
The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
MONDAY PRAYER IN TELUGU
సోమవారం శివదర్శనం సర్వ పాప హరణం ...
ఓం సౌరాష్ర్టే సోమ నాథం చ శ్రీ శైలే మల్లిఖార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళ మోంకార మమరేశ్వరమ్
ప్రజ్జ్వల్యాం వైద్యనాధం చ ఢాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే
వారాణస్యాంతు విశ్వేశం త్య్రంబకం గౌతీమీ తటే
హిమాలయేతు కేదారం ఘృశ్మేశంచ విశాలకే
ఏతాని జ్యోతిర్లింగాని సాయంప్రాతః పఠేన్నర
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి..
ఓం సౌరాష్ర్టే సోమ నాథం చ శ్రీ శైలే మల్లిఖార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళ మోంకార మమరేశ్వరమ్
ప్రజ్జ్వల్యాం వైద్యనాధం చ ఢాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే
వారాణస్యాంతు విశ్వేశం త్య్రంబకం గౌతీమీ తటే
హిమాలయేతు కేదారం ఘృశ్మేశంచ విశాలకే
ఏతాని జ్యోతిర్లింగాని సాయంప్రాతః పఠేన్నర
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి..
NAVAGRAHALU - NINE PLANETS - NAMES OF NAVAGRAHALU - NAMES AND PUJA OF NAVAGRAHALU
నవగ్రహాలు
ఆదిత్యుడు :
కశ్యపుని కుమారుడు సూర్యుడు. భార్య అదితి. అందుకేఆదిత్యుడు అని పిలుస్తాము. సప్త అశ్వాలతో ఉన్న రధం అతనివాహనం. ఆ సప్త అశ్వాలు ఏడు చక్రాలకు ( మూలాధారం,స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆగ్య్హ్నా చక్రం ,సహస్రారం )
వివాహ పరిబంధన దోషం, పుత్ర దోషం, పుత్ర పరిబంధన దోషం,విద్యా పరిబంధన దోషం, ఉద్యోగ పరిబంధన దోషం, సూర్యదోషం మొదలైన దోషాలతో బాధ పడే వారు సూర్యునిపూజించటం వలన ఫలితం పొందుతారు.
సింహరాశి కి అధిష్టాన దేవుడు సూర్యుడు. నవగ్రహాలలో మద్య స్థానం ఆదిత్యుడిది.అధిదేవత అగ్ని, ప్రత్యధి దేవత రుద్రుడు. ఆదిత్యుడు ఎరుపు వర్ణం లో ఉంటాడు.
ఇష్టమైన ధాన్యం : గోధుమలు
పుష్పం : తామర
వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం
జాతి రాయి : కెంపు
నైవేద్యం : గోధుమలు, రవ చక్కర పొంగలి
చంద్రుడు :
చాల అందమైన వాడిగా మనం వర్ణిస్తూ ఉంటాం. వర్ణనలకుకంటే మిన్నగా చంద్రుడు చాల అందమైన వాడు. పది తెల్లటిగుర్రాలతో ఉన్న రధాన్ని అధిరోహిస్తాడు. నిశాదిపతి ( రాత్రికి రాజు), క్షుపరక (రాత్రిని కాంతివంతం చేసే వాడు) అనిపేర్లు కూడా కలవు. ఇరవైఏడు నక్షత్రాలను సూచిస్తునట్టు,ఇరవైఏడు మంది భార్యలను కలిగి ఉన్నాడు. తండ్రి సోమతల్లి తారక.
అనారోగ్యం తో బాధ పడుతూ ఉన్న తల్లి, చర్మ వ్యాధులు మొదలైన సమస్యలు కలవారుచంద్రుని పూజ వలన ఫలితం పొందగలరు.
కుంభ రాశి కి అధిపతి చంద్రుడు. తూర్పు - దక్షిణ అభిముఖుడై ఉంటాడు.
అధిదేవత : నీరు.
