The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
ARTICLE ON ANCIENT HISTORICAL PURANA STORY OF INDIAN MUGGU IN SANKRANTHI FESTIVAL MONTH
ధనుర్మాసం లో.. స్త్రీలు తెల్ల వారక ముందే లేచి ఇం టి ముందు పేడనీళ్లు చల్లి ముగ్గులు వేసిన తరువాత పరమ పవిత్రమైన గోమయాన్ని గోబెమ్మలుగా తీర్చి ముగ్గు మధ్యలో వుంచి పువ్వులు , పసుపు కుంకుమల తో అలంకరిస్తారు.
గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళె్ళైన గోపికలకు సంకేతంగా భావిస్తారు. ఈ ముద్దల తలమీద కనిపించే రంగురంగుల పూవులు , పసుపు కుంకుమలు ముత్తైదువులకు సంకేతం .గోపీ+అమ్మలు=గోపెమ్మలు.. . అవే..జానపదుల వాడుకలో గొబ్బెమ్మలుగా మారాయి అని చెబుతుంటారు పెద్దలు. మధ్య వుండే గొబెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణభక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు.పువ్వులు
కళ్ళ స్థా నంలో గురి వింద గింజలు, ముక్కు స్థానంలో సంపెంగ లాంటి పువ్వును ఉంచుతారు. ఈ గొబ్బెమ్మలకు రక రకాల అలంకారం చేసి ఇంటింటి ముందుకూ తీసు కువెళ్ళి పళ్ళెంతో సహా నేలమీద ఉం చి గొబ్బెమ్మ చు ట్టూ తిరుగుతూ చేతులతో చప్పట్లు తడుతూ పాటలు పాడతారు. అక్కడ పాడే పాటలే గొబ్బి పాటలు.. చివరి రోజైన కనుమ రోజు పాటలు పాడటం పూర్తయ్యాక గొబెమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు.
రోజూ ముగ్గులో పెట్టి పూజించే గొబ్బెమ్మలను ఎండలో ఎండబెడతారు. పండుగ రోజు సూర్యభగవానునికి నైవేద్యం సమర్పించేందుకు సిద్ధం చేసే ప్రసాదాన్ని వండేందుకు ఈ గొబ్బి పిడకలనే వుపయోగిస్తారు.ఎండిపోయిన ఆ పేడ ముద్దలను మండించి ప్రసాదాన్ని తయారు చేస్తారు.
1. కొలని దోపరికి గొబ్బిళ్ళో
యదుకుల స్వామికి గొబ్బిళ్ళో
కొండ గొడుగుగా గోవుల గాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళో
దుండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో
కొలని దోపరికి గొబ్బిళ్ళో
యదుకుల స్వామికి గొబ్బిళ్ళో
పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున కంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో
కొలని దోపరికి గొబ్బిళ్ళో
యదుకుల స్వామికి గొబ్బిళ్ళో
దండివైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండి పైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో
కొలని దోపరికి గొబ్బిళ్ళో
యదుకుల స్వామికి గొబ్బిళ్ళో
2. గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
సంక్రాంతి పండగొచ్చె గొబ్బియళ్ళొ
సీతా దేవి వాకిట విరిసిన గొబ్బియళ్ళొ
మన సీతా దేవి వాకిట విరిసిన గొబ్బియళ్ళొ
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
సంక్రాంతి పండగొచ్చె గొబ్బియళ్ళొ
మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బియళ్ళొ
ఆ ముగ్గుల మీద మల్లె పూలు గొబ్బియళ్ళొ
నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బియళ్ళొ
ఆ ముగ్గుల మీద మొగలి పూలు గొబ్బియళ్ళొ
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
సంక్రాంతి పండగొచ్చె గొబ్బియళ్ళొ
రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బియళ్ళొ
ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియళ్ళొ
ధాన్యపు రాసుల ముగ్గులు వేసి గొబ్బియళ్ళొ
ఆ ముగ్గుల మీద సంపెంగలు గొబ్బియళ్ళొ
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
సంక్రాంతి పండగొచ్చె గొబ్బియళ్ళొ
భూదేవంత ముగ్గులు వేసి గొబ్బియళ్ళొ
ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియళ్ళొ
లక్ష్మి రధముల ముగ్గులు వేసి గొబ్బియళ్ళొ
ఆ ముగ్గుల మీద గుమ్మడి పూలు గొబ్బియళ్ళొ
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
సంక్రాంతి పండగొచ్చె గొబ్బియళ్ళొ
ముంగిట ముగ్గులు వేసి గొబ్బియళ్ళొ
ఆ ముగ్గులోన పొంగళ్ళు గొబ్బియళ్ళొ
భోగి పళ్ళ సందళ్ళు గొబ్బియళ్ళొ
మరదళ్ల సరదాలు గొబ్బియళ్ళొ
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
సంక్రాంతి పండగొచ్చె గొబ్బియళ్ళొ
3. గొబ్బి సుబ్బమ్మ...
