ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SWEET AND LOVELY PARROTS


IMPORTANCE OF 30 DAYS OF KARTHIKAMASAM MONTH - FESTIVAL SPECIAL ARTICLE IN TELUGU


INTERNATIONAL STANDARDS DEVELOPMENT OF GUJARATH BUS STAND


PUT CHECK TO AIDS WITH ADAVI THANGEDU PLANT - RESEARCH ARTICLES IN TELUGU


TELUGU LANGUAGE - TELUGU GRAMMER - INFORMATION ABOUT ALANKARAMULU - TWO TYPES - SABDHALANKARAMULU AND ARDHALANKARAMULU


WEDDING LEHANGA CHOLI DRESSES COLLECTION



TELUGU PURANA BIRTH STORY OF LORD KUMARASWAMY


కుమారస్వామి పుట్టడం-శ్రీ రామాయణం

"దేవతలందరూ ఇంద్రునితోనూ అగ్నిహోత్రునితోనూ కలిసి బ్రహ్మదగ్గిరికి వెళ్లి 'దేవా! నువ్వు మాకు శత్రుసంహారదక్షుడైన సేనాధిపతిని అనుగ్రహించావు; కాని అతను ఇంకా పుట్టనేలేదు. పైగా, భగవంతుడైన శివుడు హిమవచ్చిఖరం మీద ఉమాదేవితో కూడా గొప్ప తపస్సు చేస్తున్నాడు. అంచేత, ఇప్పుడు చెయ్యవలసిందేమో ఆలోచించి లోకాలను రక్షించు. నువ్వే మాకు గతి ' అని ప్రార్థించారు. దానిమీద బ్రహ్మ తియ్యనిమాటలతో వారిని ఓదార్చి 'ఉమాదేవి మిమ్ము శపించింది. కనక, మీభార్యలయందు మీకు సంతానం కలగదు. ఉమాదేవి మాట జరిగితీరుతుంది. కాని పొల్లుకాదు. ఇది సత్యం. ఇందులో సంశయం ఎంతమాత్రమూ లేదు. ఇదే, ఆకాశంలో ప్రవహించే గంగానది చూడండి. మీకు సేనాధిపతి కావలసిన మహావీరుణ్ణి అగ్నిహోత్రుడు అకాశగంగయందు పుట్టించగలడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగ యందు పుట్టించగలడు. గంగ అగ్ని వల్ల తప్పకుండా కుమారుణ్ణి కంటుంది. ఉమాదేవికి అది ఇష్టమున్నూ అవుతుంది. సందేహం లేదు' అని చెప్పాడు.

అప్పుడు దేవత లందరూ బ్రహ్మను పూజించి ధాతుశోభితం అయిన కైలాసపర్వతానికి వెళ్లి 'దేవా! ఇది దేవకార్యం. కనుక, ఇది నెరవేర్చు. శైలపుత్రిక అయిన గంగాదేవియందు నువ్వు ధరించి వున్న మహాదేవుని రేతస్సు విడిచి పెట్టు ' అని కోరారు.

వెంటనే అగ్ని గంగదగ్గరికి వెళ్లి 'దేవీ! నువ్వు గర్భం ధరించు, ఇది దేవతలకు మిక్కిలి ప్రియమైనది ' అని చెప్పాడు. ఆ మాట విని గంగ చక్కని స్త్రీరూపం ధరించి రాగా అగ్ని ఆ సౌంధర్యం చూసి అన్ని అవయవాలనుంచీ విడిచి గంగ స్రోతస్సులన్నీ శివరేతస్సుతో నింపాడు. కాని 'అగ్నీ, నే నీ తేజస్సు భరించలేను ' అంది. 'అయితే , ఈ హిమవత్పర్వత పాదంమీద గర్భం ఉంచు' అని అగ్ని చెప్పాడు. ఆమాట మీద గంగాదేవి పరమభాస్వరం అయిన గర్భం స్రోతస్సుల నుంచి విడిచిపెట్టింది. గంగ విడిచిన శివరేతస్సు భూమిమీద పడడం వల్ల బంగారమూ, వెండీ, రాగీ, ఉక్కు,తగరమూ, సీసమూ పుట్టాయి. ఆ శ్వేతపర్వతం అంతా రెల్లువనంతో కూడా బంగారం అయిపోయింది. బంగారం అది మొదలు అగ్నిలాగ మెరుస్తూ జాతరూపం అని పేరుపొందింది.

