ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

AMAZING WALL ART


DIWALI SPECIAL TELUGU MUGGU


AANIMUTYALU - TELUGU QUOTATIONS






HUGE COLLECTION OF LIFE QUOTATIONS IN TELUGU






Bhaiya Dooj or Yama Dwitiya is the fifth and last day of Diwali celebration - Indian Customs and Traditions


భగినీ హస్త భోజనం ...

సోదరి ఇంట భోజనం చేయాలి

కార్తీక శుద్ధ విదియ, అంటే దీపావళి వెళ్ళిన రెండవనాడు వస్తుందీ పండుగ. సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది. ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు. రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రక్ష (రాఖీ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని, రక్షిస్తామని చెపుతారు. రాఖీ సోదరి క్షేమానికి సంబంధించినది. 
"భయ్యా ధూజీ'' అనే పేరుతొ ఉత్తరదేశంలో బాగా ప్రాచూర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది.

ఒకప్పుడు యముడు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకి బాధ కలిగిందా? అని అడిగితె ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడిన వేదన హృదయ విదారకంగా ఉండి తన మనసు పాడైందని చెపుతాడు. యముడు కూడా బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెపుతూ ... "ఎవరైనా కార్తీక శుద్ధ విదియ నాడు సోదరికి బహుమానాలిచ్చి, ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును నివారించవచ్చు'' అంటాడు. దీనికి కారణం ఉంది.
యముడు యమున సూర్యుని పిల్లలు. సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులౌతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడట. అందువల్లనే యమునలో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదట. అందరూ యమునా స్నానం చేయలేరు కదా! సోదరసోదరీ పరమకు నిదర్శనంగా నిలిచినా యమున, యముల బంధాల్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ (సోదరి) హస్త భోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చు. ఉత్తర భారతంలో ఇది చాలా ప్రాంతాలలో జరుపుకునే పండుగ. ఆంధ్రులకు దానిని గురించి తెలిసినా పెద్దగా పాటించరు. రక్షాబంధనం కూడా అంతే ఈ మధ్య ప్రాంతీయ భేదాలు సమసిపోవటం కారణంగా ఇవి మన దాకా కూడా వచ్చాయి. కాని, రాఖీ పూర్ణిమ ప్రాచుర్యం పొందినంతగా భగినీ హస్తభోజనం ఆంధ్రదేశంలో వ్యాప్తి పొందలేదు.

Bhai Dooj 

Bhaiya Dooj or Yama Dwitiya is the fifth and last day of Diwali celebration. On this day brothers and sisters meet to express love and affection for each other. People also worship Lord Yam and river Yamuna for the well being of their loved ones.

Bhai Dooj is also known as “Bhaiya Dooj”, “Bhai Phota”, “Bhai Tika”, “Bhaubeej” or “Bhau Bij”.
Significance of Bhai Dooj
Yam & Yamuna:Yama lord of Death visited his sister Yamuna. Yamuna ji welcomed yam with an Aarti and they had a feast together. While leaving Yama blessed his sister with gifts and blessing. So, the day is also called ‘Yama Dwitiya’.

Krishna & Subhadra: Another version Lord Krishna, after killing Narakasur, went to meet his sister Subhadra. Subhadra welcomed him in the traditional way by Aarti and putting a tilak on his forehead.
Prime Rituals of Bhai Dooj
Brothers visit their sister home.
Sisters apply the auspicious Tilak on brother’s forehead.
Brothers have a meal prepared by sisters. Traditionally this meal is known as ‘Bhagini Hastha Bhojanam’ which means ‘having a meal prepared by sister’.
People also worship Lord Yamaraj and his mythical record keeper Chithragupta.
Taking a holy dip in river Yamuna is considered highly pious on this day.
Bhai Dooj Tilak Puja Vidhi
Make your brother seat near the puja ghar.
Apply Tilak on his forehead as a mark of protection.
Give him a coconut.
Perform aarti of him and prays for his long and happy life.
After aarti, offer him a sweet to eat.
If your brother is married, apply tilak on her bhabhi’s (sister- in-law) forehead and give her dry coconut.
Don’t forget to apply the auspicious Tilak to your little nephews and nieces.
If you have no brothers perform a puja to God Chandra the moon Lord.
Bhai Dooj Puja Mantra
Chant this mantra while applying tilak and pray for the well being of your brother.

Bhratus tabaa grajaataaham, Bhunksa bhaktamidam shuvam
Preetaye yama raajasya Yamunaah Visheshatah

भ्ृतूस तबा ग्रजाताहां, भुंकसा भक्तामीड़म शुवाँ
प्रीटाए यामा राजस्यYअमुनाह विशेषत

online prasad wishes you a happy Bhaiya dooj!
Yamadwitheya
Yamadwitheya
Yamadwitheya
Bhai Dooj festival is also known by the name of Yamadwitheya. We all know that this festival celebrates the beauty of the eternal bond of love and affection between a brother and a sister. The festival is the last day of the diwali celebrations. This falls on the second day after Diwali and the next day after new moon night. Dhanatrayodashi, Narakchaturdashi, Amavasya (Laxmi Pujan), Balipratipada and Yamadvitiya also called Bhai Dooj are the five days which comprise Diwali. Each day is associated with a religious significance.

Yamadwitheya Legend
One of the most commonly told legend of Bhai Dooj is the tale of Yamaraj, the Hindu mythological god of Death. The reason why the festival is also know as Yamadwitheya is from the legend of god Yama Raja himself. Story says that Yamaraj met his twin-sister Yami or Yamuna after a long period of separation. The day was ‘Dwitheya’ or ‘Dooj Day’ (second day after new moon). When Yami saw her brother after a long period of time, she was very happy and she welcomed Dharam Raj (another name for Yama) wholeheartedly. She applied red tilak on his brother's forehead and treated him a sumptuous meal. Yamaraj was very happy receiving such a warm reception from his sister. It was due to this he announced that whosoever receives a teeka from his sister on the day of ‘Dooj’ will not be hurled to hell. Hence the day is also referred as Yamadwitheya.