గొబ్బి సుబ్బమ్మ సుబ్బణ్ణీయవే..
చేమంతి పువ్వంటి చెల్లెలినియ్యవే
తామర పువ్వంటి తమ్ముణ్ణియ్యవే-
అరటి పువ్వంటి అన్ననియ్యవే
మల్లె పువ్వంటీ మామానీయవే-
బంతి పువ్వంటి బావానియ్యవే
కుంకుమ పువ్వంటి కూతురునీయవే-
కొబ్బరి పువ్వంటి కొడుకునియ్యవే
అరటి పండంటి అల్లుణ్ణియ్యావే-
గులాబి పువ్వంటి గురువునియ్యావే
మొగలి రేకంటి మొగుణ్నియ్యావే-.
ARTICLE ON SRI NAKKARAMESWARAM TEMPLE - PALLEPALEM - SAMANTHAKURRU - ALLAWARAM MANDAL - EAST GODAVARI DISTRICT - ANDHRA PRADESH - INDIA
నక్క రామేశ్వరం అనే ఈ బెస్తపల్లెను చూసి నేర్చుకోవాలి మనం ధర్మనిష్ఠ అంటే ఏమిటో !
బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం|
జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం||
బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం|
జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం||
తూర్పుగోదావరిజిల్లా అల్లవరం మండలం సామంతకుర్రు గ్రామశివారైన పల్లెపాలెం పంచాయితీకి చెందిన నక్కారామేశ్వరం ఒక చిన్నమారుమూలగ్రామం. కోనసీమలో ఈగ్రామానికి గొప్పశివక్షేత్రంగా మంచిప్రసిద్ధి ఉంది. వశిష్ఠగోదావరి పాయలుగా చీలి, సముద్రంలో కలిసేటప్పుడు ఏర్పడిన చిన్నద్వీపం ఈగ్రామం. గ్రామంలో స్త్రీలు, పురుషులు కలిసిన మొత్తం జనాభా 4,500మంది. వీరందరూ అగ్నికులక్షత్రియులు. సముద్రంమీద వేటకు పోయి, చేపలు పట్టుకుని జీవించటమే వీరి ప్రధానవృత్తి. అయితే ఈగ్రామస్తులందరూ వందలఏళ్ళుగా గొప్పశివభక్తులు. ఇందుకు కారణం ఆగ్రామంలో వేంచేసి ఉన్న శ్రీపార్వతీసమేత రామేశ్వరస్వామివారు. ఈస్వామి మహిమల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.
