The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
IMPORTANCE OF OSIRI TREE ROUNDS IN KARTHIKAMASAM
కార్తీకమాసంలో ఉసిరిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తే..?
ఉసిరిచెట్టుకు ప్రదక్షిణలు చేసి దాని కింద భోజనాలు చేయడం ద్వారా ఆశించిన ఫలాలు చేకూరుతాయి. ఈతిబాధలు దూరమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అయితే కార్తీక మాసమంతా ఉల్లి, వెల్లుల్లి, ఇంగువ, చద్దన్నం, గుమ్మడికాయ, వంకాయ, ముల్లంగి, నువ్వులు, మాంసాన్ని తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటే.. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం కలిగించే పవిత్రమైన మాసంగా కార్తీకమాసం కనిపిస్తుంది. ఈ మాసంలో పాటించే నియమాలే భగవంతుడి అనుగ్రహం దక్కేలా చేస్తూవుంటాయి. ఈ మాసంలో సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి నదీ స్నానం చేయాలి .. లేదంటే చన్నీటి స్నానం చేయాలి. అంతేగానీ వేడినీటి స్నానం చేయకూడదు.
అలాగే తలకి నూనె పట్టించకూడదనే విషయాన్ని ఈ మాసంలో మరచిపోకూడదు. ఈ మాసమంతా తులసీ దళాలతో శ్రీమహా విష్ణువును, బిల్వ దళాలతో పరమశివుడిని ఆరాధించాలి.
ప్రతిరోజు పూజా మందిరంలోను ... తులసికోట దగ్గర ... ఆలయంలోను దీపాలు వెలిగించాలి. సాయంత్రం వేళలో శివాలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకోవాలి. పగలంతా ఉపవాసం ఉంటూ సాయంత్రం వేళలో శివ కేశవులను పూజించి .. వారికి నైవేద్యంగా సమర్పించిన దానినే ప్రసాదంగా స్వీకరించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
FOR SPARKLING AND CLEAN DENTAL CARE - FOLLOW TELUGU TIPS
పళ్లు… మిళమిళమెరవాలంటే..
ఆరోగ్యం, ప్రోగ్రామ్స్
మనకు దృఢమైన పళ్లు చాలా అవసరం. ఆహారాన్ని బాగా నమిలి తినవచ్చు. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తిన్న ఆహారం వంటికి పట్టే అవకాశాలున్నాయి. పంటి సమస్యలు మనకు మానసికంగా,శారీరకంగా, సామాజికంగా ప్రభావం చూపుతాయి. పళ్లను నిర్లక్ష్యం చేయడం వల్ల పంటి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. అందువల్ల చెడుశ్వాస దరిచేరుతుంది. చివరికి నవ్వడానికి కూడా ఇబ్బంది ఎదురవుతుంది.
దంతాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల చిగుళ్ల నొప్పి, వాపు రావు. చిగుళ్ల నుంచి రక్తం కారదు. పళ్లు వదులుకాకుండా ధృఢంగా ఉంటాయి.
పంటి సమస్యల నుంచి గట్టెక్కడానికి…
- ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్తో మీ పళ్లను రోజుకు రెండుసార్లు శుభ్రపర చుకోవాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు ఇలా చేయాలి.
- రోజులో అప్పుడప్పుడు నోటిని నీళ్లతో పుక్కిలించాలి.
- పొగాకు పీల్చడం, నమలడం చేయకూడదు.
-మనం తీసుకుంటున్న మందుల్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే లక్షణాలున్నాయా అని డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. పళ్లను దెబ్బతీసే మందులు వాడకూడదు. ఉదాహరణకు కొన్ని మందులు పరగడపున వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
- పళ్లను ప్రతీరోజు అద్దంలో చూస్తూ చెక్ చేసుకోవాలి.
-డెంటిస్ట్ ను తరచూ సంప్రదిస్తూ ఉండాలి.
-తాగే, తినే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలి. తీపిపదార్థాలు ఎక్కువసేపు నోట్లో ఉంటే పంటి సమస్యలు వస్తాయి.
-ఆకుకూరలు, కాయగూరలు తినడం వల్ల పంటి సమస్యల అధిగమించొచ్చు.