HOME MADE TIPS FOR GLOWING SKIN


ARTICLE ABOUT LORD SRI MAHA VISHNU'S 21 AVATHARS IN TELUGU


ఆదిపురుషుడు శ్రీమన్నారాయణుడి

 యొక్క 21 అవతారాలు.

భగవంతుండగు విష్ణువు

జగముల కెవ్వేళ రాక్షసవ్యథ గలుగున్
దగ నవ్వేళల దయతో
యుగయుగమునఁ బుట్టి కాచు నుద్యల్లీలన్.
శౌనకాది మునులు, సూతమహర్షిని నారాయణుని కథలు తెలుపమని అడగగా, సకలపురాణ ద్రష్టయైన ఆ మహర్షి, శ్రీమద్భాగవత వక్తయైన శుకమునిని స్మరించి, వ్యాసుని పాదాలకు నమస్కారం చేసి,నరనారాయణులకున్నూ,భారతికిన్నీ మొక్కి ఇలా చెప్పటం మొదలెట్టాడు..."మునీంద్రులారా! సర్వలోకాలకీ మంగళప్రదమైన విషయాన్ని అడిగారు...కర్మనిర్మూలన హేతువులైన ఆ కమలలోచనుని కథలు ఎవడైతే వినడానికి ఇష్టపడతాడో, వాడికి ఇతరమైన విషయాలేవీ రుచించవు...పుణ్యశ్రవణ కీర్తనుడైన ఆ విష్ణువు తన కథలు వినేవాళ్ళ హృదయాల్లో నిలిచిఉండి సర్వశుభాల్నీ కలిగిస్తాడు..అశుభాల్ని పోగొడతాడు....అలాంటి వారికి నిశ్చలమైన భక్తి కలుగుతుంది...భక్తి ఉన్నవాడి మనస్సు అరిషడ్వర్గాలకి చిక్కక సత్వగుణప్రసన్నమై, ఈశ్వరతత్త్వాన్ని తెలుసుకుంటుంది....అలాంటి వారికి సర్వ సంశయనివృత్తికలిగి, సర్వ కర్మలూ నశిస్తాయి......
అగ్ని ఒక్కటే ఐనా, వేరువేరు కట్టెలకి తగిలి మండేప్పుడు వేరువేరుగా కనిపించినట్టు, విశ్వాత్ముడైన ఆ ఆదిపురుషుడొక్కడే ఐనా అతడు దేవ,తిర్యక్, మనుష్య జాతుల్లో అవతరించి లోకాల్ని రక్షిస్తూ ఉంటాడు.....ఆ భువనైకకర్త,బహుసుందరమైన పదునారు కళలతో,పంచమహాభూత భాసితుడై, శుద్ధసత్వుడై, సర్వావయవాలూ,సర్వేంద్రియాలూ వేలకొద్దీ("సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షా సహస్రపాత్" అని పురుషసూక్తం) వెలుగుతుండగా,హార కిరీటకుండలాలు పెక్కువేలతో, సహస్ర శిరస్కుడై పురుషరూపం ధరించి, అపారజలరాశి మధ్య,యోగనిద్రావిలాసియై వెలుగుతూ ఉంటాడు...అది సకలావతారాలకూ మూలమైన శ్రీమన్నారాయణుని దివ్యరూపం....దానిని పరమయోగీంద్రులైనవారు దర్శిస్తారు....ఆ పరమేశ్వరుని నాభికమలంలోనుంచి సృష్టికర్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మ జన్మించాడు....ఆయన అవయవాలనుండే సర్వలోకాలూ సృష్టించబడ్డాయి.......
మొట్టమొదట ఆ శ్రీమన్నారాయణుడు సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులనే నల్వురిపేర బ్రహ్మమానసపుత్రులుగా జన్మించి, బ్రాహ్మణుండై కఠినమైన బ్రహ్మచర్యాన్ని ఆచరించాడు....
రెండవసారి, జగజ్జననం కోసం యజ్ఞవరాహరూపంతో హిరణ్యాక్షుణ్ణి వధించి,ఆ హిరణ్యాక్షుడిచేత రసాతలానికి తొయ్యబడ్డ భూమిని, తన కోరలపై నిలబెట్టాడు.....
మూడవమారు, నారదుడను దేవరుషిగా బ్రహ్మమానసపుత్రుడై, సర్వకర్మనిర్మూలనము, సర్వపాపహారియగు వైష్ణవతంత్రాన్ని చెప్పి,మహతి అనే వీణను పూని నారాయణ కథాగానంతో లోకాల్ని పావనం చేశాడు......
నాల్గవపరి, నరనారాయణ రూపాలతో బదరికావనంలో దుష్క్రరమైన తపస్సొనరించాడు....