ఈగ్రామంలోకి పాదం మోపి ప్రచారం చేసుకోవడానికి అన్యమతాలవారు వందలఏళ్ళుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మహమ్మదీయుల ప్రాబల్యం దేశమంతటా ఉన్నప్పుడు ఇక్కడికి ఒకానొక ఫకీరు వచ్చి, ఇక్కడ ఉండే స్వామివారి మహిమకు ఆకర్షింపబడి, తానే శివభక్తుడుగా మారాడనీ చెబుతారు. ఆయన పేరు నాగూరు మీరాసాహెబ్. ప్రజలు ఆయన భక్తికి, ఆయన ద్వారా ప్రదర్శింపబడిన మహిమలకు ఆకర్షింపబడి, ఆయనను సేవించేవారని తెలుస్తోంది. ఆయన దేహం చాలించిన తరువాత ఆయన సమాధిపై నిర్మించిన దర్గా ఒకటి ఇప్పటికీ అక్కడి ప్రజలచే గౌరవింపబడుతోంది. ఇంతటి మహిమాన్వితమైన శైవక్షేత్రంలో పాదంమోపి, ఎలాగైనాసరే తమమతాన్ని ప్రజలలో వ్యాపింపజేసుకుందామని కొన్ని మిషనరీలవాళ్ళు ఎంతోకాలంగా ప్రయత్నిస్తూవచ్చారు. అలాంటి ప్రయత్నాలలో ఒకటి ఈమధ్యనే విఫలమైన వైనం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఒక మిషనరీకి చెందిన మతప్రచారకుడు ఒకాయన ఈగ్రామంపై కన్నువేసి, కొంతమంది యువకులను చేరదీశాడు. గ్రామంలో ఒక ఆస్పత్రి, పాఠశాల, వసతిగృహం, కమ్యూనిటీహాలు నిర్మిస్తామని, అవి స్థానికులకు ఎంతో ఉపయోగపడతాయనీ మాయమాటలు చెప్పాడు. పంచాయితీవారినుండి ఆరుసెంట్లస్థలం సంపాదించాడు. అక్కడొక కమ్యూనిటీహాలు కడుతున్నాం అని చెప్పి, ఒకభవనాన్ని నిర్మింపజేశాడు. 2002వ సంవత్సరం అక్టోబర్ 29వ తేదీన ఉదయం 7గంటలకు ప్రభువుతోపాటు అందులో ప్రవేశించుదాం అని చెప్పి, ముహూర్తం కూడా నిర్ణయించాడు. గ్రామంలోని పెద్దలకు అక్కడ సిద్ధమైనది కమ్యూనిటీహలు కాదనీ, చర్చిభవనమనీ తెలిసిపోయింది. ఎలాగైనా సరే అక్కడ బలవంతపు మతాంతరీకరణలు జరగకుండా ఆపాలని వారు నిర్ణయించుకున్నారు. అమలాపురంలో ఉండే విశ్వహిందూపరిషత్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంటి సంస్థల కార్యకర్తలను సంప్రదించారు. వారంతా కలిసి ఆయ్రత్నాన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 28వ తేదీ రాత్రికే గ్రామస్థులంతా సమావేశమై, అన్యమతప్రవేశాన్ని అడ్డుకోవాలని ముక్తకంఠంతో తీర్మానించారు. 29వ తేదీ బ్రాహ్మీముహూర్తంలో గ్రామస్థులందరూ సీతారామలక్ష్మణహనుమల విగ్రహాలతో సిద్ధమైపోయారు. అమలాపురం నుండి కార్యకర్తలందరూ ఉదయం 5గంటలకల్లా అక్కడికి చేరుకున్నారు. మేళతాళాలతో దేవతావిగ్రహాలను ఊరేగించి, హరేరామహరేకృష్ణ, జైజైరామ జానకిరామ, జైశ్రీరాం అంటూ సరిగ్గా ఉదయం 6గంటలకు నూతనంగా నిర్మించిన భవనంలో ప్రవేశించి, దేవతావిగ్రహాలను ప్రతిష్ఠించి, భజనను కొనసాగించారు. మరో అరగంటలో 7గంటల ముహూర్తానికని శిలువతో అక్కడికి చేరుకున్న మతప్రచారకునికి మతిపోయినట్లయింది. కాసేపు అటూఇటూ తచ్చాడాడు. అందరూ ఆయనకేసి చూశారు గానీ, ఒక్కరూ పలుకరించలేదు. జైజైరామ జానకిరామ అంటూ మరింత గట్టిగా గ్రామస్థులు భజన చేస్తుంటే, పరిస్థితిని అర్థంచేసుకున్న ఆపెద్దమనిషి కిమ్మనకుండా కారువెనక్కి త్రిప్పుకుని పలాయనం చిత్తగించాడు.