దంతాల ఆరోగ్యం కోసం…
- చెక్కెర అధిక సాంద్రతలో ఉండే ఐస్ క్రీం, హల్వా, గులాబ్జామున్, బర్ఫి తదితర స్వీట్లకు దూరంగా ఉండాలి.
- చెక్కెర తక్కువ మోతాదులో ఉన్న పౌష్టికాహారం తీసుకోవాలి. పాలు, అన్నం, మాంసం, పండ్లు, చేపలు ఉండాలి.
- రిఫ్రెషింగ్ డ్రింక్స్ లో చెక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని అసలు ముట్టకుండా ఉంటే మంచిది.
- స్వీట్లు తిన్న తర్వాత భోజనం చేయడం అన్ని విధాల మంచిది. స్వీట్లు తినడం వల్ల లాలాజలం ఉత్తత్తి ఎక్కువవుతుంది.
ఏ ఆహారం ఎంత మోతాదు తీసుకోవాలి…
-జిగటగా ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు. ఎందుకంటే అది పళ్ల మధ్య ఇరుక్కుని బ్యాక్టీరియాను వృద్ది చేస్తుంది.
-తక్కువ చెక్కెర శాతం ఉన్న ఆహార పదార్థాలు, తక్కువ కొవ్వు ఉన్న కాయగూరలు, తాజా పండ్లు, చిరుధాన్యాలతో తయారయ్యే బ్రెడ్ తీసుకోవడం మంచిది.
-చాలావరకు దంతసమస్యలను సులువుగా నివారిం చవచ్చు. పళ్లకు ఆరోగ్యాన్నిచ్చే ఆహారపదార్థాలను భుజించాలి. తరచుగా చెకప్ చేయించుకోవాలి.
కొన్ని సాధారణ దంతసమస్యలు
దుర్వాసన
చాలామందికి నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఒక్కోసారి ఈ సమస్య శాశ్వతంగా ఉండిపోతుంది. కాబట్టి దుర్వాసన వచ్చిన వెంటనే డెంటిస్ట్ను సంప్రదించాలి. నోట్లో బ్యాక్టీరియా ఉండటం వల్ల ఈ వాసన వస్తుంది. నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల చిగుళ్ల వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. పళ్లలో చిక్కుకున్న ఆహార పదార్థాలను ఎప్పటికప్పడు తొలగించాలంటే రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి. అలాగే టంగ్ క్లీనర్ ద్వారా నాలుకను శుభ్రం చేయాలి.
కట్టుడు పళ్లయితే రాత్రిపూట తీసివేసి పడుకోవాలి. మరుసటి రోజు వాటిని బ్రష్ ద్వారా శుభ్రపరిచి పెట్టుకోవాలి.
పళ్లు పాడవడమూ చాలాసాధారణ సమస్య. ఈ సమస్య వున్న వారికి బ్యాక్టీరియా సర్వసాధారణంగా నోట్లో ఉంటుంది.లాలాజలంలో ఈ బ్యాక్టీరియా చేరుకుని పంటిని పాడుచేస్తుంది. ఈ బ్యాక్టీరియా చెక్కెర ఉన్న ఆహార పదార్థాలను తింటుంది.ఇవి ఆవ్లూలను ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల పంటి పై పొర మీద ఉన్న ఎనామిల్ పాడవుతుంది.
చిగుళ్ల వ్యాధి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. తద్వారా పంటి చిగురు వ్యాధికి గురవుతుంది. పంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి అన్ని విధాలా జాగరూకతతో వ్యవహరిస్తే చిగుళ్ల వ్యాధి వచ్చే అవకాశముండదు.
ఆరోగ్యం, ప్రోగ్రామ్స్
మనకు దృఢమైన పళ్లు చాలా అవసరం. ఆహారాన్ని బాగా నమిలి తినవచ్చు. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తిన్న ఆహారం వంటికి పట్టే అవకాశాలున్నాయి. పంటి సమస్యలు మనకు మానసికంగా,శారీరకంగా, సామాజికంగా ప్రభావం చూపుతాయి. పళ్లను నిర్లక్ష్యం చేయడం వల్ల పంటి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. అందువల్ల చెడుశ్వాస దరిచేరుతుంది. చివరికి నవ్వడానికి కూడా ఇబ్బంది ఎదురవుతుంది.
దంతాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల చిగుళ్ల నొప్పి, వాపు రావు. చిగుళ్ల నుంచి రక్తం కారదు. పళ్లు వదులుకాకుండా ధృఢంగా ఉంటాయి.
పంటి సమస్యల నుంచి గట్టెక్కడానికి…
- ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్తో మీ పళ్లను రోజుకు రెండుసార్లు శుభ్రపర చుకోవాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు ఇలా చేయాలి.
- రోజులో అప్పుడప్పుడు నోటిని నీళ్లతో పుక్కిలించాలి.
- పొగాకు పీల్చడం, నమలడం చేయకూడదు.
-మనం తీసుకుంటున్న మందుల్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే లక్షణాలున్నాయా అని డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. పళ్లను దెబ్బతీసే మందులు వాడకూడదు. ఉదాహరణకు కొన్ని మందులు పరగడపున వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
- పళ్లను ప్రతీరోజు అద్దంలో చూస్తూ చెక్ చేసుకోవాలి.
-డెంటిస్ట్ ను తరచూ సంప్రదిస్తూ ఉండాలి.
-తాగే, తినే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలి. తీపిపదార్థాలు ఎక్కువసేపు నోట్లో ఉంటే పంటి సమస్యలు వస్తాయి.
-ఆకుకూరలు, కాయగూరలు తినడం వల్ల పంటి సమస్యల అధిగమించొచ్చు.
దంతాల ఆరోగ్యం కోసం…
- చెక్కెర అధిక సాంద్రతలో ఉండే ఐస్ క్రీం, హల్వా, గులాబ్జామున్, బర్ఫి తదితర స్వీట్లకు దూరంగా ఉండాలి.
- చెక్కెర తక్కువ మోతాదులో ఉన్న పౌష్టికాహారం తీసుకోవాలి. పాలు, అన్నం, మాంసం, పండ్లు, చేపలు ఉండాలి.
- రిఫ్రెషింగ్ డ్రింక్స్ లో చెక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని అసలు ముట్టకుండా ఉంటే మంచిది.
- స్వీట్లు తిన్న తర్వాత భోజనం చేయడం అన్ని విధాల మంచిది. స్వీట్లు తినడం వల్ల లాలాజలం ఉత్తత్తి ఎక్కువవుతుంది.
ఏ ఆహారం ఎంత మోతాదు తీసుకోవాలి…
-జిగటగా ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు. ఎందుకంటే అది పళ్ల మధ్య ఇరుక్కుని బ్యాక్టీరియాను వృద్ది చేస్తుంది.
-తక్కువ చెక్కెర శాతం ఉన్న ఆహార పదార్థాలు, తక్కువ కొవ్వు ఉన్న కాయగూరలు, తాజా పండ్లు, చిరుధాన్యాలతో తయారయ్యే బ్రెడ్ తీసుకోవడం మంచిది.
-చాలావరకు దంతసమస్యలను సులువుగా నివారిం చవచ్చు. పళ్లకు ఆరోగ్యాన్నిచ్చే ఆహారపదార్థాలను భుజించాలి. తరచుగా చెకప్ చేయించుకోవాలి.
కొన్ని సాధారణ దంతసమస్యలు
దుర్వాసన
చాలామందికి నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఒక్కోసారి ఈ సమస్య శాశ్వతంగా ఉండిపోతుంది. కాబట్టి దుర్వాసన వచ్చిన వెంటనే డెంటిస్ట్ను సంప్రదించాలి. నోట్లో బ్యాక్టీరియా ఉండటం వల్ల ఈ వాసన వస్తుంది. నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల చిగుళ్ల వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. పళ్లలో చిక్కుకున్న ఆహార పదార్థాలను ఎప్పటికప్పడు తొలగించాలంటే రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి. అలాగే టంగ్ క్లీనర్ ద్వారా నాలుకను శుభ్రం చేయాలి.
కట్టుడు పళ్లయితే రాత్రిపూట తీసివేసి పడుకోవాలి. మరుసటి రోజు వాటిని బ్రష్ ద్వారా శుభ్రపరిచి పెట్టుకోవాలి.