ఐదవ అవతారంలో, కర్దమ ప్రజాపతికి, స్వాయంభువమనువు రెండవపుత్రిక దేవహూతికి కపిలాచార్యుడుగా జన్మించాడు.....ఆ కపిలాచార్యుడు, దేవహూతికి పిండోత్పత్తిక్రమాన్ని ఉపదేశిస్తాడు....తత్త్వజ్ఞాన రూపమైన సాంఖ్యయోగాన్ని ఆసురి అనే బ్రాహ్మణునికి ఉపదేశిస్తాడు....
ఆరవ అవతారం దత్తాత్రేయుడు.....అనసూయాదేవియందు అత్రిమహామునికి జన్మించి, అలర్కుడు,ప్రహ్లాదుడు మొదలైన వారికి ఆత్మవిద్యని బోధించాడు....
ఏడవరూపంలో, రుచి ప్రజాపతికి, స్వాయంభువమనువు పెద్ద కుమార్తె ఆకూతికి శ్రీయజ్ఞుడనే పేర జన్మించి, దివ్యమైన ప్రకాశంతో యామాది దేవతలతో కలసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు....
ఎనిమిదవ అవతారం ఋషభుడు......ఈయననే ఉరుక్రముడనీ అంటారు......ఈయన మేరుదేవియందు నాభికి కలిగినవాడు....ఈ అవతారంలో ఆ మహావిష్ణువు సకల విద్ద్వజ్జనులకీ పరమహంస మార్గాన్ని బోధించాడు......
తొమ్మిదవదైన అవతారంలో, ఋషుల కోరికమీద పృథుచక్రవర్తిగా జన్మించి, భూమిని ధేనువుగా చేసి సకల ఓషధులనీ పిదికె.....
పదవది మత్స్యావతారం.....మహా మీనంగా ప్రభవించి చాక్షుష మన్వంతరం అంత్యకాలంలో,వేదాల్ని దొంగిలించిన సోమకుణ్ణి వధించి,సత్యవ్రతుణ్ణి మహీరూపమైన నావనెక్కించి, సప్తర్షులతో,సకల బీజాల్నీ,ఓషధుల్నీ కూడిన ఆ నావని తన మూపు మీద ధరించి రక్షించాడు.....ఆ సత్యవ్రతుడే ఈ కల్పంలో వైవస్వత మనువు......
పదకొండవదైన కూర్మావతారంలో, క్షీరసాగరమథనవేళ ఒరిగిపోతున్న మందరాద్రిని తన వీపుపై నేర్పుగా నిలిపాడు...
పన్నెండవ అవతారం ధన్వంతరి.....క్షీరసాగరమథనంలో చివరిగా అమృత కలశహస్తుడై జన్మించి,దేవవైద్యుడై, సర్వ వైద్యవిద్యలకీ ఒజ్జయై విలసిల్లాడు...
పదమూడవది అసురులని మోహింపజేసి, సురలకి అమృతాహారాన్నందించి,పరమేశ్వరుణ్ణి సైతం మోహింపజేసిన జగన్మోహినీ అవతారం.....
పద్నాల్గవదైన ఉగ్రనరసింహరూపంతో, కనకకశిపుని వధించి,ప్రహ్లాదుణ్ణి రక్షించాడు....
పదిహేనవదైన కపటవామనావతారంతో బలిని మూడడుగులడిగి, ముల్లోకాల్నీ ఆక్రమించాడు....
పదహారవది పరశురామావతారం....కుపితభావంతో, బ్రాహ్మణ ద్రోహులైన రాజుల్ని ఇరవయ్యొక్కసార్లు వధించి భూమిని క్షత్రియశూన్యం గావించాడు....
పదిహేడవరూపంలో వ్యాసుడై, అల్పులైన మానవులని కరుణించ, వేదాల్ని విభజించి, అష్టాదశపురాణాల్ని రచించాడు....
పద్ధెనిమిదవ అవతారంలో శ్రీరాముడై, దేవకార్యార్థమై రాజత్వాన్ని పొంది, సముద్ర నిగ్రహనాది పరాక్రమాల్ని ఆచరించాడు....
పందొమ్మిది,ఇరవై అవతారాలైన బలరామ,కృష్ణావతారాలతో భూమి భారాన్ని తగ్గించాడు....
కలియుగాదిలో రాక్షససమ్మోహనంకోసం, కీకటదేశంలో(మధ్యగయా ప్రాంతంలో) జినసుతుడై, బుద్ధ్హుడనే పేర ప్రకాశిస్తాడు...అదే ఇరవై ఒకటవ అవతారం......
చివరగా కలియుగ, కృతయుగ సంధిలో రాజులు చోరులుగా మారి సంచరిస్తుంటే విష్ణుయశుడనే విప్రునికి కల్కి అనే పేర ఉద్భవిస్తాడు....సర్వమ్లేచ్ఛ సంహారంగావిస్తాడు....." అని వివరించి సూతమహర్షి ఇంకా ఇలా అన్నాడు..
" అతిరహస్యంబైన హరిజన్మకథనంబు
మనుజుఁ డెవ్వఁడేని మాపురేపుఁ
జాలభక్తి తోడఁ జదివిన సంసార
దుఃఖరాశిఁ బాసి తొలఁగిపోవు."