ప్రత్యధిదేవత : గౌరి
వర్ణం : తెలుపు
ధాన్యం : బియ్యం / వడ్లు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : ముత్యం
నైవేద్యం : పెరుగన్నం
మంగళ :
అంగారకుడు ( ఎర్రని వర్ణం కలవాడు) అని కూడా పిలుస్తాం.ఇతను భూదేవి కుమారుడు. మేష, వృశ్చిక రాసులకిఅధిపతి. దక్షినాభిముఖుడు. రుచక మహాపురుష యోగవిద్యను భోదిస్తాడు. తమోగుణ వంతుడు.
భార్య / పిల్లలు / అన్నదమ్ముల వాళ్ళ సమస్యలు ఉండేవారు,స్నేహితులతో శత్రుత్వం, సంపదను కోల్పోయిన వారు మంగళ దేవుడిని పూజించటంవలన సత్ఫలితాలను పొందుతారు.
అధిదేవత : భూదేవి
వర్ణం: ఎరుపు
ధాన్యం : కందిపప్పు
పుష్పం : సంపంగి మరియు తామర
వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం
జాతి రత్నం : ఎర్రని పగడం
నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం
బుధుడు :
తార, చంద్రుల పుత్రుడు బుధుడు. రజోగుణవంతుడు. పుత్రదోషం, మంద విద్య, చంచలమైన మనసు కలవారు బుధునిపూజలు చేసి ఉపసమనం పొందుతారు. తెలివితేటల వృద్ధి,సంగీతం, జ్యోతిష్యం, గణితం, వైద్యం వంటి వాటిలోరానిచాలంటే బుధుడి అనుగ్రహం పొందాలి.
మిధున మరియు కన్యారాశి కి అధిపతి బుధుడు. తూర్పు -ఉత్తర ముఖుడై ఉంటాడు.
అధిదేవత : విష్ణు
ప్రత్యధిదేవత : నారాయణుడు
వర్ణం : చిగురాకు పచ్చ
వాహనం : సింహం
ధాన్యం : పచ్చ పెసర పప్పు
వస్త్రం : పచ్చని రంగు వస్త్రం
జాతి రత్నం : పచ్చ
నైవేద్యం : పెసరపప్పు తో కూడిన అన్నం
గురు :
బృహస్పతి అని కూడా అంతము. దేవతలకు, దానవులగురువైన శుక్రాచారుడికి గురువు ఇతను. సత్వగుణసంపన్నుడు. పసుపుపచ్చ / బంగారు వర్ణం లో ఉంటాడు.
పేరు ప్రఖ్యాతులు, సంపద, తోడ బుట్టినవారి క్షేమము కొరకుగురువు ని పూజించాలి
ధన్నురాశి, మీనా రాశిలకు అధిపతి. ఉతరముఖుడైఉంటాడు.
అధిదేవత : బ్రహ్మ
ప్రతదిదేవత : ఇంద్రుడు
వర్ణం: పసుపు
వాహనం : గజరాజు
ధాన్యం : వేరుసెనగ పప్పు
పుష్పం : మల్లె
వస్త్రం : బంగారు రంగు వస్త్రం
జాతి రత్నం : పుష్య రాగం
నైవేద్యం : సెనగపప్పు తో కూడిన అన్నం
శుక్రుడు :
ఉషన, బృగు మహర్షి ల సంతానం. అసురులకుగురువు ఇతను. రజోగుణ సంపన్నుడు. ధవళ వర్ణంతో మద్యవయస్కుడిగా ఉంటాడు. ఒంటె / గుఱ్ఱము /మొసలి వాహనంగా కల్గి ఉంటాడు.
అనుకోని పరిస్థితుల వల్లనా కుటుంబాలు విడిపోవడంలేక తగాదాలు రావడం , బాగా కలిసి ఉండేవారిమద్యలో శత్రుత్వం కలగడం మొదలైన విపత్కరపరిస్థితులనుండి శుక్రాచార్యుని పూజ వలన బయటపడే అవకాశం ఉంది.