ఇంద్రాది దేవతలు, కుమారుడు పుట్టగానే పాలిచ్చి పెంచడానికి షట్కృత్తికలనూ ఏర్పాటు చేశారు. 'ఈ బిడ్డ మా ఆరుగురికీ కొడుకే ' అని సమయం చేసుకుని కృత్తికలు అతన్ని పెంచడానికి ఉన్ముఖులయినారు. అది చూసి దేవతలు 'కుమారుడు కార్తికేయుడనిన్నీ పేరుపొందుతాడు. త్రిలోకాలయందూ విఖ్యాతుడున్నూ అవుతా' డన్నారు. అప్పుడు గర్భ పరిశ్రావంకాగా స్కన్నుడైన బాలుణ్ణి కృత్తికలు స్నానం చేయించారు. అగ్నిహోత్రంలాగ ప్రకాశిస్తున్న ఆ కుమారుడు స్కన్నుడైనాడు కనుక దేవతలు స్కందుడనిన్నీ పేరు పెట్టారు. వెంటనే కృత్తికలకు పాలు పుట్టాయి. కుమారుడు ఆరు మొగాలు కలవాడై ఏకకాలంలో ఆరుగురి పాలూ తాగి, సుకుమారదేహుడే అయినా తన అఖండపరాక్రమం వల్ల రాక్షస సేనలనన్నిటినీ జయించాడు. అగ్నిని పురస్కరించుకుని దేవతలందరూ కుమారుణ్ణి దేవసేనాధిపత్యం యిచ్చి అభిషేకించారు. రామా! గంగ వృత్తాంతం యిదీ. పుణ్యప్రదమైన కుమారస్వామి జననం ఈ విధంగా జరిగింది. ఇక్ష్వాకు వంశవర్ధనా! కార్తికేయుడైన కుమారస్వామి యెడల భక్తిగల మానవుడు ఇహలోకంలో దీర్ఘాయువూ అష్టైశ్వర్యాలూ అనుభవించి చివరికి స్కందసాలోక్యసిద్ధి పొందుతాడు.

MAHABHARATHA PURANA TELUGU STORY ABOUT EKALAVYA


గురు దక్షిణ -శ్రీ మహాభారతంలో కథలు

ద్రోణుడు పరుశురాముడి శిష్యుడు. ఆయన దగ్గర శస్త్రాస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాడు. భీష్ములవారు ద్రోణాచార్యుడి ధనుర్విద్యాశక్తిని గురించి విని ఆయనను పిలిపించి కురుపాండవులకు శిక్షణ ఇప్పించాడు.

హస్తినాపురంలో ద్రోణాచార్యులు ధనుర్విద్య నేర్పుతున్న సంగతి ఆ నోటా ఆ నొటా అందరికీ తెలిసింది. కర్ణుడు కూడా విద్యాభ్యాసం కోసం వచ్చాడు.

అందరూ ఎంతో శ్రమపడి విద్య నేర్చుకుంటున్నా, అందరికంటే దీక్షగా అర్జునుడు చేసే సాధన ఆచార్యునికి సంతోషం కలిగించింది. అందుకని మరింత ఓపికతో, ప్రేమతో అతనికి పాఠాలు చెప్పావారు. ఒకనాడు భోజన సమయంలో పెనుగాలికి దీపం ఆరిపోయింది. అయినా అలవాటు ప్రకారం అర్జునుడు భోజనం ముగించి చీకటిలో కూడా విద్యాభ్యాసం ఆరంభించాడు. నిద్రపోతున్న గురువుగారు అర్జునుడి ధనుష్ఠంకారం విని లేచాడు. శిష్యుడి ఏకాగ్రతకు, దీక్షకు పరవశించి గాఢాలింగనం చేసుకుని " అస్త్రవిద్యలో నీ అంతటివాడు వండడు" అని వెన్ను తట్టారు.

రోజులు గడుస్తున్నాయి.

కురుపాండవుల విలువిద్యాశక్తిని పరిశీలించేందుకు ద్రోణాచార్యులవారు ఒకనాడు ఓ పరీక్ష పెట్టారు.ఒక పిట్ట బొమ్మని తయారు చేయించి దానిని ఒక చెట్టు చిటారుకొమ్మకు కట్టి శిష్యులందరినీ పిలిపించారు. ముందుగా ధర్మరాజును పిలిచి "చిటారుకొమ్మన పక్షిని చూశావా? నేనూ, నీ సోదరులూ, చెట్టూ కనిపిస్తున్నాయా?" అని అడిగారు.