SECRETS OF INDIAN ANCIENT VEDAS


“ వేదములు – సైన్స్ –రహస్యాలు “

ఒక పరమాణువు విశ్వాన్నంతటినీ సృష్టిస్తే, ఆ సృష్టిలోని చరాచరములన్నీ పరమాణువులతోనే తయారుగాబడివుంటాయి. ఆ మొట్టమొదటి పరమాణువుయొక్క మూల ధర్మాలే అన్ని చరాచరముల అణువులలోనూ నిభిఢీకృతమై వుంటాయి. భౌతిక, పదార్ధ, రసాయన శాస్త్రాలు ఈ విషయాన్ని ఒప్పుకుంటాయి. ఈ శాస్త్రాలు చెప్పిన నిజాలనే నేటి సమాజం నమ్ముతున్నది. మంచిదే. ఒక జపాన్ శాస్త్రవేత్త ఆవిష్కరించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ముందుగా తెలుసుకుందాం.

డాక్టర్ మసరూ ఎమోటో మానవులు మాట్లాడే మాటలు, పాడే పాటలు, నృత్య శబ్దాలు నీరు, ఆహారంపైన ఏ విధంగా ప్రభావాన్ని చూపుతాయో తన పరిశోధన ద్వారా తెలుసుకున్నారు. కొన్ని నీటి చుక్కలను తీసుకొని, వాటిముందు, వేరువేరుగా, కొని మంచిమాటలను, మంచి ప్రార్ధనలను, మంచి సంగీతాన్ని, మంచి సరళమైన నృత్య శబ్దాలను వినిపించారు. అలాగే, మరికొన్ని నీటి చుక్కలను తీసుకొని, వేరువేరుగా, కొన్ని చెడు/తీవ్రమైన మాటలను, తీవ్రమైన ( metallic music ) సంగీత శబ్దాన్ని, తీవ్రమైన నృత్య శబ్దాలను వినిపించారు. ఆ తరువాత, ఆ నీటి చుక్కలను మంచు ముక్కల్లాగా గడ్డకట్టించి వాటిని సూక్ష్మదర్శినిలో పరిశీలించి, వాటి ఛాయా చిత్రాలు తీసారు. అనేక అణువుల సమాహారమే నీటి రూపం. మంచి మాటలలు, మంచి ప్రార్ధనలు, మంచి సంగీతాన్ని …. వినిపించిన నీటి చుక్కల స్పటికాల్లో అణువుల సమాహారం ఆకృతి అతి అందంగా, ముత్యాలు పేర్చినట్లుగా కనిపిస్తే, తీవ్రమైన మాటలను, తీవ్ర సంగీత శబ్దాలను …. వినిపించిన నటి చుక్కల స్పటికాల్లో అణువుల సమాహార ఆకృతి అందవిహీనంగా, చిందరవందరగా కనిపించిందట. వీటికి సంబంధించిన *చిత్రాలను కింద చూడండి. ఆ శాస్త్రవేత్త చెప్పిందేమిటంటే, మనిషి శరీరంలో 72 శాతం నీరు వుంటుంది. కొన్ని నీటి చుక్కలకు మంచి మాటలు, ప్రార్ధనలు, సంగీతాన్ని వినిపిస్తేనే ఆ నీటి చుక్కలలో అణువుల సమాహార ఆకృతి ఎంతో అందంగా ఏర్పడితే, 72 శాతం నీటితో నిండిన మనిషి, తనకు తానుగా మంచి మాటలనే మాట్లాడుతూ, ఎప్పుడూ నిజమే చెబుతూ, చక్కటి సున్నితమైన సంగీతాన్ని వింటూ, తనలో తాను చక్కటి మంచి ప్రార్ధనలు చేసుకుంటే, ఉదా:- నేను చాలా దివ్యంగా వున్నాను, ఈ ప్రపంచమంతా అందంగా వున్నది; నేను చాలా సంతోషంగా, ఆనందంగా వున్నాను; నేను భగవంతుని బిడ్డను; ఆయన దయతో ఇవన్నీ నాకు లభించినాయి అని ఎప్పుడూ భావించినట్లైతే, ఆ మనిషి యొక్క మానసిక, భౌతిక శరీర స్థితి ఎంతో ఆరోగ్యంగా వుంటుంది. అట్టి భావనకు వ్యతిరేకంగా, నేను జీవితంలో ఓడిపోయాను,; అన్నీ కోల్పోయాను; నా జీవితం చీకటిమయం, దుర్భరం అని భావిస్తూవుంటే, అతని మానసిక, భౌతిక శరీర స్థితి అనారోగ్యంగా తయారవుతుంది. దీనినే, వైద్య భాషలో, “ అన్నీ రుగ్మతలకు మూలకారణం మనస్సు “ ( Mind is the origin of all diseases ) అని అంటారు. అదేవిధంగా, మరొక ప్రయోగములో గాలి చొరబడని రెండు గాజు సీసాల్లో మంచి తెల్లటి అన్నంతో నింపి, వాటిని వేరువేరు గదులలో ఉంచి, 30 రోజులపాటు, వరుసగా వాటిముందు అంటే మొదటి సీసాముందు “ నీవంటే నాకు చాలా ఇష్టం, నిన్ను ప్రేమిస్తున్నాను అని; రెండవ సీసా ముందు “ నీవంటే నాకు అయిష్టం, అసహ్యం, నిన్ను ద్వేషిస్తున్నాను” అని పదే,పదే, పదిహేను నిముషాలపాటు చెబుతూ వచ్చారట. 30 రోజుల తరువాత మొదటి సీసాలోని అన్నం తెల్లగానేవుండి, చెడిపోకుండా వుంటే, రెండవ సీసాలోని అన్నం నల్లగా అయిపోయి, చెడిపోయిందట. అంటే మన పాటల ప్రభావం ఆహారంపై ఏ విధంగా పనిచేసిందో తెలుసుకున్నారు ఆ శాస్త్రవేత్త. జీవించటంకోసం తినే ఆహారాన్ని మనం తినేటప్పుడు దానిని ఆస్వాదిస్తూ తినినప్పుడే అది మన శరీరానికి చక్కగా వంటబట్టి, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలా చేయనప్పుడు, ఆహారం వంటబట్టకపోగా, అనారోగ్యాన్ని కలుగచేస్తుందని ఆయన తన శాస్త్ర పరిశోధనల ద్వారా మానవాళికి తెలియచేశారు.


ఇప్పుడు, మనం, ఒక ముఖ్యమైన విషయానికి వద్దాం. .

ఆహారాన్ని కానీ, నీటిని కానీ, తీసుకునేటప్పుడు, ప్రపంచ వ్యాప్తంగా, అన్నీ మతాలలోనూ ప్రార్ధనలు చేయటం అనే పద్ధతి అందరికీ తెలిసేవుంటుంది. క్రీస్తు శకానికి పూర్వమే, మన భారతదేశంలో, వేదాలలో, ఈ ఆచారం నిర్దేశింపబడింది. వీటిని గురించి, ఇప్పటి తరంవారికి ఓపిగ్గా వివరించి చెప్పేవారు కరువవటంతో, వాటి ప్రాముఖ్యత తెలియకుండా పోతున్నది. మానసిక కాలుష్యం, శారీరిక కాలుష్యం, పరిసర వాతావరణ కాలుష్యం పెరిగిపోవటానికి కారణం, మనం ఈ ధర్మాలను పాటించక పోవటమే. మరి మన హిందూ ధర్మ శాస్త్రాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. జాగ్రత్తగా పరిశీలించండి.

