడిని సంహరించిన విధం పోతన భాగవతంలో ఇలా వర్ణించాడు (పోతన పద్యం)--
ఉరకంభోనిధిలోని వేదముల కుయున్ దైత్యున్ జూచి వే
గరులాడించి ముఖంబు సాచి పలువీతన్ తోక సారించి మేన్
మెరయన్ దౌడలు గీరి మీసలడరన్ మీనాకృతిన్ విష్ణుడ
క్కరటిన్ దాకి వధించె ముష్టి దళిత గ్రావున్ హయగ్రీవున్
ఆ శ్రీమన్నారాయణుని సత్యవ్రతుడు ఇలా ప్రస్తుతించాడు (పోతన పద్యం)--
చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై ఆత్మవై
వలనై కోర్కెల పంటవై విభుడవై వర్తిల్లు నిన్నొల్లకే
పలువెంటన్ బడి లోకమక్కటా వృధా బద్ధాశమై పోయెడున్
నిలువన్నేర్చునె హేమరాశి గనియున్ నిర్భాగ్యుడంభశ్శయ్యాపహా!

ప్రళయాకాలములో అందరితోను, మూలబీజములతోను ఉన్న ఆ నావను కాపాడుతున్న మత్స్యావతారమూర్తి
సత్య వ్రతుని కీర్తనలకు సంతోషించి శ్రీమత్స్యావతారమూర్తి అతనికి సాంఖ్యయోగ క్రియను, పురాణ సంహితను ఉపదేశించెను. అందరితోను, మూలబీజములతోను ఉన్న ఆ నావను ప్రళయాంభోనిధిని దాటించెను.
సత్యవ్రతుడు ప్రస్తుతం నడుస్తున్న "వైవస్వత మన్వంతరానికి" అధిపతి అయ్యాడు.

మత్స్యావతారంలో శ్రీమహావిష్ణువు వెలసిన ప్రముఖ ఆలయము.
వేద నారాయణ స్వామి ఆలయం నాగలాపురం

MATSYA AVATAR

First incarnation of Lord Vishnu. Once there was a demon named Somukasuran, who has the face of a horse. He stolen all the Vedas and Sasthras created by Lord Brahma, and he went in to sea.
Lord Brahma prayed Lord Vishnu to save all Vedas, at once Lord Vishnu changed his form in to Fish, killed Somukasuran and returned all Vedas to Brahma.
This incident was called as Matsya Avathar of Lord Vishnu and that's why Idol of Lord Vishnu in Matsya Avathar has half- fish shaped and half- God shaped.