ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LIFE HAPPY QUOTES


ZEERA HEALTH TIPS FOR REDUCING WEIGHT / GASTRIC PROBLEM / ACEDITY ETC


అధికబరువు - గ్యాస్ ప్రాబ్లం - అసిడిటీ - ఫైల్స్ - అజీర్తితో బాధపడేవారికి చిట్కా 

1) రెండు గ్లాసుల నీటిలో 1 స్పూన్ జీలకర్ర వేసి , మరగించి , గోరువెచ్చగా ఉదయం బ్రష్ చేసాక పరగడుపున తీసుకోవాలి.

2) అదేవిధంగా రాత్రి భోజనం చేసాక , పడుకొనే సమయంలో ఒక గ్లాస్ గోరువెచ్చగా తీసుకోవాలి.

3) ఇలా ప్రతి రోజు క్రమం తప్పకుండా చేయడం వల్ల జీర్ణాశయం శుద్ది చెంది , అరుగుదల శక్తి పెరుగుతుంది. తద్వారా సమస్య తగ్గుముఖం పడుతుంది.

4) దీనితో పాటు సంతులిత ఆహరం తీసుకొంటూ , రోజులో కనీస కాలినడక వ్యాయామం చేసుకోవాలి.

LORD SRI KRISHNA


MARRIAGE PROPOSAL


NO MARRIAGE HAPPY LIFE


SIMRAN KAUR MUNDI




LOOKS LIKE VINAYAKA


BEAUTIFUL LATEST DESIGN WEDDING CAKE


BEAUTIFUL CATHERINE






ARUNDATHI - MODEL AND ACTRESS


ANDHRA HALF SAREES MODELS



THE IMPORTANCE OF WOMEN IN INDIA


మన సంప్రదాయంలో స్త్రీ విశిష్టత

స్త్రీని గౌరవించి, పూజించడమే మన సంప్రదాయం

ప్రపంచంలోని ప్రతి సంస్కృతిలోను మహిళల్ని అణచివేయడం గమనించవచ్చు. వారు సంఘ పరంగా అనేక వివక్షల్ని ఎదుర్కొంటారు. ఇక ఆధ్యాత్మికంగా స్త్రీలకు ఎన్నో విధి నిషేధాలు ఉన్నాయి. కాని, భారతదేశంలో, అందునా ఆర్య సంస్కృతిలో మాత్రం స్త్రీకి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. నిజమైన సంప్రదాయాన్ని పాటించే వారెవరూ స్త్రీని కించపరిచే విధంగా ప్రవర్తించలేరు. అదే భారతీయ సంస్కృతి విశిష్టత. ఆధ్యాత్మిక పరంగా చూసినా కూడా స్త్రీది విశిష్ట స్థానమే. మిగతా దేవుళ్ళు, దేవతలు ఎందరు ఉన్నా ఆదిపరాశక్తిదే అగ్రస్థానం. మొదటి పూజ కూడా ఆ జగన్మాతకే. కుటుంబంలో మరలా తల్లిదే అగ్రస్థానం. ముందుగా ఉన్నాడో లేడో తెలియని దేవుణ్ణి తలుచుకుని, మిగతా వారిని నిర్లక్ష్యం చేయమని ఆర్య జీవన విధానం నేర్పదు. కంటికి ఎదురుగా కనిపించే తల్లిదండ్రుల్నే ప్రత్యక్ష దైవాలుగా భావించమని చెబుతుంది వేదం. వారిలో తల్లికే మొదటి పూజ. 'మాతృ దేవోభవ' - ముందు తల్లికి నమస్కరించిన తరువాత తండ్రికి 'పితృ దేవోభవ'. యజ్ఞ యాగాదులలో, పూజలు, క్రతువులలో పాల్గొనడానికి వివాహితుడు కాని వారికి, భార్యా వియోగం అయిన వారికి అర్హత లేదు. భార్యతో కలిసి ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తేనే పూర్తి ఫలం దక్కుతుంది. అదీ స్త్రీకి ఉన్న ప్రాధాన్యత. 