మొదటగా, మానవునికి—నీటికి గల అనుబంధం గురించి చూద్దాం. ప్రస్తుత సైన్స్ చెప్పిందేమిటంటే, అనేక రకాల బహు-కణ జీవుల ఉత్త్పత్తికి మూల కారణం ఏక-కణ జీవులని; మానవుని ఆవిర్భావానికి ముందు దశలను పరిశీలిస్తూ పోతే, అవి నీటినుంచి పుట్టిన ఏక-కణ జీవుల దగ్గరకు దారితీస్తుంది. అందువలనే, ఇప్పటికీ, మనిషి శరీరంలో 72 శాతం నీటితో నిండివున్నది చెబుతారు. — ఈ విషయాన్ని మన పురాణాలతో, శాస్త్రాల్తో సరిచూస్తే, ఆదిపరాశక్తి, అరమోడ్పు కనులతో వున్నప్పుడు,. ఈ భూమి అంతా నీటిలో మునిగి పోయివుంటుందని, అప్పుడు ఆ పరాశక్తి, జలమధ్యమున , వటపత్రముపై యోగనిద్రలో తేలుతూవున్న విష్ణువును ( అంటే స్థితి కారకుడు ) ప్రేరేపించి, భూమిపై సృష్టి కార్యాన్ని ప్రారంభిచమని ఆదేశిస్తుందని, అప్పుడు విష్ణువు , బ్రహ్మ ద్వారా సృష్టి కార్యాన్ని మొదలుపెడతాడని దేవీ భాగవతం మొదలైన పురాణాలు తెలియచేస్తున్నాయి. నీటిలో మునిగిపోయివున్న భూమిని, వరాహావతారంలో, విష్ణువు నీటిపైకి తీసుకువచ్చిన తరువాత భూమిపై జీవుల సృష్టి ప్రారంభమైనదని భాగవతంలో చెప్పబడింది. దీనిని బట్టి, భూమిపైవున్న జీవులకి నీటితో అవినాభావ సంబంధం వున్నదని చెప్పవచ్చు. శ్రీ పురుష సూక్తంలో “ అధ్భ్యస్శంభూత పృధీవ్యరసాచ్చ …..” అని చెప్పబడింది. అంటే నారాయణుడు నీళ్లనుండి పుట్టెను; నీటినుండి పృధివి పుట్టెను అని అర్ధం. విష్ణు సహస్ర నామములో ఒకటైన నారాయణహః “ అనే నామముకూడా మనిషికి – నీటికి గల సంబంధాన్ని తేలియచేస్తుంది. నారము + అయన = నారాయణ = నారములు అనగా జీవులు; అయనము అంటే, స్థానం. ప్రళయకాలమునందున జీవులు ఆశ్రయించుటకు ఒక స్థానం కావలసివున్నందున, అట్టి స్థానమును, నీటినే తన స్థానముగా చేసుకొని, నీటియందు తేలుచున్న నారాయణుడు కల్పించును అని తేలియచేస్తుంది.

రెండవ అంశం మంత్రబద్ధంగా జలాన్ని వినియోగించుకోవటం:- మన ఋషులు గొప్ప పరిశోధకులు, శాస్త్రవేత్తలు. నీటియొక్క గొప్ప తనంగురించి తెలుకున్నవారుగనుక, దైనందిన జీవనంలో మానవుడు నీటిని వాడేటప్పుడు, నీటిని పవిత్రంగా భావించాలి అని నిర్దేశించారు. “యత్ భావం, తత్ భవతి” అని పెద్దలు చెప్పారు. నీటిని వాడేటప్పుడు, మన భావన పవిత్రంగా వున్నట్లైతే, దాని ఫలితం మనం కోరుకున్నట్లే వుంటుంది. మన దేశంలో (1) స్నానం చేసేటప్పుడు; (2) సంధ్యావందనం, మరియు పూజ చేసేటప్పుడు; (3) భోజనం చేసేటప్పుడు ముఖ్యంగా నీటిని ప్రార్ధనా సహితంగా వాడబడుతుంది.

స్నానం చేయునప్పుడు:- “ గం గేచ యమునేచైవ, గోదావరీ సరస్వతీ | నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిమ్ కురు …..” అనే ఆరు మంత్రములను చదువుచూ, ఓ నదులారా మీకు నమస్కారములు; పవిత్రమైన మీ నీటిని నేను వినియోగిస్తున్నాను; సర్వ పుణ్యములను ప్రసాదించండి అని ప్రార్ధన చేయటం జరుగుతుంది.

సంధ్యావందనము/గాయత్రీ ఉపాసన చేయునపుడు – “పవిత్రీ కరణము చేస్తూ, ఎడమ చేతులో నీటిని తీసుకొని, కుడి చేతితో మూసి , “ ఓం అపవిత్రహ పవిత్రోవా సర్వావస్తాం గతోపివా | యః స్మరేత్పుండరీకాక్షమ్ స బాహ్యభ్యంతర శ్శుచి హి …..” అని మంత్రోచ్చారణ చేసి, ఆ జలమును కుడి చేత్తో శిరస్సున చల్లుకోవాలి. ఈ మంత్ర మందలి ముఖ్య భావనేమిటంటే, అపవిత్రమైన ఈ నా మనస్సును, శరీరమును సర్వావస్థలందు, బాహ్యమున, అఃతరమున పవిత్రమైన ఈ జలము ద్వారా, పదే,పదే శుద్ధి కాబడుగాక అని. అదేవిధంగా, “ ఆచమనమ్ “ చేస్తూ, “ ఓం అమృతోపస్తరణమసి స్వాహః …..” అనే మంత్రాన్ని చదువుతూ, వాక్కు, మనస్సు, ఆంతఃకరణములు శుద్ధి కాబడుగాక” అని మంత్రపూత జలాన్ని మూడు సార్లు కొద్ది, కొద్దిగా తాగటం జరుగుతుంది. అదేవిధంగా, “ శిఖాబంధనము “ అను ప్రక్రియను చేస్తూ, శిఖపై, కుడి చేతి వ్రేళ్లను తడిచేసుకొని స్పృశిస్తూ, ఈ పవిత్రమైన జలము ద్వారా సునిశితమైన మేధాశక్తి, తేజస్సు నాలో ప్రవేశించుగాక అని ప్రార్ధన చేయటం జరుగుతుంది. అదేవిధంగా, “ అంగన్యాసము “ చేస్తూ, “ ఓం వాజ్మే ఆస్యెస్తూ ….” అనే మంత్రాన్ని చదువుతూ, శరీరములోని కుడి, ఎడమ వైపున్న అన్నీ అంగములను నీటితో స్పృశిస్తూ, ఈ మంత్రపూరిత జలము ద్వారా నా శరీరాంగములకు పవిత్రత కలిగి, చైతన్య శక్తిచే జాగృతం కాబడి, అట్టి శక్తిని పొందిన అన్నీ అవయవములు సంయమం కలిగివుండుగాక అని ప్రార్ధించటం జరుగుతుంది. ఆఖరుగా, “ సూర్యునికి అర్ఘ్యం “ ఇస్తూ, “ ఓం సూర్యదేవ సహస్రామ్సో తేజోరాసే జగత్ ఫతే …..” అనే మంత్రాన్ని పఠిస్తూ, నీటిని చేతితో వదులుతూ , ఏ మంత్రపూరిత, పవిత్రమైన జలము ద్వారా తనకు సంపూర్ణ వ్యక్తిత్త్వం లభించిందో అట్టి దానిని విశ్వ కుటుంబానికి సమర్పణ చేస్తున్నాను అని ప్రార్ధించటం జరుగుతుంది. ఇదేవిధంగా, ఏవైనా పూజలు చేసేటప్పుడుకూడా నీటిని పవిత్ర మాధ్యమంగా వాడుతూ, సత్ సంకల్పాన్ని ప్రేరేపించటం జరుగుతుంది.