అన్నీ చూస్తున్నానన్నాడు ధర్మరాజు.

అలాగే దుర్యోధనాదులందరినీ పిలిచి అడిగాడు.

అందరూ గొప్పగా తలలూపారు.

చివరికి అర్జునుడ్ని పిలిచి అడిగితే "ఆచార్యా! పక్షి తప్ప మరేమీ కనిపించడం లేదు నాకు" అన్నాడు.

"ఆ పక్షి అవయవాలు ఎలా వున్నాయి?" గురువుగారు మరో ప్రశ్న వేశారు.

"దాని శిరస్సు తప్ప మరే అవయవమూ నా దృష్టిలో లేదు" అన్నాడు అర్జునుడు.

దాని శిరస్సు పడగొట్టమన్నాడు ద్రోణుడు.

అనటమే ఆలస్యం- అర్జునుడి ధనస్సు నుండి బాణం దూసుకుపోయింది. పక్షి తల నేల రాలింది.

ద్రోణుడు శిష్యుడ్ని గాఢాలింగనం చేసుకున్నాడు.

అర్జునుడు గురువుగారికి పాదాభివందనం చేశాడు.

అయితే, ఆ రోజుల్లోనే అర్జునుడికి దీటైనవాడు మరొకడు ధనుర్విద్యలో ఆరితేరాడు. అతను హిరణ్యధన్వుడనే ఎలుకరాజు కుమారుడు ఏకలవ్యుడు. అతను ధనుర్విద్య నేర్పమని ద్రోణాచార్యులవారిని బ్రతిమాలితే ఆయన తిరస్కరించాడు. అయినా బాధపడక గురువుగారి పాదాలకు నమస్కరించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళాకా ద్రోణుని విగ్రహం ఎదుట వుంచుకుని, ఆ ప్రతిమనే గురువుగా భావించి పూజిస్తూ ధనుర్విద్య అభ్యసించటం మొదలు పెట్టాడు.

ఒకనాడు కురుపాండవులు వేటకు వెళ్ళి అడవి జంతువులను సంహరిస్తుండగా వారి వేటకుక్క ఏకలవ్యుడ్ని చూసి మొరిగింది. అది నోరు తెరచి మొరుగుతున్న క్షణంలో ఏకలవ్యుడు ఒకేసారి దాని నోట్లోకి ఏడు బాణాలు వదిలాడు.

అది అలాగే పాండవుల దగ్గరికి వెళ్ళింది.

పాండవులకు ఆశ్చర్యం కలిగింది.

అంతటి విలుకాడెవరా అని వెదికి వెదికి చివరకు ఏకలవ్యుడని తెలుసుకున్నారు. కుతూహలం చంపుకోలేక "నీ గురువు పేరేమిటి?" అని అడిగారు పాండవులు. "ద్రోణాచార్యులు" అని వినయంగా సమాధానం చెప్పాడు అతను. అతను కూడా ద్రోణుని శిష్యుడే అని తెలియగానే హస్తినాపురం వస్తూనే అర్జునుడు నేరుగా గురువుగారి దగ్గరకు వెళ్ళాడు. "ఆర్యా! మీ శిష్యులలో నన్ను మించినవాడు లేడన్నారు. కాని మీ శిష్యుడు ఏకలవ్యుడు విలువిద్యలో నాకంటే ఆరితేరాడు" అనగా, ద్రోణుడు అర్జునుడితో అడవికి వచ్చి ఏకలవ్యుణ్ణి చూశాడు. ఆ వీరుడు ద్రోణుడికి నమస్కరించి గురుదక్షిణగా ఏం కావాలన్నా యిస్తానన్నాడు. వెంటనే కుడిచేతి బొటనవేలు కోసి యిమ్మన్నాడు. ఏకలవ్యుడు సంతోషంగా గురువు కోరిన ప్రకారం దక్షిణ అర్పించాడు.

"నిన్ను మించిన విలుకాడు ఉండటానికి వీల్లేదు" అని ద్రోణుడు అర్జునుడికి చేసిన వాగ్ధానం కోసం ఏకలవ్యుని అంగుష్ఠం గ్రహించి తిరిగి వచ్చాడు.