ఈగ్రామం కథాకమామీషు
ఈవిధంగా మతాంతరీకరణను త్రిప్పికొట్టిన ఈపల్లెకు పెద్దచరిత్రే ఉంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని అపహరించిన రావణాసురుని సంహరించి, అయోధ్యకు తిరిగివెడుతూ, సముద్రతీరానగల ఈప్రాంతంలో కొంతసేపు విశ్రమించాడట. బ్రాహ్మణుడైన రావణుని సంహరించడంవల్ల తనకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందని బాధపడ్డాడట. పాపపరిహారార్థం శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అని సంకల్పించాడట. అందుకు తగిన ముహూర్తాన్ని నిర్ణయించుకుని, ఆసమయానికి తిరిగివచ్చేలా కాశీనుండి శ్రేష్ఠమైన శివలింగాన్ని తీసుకురమ్మని ఆంజనేయస్వామిని ఆదేశించాడట. హనుమ శివలింగంతో తిరిగిరావటం ఆలస్యమైందట. ముహూర్తం మించిపోకూడదని రాములవారు ఆసముద్రతీరాన ఇసుకతోనే ఒక శివలింగాన్ని చేసి, దానికి ప్రాణప్రతిష్ఠ చేసి, తన సంకల్పం నెరవేర్చుకున్నాడట. ఇక్కడ ఈప్రతిష్ఠ జరుగుతుండగా ఆంజనేయస్వామి కాశీనుండి శివలిగాన్ని తీసుకువచ్చాడు. దానిని ఏమి చెయ్యాలి అనే ప్రశ్న తలెత్తింది. అప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామితో ”ఈలింగాన్ని నీవు ఈగోదావరిపాయకు ఆవలివైపున ప్రతిష్ఠ చెయ్యి. ఈరెండు శివలింగాలలో ఒకటి నాపేరుతో శ్రీరామలింగేశ్వరస్వామిగాను, మరియొకటి నీపేరుతో లక్ష్మణేశ్వరస్వామిగాను ప్రసిద్ధికెక్కి, ప్రజలచే పూజింపబడతాయి. వారిపాలిట ఈరెండుక్షేత్రాలూ కల్పవృక్షాలవలె కోరికలు తీరుస్తూ, వారిని తరింపజేస్తాయి” అని చెప్పాడట. ఆవిధంగా రాములవారిచే ప్రతిష్ఠింపబడిన శ్రీరామలింగేశ్వరస్వామివారు పార్వతీసమేతంగా ఇప్పటికీ ఈప్రాంతప్రజలచే ఆరాధింపబడుతున్నారు. ఈఆలయం పశ్చిమముఖంగాను, లక్ష్మణేశ్వరస్వామి ఆలయం తూర్పుముఖంగాను ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉండటం విశేషం. రాములవారు ఇక్కడ ఈప్రతిష్ఠ చేసిన సమయంలో నక్కలు కూశాయనీ, అందువల్ల ఈప్రాంతానికి నక్కారామేశ్వరం అనేఖ్యాతి వచ్చిందనీ ఇక్కడి పెద్దలు చెబుతారు. చాలాకాలం క్రితం ఇక్కడ కంచుతో నిర్మించిన ఆలయం ఉండేదనీ, అది సముద్రం పొంగిరావటంవల్ల కొట్టుకుపోయిందనీ, తరువాతికాలంలో ఇక్కడి ప్రజలు లింగప్రతిష్ఠ చేసి గుడి కట్టించుకున్నారనీ స్థానికులు చెబుతారు. పెద్దాపురం మహారాజులు ఈక్షేత్రమహిమను గురించి తెలుసుకుని ఈదేవుడికి మడిమాన్యాలు సమర్పించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పోయిన ఆస్తి పోగా, ఇప్పుడు స్వామివారిపేరున నలభయ్యెకరాల భూమి మిగిలింది. యాభైసంవత్సరాల క్రితంవరకు ఈఆలయంలో బంగారపు అమ్మవారి విగ్రహం, దేవుని ఊరేగింపుకు వాహనాలు ఉండేవిట. అయితే ఆలయానికి సరయిన రక్షణ లేకపోవటంవల్ల సమీపగ్రామమైన సామంతకుర్రు గ్రామస్తులు ఆవిగ్రహాన్నీ, వాహనాలనూ తమ ఊరి దేవాలయంలో భద్రపరుస్తామని చెప్పి తీసుకువెళ్ళారట. ఆనాటినుండి ఈనాటివరకూ అవి అక్కడే ఉన్నాయని ఈగ్రామప్రజలు చెబుతున్నారు.