ఇక భోజనం చేసేటప్పుడు:- “ అన్నం పరబ్రహ్మం “ అని వేదవాక్కు. అన్నం వలన జీవులు ఉత్త్పన్న మవుతారు. నీటికి, గాలికి ఎంత ప్రాముఖ్యతగలదో, అన్నానికికూడా అంత ప్రాముఖ్యత వున్నది. మన శరీరాన్ని, వేదాలు, ఐదు కోశములుగా విభజించాయి. అవి “ అన్నమయ కోశం ; ప్రాణమయ కోశం ; మనోమయ కోశం ; విజ్నానమయ కోశం ; మరియు ఆనందమయ కోశం “. అన్న రసం ద్వారా శరీరము ఏర్పడితే, తద్వారా ప్రాణములు ఏర్పడతాయి. అన్నరసం ద్వారా మానసిక శక్తి కలుగుతుంది; తద్వారా అనుభవంతో కూడిన జ్ణానమ్ లభిస్తుంది; అట్టి విజ్ణాము ద్వారా మనిషి ఆనందమయడుగా, సాధన ద్వారా, సమాధి స్థితిని పొందుతాడు. అంతటి మహత్తుగల అన్నాన్ని వేదములలో విస్తారంగా వర్ణించబడింది. అన్నం తయారుకావాలంటే, ధాన్యం పండాలి; ధాన్యం పండటానికి, భూమి, నీరు, గాలి, పరోక్షంగా అనేక సూక్ష్మజీవులు ( bacteria ) తోడ్పడతాయి. వీటన్నిటికి తోడు చైతన్య శక్తి మూలాధారంగా పనిచేస్తుంది. అందుకనే, ఆహారాన్ని భుజించేటప్పుడు, ఏయే జీవులు, శక్తులు ఆహారం తయారు కావటంలో దోహదపడ్డాయో, సహాయపడ్డాయో, అట్టివాటికి ముందుగా మనం కృతజ్నతలను మనసులో తెలుపుకోవాలి. ఆతరువాతనే భుజించాలి. క్రిందపడిన మెతుకులను తీసుకొని తినవద్దని చెబుతారు. కారణం వాటికి ధూళి ఆటవచ్చు. అయితే, అట్టి క్రిందపడిన మెతుకులను ఏరి, చీమలకు వేస్తే, చీమలకు ఆహారాన్ని పెట్టియనవారమ్ అవుతామ్. దీనివలన, మనలో భూత దయ కలుగుతుంది. చిన్న,చిన్న ప్రాణులనుకూడా ప్రేమించటం మనకు అలవడుతుంది.

ఉపసంహారం:- ప్రతి పరిశోధకుడు, శాస్త్రవేత్త తను ఎంచుయికున్న రంగంలో అన్వేషణలను చేస్తున్నప్పుడు, ( ఉకు:- భౌతిక, రసాయినిక, జీవ శాస్త్రాలు మొదలైనవి ) ఆయా శాస్త్ర పరిశోధనలు చాలా లోతుగా చేయబడినప్పుడు, పరిశోధనా విషయానికి అతీతమైన అనేక కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఇవి ఆధ్యాత్మిక విషయానికి, లేదా, విశ్వ చైతన్యశక్తి యొక్క విభూతులకు సంబంధించి అయివుంటాయి. అప్పటి మన ఋషులు చెప్పినవాటికి, ఇప్పటి ఆధునిక శాస్త్రజ్నులు చెబుతున్నవాటికి సమపోలికలు కనిపిస్తుంటాయి. డాక్టర్ ఎమోటో పరిశోధనలు నీరు, ఆహారంపై చేసినవి. శబ్ద తరంగాలు నీటిపై ఎటువంటి ప్రభావం చూపుటాయో అనేది భౌతిక, రసాయినిక శాస్త్రాలకు సంబంధించినవి. కానీ, మంచి/చెడు మాటలు, సరళమైన/మొరటైన సంగీతం, నృత్యం నీరు, ఆహారంపై ఎటువంటి ప్రభావం చూపుతాయి అని చెప్పేది భౌతిక/రసాయినిక శాస్త్రాలకు సంబంధించినది కాదు. ఇది ఆధ్యాత్మిక తత్త్వ శాస్త్రానికి సంబంధించినది. ఈ తత్త్వ రహస్యాలను మన ఋషులు వేదముల ద్వారా ఎన్నడో మన జాతికి అందించారు. ఏది ఏమయినప్పటికీ, ఎవరు చెప్పినప్పటికీ, ఆ విషయాలు అనుసరించదగ్గవే. స్వస్తి.