LIST OF NAMES OF 60 TELUGU YEARS AND ITS RESULTS IN EACH YEAR




BEAUTIFUL PAPER ART OF COCK


NAMES OF EIGHT POETS OF SRI KRISHNADEVARAYA - BRIEF ARTICLE ABOUT ASTADIGGAJALU IN TELUGU



NEW MODEL YAMAHA SUPER BIKE MONSTER


ANGEL


MONDAY PRAYER IN TELUGU


సోమవారం శివదర్శనం సర్వ పాప హరణం ...
ఓం సౌరాష్ర్టే సోమ నాథం చ శ్రీ శైలే మల్లిఖార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళ మోంకార మమరేశ్వరమ్
ప్రజ్జ్వల్యాం వైద్యనాధం చ ఢాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే
వారాణస్యాంతు విశ్వేశం త్య్రంబకం గౌతీమీ తటే
హిమాలయేతు కేదారం ఘృశ్మేశంచ విశాలకే
ఏతాని జ్యోతిర్లింగాని సాయంప్రాతః పఠేన్నర
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి..

BRIDE IN BROWN


NAVAGRAHALU - NINE PLANETS - NAMES OF NAVAGRAHALU - NAMES AND PUJA OF NAVAGRAHALU


నవగ్రహాలు

ఆదిత్యుడు :

కశ్యపుని కుమారుడు సూర్యుడు. భార్య అదితి. అందుకేఆదిత్యుడు అని పిలుస్తాము. సప్త అశ్వాలతో ఉన్న రధం అతనివాహనం. ఆ సప్త అశ్వాలు ఏడు చక్రాలకు ( మూలాధారం,స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆగ్య్హ్నా చక్రం ,సహస్రారం )

వివాహ పరిబంధన దోషం, పుత్ర దోషం, పుత్ర పరిబంధన దోషం,విద్యా పరిబంధన దోషం, ఉద్యోగ పరిబంధన దోషం, సూర్యదోషం మొదలైన దోషాలతో బాధ పడే వారు సూర్యునిపూజించటం వలన ఫలితం పొందుతారు.
సింహరాశి కి అధిష్టాన దేవుడు సూర్యుడు. నవగ్రహాలలో మద్య స్థానం ఆదిత్యుడిది.అధిదేవత అగ్ని, ప్రత్యధి దేవత రుద్రుడు. ఆదిత్యుడు ఎరుపు వర్ణం లో ఉంటాడు.

ఇష్టమైన ధాన్యం : గోధుమలు
పుష్పం : తామర
వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం
జాతి రాయి : కెంపు
నైవేద్యం : గోధుమలు, రవ చక్కర పొంగలి

చంద్రుడు :

చాల అందమైన వాడిగా మనం వర్ణిస్తూ ఉంటాం. వర్ణనలకుకంటే మిన్నగా చంద్రుడు చాల అందమైన వాడు. పది తెల్లటిగుర్రాలతో ఉన్న రధాన్ని అధిరోహిస్తాడు. నిశాదిపతి ( రాత్రికి రాజు), క్షుపరక (రాత్రిని కాంతివంతం చేసే వాడు) అనిపేర్లు కూడా కలవు. ఇరవైఏడు నక్షత్రాలను సూచిస్తునట్టు,ఇరవైఏడు మంది భార్యలను కలిగి ఉన్నాడు. తండ్రి సోమతల్లి తారక.
అనారోగ్యం తో బాధ పడుతూ ఉన్న తల్లి, చర్మ వ్యాధులు మొదలైన సమస్యలు కలవారుచంద్రుని పూజ వలన ఫలితం పొందగలరు.
కుంభ రాశి కి అధిపతి చంద్రుడు. తూర్పు - దక్షిణ అభిముఖుడై ఉంటాడు.

అధిదేవత : నీరు.
ప్రత్యధిదేవత : గౌరి
వర్ణం : తెలుపు
ధాన్యం : బియ్యం / వడ్లు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : ముత్యం
నైవేద్యం : పెరుగన్నం

మంగళ :

అంగారకుడు ( ఎర్రని వర్ణం కలవాడు) అని కూడా పిలుస్తాం.ఇతను భూదేవి కుమారుడు. మేష, వృశ్చిక రాసులకిఅధిపతి. దక్షినాభిముఖుడు. రుచక మహాపురుష యోగవిద్యను భోదిస్తాడు. తమోగుణ వంతుడు.
భార్య / పిల్లలు / అన్నదమ్ముల వాళ్ళ సమస్యలు ఉండేవారు,స్నేహితులతో శత్రుత్వం, సంపదను కోల్పోయిన వారు మంగళ దేవుడిని పూజించటంవలన సత్ఫలితాలను పొందుతారు.