శ్రీరామలింగేశ్వరస్వామి మహిమలు
గోదావరీ సంగమస్థానంలో నెలకొని ఉన్న ఈపార్వతీసమేత రామలింగేశ్వరస్వామివారి గురించి, వారి మహిమల గురించి ఎన్నెన్నో కథలూ, గాథలూ ప్రచారంలో ఉన్నాయి. చొల్లంగి అమావాస్యనాడు ఇక్కడ పెద్దతీర్థం జరుగుతుంది. పరిసరప్రాంతాలనుంచే గాక, సుదూరప్రాంతాలనుంచి కూడా ప్రజలు ఇక్కడికి తరలివస్తారు. సముద్రస్నానం చేసి, శ్రీరామలింగేశ్వరస్వామిని సందర్శించి, ఫలపుష్పాలు సమర్పిస్తారు. సంతతిలేని దంపతులు ఇక్కడ సముద్రస్నానం చేసి, ఒకరాత్రి స్వామి సమక్షంలో నిద్రించి, గుడిచుట్టూ ప్రదక్షిణ చేస్తూ, స్వామిని సేవించుకుంటే తప్పకుండా వారికి పిల్లలు పుడతారట. అనారోగ్యంతో బాధపడేవారు తమకు స్వస్థత కలగాలని స్వామివారికి మ్రొక్కుకుంటే ఎలాంటివ్యాధులైనా తగ్గిపోతాయని, ఆతరువాత వారు వచ్చి, ఇక్కడ మ్రొక్కులు చెల్లించుకుంటారనీ తెలుస్తోంది. స్వామికి అర్చన చేసిన తీర్థజలాలు ఎంతోమహిమ గలవని, సర్వవ్యాధినివారకములని కూడా ప్రజల విశ్వాసం. శివరాత్రి పర్వదినమున, రధసప్తమినాడు ఇక్కడ విశేషపూజలు జరుగుతాయి. కార్తీకమాసంలో స్వామిని దర్శించి, అభిషేకాలు చేయించుకునేందుకు అధికసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
ఆలయపునరుద్ధరణ
అతిప్రాచీనమైన ఈశివాలయం శిధిలావస్థకు చేరుకోగా గ్రామపెద్దలు పూనుకుని 1982వ సంవత్సరంలో ఈఆలయానికి ప్రాకారం నిర్మింపజేశారు. వాస్తుశాస్త్రప్రకారం జరిగిన ఈప్రాకార నిర్మాణంవల్ల ఈఆలయానికి మంచిరోజులు వచ్చాయనే చెప్పాలి. 2004వ సంవత్సరంలో ఆలయపునఃప్రతిష్ఠ మహావైభవంగా జరిగింది. శిధిలమైన పానవట్టాన్ని, అమ్మవారి విగ్రహాన్ని మార్చి, క్రొత్తవాటిని ప్రతిష్ఠించి, పూజలు జరిపించారు. శ్రీపుల్లేటికుర్తి పురుషోత్తమశర్మగారు ఈఆలయ ప్రధానార్చకులు. స్వామివారికి నిత్యపూజలు, మహానైవేద్యములు భక్తితో సమర్పిస్తూ, భక్తులకు పూజాదికములను జరిపిస్తున్నారు.