ఇంత మంచి విషయాన్ని శ్రీ పబ్బరాజు మాధవ రావు. గారు వ్రాసుకున్న " మీతో చెప్పాలనుకున్న" అనే బ్లాగునుండి సేకరించడం జరిగినది. వారికి మా ధన్యవాదములు.


BHAGAWADHGEETHA SLOKAS AND ITS MEANING


ఒం నమోనారాయణాయనమః
ఓం శ్రీకృష్ణపరమాత్మనేనమః
భగవద్గీత...18/68--78

య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వ భిదాస్యతి
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్య సంశయః

న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః
భవితా న చ మే తస్నాత్ అన్యః ప్రియతరో భువి

అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాద మవయోః
జ్ఞానయజ్ఞేన తేనాహమ్ ఇష్టః స్యామితి మే మతిః

శ్రద్ధావాన నసూయశ్చ శృణుయాదపి యో నరః
సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్
పుణ్యకర్మణామ్

కచ్చిదేతచ్చ్రుతం పార్ధ త్వయైకాగ్రేణ చేతసా
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ

అర్జున ఉవాచ:

నష్టో మోహః స్మృతిర్లబ్దా త్వత్ప్రసాదాన్మ
యాచ్యుత
స్ధితో స్మి గతసందేహః కరిష్యే వచనం తవ 

సంజయ ఉవాచ:

ఇత్యహం వాసుదేవస్య పార్ధస్య చ మహాత్మనః
సంవాదమిమమశ్రౌషమ్ అద్భుతం రోమహర్ష
ణమ్

వ్యాసప్రసాదాచ్చ్రుతవాన్ ఏతద్గుహ్యమహం
పరమ్
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్
కధయతః స్వయమ్

రాజన్ సంస్మృత్య సంస్మృత్య సవాదమ్ ఇమమద్భుతమ్
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః

తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతమ్ హరే
విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయో భూతిః ద్ర్హువా నీతిర్మతిర్మమ!

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతానూపనిషత్ బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునాసంవాదే మోక్షసన్న్యాసయోగోనామ అష్టాదశోధ్యాయః

ఓం శాంతిః శాంతిః శాంతిః

$$$$ 

నాయందు పరమభక్తి కలిగి ఈఅత్యంతగోప్యమైన
శాస్త్రమును నాభక్తులకు భోదించువాడు నన్నే చేరును. మనుష్యులలో అతనికన్న ప్రియముచేయువాడులేడు ఈలోకమున నుండబోడు. మా యీధర్మసంవాదము భక్తితో
పఠించువాడు నన్ను జ్ఞానయజ్ఞరూపముగా
పూజించినవాడగును. శ్రద్దావంతుడై అసూయారహితుడై వినువాడుకూడ ముక్తుడై
పుణ్యకర్మలొనర్చినవారేగులోకమునకేగును.

నీవు ఏకాగ్రచిత్తముతో వింటివా? నీఅజ్ఞాన మూడత్వము నశించినదా?

అర్జునుడు పలికెను:

అచ్యుతా నీకృపచేత నా మూడత నశించినది.
నా ఆత్మతత్త్వముయొక్క జ్ఞప్తి లభించినది. స్ధైర్యమలవడినది. సంశయములు తొలగినవి.

సంజయుడు పలికెను:

వాసుదేవునకును మహాత్ముడగు అర్జునకును
జరిగిన ఈ అద్భుత సంవాదమును రోమములు గగుర్పొడుచుచుండ నే వింటిని. నాకు దివ్య
చక్షువులిచ్చిన వ్యాసుని కృపవలన పరమ
గోప్యమగు ఈ యోగమును యోగేశ్వరుడగు
కృష్ణుడు వివరించుచుండగా ఆయనయొద్దనుండియే వింటిని. రాజా
కృష్ణార్జునులకు జరిగిన పుణ్యము అద్భుతము
అగు ఈ సవాదము ఎన్నిసార్లు జ్ఞప్తికి వచ్చునో
అన్నిసార్లు మరల మరల హర్షీంచుచున్నాను.
రాజా శ్రీకృష్ణుని అత్యద్భుతమగు ఆ విశ్వరూప
ము నాకెన్నిసార్లు జ్ఞప్తికివచ్చునో అన్నిసార్లు

అబ్బురపడుచు మరల మరల హర్షించు చున్నాను. 

యోగీశ్వరుడగు కృష్ణుడును ధనువుధరించిన
అర్జునుడును ఎచ్చటనుందురో అచ్చట సంపద
విజయము అభ్యుధయము స్ధిరముగా రాజనీతియు ఉండును. ఇది నా అభిప్రాయము.

శ్రీ మద్భగవద్గీత లో బహ్మవిద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదము
రూపమగు 18వ అధ్యాయము 'మోక్ష
సన్న్యాసయోగము' స మా ప్త ము.

ఓం శాంతిః శాంతిః శాంతిః

సర్వం ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు

గోవిందా గోవిందా గోవింద గోవిందా గోవిందా
ఓం నమోనారాయణాయనమః

SRI MAHA LAKSHMI - THE GODDESS OF WEALTH


DEEPAVALI FESTIVAL MAMOOLS PLEASE


GURUDEVOBHAVA - ARTICLE ABOUT RELATIONSHIP BETWEEN A STUDENT AND THE TEACHER


గురుదేవోభవ

"వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరుపాయ విష్ణవే 
నమోవై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమోనమః"

వేదమూర్తియైన వశిష్ఠుని వంశంలో జన్మించిన వేదవ్యాస మహామునే విష్ణువు. విష్ణువే వేదవ్యాస మహాముని. అట్టి మహనీయునికి నమస్కారం.