ఇవన్నీ ఒక ఎత్తయితే, మనకు ఏ సంబంధం లేని పరాయి స్త్రీని కూడా మాతృ సమానురాలిగా, సోదర సమానురాలిగా చూడమని చెబుతుంది వేదం. పృధ్వీరాజ్‌ ఛౌహాన్‌, శివాజీ వంటి వీరులు కూడా తాము జయించిన రాజ్యంలోని పాలకుల భార్యలను సోదరి సమానంగా భావించి, సకల లాంఛనాలతో వారి రాజ్యాలకు సాగనంపారు. అదీ ఆర్య సంస్కృతి ఆచరణ అంటే..

యత్ర నార్యస్తు పూజ్యంతే
రమంతే తత్ర దేవతా||

''స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటారనేది'' ఆర్యోక్తి. మహిళకి భారతదేశంలో ఇచ్చిన ప్రాధాన్యత అలాంటిది. కలకంఠి కంట కన్నీరొలికిన ఇంట సిరి ఉండనొల్లదు అనే భావన కూడా మహిళకు ఆర్య సాంప్రదాయంలో ఉన్న విశిష్టతను తెలియజేస్తుంది. ప్రస్తుతం మనం జరుపుకుంటున్న దేవీ నవరాత్రులు కూడా మహిళా శక్తి గొప్పదనాన్ని, మహిమను చాటిచెబుతాయి. స్త్రీని శక్తి స్వరూపిణిగా, పరాశక్తిగా, సృష్టి స్థితి లయలకు కారకులైనవారికి కూడా తల్లిగా పురాణాలు కీర్తిస్తున్నాయి. విశ్వానికి అంతటికీ ఆధారభూతమైన, కారణమైన ఆ మహాశక్తి పురుష రూపంలో ఉండే అవకాశం లేదని రుషుల భావన. ఇంతటి మహావిశ్వాన్ని సృజించి, పెంచి, పోషించి, మరలా తనలోనే లయింపజేసుకొనే అన్ని శక్తుల మూల కారణం స్త్రీ స్వరూపమే. జగమంతటిలో ఉన్న ఇన్ని ప్రాణులకు అవసరమైనవన్నీ ఇచ్చి, చిన్న చీమ నుండి పెద్ద ఏనుగు వరకు ప్రతి పూటా అన్నిటికీ ఆశ్రయమిచ్చి, ప్రాణం నిలవడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసి, తన చల్లని ఒడిలో లాలించి, పాలించి, తల్లి ప్రేమను పంచే ఆ మహాశక్తి ముమ్మాటికీ అమ్మ మాత్రమే అయి ఉంటుంది. ఎందుకంటే అంతటి ప్రేమను పంచి, అనురాగాన్ని కురిపించగలగడం తల్లికి మాత్రమే సాధ్యం. తండ్రి కేవలం బాధ్యత వహిస్తాడు. కాని, తల్లి తన జీవితాన్ని అర్పిస్తుంది. అందుకే విజయదశమికి అమ్మవారిని భావన చేస్తాము.

స్త్రీని గౌరవించని, ఆమెకు ప్రాధాన్యమివ్వని ఏ నాగరికత అయినా, సమాజం అయినా మనుగడ సాగించలేదు. ఆమె సహకారం లేకుండా ఏ క్లిష్టమైన పనీ సాధ్యపడదు. ప్రతి ఇంటిలోను ఇంటిని చక్కబెట్టే ఇల్లాలిగా, పిల్లల్ని సంస్కారవంతులుగా, ఉన్నత సమాజ పౌరులుగా మార్చే గురుతరమైన బాధ్యత స్త్రీదే. ఏ ఇంటిలో స్త్రీ మానసిక, శారీరక వ్యధ అనుభవిస్తుందో ఆ కుటుంబం నుండి వచ్చే సంతానం నేరస్తులుగా మారే ప్రమాదం అంత ఎక్కువగా ఉందనేది సామాజిక నిపుణుల పరిశీలనలో తేలిన వాస్తవం. అది ముమ్మాటికీ నిజం కూడా. 