అధిదేవత : భూదేవి
వర్ణం: ఎరుపు
ధాన్యం : కందిపప్పు
పుష్పం : సంపంగి మరియు తామర
వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం
జాతి రత్నం : ఎర్రని పగడం
నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం


బుధుడు :

తార, చంద్రుల పుత్రుడు బుధుడు. రజోగుణవంతుడు. పుత్రదోషం, మంద విద్య, చంచలమైన మనసు కలవారు బుధునిపూజలు చేసి ఉపసమనం పొందుతారు. తెలివితేటల వృద్ధి,సంగీతం, జ్యోతిష్యం, గణితం, వైద్యం వంటి వాటిలోరానిచాలంటే బుధుడి అనుగ్రహం పొందాలి.
మిధున మరియు కన్యారాశి కి అధిపతి బుధుడు. తూర్పు -ఉత్తర ముఖుడై ఉంటాడు.
అధిదేవత : విష్ణు
ప్రత్యధిదేవత : నారాయణుడు
వర్ణం : చిగురాకు పచ్చ
వాహనం : సింహం
ధాన్యం : పచ్చ పెసర పప్పు
వస్త్రం : పచ్చని రంగు వస్త్రం
జాతి రత్నం : పచ్చ
నైవేద్యం : పెసరపప్పు తో కూడిన అన్నం

గురు :

బృహస్పతి అని కూడా అంతము. దేవతలకు, దానవులగురువైన శుక్రాచారుడికి గురువు ఇతను. సత్వగుణసంపన్నుడు. పసుపుపచ్చ / బంగారు వర్ణం లో ఉంటాడు.
పేరు ప్రఖ్యాతులు, సంపద, తోడ బుట్టినవారి క్షేమము కొరకుగురువు ని పూజించాలి 
ధన్నురాశి, మీనా రాశిలకు అధిపతి. ఉతరముఖుడైఉంటాడు.

అధిదేవత : బ్రహ్మ
ప్రతదిదేవత : ఇంద్రుడు
వర్ణం: పసుపు
వాహనం : గజరాజు
ధాన్యం : వేరుసెనగ పప్పు
పుష్పం : మల్లె
వస్త్రం : బంగారు రంగు వస్త్రం
జాతి రత్నం : పుష్య రాగం
నైవేద్యం : సెనగపప్పు తో కూడిన అన్నం


శుక్రుడు :

ఉషన, బృగు మహర్షి ల సంతానం. అసురులకుగురువు ఇతను. రజోగుణ సంపన్నుడు. ధవళ వర్ణంతో మద్యవయస్కుడిగా ఉంటాడు. ఒంటె / గుఱ్ఱము /మొసలి వాహనంగా కల్గి ఉంటాడు.
అనుకోని పరిస్థితుల వల్లనా కుటుంబాలు విడిపోవడంలేక తగాదాలు రావడం , బాగా కలిసి ఉండేవారిమద్యలో శత్రుత్వం కలగడం మొదలైన విపత్కరపరిస్థితులనుండి శుక్రాచార్యుని పూజ వలన బయటపడే అవకాశం ఉంది.
వృషభ, తులరాశులకు అధిపతి.
అదిదేవత : ఇంద్రుడు
వర్ణం : తెలుపు
వాహనం : మొసలి
ధాన్యం : చిక్కుడు గింజలు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : వజ్రం
నైవేద్యం : చుక్కుడు గింజల తో కూడిన అన్నం


శని :

సూర్యభగవానుడి పుత్రుడు శని. భార్య ఛాయా దేవి (నీడ). నల్లని వర్ణం తో, నలుపు వస్త్రదారనతో, కాకివాహనంగా కలిగి ఉంటాడు.
శని దేవుడిని అందరు తిడ్తూ ఉంటారు. నిజామే అలంటిబాధలు పెడతాడు శని. మనల్ని ఎంతగా బాధ పెట్టికస్టాలు పెడతాడో, అంతకంటే ఎక్కువ మంచి చేసివెళ్తాడు.
కుంభ, మకర రాసులకి అధిపతి. పడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు.
అదిదేవత : యముడు
ప్రతదిదేవత : ప్రజాపతి
వర్ణం : నలుపు
ధాన్యం : నల్ల నువ్వులు
/> వస్త్రం : నల్లని వస్త్రం
జాతి రత్నం : నీలం
నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం


రాహువు :

సూర్య చంద్ర గ్రహాణాలకు కారకుడు గా చెప్పబడేరాహువు ను ఒక పాము రూపం లో వారిన్స్తారు. ఒకకత్తి ని ఆయుధంగా చేసుకొని, ఎనిమిది నల్లటిగుర్రాలను అధిరోహిస్తూ ఉంటాడు.
పుత్ర దోషం, మానసిక రోగాలు, కుష్టు మొదలైనవిరాహు ప్రభావములే.
పడమర - దక్షినాభిముఖుడై ఉంటాడు.
అదిదేవత : దుర్గ
ప్రత్యధిదేవత : పాము
వర్ణం : నలుపు
వాహనం : నిలపు సింహం
ధాన్యం : మినుగులు
పుష్పం : అడవి మందారం
జాతిరత్నం : గోమేధుకం
వస్త్రం : నల్లటి వస్త్రం
నైవేద్యం : మినుగులతో కూడిన అన్నం


కేతువు :

భార్య చిత్రలేఖ. ఆస్తి నష్టం, చెడు అలవాట్లు, పుత్ర దోషంమొదలైనవి తొలగాలంటే కేతు పూజలు చేయాలి.
ఉత్తరం - పడమటి ముఖాసీనుడై ఉంటాడు.

అదిదేవత : చిత్రగుప్తుడు
ప్రత్యధిదేవత : బ్రహ్మ
వర్ణం : ఎరుపు
వాహనం : గద్ద
ధాన్యం : ఉలవలు
పుష్పం : ఎర్రని కలువ
వస్త్రం : రంగురంగుల వస్త్రం
జాతి రత్నం : వైడుర్యం
నైవేద్యం : ఉలవల అన్నం.


LIFT NOT WORKING


AMAZING FACT ABOUT GLASS MAKING WITH SAND


GET ATTESTATION FOR TOMATOS


CLEANING PROBLEM


STORY OF A FLY IN TELUGU


HOW TO CALCULATE THE DISTANCE BETWEEN THE TWO GALAXIES IN THE SPACE


MAGICAL GOOGLES STORY FOR TELUGU CHILDREN


TELUGU VYAKARANAMU - TELUGU GRAMMER CHART


STORY OF A GOOD STUDENT IN TELUGU


గురుభక్తుడు

ఒకానొక ఏకాంత ప్రదేశమున ఒక చక్కని ఆశ్రమము కలదు. అది పట్టణ ప్రాంతమునకు సుదూరముగా నుండుటచే జనసమూహములు ఎక్కువగా చేరుటగాని, కేకలు వేయుటగాని, వాహనముల శబ్దము వినిపించుట గాని ఏమియు అచట లేదు. వాతావరణము కలుషితముకాక నిర్మలముగా నుండెను. ఒకవైపు గగన చుంబితములగు ఎత్తేన పర్వతములు, ఒకవైపు స్వచ్చమైన జలముతో గూడిన గొప్ప సరోవరము ఆ అశ్రమమునకు శోభను కల్పించుచుండెను. ఫలపుష్పాదులతో గూడిన మహావృక్షములు కనులకు ఇంపుగా నుండెను. భక్తులు ధ్యానాదులను శీలించుటకును, ఆధ్యాత్మిక సాధనలు కావించుటకును అచటచట వృక్షచ్చాయలందు చక్కని అరుగులు కట్టబడియుండెను. సాధకులు వానిపై కూర్చుండి దృశ్యము వైపునకు దృష్టిని మరలించక మనస్సును అంతర్ముఖ మొనర్చి పరమాత్మయందు కేంద్రీకరించు చుందురు. ఆకలి అయినపుడు కండమూలములు,ఫలములు భక్షించుచు అచట సాధకులు ప్రాపంచిక వ్యామోహములపై ఏమాత్రము మనస్సును పరుగిడనీయక అహర్నిశములు ఆత్మచింతన , ధ్యానాద్యనుష్ఠానములను శిలించుచు కాలమును సద్వినియోగ పరచుచుందురు.