వృషభ, తులరాశులకు అధిపతి.
అదిదేవత : ఇంద్రుడు
వర్ణం : తెలుపు
వాహనం : మొసలి
ధాన్యం : చిక్కుడు గింజలు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : వజ్రం
నైవేద్యం : చుక్కుడు గింజల తో కూడిన అన్నం
శని :
సూర్యభగవానుడి పుత్రుడు శని. భార్య ఛాయా దేవి (నీడ). నల్లని వర్ణం తో, నలుపు వస్త్రదారనతో, కాకివాహనంగా కలిగి ఉంటాడు.
శని దేవుడిని అందరు తిడ్తూ ఉంటారు. నిజామే అలంటిబాధలు పెడతాడు శని. మనల్ని ఎంతగా బాధ పెట్టికస్టాలు పెడతాడో, అంతకంటే ఎక్కువ మంచి చేసివెళ్తాడు.
కుంభ, మకర రాసులకి అధిపతి. పడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు.
అదిదేవత : యముడు
ప్రతదిదేవత : ప్రజాపతి
వర్ణం : నలుపు
ధాన్యం : నల్ల నువ్వులు
/> వస్త్రం : నల్లని వస్త్రం
జాతి రత్నం : నీలం
నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం
రాహువు :
సూర్య చంద్ర గ్రహాణాలకు కారకుడు గా చెప్పబడేరాహువు ను ఒక పాము రూపం లో వారిన్స్తారు. ఒకకత్తి ని ఆయుధంగా చేసుకొని, ఎనిమిది నల్లటిగుర్రాలను అధిరోహిస్తూ ఉంటాడు.
పుత్ర దోషం, మానసిక రోగాలు, కుష్టు మొదలైనవిరాహు ప్రభావములే.
పడమర - దక్షినాభిముఖుడై ఉంటాడు.
అదిదేవత : దుర్గ
ప్రత్యధిదేవత : పాము
వర్ణం : నలుపు
వాహనం : నిలపు సింహం
ధాన్యం : మినుగులు
పుష్పం : అడవి మందారం
జాతిరత్నం : గోమేధుకం
వస్త్రం : నల్లటి వస్త్రం
నైవేద్యం : మినుగులతో కూడిన అన్నం
కేతువు :
భార్య చిత్రలేఖ. ఆస్తి నష్టం, చెడు అలవాట్లు, పుత్ర దోషంమొదలైనవి తొలగాలంటే కేతు పూజలు చేయాలి.
ఉత్తరం - పడమటి ముఖాసీనుడై ఉంటాడు.
అదిదేవత : చిత్రగుప్తుడు
ప్రత్యధిదేవత : బ్రహ్మ
వర్ణం : ఎరుపు
వాహనం : గద్ద
ధాన్యం : ఉలవలు
పుష్పం : ఎర్రని కలువ
వస్త్రం : రంగురంగుల వస్త్రం
జాతి రత్నం : వైడుర్యం
నైవేద్యం : ఉలవల అన్నం.