ప్రజల సహకారం
రెండుమూడు కుటుంబాలవారు తప్ప ఈగ్రామంలోని ప్రజలందరూ అగ్నికులక్షత్రియులే. ఈఆలయమన్నా, శ్రీరామలింగేశ్వరస్వామివారన్నా వీరికి ఎంతో భక్తివిశ్వాసాలు ఉన్నాయి. తమకు ఏకష్టం వచ్చినా స్వామికి నివేదిస్తే గట్టెక్కుతామని వారందరూ నమ్ముతారు. సునామీలవంటి ప్రకృతిభీభత్సాలను కూడా తట్టుకుని నిలబడగలిగామంటే అంతా ఆస్వామిదయే అంటారు ఇక్కడి ప్రజలు. ఈమత్స్యకారులకు ఒక సహకారసంఘం ఉంది. అసంఘానికి అధ్యక్షులైన శ్రీఅంగాడి కాళీస్వామిగారు ఈఆలయవిశేషాలను సహృదయంతో తెలియజేశారు. గ్రామస్తులంతా కలసి ఈఆలయ అభివృద్ధికి ఒకలక్షా ఎనభైవేల రూపాయిలు విరాళాలుగా సేకరించామని, ప్రభుత్వంవారు తమవంతుగా మరొక నలభైవేలరూపాయిలు ఇచ్చారనీ, ఈమొత్తమంతా స్వామిపేరున బ్యాంకులో ఉన్నదని చెప్పారు. దీనిపై వచ్చే వడ్డీతో ఇక్కడి కార్యక్రమాలు నడుస్తున్నాయని, అంతకు మించిన అభివృద్ధి కార్యక్రమాలు జరగటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు దేవాదాయశాఖవారి సహకారం లేకపోవటమే కారణమని కూడా ఆయన చెప్పారు.
చేయవలసిన సదుపాయాలు
ప్రసిద్ధమైన ఈశైవక్షేత్రానికి సరయిన ప్రయాణసదుపాయం లేకపోవటం పెద్ద లోపంగా ఉంది. అమలాపురం నుండి చల్లపల్లిమీదుగా సామంతకుర్రు వెళ్ళేందుకు ఒకటిరెండు ఆర్టిసి బస్సులు తిరుగుతున్నాయి గానీ, రోడ్డు పెద్దపెద్ద గోతులతో ప్రమాదభరితంగా ఉండటంవల్ల ప్రయాణీకులు అసౌకర్యానికి లోనవుతున్నారు. పాడయిన ఈమార్గాన్ని తక్షణమే బాగుచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
భక్తులు మ్రొక్కులు చెల్లించుకోవటానికి వచ్చినప్పుడు విడిదిచేసేందుకు వసతిగృహాలు లేక చాలా ఇబ్బందిపడుతున్నారు. కాబట్టి ఇక్కడ దూరప్రాంతాలనుండి వచ్చే భక్తులకోసం వసతిగృహాలు నిర్మించవలసి ఉంది. దేవుడి భూములను కొంతమంది స్వార్థపరులు అక్రమంగా ఆక్రమించుకుని పక్కాభవనాలు నిర్మించుకున్నారు. ఆభవనాలను స్వామివారి ఆస్తిగా ప్రకటించి, స్వామివారికి దక్కేలా చెయ్యవలసి ఉంది.
కొమరగిరిపట్నంనుంచి గోదావరిపాయల మీదుగా ఈగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. గోదావరిపాయలపై వంతెనల నిర్మాణానికి జరిగిన ప్రయత్నం శంకుస్థాపన ఫలకాల వరకు వచ్చి ఆగిపోయింది. రాజకీయాలకు అతీతంగా ఈప్రయత్నాన్ని కొనసాగించి వంతెనలను నిర్మిస్తే, ఈగ్రామం మరింత అభివృద్ధికి నోచుకుంటుంది. అంతేకాక, దేవాలయాన్ని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఈమార్గం ఎంతో సౌకర్యంగా కూడా ఉంటుంది. ఈఆలయానికి ఎదురుగా తూర్పుముఖంగా ఉండే శ్రీలక్ష్మణేశ్వరస్వామిని లక్ష్మణేశ్వరం వెళ్ళి సేవించుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.