పళ్లు పాడవడమూ చాలాసాధారణ సమస్య. ఈ సమస్య వున్న వారికి బ్యాక్టీరియా సర్వసాధారణంగా నోట్లో ఉంటుంది.లాలాజలంలో ఈ బ్యాక్టీరియా చేరుకుని పంటిని పాడుచేస్తుంది. ఈ బ్యాక్టీరియా చెక్కెర ఉన్న ఆహార పదార్థాలను తింటుంది.ఇవి ఆవ్లూలను ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల పంటి పై పొర మీద ఉన్న ఎనామిల్ పాడవుతుంది.
చిగుళ్ల వ్యాధి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. తద్వారా పంటి చిగురు వ్యాధికి గురవుతుంది. పంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి అన్ని విధాలా జాగరూకతతో వ్యవహరిస్తే చిగుళ్ల వ్యాధి వచ్చే అవకాశముండదు.
DIGESTION HEALTH TIPS WITH JEERA - SOMPU - PATIKA BELLAM
జీర్ణశక్తిని పెంచే సోంపు -జీరా -పటికబెల్లం మిశ్రమం తయారీ విధానం.
కావలసినవి
25 గ్రాములు సోంపు గింజలు
25 గ్రాముల జీలకర్ర
25 గ్రాముల పటికబెల్లం (మిశ్రి)
తయారీ విధానం
ముందుగా , జీలకర్ర , సోంపు గింజలు ఒక గిన్నెలో నూనె వెయ్యకుండా దోరగా వేయించుకోవాలి.తర్వాత ఈ రెండింటిని కలిపి పౌడర్ చేసుకోవాలి .పటికబెల్లం కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మూడింటిని భాగా కలిపి ఒక సీసా లో నిల్వ చేసుకోవాలి.
ఉపయోగించే విధానం
మద్యాహ్నం , రాత్రి బోజనం తిన్న వెంటనే ఒకటి నుండి రెండు స్పూన్ల పౌడర్ చప్పరించాలి.ఈ పౌడర్ జీర్ణ శక్తి ని పెంచుతుంది.
కావలసినవి
25 గ్రాములు సోంపు గింజలు
25 గ్రాముల జీలకర్ర
25 గ్రాముల పటికబెల్లం (మిశ్రి)
తయారీ విధానం
ముందుగా , జీలకర్ర , సోంపు గింజలు ఒక గిన్నెలో నూనె వెయ్యకుండా దోరగా వేయించుకోవాలి.తర్వాత ఈ రెండింటిని కలిపి పౌడర్ చేసుకోవాలి .పటికబెల్లం కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మూడింటిని భాగా కలిపి ఒక సీసా లో నిల్వ చేసుకోవాలి.
ఉపయోగించే విధానం
మద్యాహ్నం , రాత్రి బోజనం తిన్న వెంటనే ఒకటి నుండి రెండు స్పూన్ల పౌడర్ చప్పరించాలి.ఈ పౌడర్ జీర్ణ శక్తి ని పెంచుతుంది.
SRI RAMA JAYA RAMA JAYA JAYA RAMA
ఓం నమో భగవతే ఆంజనేయాయా మహా
బలాయస్వాహాః
శ్రీ హనుమత్ప్రసాద సిద్ద్యర్ధే
ఉల్లంఘ్య సింధోస్సలిలం సలీలం యశ్శోకవహ్నిం జనకాత్మజాయాః
ఆధాయతేనై వ దదాహలంకాం నమామితం ప్రాంజలి రాంజనేయమ్
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్దిమతాంవరిష్టం
వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామ ధూతం శిరసా నమామి
ఉద్యదాదిత్య సంసకాశముదార భుజవిక్రమం
కందర్ప కోటిలావణ్యం సర్వవిద్యా విశారదమ్
శ్రీరామహృదయానంద భక్తకల్ప మహీరుహం
అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతా త్మజమ్.
శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే
సహస్రనామతస్తుల్యం రామనామవరాననే!
శ్రీరామ జయ రామ జై జై రామ రామ
బలాయస్వాహాః
శ్రీ హనుమత్ప్రసాద సిద్ద్యర్ధే
ఉల్లంఘ్య సింధోస్సలిలం సలీలం యశ్శోకవహ్నిం జనకాత్మజాయాః
ఆధాయతేనై వ దదాహలంకాం నమామితం ప్రాంజలి రాంజనేయమ్
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్దిమతాంవరిష్టం
వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామ ధూతం శిరసా నమామి
ఉద్యదాదిత్య సంసకాశముదార భుజవిక్రమం
కందర్ప కోటిలావణ్యం సర్వవిద్యా విశారదమ్
శ్రీరామహృదయానంద భక్తకల్ప మహీరుహం
అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతా త్మజమ్.
శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే
సహస్రనామతస్తుల్యం రామనామవరాననే!
శ్రీరామ జయ రామ జై జై రామ రామ
SRIKALAHASTHESWARA SATAKAM POEMS AND ITS MEANING IN TELUGU
సత్యం..శివం...సుందరం..
నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవంబబ్బనీ
జనమాత్రుండననీ మహాత్ముడననీ సంసార మోహంబు పై
కొననీ జ్ఞానముగల్గనీ గ్రహగతుల్ కుందింపనీ,మేలు వ
చ్చిన రానీ యవి నాకు భూషణములే .. శ్రీకాళహస్తీశ్వరా!
.
(శ్రీకాళహస్తీశ్వర శతకము)
.
శ్రీకాళహస్తీశ్వరా!నీకు సేవలు చేయు సందర్భములో నాకు ఆపదలు వచ్చిన రానిమ్ము
లేక మేలు జరిగి అన్ని వేళాలయందు నీకు వేడుకలు జరుగనిమ్ము
.సామాన్య మానవుడని అందరూ అననిమ్ము.లేక నన్నుమహాత్ముడనిప్రశంసించని మ్ము,
సంసార సముద్రములో మోహాదులు కలిగితే కలుగనీ,జ్ఞానము లభ్యముకానీ
,గ్రహగతులు అనుకూలించక పోతేపోనీ,మేలే జరిగితే జరుగనీ,
అవీఅన్నీ నాకు ఆభరణముల వంటివే అగును.
నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవంబబ్బనీ
జనమాత్రుండననీ మహాత్ముడననీ సంసార మోహంబు పై
కొననీ జ్ఞానముగల్గనీ గ్రహగతుల్ కుందింపనీ,మేలు వ
చ్చిన రానీ యవి నాకు భూషణములే .. శ్రీకాళహస్తీశ్వరా!
.
(శ్రీకాళహస్తీశ్వర శతకము)
.
శ్రీకాళహస్తీశ్వరా!నీకు సేవలు చేయు సందర్భములో నాకు ఆపదలు వచ్చిన రానిమ్ము
లేక మేలు జరిగి అన్ని వేళాలయందు నీకు వేడుకలు జరుగనిమ్ము
.సామాన్య మానవుడని అందరూ అననిమ్ము.లేక నన్నుమహాత్ముడనిప్రశంసించని
సంసార సముద్రములో మోహాదులు కలిగితే కలుగనీ,జ్ఞానము లభ్యముకానీ
,గ్రహగతులు అనుకూలించక పోతేపోనీ,మేలే జరిగితే జరుగనీ,
అవీఅన్నీ నాకు ఆభరణముల వంటివే అగును.
SUMATHI SATAKAM POEM AND ITS MEANING
సరసము విరసము కొఱకే
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే
పెరుగుట విరుగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చుట కొఱకె తథ్యము సుమతీ!
.
(సుమతీ శతకం)
.
భావం : మనసుకు ఆనందం కలిగించేలా మాట్లాడటం, చేష్టలు చేయటం... ఇవన్నీ దుఃఖం కలగటానికే. పరిపూర్ణ సుఖం కలగటం అంటే ఎక్కువ కష్టాలు అనుభవించటానికే. వృద్ధి చెందటం అంటే క్షీణించటం కోసమే. ఒక వస్తువు ధర తక్కువ కావటం అంటే పెరగటం కోసమే. ఇది వాస్తవం.
ప్రతిపదార్థం : సరసము అంటే ఆనందం కలిగించేలా మాట్లాడటం, పనులు చేయటం; విరసము కొరకే అంటే బాధలు కలగటం కోసమే; పరిపూర్ణ అంటే పూర్తిస్థాయిలో; సుఖంబులు అంటే సౌఖ్యాలు; అధిక అంటే ఎక్కువ కావటం, బాధల కొరకే అంటే కష్టాల కోసమే; పెరుగుట అంటే వృద్ధిచెందటం; విరుగుట కొరకే అంటే నశించిపోవటానికే; ధర అంటే వెల; తగ్గుట అంటే తగ్గటం; హెచ్చుట కొరకే అంటే అధికం కావటం కోసమే; తథ్యము అంటే వాస్తవం.