పత్రికల్లోను, తెర మీద కనబడే రంగుల వలయాల్లో బొమ్మల్ని చూసి, గోల చేస్తూ, అసభ్య వ్యాఖ్యలు చేస్తూ, నీచమైన ఆనందం పొందే నేటి తరానికి ఈ విలువల ప్రాధాన్యం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆడపిల్ల అంటే వ్యాపార వస్తువు కాదు, మగవారి కోర్కెలు తీర్చే బానిసా కాదు. బస్సుల్లో, రైళ్ళల్లో, రోడ్లమీద, కాలేజీల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ కంటికి కాస్త నదురుగా కనబడే ప్రతి ఆడపిల్లను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఉండేవారికి ఈ దేవీ నవరాత్రులలో స్త్రీశక్తి ప్రాధాన్యతను తెలపాలి. ఆడపిల్ల కనపడిందంటే చాలు, ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి, తామేదో గొప్ప వీరప్రేమికుల స్థాయిలో పోజలు కొట్టే వారికి, నిజమైన ప్రేమ రుచి చూడాలంటే అదే అమ్మాయిని మాతృ సమానంగా, సోదరి సమానంగా చూస్తే చాలు. అప్పుడే ఆమె నిజమైన ప్రేమను కురిపిస్తుంది. ఆడదంటే అబల కాదు, అవసరం వచ్చినపుడు ఆమే పరాశక్తిగా మారి దుష్ట సంహారం చేసి, లోక రక్షణ చేస్తుందనే సందేశాన్ని సకల లోకానికి తెలపడమే ఈ దేవీ నవరాత్రుల ముఖ్య ఉద్దేశం. ఈ సందేశం కేవలం భారతదేశానికే కాక, సకల ప్రపంచానికి కనువిప్పు కావాలని ఆశిద్దాం.


GODDESS ADHIPARASAKTHI PRAYER


కకారరూపా కళ్యాణీ కళ్యాణగుణశాలినీ |
కళ్యాణశైలనిలయా కమనీయా కళావతీ || ౧ ||
కమలాక్షీ కల్మషఘ్నీ కరుణామృతసాగరా |
కదంబకాననావాసా కదంబకుసుమప్రియా || ౨ ||
కందర్పవిద్యా కందర్పజనకాపాంగవీక్షణా |
కర్పూరవీటిసౌరభ్యకల్లోలితకకుప్తటా || ౩ ||
కలిదోషహరా కంజలోచనా కమ్రవిగ్రహా |
కర్మాదిసాక్షిణీ కారయిత్రీ కర్మఫలప్రదా || ౪ ||
ఏకారరూపా చైకాక్షర్యేకానేకాక్షరాకృతిః |
ఏతత్తదిత్యనిర్దేశ్యా చైకానందచిదాకృతిః || ౫ ||
ఏవమిత్యాగమాబోధ్యా చైకభక్తిమదర్చితా |
ఏకాగ్రచిత్తనిర్ధ్యాతా చైషణారహితాద్దృతా || ౬ ||
ఏలాసుగంధిచికురా చైనఃకూటవినాశినీ |
ఏకభోగా చైకరసా చైకైశ్వర్యప్రదాయినీ || ౭ ||

HINDU GODDESS ADHISAKTHI


GRAND MOTHER AND GRAND SON


DIWALI DHAMAKA


దీపావళి పండుగ అయిపోయింది..పటాసులూ ఖాళీ..ఇక ఇదొక్కటే మిగిలింది..డిష్యుం..డిష్యుం...!

SRI POTHULURI VEERABRAHMENDRASWAMY KALAGNANAM PART-3


పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాల జ్ఞానం - 3

వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన కొన్ని జోస్యాలు కొద్దిగా అస్పష్టంగా వుండటం వల్ల, వీటిని అనుసరించి ఖచ్చితంగా ఏ సంఘటనలు ఎక్కడ జరుగుతాయో ఊహించటం అంత సులభం కాదు.