పరాశరులు సత్యవతిని వివాహమాడినపుడు శ్రీమహావిష్ణువు నీ కుమారునిగా నేను జన్మించగలనని తెల్పాడు. ఆ కారణంతో ఆయనే వ్యాసమహర్షియై జన్మించాడు. నాది సాధారణమైన మానవజన్మ కాదని నిర్ధారించుటకుగాను పుట్టిన వెంటనే ఏడు సంవత్సరాల బాలునివలె రూపొందాడు. నదీ మధ్యమున నల్లనివాడుగా జన్మించటం వలన ఈయనకు కృష్ణ ద్వైపాయనుడను పేరుకూడా ఉంది. వేదాలు ఆపౌరుషేయాలు. భగవద్ధతములు. వాటిని పరిష్కరించి ఋగ్యజుస్సామాధర్వణ వేదాలుగా లోకానికి అందించిన పరబ్రహ్మస్వరూపుడైన ప్రధమగురువు వేదవ్యాసమహర్షి.

ఆయన ఉపనిషత్తుల తత్వాన్ని,భారత, భాగవతాలను, భారతంలో ప్రధానంగా భగవద్గీతను, అష్టాదశపురాణాలను ఇంకా ఎన్నో తాత్విక శాస్త్ర గ్రంధాలను రచించి ప్రపంచానికి అందించి భారత దేశ తాత్వికత ప్రపంచ దేశాలలో మకుటాయమానమైనదని తలంపజేశారు.

లోకకళ్యాణానికై మహాత్ములు జన్మిస్తారు. సకల జనుల శ్రేయస్సుకై తమ మనుగడను సాగించి చరితార్ధులు అవుతారు. శ్రీ వ్యాస భగవానుడు దైవకార్యాన్ని నిర్వహించేదానికి గాను జన్మించిన దినమే ఆషాఢ పూర్ణిమ. దీనిని వ్యాస పూర్ణిమ అని, గురుపూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున దేశంలోని గురువులందరూ పూజింపబడుతారు. ఉత్తమ గురువులు త్యాగధనులు కావునా కాషాయ వస్త్రాలను ధరించి నిరాడంబర జీవన విధానాన్ని అనుసరిస్తారు.
" గు " శబ్దం అంధకారానికి పేరు. " ఋ " శబ్దం దాని వినాశనం చేయు ప్రకాశం. అనగా అజ్ఞానమనెడి చీకటిని పారద్రోలి స్వయంప్రకాశకమగు పరబ్రహ్మను తెలియజేయునది అని అర్ధం.

జననీ జనకులు శరీరమిచ్చి పోషించి, కాపాడిన వారు. వారిని జ్ఞప్తియందు వుంచుకొని కృతజ్ఞత భావంతో మెలుగుతూ వుంటాము. అదే విధంగా సోదరులు, స్నేహితులు, బంధువులు మానసిక, సాంఘిక బంధుత్వంగల వారు కావునా వారితో మర్యాద, మన్ననలతో నడుచు కున్తుంటాము వీరందరితోడి సంబంధము ఇలాంటిది కాదు.
వ్యక్తీ జీవించి వున్నంతవరకే. కాని గురువుతోడి సంభందము ఇలాంటి కాదు. అది ఆధ్యాత్మికమైనది అతడు తన శిష్యుని తరింపజేయునట్టి మహత్యమును ప్రసాదించినాడు. కాబట్టి అందరికంటే గురువు ఉత్తమమైనవాడుగా గుర్తింపబడ్డాడు.

గురువు లేకపోయినా జ్ఞానం కలగటం అసంభవం. భారత దేశంలో సుప్రసిద్ధమైన మహాత్ములందరికీ గురువులున్నారు. శ్రీరామునకు, శ్రీకృష్ణునికి గురువులున్నారు. అదేవిధంగా శ్రీ శంకరులు, శ్రీ రామకృష్ణులవారికి గురువులున్నారు. వారు సహజంగానే సద్గురువులు. కానీ వారు గురువులనే ఆశ్రయించే జ్ఞానాన్ని పొందారు. పూర్ణత్వము పొందినట్టివారికి గురువు అవసరంలేదు. కాని అట్టివారు ఎవరని చెప్పగలం?

నీవు చదివిన విద్య ఎట్టిదో తెలుపమని తండ్రియగు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ప్రశ్నించగా " చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ " అని అంటాడు. చదువులలో మర్మమేమంటే ఏమిటీ? అదే ఆత్మజ్ఞానం. " అహం బ్రహ్మాస్మి "తాను శరీరం కాదు " ఆత్మ " అనే జ్ఞానాన్ని పొందడం. నీవు ఇప్పుడు అహంకారాన్ని వదలి భగవంతుని శరణాగతి వేడితే నీలో వున్నా ఆత్మయే సద్గురు రూపంలో ప్రత్యక్షమవుతాడు.
గురుపూర్నిమనుండే చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది. సద్గురువులు వ్రతదీక్షబూని తమ శిష్యులకు మార్గదర్శకులవుతారు. గురుశిష్య సాంప్రదాయం చాల గొప్పది. ఒక గురువు వద్ద తయారైన సత్య నిష్ఠగల శిష్యుడు, మరికొంతమంది శిష్యులకు గురువై సద్గురు సాంప్రదాయాన్ని నెలకొల్పుతాడు.

నమోస్తు గురువే తస్మై! ఇష్టవేదా స్వరూపిణే
యస్యవాఖ్యామృతం హంతి విషసంసారి పజ్ఞ్కిలం


ఎవరి అమృతవాక్కుల వల్ల సంసారమనే విషంనుండి తరుణోపాయం లభిస్తుందో ,ఆ గురువునకు నమస్కారం. సడుగురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. ఆయన ప్రక్కన భగవంతుడే నిలుచుంటే ప్రథమ నమస్కారం సద్గువురుకే అని అంటాడు కబీర్దాస్.


HELP EACH OTHER - STORY IN TELUGU


GOOD BOY CHANDRAM


BRIEF DESCRIPTION ABOUT AJANTHA AND ELLORA CAVES