ధ్యానాదులు విరమించిన పిదప ఇక స్వాధ్యయనమందు ప్రవేశించి ఉపనిషత్తులు, భగవద్గీత మొదలైన సద్గ్రంథములను పరిశీలించు చుందురు. ఆ తదుపరి ఆశ్రమవాసు లందరు ఒకచోట సమావేసమయి ఆధ్యాత్మిక విషయములను గూర్చి పరస్పరము చర్చించుకొనుచు నుందురు. ఏవైన తెలియని అంశములను అడిగి తెలిసికొందురు. ఇట్టి సత్కాలక్షేపముల వలన వారి మనస్సు అన్యత్ర పోవుటకు అవకాశమే లేనందున శాశ్వత పరమాత్మయందే లగ్న మగుచుండెను.

ఇట్లుండ ఒకనాడు సాయంత్ర సమయమున శిష్యులందరిని సమావేశ పరచి గురుదేవుడు,సాధనయందు సామాన్యముగ జనులకు ఏయే ప్రతిబంధకములు కలుగుచుండునో వానిని అధిగమించుటకు అవలంబించవలసిన పద్దతు లేవియో చక్కగా విశదపరచెను. కొందరు భక్తులు గురువు చెప్పిన కీలక విషయములను పుస్తకములోనికి ఎక్కించుకొనిరి. గోష్ఠి అంతయు పూర్తికాగానే శాంతిమంత్రముల ఉచ్చారణతో ఆనాటి సమావేశము విసర్జింపబడెను.

అపుడు గురుదేవుడు అంతేవాసులతో "నాయనలారా! ప్రకృతి సౌందర్యమును వీక్షించుటకును, భగవంతుని చిద్విలాసమును చూచి ఆనందించుటకును ఉద్యానవనమునకు బోదము రండు" అని చెప్పి ఆ శిష్యులందరిని ఆశ్రమసమీపమున గల ఉద్యానవనమునకు తీసికొని పోయెను. అచట రకరకములైన పుష్పములు చక్కగా వికసించి సుగంధమును వెదజల్లుచుండెను. తులసి వనమునుండి పవిత్రమైన పరిమళము నలువైపుల ప్రసరించుచుండెను.

అత్తరి గురుదేవుడు వికసించిన ఒక గులాబి పువ్వును చూచి, దాని రచనావైచిత్ర్యమును గాంచి ముగ్దుడై, సృష్టికర్త యొక్క అపారశక్తి సామర్థ్యమును తలంచుకొని విస్మితుడై ఆ పుష్పమును మెల్లగ కోసెను. ఆ కోయుటలో పొరపాటున దానికి ఉన్న ముల్లు గ్రుచ్చుకొనుటచే వ్రేలినుండి రక్తము కారదొడగెను. అది చూసి శిష్యులలో కొందరు గుడ్డపీలికతో ఆ వ్రేలికి కట్టుకట్టదలంచి పాత గుడ్డ కొరకై ఆశ్రమమునకు పరుగెత్తిరి. కాని సమీపముననే యున్న ఒక శిష్యుడు తనపై కప్పుకొనిన అంగవస్త్రమును చింపి ఆ పీలికతో తత్ క్షణము దేశికేంద్రుని వ్రేలికి కట్టుకట్టెను. రక్తస్రావము ఆగిపోయెను. కొలది సమయములో గురుదేవునకు నొప్పి తగ్గిపోయి స్వస్థత చేకూరెను. అపుడు గురువు తన మనంబున "ఈతడుగదా నిజమైన గురుభక్తుడు! తక్కినవారు గుడ్డకొరకై ఇటునటు పరుగెత్తిరి. కాని ఇతడు ఒరుల బాధను గుర్తెరింగి ఆచార్యునిపై గల అపారభక్తిని క్రియారూపమున ప్రకటించియున్నాడు" అని ఈ ప్రకారముగ తలంచుకొనుచు ఆశ్రమము వైపునకు మెల్లగా నడువజొచ్చెను.

నీతి: భక్తిగాని, జ్ఞానముగాని నోటివరకే పరిమితముకాక హృదయమందు కూడ ప్రవేశించవలెను. వాచాజ్ఞానముతో పరితృప్తి నొందక అనుష్ఠానమందు కూడ దానిని ప్రవేశపెట్టవలెను. గురుదేవుని ఈ బోధను కార్యాన్విత మొనర్చువాడే నిజమైన గురుభక్తుడు.