STORY OF A GOOD STUDENT IN TELUGU
గురుభక్తుడు
ఒకానొక ఏకాంత ప్రదేశమున ఒక చక్కని ఆశ్రమము కలదు. అది పట్టణ ప్రాంతమునకు సుదూరముగా నుండుటచే జనసమూహములు ఎక్కువగా చేరుటగాని, కేకలు వేయుటగాని, వాహనముల శబ్దము వినిపించుట గాని ఏమియు అచట లేదు. వాతావరణము కలుషితముకాక నిర్మలముగా నుండెను. ఒకవైపు గగన చుంబితములగు ఎత్తేన పర్వతములు, ఒకవైపు స్వచ్చమైన జలముతో గూడిన గొప్ప సరోవరము ఆ అశ్రమమునకు శోభను కల్పించుచుండెను. ఫలపుష్పాదులతో గూడిన మహావృక్షములు కనులకు ఇంపుగా నుండెను. భక్తులు ధ్యానాదులను శీలించుటకును, ఆధ్యాత్మిక సాధనలు కావించుటకును అచటచట వృక్షచ్చాయలందు చక్కని అరుగులు కట్టబడియుండెను. సాధకులు వానిపై కూర్చుండి దృశ్యము వైపునకు దృష్టిని మరలించక మనస్సును అంతర్ముఖ మొనర్చి పరమాత్మయందు కేంద్రీకరించు చుందురు. ఆకలి అయినపుడు కండమూలములు,ఫలములు భక్షించుచు అచట సాధకులు ప్రాపంచిక వ్యామోహములపై ఏమాత్రము మనస్సును పరుగిడనీయక అహర్నిశములు ఆత్మచింతన , ధ్యానాద్యనుష్ఠానములను శిలించుచు కాలమును సద్వినియోగ పరచుచుందురు.
ధ్యానాదులు విరమించిన పిదప ఇక స్వాధ్యయనమందు ప్రవేశించి ఉపనిషత్తులు, భగవద్గీత మొదలైన సద్గ్రంథములను పరిశీలించు చుందురు. ఆ తదుపరి ఆశ్రమవాసు లందరు ఒకచోట సమావేసమయి ఆధ్యాత్మిక విషయములను గూర్చి పరస్పరము చర్చించుకొనుచు నుందురు. ఏవైన తెలియని అంశములను అడిగి తెలిసికొందురు. ఇట్టి సత్కాలక్షేపముల వలన వారి మనస్సు అన్యత్ర పోవుటకు అవకాశమే లేనందున శాశ్వత పరమాత్మయందే లగ్న మగుచుండెను.
ఇట్లుండ ఒకనాడు సాయంత్ర సమయమున శిష్యులందరిని సమావేశ పరచి గురుదేవుడు,సాధనయందు సామాన్యముగ జనులకు ఏయే ప్రతిబంధకములు కలుగుచుండునో వానిని అధిగమించుటకు అవలంబించవలసిన పద్దతు లేవియో చక్కగా విశదపరచెను. కొందరు భక్తులు గురువు చెప్పిన కీలక విషయములను పుస్తకములోనికి ఎక్కించుకొనిరి. గోష్ఠి అంతయు పూర్తికాగానే శాంతిమంత్రముల ఉచ్చారణతో ఆనాటి సమావేశము విసర్జింపబడెను.
అపుడు గురుదేవుడు అంతేవాసులతో "నాయనలారా! ప్రకృతి సౌందర్యమును వీక్షించుటకును, భగవంతుని చిద్విలాసమును చూచి ఆనందించుటకును ఉద్యానవనమునకు బోదము రండు" అని చెప్పి ఆ శిష్యులందరిని ఆశ్రమసమీపమున గల ఉద్యానవనమునకు తీసికొని పోయెను. అచట రకరకములైన పుష్పములు చక్కగా వికసించి సుగంధమును వెదజల్లుచుండెను. తులసి వనమునుండి పవిత్రమైన పరిమళము నలువైపుల ప్రసరించుచుండెను.