ఉదాహరణకు - బ్రహ్మంగారు చెప్పినది - ''ఆకాశమున రెండు బంగారు హంసలు వచ్చి పురములందు, వనములందు, నదులయందు సంచరించెను. ప్రజలు వానిని పట్టుటకు పోయి కన్నులు గానక గిర గిర తిరిగి లక్షోపలక్షలుగా చచ్చేరు...'' వీటికి ఇక్కడ స్పష్టమైన అర్థం లేదు. పేర్లు, వివరాలు లేవు. బంగారు హంసలు అంటే అణుబాంబులు కావచ్చు. అణు బాంబులు పేలినప్పుడు విపరీతమైన మంటలు వస్తాయి. ఇవి పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ఎవరయినా మరణించటం ఖాయం.

అలా కాకుండా ఉల్కల గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. గతంలో ఆకాశం నుంచి భూమిమీద పడిన ఉల్కల వల్ల జీవజాతులు నశించిపోయాయి. ఉల్కలు భూ కక్ష్యలోకి ప్రవేశిస్తే ఆ రాపిడికి మంటలు రేగుతాయి. ఈ ఉల్కాపాతం జరిగినా పెను విద్వంసం తప్పదు. వీటిని కూడా బంగారు హంసలు అని అన్వయించుకునే అవకాశం వుంది.

అణుబాంబులు, ఉల్కలు కాకుండా యు.ఐ.ఓ.లు (అన్ ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్) కావచ్చు. ఇవి భవిష్యత్ లో భూమిమీదకు వస్తాయా? వీటివల్ల ప్రజలు మరణిస్తారా? పై ప్రశ్నలకు జవాబులు మనకు దొరకటం చాలా కష్టం.

వీరబ్రహ్మేంద్రస్వామి ''మన దేశానికి ఒక స్త్రీ ప్రధానమంత్రి అవుతుందని'' చెప్పిన విధంగానే, ప్రపంచ భవిష్యత్ గురించి చెప్పిన నోస్ట్రడామస్ కూడా ఆ విషయాన్ని చెప్పాడు.

నోస్ట్రడామస్ ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్. ఈయన క్రీ.శ. 1500లోనే చెప్పాడు అంటారు. గాంధీవంశంలో హత్యలు జరుగుతాయని, నోస్ట్రడామస్ తన 'క్వార్టైన్స్' లో చెప్పాడు. ఇవి ఫ్రెంచ్ భాషలో వుంటాయి.

''అయిదు నదుల సంగమ స్థానం నుంచి తలకు పాగాతో వున్న ఒక సాధూజీ భారతదేశానికి ప్రధాని అవుతాడని'' నోస్ట్రడామస్ వివరించాడు. బహుశా ఈయనే మన్మోహన్ సింగ్ అనుకోవచ్చు! ఈయన అధికారంలో వున్నప్పుడు సైనికపరంగా భారతదేశం ప్రపంచంలో బలమైన దేశంగా మారుతుందని ఆ జోశ్యంలో వుంది. అది ఒకరకంగా నిజమే కదా! అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలు ఆర్ధిక సంక్షోభంలో పుట్టాయి. ప్రస్తుతం మనదేశం పురోగామలోనే ఉంది.

ఇక్కడ నోస్ట్రడామస్ గురించి కొద్దిగా తెలుసుకోవటం అవసరం. తెలుగులో వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ విధంగా అయితే వందల సంవత్సరాల ముందు జరగబోయే విషయాలను దర్శించి చెప్పారో అలాగే నోస్ట్రడామస్ ఫ్రెంచ్ భాషలో చెప్పారు. నోస్ట్రడామస్ జీవితం చాలా ఆశ్చర్యకరంగా వుంటుంది. కాబట్టి అప్పట్లో వున్న మూఢ విశ్వాసాల ప్రాతిపదికగా ఆయన జోస్యం చెప్పాడనే ప్రశ్నకు జవాబు లేదు.