జీవితంలో కష్టసుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. కష్టాలకు కుంగిపోవడం, సుఖాలకు పొంగిపోవడం మంచిది కాదని పెద్దలు చెబుతారు. అధిక ధనం వచ్చింది కదా అని గర్వంతో విర్రవీగకూడదు. అది కొన్నిరోజుల తరవాత మన దగ్గర నుంచి వెళ్లిపోవచ్చు. అలాగే ఇబ్బందులలో ఉన్నామని కుంగిపోకూడదు. ఆ ఇబ్బందులు కూడా ఎన్నో రోజులు ఉండవు. కొన్నాళ్ల తరవాత సుఖాలు వరిస్తాయి. అందుకే ‘పెరుగుట తరుగుట కొరకే’ అనేది నిత్య జీవితంలో వాడుకలోకి వచ్చింది. ఇందుకు చంద్రుడు చక్కని ఉదాహరణ - పదిహేను రోజులకుఒకసారి పౌర్ణమి వస్తే, మరో పదిహేను రోజులకు అమావాస్య వస్తుంది. అదే జీవితం. సుఖదుఃఖాలు రెండింటినీ సమదృష్టితో చూస్తూ స్థితప్రజ్ఞత చూపాలని కవి ఈ పద్యంలో వివరించాడు.
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే
పెరుగుట విరుగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చుట కొఱకె తథ్యము సుమతీ!
.
(సుమతీ శతకం)
.
భావం : మనసుకు ఆనందం కలిగించేలా మాట్లాడటం, చేష్టలు చేయటం... ఇవన్నీ దుఃఖం కలగటానికే. పరిపూర్ణ సుఖం కలగటం అంటే ఎక్కువ కష్టాలు అనుభవించటానికే. వృద్ధి చెందటం అంటే క్షీణించటం కోసమే. ఒక వస్తువు ధర తక్కువ కావటం అంటే పెరగటం కోసమే. ఇది వాస్తవం.
ప్రతిపదార్థం : సరసము అంటే ఆనందం కలిగించేలా మాట్లాడటం, పనులు చేయటం; విరసము కొరకే అంటే బాధలు కలగటం కోసమే; పరిపూర్ణ అంటే పూర్తిస్థాయిలో; సుఖంబులు అంటే సౌఖ్యాలు; అధిక అంటే ఎక్కువ కావటం, బాధల కొరకే అంటే కష్టాల కోసమే; పెరుగుట అంటే వృద్ధిచెందటం; విరుగుట కొరకే అంటే నశించిపోవటానికే; ధర అంటే వెల; తగ్గుట అంటే తగ్గటం; హెచ్చుట కొరకే అంటే అధికం కావటం కోసమే; తథ్యము అంటే వాస్తవం.
జీవితంలో కష్టసుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. కష్టాలకు కుంగిపోవడం, సుఖాలకు పొంగిపోవడం మంచిది కాదని పెద్దలు చెబుతారు. అధిక ధనం వచ్చింది కదా అని గర్వంతో విర్రవీగకూడదు. అది కొన్నిరోజుల తరవాత మన దగ్గర నుంచి వెళ్లిపోవచ్చు. అలాగే ఇబ్బందులలో ఉన్నామని కుంగిపోకూడదు. ఆ ఇబ్బందులు కూడా ఎన్నో రోజులు ఉండవు. కొన్నాళ్ల తరవాత సుఖాలు వరిస్తాయి. అందుకే ‘పెరుగుట తరుగుట కొరకే’ అనేది నిత్య జీవితంలో వాడుకలోకి వచ్చింది. ఇందుకు చంద్రుడు చక్కని ఉదాహరణ - పదిహేను రోజులకుఒకసారి పౌర్ణమి వస్తే, మరో పదిహేను రోజులకు అమావాస్య వస్తుంది. అదే జీవితం. సుఖదుఃఖాలు రెండింటినీ సమదృష్టితో చూస్తూ స్థితప్రజ్ఞత చూపాలని కవి ఈ పద్యంలో వివరించాడు.
Subscribe to:
Posts (Atom)