అత్తరి గురుదేవుడు వికసించిన ఒక గులాబి పువ్వును చూచి, దాని రచనావైచిత్ర్యమును గాంచి ముగ్దుడై, సృష్టికర్త యొక్క అపారశక్తి సామర్థ్యమును తలంచుకొని విస్మితుడై ఆ పుష్పమును మెల్లగ కోసెను. ఆ కోయుటలో పొరపాటున దానికి ఉన్న ముల్లు గ్రుచ్చుకొనుటచే వ్రేలినుండి రక్తము కారదొడగెను. అది చూసి శిష్యులలో కొందరు గుడ్డపీలికతో ఆ వ్రేలికి కట్టుకట్టదలంచి పాత గుడ్డ కొరకై ఆశ్రమమునకు పరుగెత్తిరి. కాని సమీపముననే యున్న ఒక శిష్యుడు తనపై కప్పుకొనిన అంగవస్త్రమును చింపి ఆ పీలికతో తత్ క్షణము దేశికేంద్రుని వ్రేలికి కట్టుకట్టెను. రక్తస్రావము ఆగిపోయెను. కొలది సమయములో గురుదేవునకు నొప్పి తగ్గిపోయి స్వస్థత చేకూరెను. అపుడు గురువు తన మనంబున "ఈతడుగదా నిజమైన గురుభక్తుడు! తక్కినవారు గుడ్డకొరకై ఇటునటు పరుగెత్తిరి. కాని ఇతడు ఒరుల బాధను గుర్తెరింగి ఆచార్యునిపై గల అపారభక్తిని క్రియారూపమున ప్రకటించియున్నాడు" అని ఈ ప్రకారముగ తలంచుకొనుచు ఆశ్రమము వైపునకు మెల్లగా నడువజొచ్చెను.
నీతి: భక్తిగాని, జ్ఞానముగాని నోటివరకే పరిమితముకాక హృదయమందు కూడ ప్రవేశించవలెను. వాచాజ్ఞానముతో పరితృప్తి నొందక అనుష్ఠానమందు కూడ దానిని ప్రవేశపెట్టవలెను. గురుదేవుని ఈ బోధను కార్యాన్విత మొనర్చువాడే నిజమైన గురుభక్తుడు.
IMPORTANCE OF MARGASIRA MASAM IN TELUGU
మార్గశిర మాస విసిష్ట్హత
చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉండే నెల మార్గశీర్షం. ఇది ప్రకృతి కాంతకు సీమంతం. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసం. 'మాసానాం మార్గశీర్షం'- మాసాల్లో తాను మార్గశిరమాసాన్ని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని విభూతియోగంలో. ఈకాలంలో పొలాలనుంచి ధాన్యం ఇళ్లకు చేరి ప్రజలు సంతోషంగా ఉంటారని ఉత్తమ మాసంగా పరిగణిస్తారు.
కృష్ణుడు విష్ణ్వంశ సంభూతుడు. విష్ణువు సూర్యనారాయణుడై ధనూరాశి నుంచి మకర రాశికి ప్రయాణించే సమయమిది. సౌరమానం ప్రకారం ఈనెలలో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాస ప్రాశస్త్యాన్ని బ్రహ్మాండ పురాణం, భాగవతం, వైఖానసం మొదలైన గ్రంథాలు వివరిస్తున్నాయి. సూర్యుడు ధనూరాశిలో ఉండగా విష్ణువును మేల్కొలిపే ధనుర్మాస వ్రతం చేయాలని ఆయా గ్రంథాలు చెబుతున్నాయి.
మార్గశిరం ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక. కార్తీకంలో పుణ్యనదీ స్నానాలతో తరించిన భక్తుల హృదయాలు మార్గశిర మాసంలో మరింత భగవచ్చింతనలో తన్మయమవుతాయి. నిర్మలమైన ఆకాశం మాదిరిగా మనస్సులు కూడా ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి.
మార్గశిరం ఎన్నో పర్వాలకు నెలవు. మార్గశిర శుద్ధ 'స్కంద షష్ఠి'- శివకుమారుడైన కుమారస్వామి ఈరోజున తారకాసురుని సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని చెబుతారు. తెలుగువారు దీన్ని 'సుబ్రహ్మణ్య షష్ఠి' అని వ్యవహరిస్తారు. మార్గశిర శుద్ధ ఏకాదశి 'వైకుంఠ ఏకాదశి'. దీనినే 'మోక్ష్తెకాదశి' అనీ అంటారు. ఆ రోజున విష్ణ్వాలయాల్లో ఉత్తరద్వారంనుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం. తిరుపతి, శ్రీరంగంవంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆరోజు గొప్ప ఉత్సవం. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశచిహ్నంగా భావిస్తారు. ఈ ఏకాదశి గీతాజయంతి. సమస్త మానవాళికి ధర్మ భాండాగారం, భారతీయ ఆధ్యాత్మ వాఞ్మయంలో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు. మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి అని, సఫలైకాదశి అని వ్యవహరిస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమైక్యస్థితి దత్తాత్రేయుడు. ఈ దత్తజయంతిని మార్గశిరంలోనే శుక్లపూర్ణిమనాడు జరుపుకొంటారు. మార్గశిర శుక్ల త్రయోదశినాడు హనుమద్వ్రతం ఆచరించడం పరిపాటి. ఇలా ఎన్నో విశిష్టతలతో భక్తజనావళికి హర్షం మార్గశీర్షం.
చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉండే నెల మార్గశీర్షం. ఇది ప్రకృతి కాంతకు సీమంతం. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసం. 'మాసానాం మార్గశీర్షం'- మాసాల్లో తాను మార్గశిరమాసాన్ని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని విభూతియోగంలో. ఈకాలంలో పొలాలనుంచి ధాన్యం ఇళ్లకు చేరి ప్రజలు సంతోషంగా ఉంటారని ఉత్తమ మాసంగా పరిగణిస్తారు.
కృష్ణుడు విష్ణ్వంశ సంభూతుడు. విష్ణువు సూర్యనారాయణుడై ధనూరాశి నుంచి మకర రాశికి ప్రయాణించే సమయమిది. సౌరమానం ప్రకారం ఈనెలలో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాస ప్రాశస్త్యాన్ని బ్రహ్మాండ పురాణం, భాగవతం, వైఖానసం మొదలైన గ్రంథాలు వివరిస్తున్నాయి. సూర్యుడు ధనూరాశిలో ఉండగా విష్ణువును మేల్కొలిపే ధనుర్మాస వ్రతం చేయాలని ఆయా గ్రంథాలు చెబుతున్నాయి.
మార్గశిరం ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక. కార్తీకంలో పుణ్యనదీ స్నానాలతో తరించిన భక్తుల హృదయాలు మార్గశిర మాసంలో మరింత భగవచ్చింతనలో తన్మయమవుతాయి. నిర్మలమైన ఆకాశం మాదిరిగా మనస్సులు కూడా ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి.
మార్గశిరం ఎన్నో పర్వాలకు నెలవు. మార్గశిర శుద్ధ 'స్కంద షష్ఠి'- శివకుమారుడైన కుమారస్వామి ఈరోజున తారకాసురుని సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని చెబుతారు. తెలుగువారు దీన్ని 'సుబ్రహ్మణ్య షష్ఠి' అని వ్యవహరిస్తారు. మార్గశిర శుద్ధ ఏకాదశి 'వైకుంఠ ఏకాదశి'. దీనినే 'మోక్ష్తెకాదశి' అనీ అంటారు. ఆ రోజున విష్ణ్వాలయాల్లో ఉత్తరద్వారంనుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం. తిరుపతి, శ్రీరంగంవంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆరోజు గొప్ప ఉత్సవం. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశచిహ్నంగా భావిస్తారు. ఈ ఏకాదశి గీతాజయంతి. సమస్త మానవాళికి ధర్మ భాండాగారం, భారతీయ ఆధ్యాత్మ వాఞ్మయంలో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు. మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి అని, సఫలైకాదశి అని వ్యవహరిస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమైక్యస్థితి దత్తాత్రేయుడు. ఈ దత్తజయంతిని మార్గశిరంలోనే శుక్లపూర్ణిమనాడు జరుపుకొంటారు. మార్గశిర శుక్ల త్రయోదశినాడు హనుమద్వ్రతం ఆచరించడం పరిపాటి. ఇలా ఎన్నో విశిష్టతలతో భక్తజనావళికి హర్షం మార్గశీర్షం.
Subscribe to:
Posts (Atom)