నోస్ట్రడామస్ 1503లో ఫ్రాన్స్ లో జన్మించారు. ఆయన తల్లితండ్రులు యూదులు, చిన్నప్పటి నుంచీ ఆయన వివిధ శాస్త్రాలను నేర్చుకున్నారు. తర్వాత వైద్యంలో గ్రాడ్యుయేషన్ పొందారు. తన జీవిత దశలో అంటే 1564లో కింగ్ ఛార్లెస్ - 9 కు రాజ వైద్యునిగా నియమితులయ్యారు. దీన్ని బట్టే ఆయన ఎంత మేధావో అర్థం చేసుకోవచ్చు.

నోస్ట్రడామస్ జీవిత చివరిదశలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. నోస్ట్రడామస్ అప్పుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 1566జూలై ఒకటవ తేదీన, నోస్ట్రడామస్ చివరి జోశ్యాన్ని తన వద్దకు వచ్చిన మత గురువుకు వివరించారు. ఆ గురువు వెళ్ళిపోతూ 'మనం రేపు కలుసుకుందాం' అన్నాడు.

దానికి జవాబుగా నోస్ట్రడామస్ 'రేపు సూర్యోదయానికి నన్ను ప్రాణాలతో చూడలేరు' అని పలికాడు. ఆరోజు రాత్రే నోస్ట్రడామస్ మరణించారు.

నోస్ట్రడామస్ చెప్పినవి కూడా బ్రహ్మంగారు చెప్పిన విధంగానే కొద్దిగా అస్పష్టంగా, విశేషణాలతో, వర్ణనలతో కూడి వుంటాయి. ఖచ్చితత్వం తక్కువ. సంవత్సరాలు, దేశాల పేర్లు ఎక్కువగా వుండవు. నాలుగు వాక్యాలతో ఫ్రెంచ్ భాషలో వున్న వీటినే 'క్వార్ట్టైన్స్' అంటారు.

నోస్ట్రడామస్ చెప్పినది - '45డిగ్రీల కోణంలో ఆకాశంలో మంటలు చెలరేగుతాయి కొత్త నగరం వైపు ఆ మంటలు ప్రయాణం చేస్తాయి' ఇక్కడ నగరం పేరు లేదు. అది ఏ దేశంలో వుంటుందో, మంటలు ఎలా పుడతాయో చెప్పలేదు. ఎంతకాలం అవి విధ్వంసాన్ని సృష్టిస్తాయో కూడా లేదు. దీనివల్ల ఈ జ్యోతిష్యాన్ని ఎవరికి వారు తమ విజ్ఞానాన్ని బట్టి అన్వయించుకున్నారు.

డామ 'కొత్తనగరం' అంటే న్యూయార్క్ అని పశ్చిమ దేశీయులు భావిస్తున్నారు. ఇది మూడో ప్రపంచ యుద్ధ సమయంలో సంఘటన అని కొందరి అంచనా.

STUNNING POONAM KAUR IN SIZZLING BLACK SAREE


BEAUTIFUL HD PIC OF GODDESS SRI MAHALAKSHMI


LORD SRI KRISHNA PAINTING


FESTIVAL READY MADE RANGOLI


TEENAGE BEAUTY PENCIL SKETCH


GODDESS SRI SARASWATHI MATHA ASTAKAM IN TELUGU





GODDESS SRI SARASWATHI MATHA PRAYERS IN TELUGU




STOP THERE


OPERATION NO


HOT BEAUTY


LORD SRI SAI BABA PUJA PHOTOS COLLECTION







BHAKTHI TIPS


GODDESS SRI ADHIPARASAKTHI


GODDESS SRI KANAKADURGA AVATHAR


YOU ARE WORTHY OF LOVE AND RESPECT


GODS PRAYER