క్షేత్రపాలకుడైన కాలభైరవస్వామికి సరయిన ఆవాసం కల్పించవలసి ఉంది. ఆస్తీ, ఆదాయమూ కూడా ఉన్న ఈపురాతన శైవక్షేత్రన్ని భక్తులందరికీ దర్శనీయమైన క్షేత్రంగా చేయటానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోనసీమప్రజలందరూ కోరుకుంటున్నారు.
శ్రీరాములవారిచే ప్రతిష్ఠింపబడినట్లుగా చెప్పబడుతున్న ఈరామేశ్వరస్వామివారు తనప్రతిష్ఠకు కారకుడైన శ్రీరాములవారిని కూడా ఇక్కడ స్థాపించుకుని పూజింపవలసి ఉన్నది అనే సంకల్పాన్ని ఇక్కడి ప్రజల హృదయాలలో కలిగించి, శ్రీరామప్రతిష్ఠ తన భక్తులచే జరిపించటం విశేషం. ”శివస్యహృదయం విష్ణోః” అని కదా అంటారు. వాస్తవానికి దైవం విషయంలో నామభేదమే తప్ప వస్తుభేదం ఉండదు.
మహేశ్వరే వా జగతామధీశ్వరే
జనార్దనే వా జగదన్తరాత్మని|
నవస్తుభేద ప్రతిపత్తిరస్తిమే
తథా-పి భక్తిస్తరుణేన్దుశేఖరే||
అని కదా ఆర్యోక్తి.
SRI DEVI BHAGAVATHAM TELUGU ARTICLES - THE MOVEMENT OF LORD SURYA AND LORD CHANDRAMA
సూర్యచంద్రుల గతులు - గమనాలు, ( శ్రీ దేవీ భాగవతం ).
పైన ఉన్నది శుద్ధాకాశం. సూర్యుడు ఈ బ్రహ్మాండానికి నట్టనడిమిన ఉన్నాడు కదా! ఈతడు హిరణ్య (బంగారం) అండం నుంచి జన్మించాడు కనుక - ఇతడిని హిరణ్యగర్భుడన్నారు. (కొందరు సూర్యుని గర్భంలో బంగారం ఉందని చెబుతారు.) మృతాండం నుండి జన్మించాడు కనుక, మార్తాండుడనీ అంటారు. ఈ సూర్యగోళానికీ - భూగోళానికీ మధ్య దూరం - పాతిక కోట్ల యోజనాలు. ఈ మహావిశాల విశ్వంలో భూమి, దిక్కులు వగైరా విభజనలకు ఆధారం సూర్యభగవానుడే!
శ్లో|| విషు వత్సంజ్ఞ మాసాద్య గతి సామ్యం వి తన్వతే |
సమస్థాన మాసాద్య దిన సామ్యం కరోతి చ||
ఆరోహణ స్థానంలో మందగతిన ఉంటాడు సూర్యుడు. అది దక్షిణాయణం. కనుక పగళ్లు దీర్ఘం, అవరోహణ స్థానంలో సీఘ్ర గతిన ఉంటాడు. అది ఉత్తరాయణం. కనుక రాత్రులు దీర్ఘం. విఘవత్లలో సమగతిలో ఉంటాడు. కనుక పగలూ - రేయీ సమానంగా ఉంటాయి.
రాశుల్లోకి సంక్రమించే సూర్యగతిని బట్టి చెప్పాలంటే - వృషభం నుంచి కన్యారాశి వరకు సూర్యుడు చరిస్తుండగా (దాదాపు 5 నెలల కాలం) పగళ్లు దీర్ఘంగా ఉంటాయి. వృశ్చికం నుంచి మీనరాశి వరకు సూర్యుడు చరిస్తున్నప్పుడు రాత్రులు దీర్ఘం. మేష - తులా రాశుల్లో (విషువత్) మాత్రం రాత్రీ పగలూ సమానం. ఈ ప్రకారం సూర్యగతిలో 1. శీఘ్ర 2. మంద 3. సమగతి అనే 3 భేదాలున్నాయి.
ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే - మేరు పర్వతానికి నాలుగువైపులా నాలుగు దిక్పతుల పురాలున్నాయి. అవి. 1. ఐంద్రి (ఇంద్రుని పురి) 2. సంయమని (యమపురి) 3. నిమ్లోచని (వరుణ పురి) 4. విభావరి (కుబేర పురి). ఈ నాలుగు పట్టణాలూ సూర్యగమనానికి నిమిత్తాలు. సూర్యుడు ఇంద్రిలో ఉదయించి, సంయమానికి మధ్యాహ్నం చేరి, నిమ్లోచనిలో అస్తమించి, విభావరిలో రాత్రి విశ్రాంతి తీసుకుంటాడు. అయితే - మేరువు మీద ఉన్నవారికి మాత్రం సూర్యుడు నిరంతరం ఆకాశానికి మధ్యలో ఉన్నట్లే కనిపిస్తాడు. సూర్యోదయం - సూర్యాస్తమయం ఏమిటి? ఆయన నిత్యుడు - శాశ్వతుడు కదా! నిజమే! దర్శన - దర్శనరహిత భేదాల వల్ల ఇవి మనం ఏర్పరుచుకున్నవే! దీనికిదే శ్లోక ప్రామాణ్యం....
శ్లో|| నై వాస్తమన మర్కస్య నో దయః సర్వదా సతః |
ఉదయాస్త మనాఖ్యం హి దర్శనా దర్శనం రవేః ||
ఇప్పుడు చంద్రగ్రహనానికి సంబధించి గమనం. ఇది చిత్రమయినరీతి. సూర్యుడు కాలచక్ర గతుడై 12 రాశులలోనూ సంచరిస్తూ 12 నెలలను కల్పిస్తుండగా చంద్రుడు పక్షద్వయంతో ఈ మాసకాలాన్ని విభజిస్తున్నాడు.
శ్లో|| భానోర్మాంద్య శైఘ్ర్య సమగతిభిః కాల విత్తమైః |
ఏవం భానోర్గతిః ప్రోక్తా చంద్రాదీనాం నిబోధత ||
సూర్యుడికన్నా చంద్రునిది శీఘ్రగతి. ఏయే నక్షత్రాలతో కూడి ఉంటే, ఆయా నక్షత్రాల వల్ల మాసాలకు పేర్లు ఏర్పడుతున్నాయి. (ఉదా: చంద్రుడు మృగశిరా నక్షత్రంతో కూడినపుడు మార్గశిర మాసం) పెరుగుతున్న చంద్ర కళలతో దేవతలకు - తరుగుతున్న చద్రకళలతో పితృదేవతలకు ఇతడు ఇష్టడవుతున్నాడు. సూర్యునికి సంవత్సరం పాటు పట్టే కాలచక్రాన్ని ఈతడు నెలరోజుల్లో అధిగమిస్తున్నాడు. అమృత కిరణుడు. మనస్సుపై ప్రభావం చూపేవాడు. రాత్రి కారకుడు. సర్వజీవకోటికీ ప్రాణం - జీవం చంద్రుడే!
చంద్రునికి 3 లక్షల యోజనాల దూరంలో మేరువుకు ప్రదక్షిణంగా భచక్రం తిరుగుతూ ఉంటుంది. నక్షత్రాలన్నీ ఈ భచక్రంలోనే సంచరిస్తుంటాయి అభిజిత్తో కలిసి 28 నక్షత్రాలు.
ఈ భచక్రానికి రెండు లక్షల యోజనాల దూరాన శుక్రగ్రహం. సూర్యునికి ముందు - వెనుకలుగా చరించే ఇతడికీ శీఘ్ర - మంద - సమగతులున్నాయి. లోకోపకారి. ఇతడికి రెండు లక్షల యోజనాల దూరాన బుధుడు సౌమ్యుడు. ఈతడికి రెండు లక్షల యోజనాల పైన అంగారకుడున్నాడు. వక్రించనంతవరకు ఇతడూ శుభుడే! ఆపైన రేండు లక్షల యోజనాల దూరంలో శనైశ్చరుడున్నాడు. చాలా మందగతి గలవాడు. ముప్పై నెలలకు గాని ఒక్కోరాశి నుంచీ కదలడు. అంటే ఒక్కోరాశిలోను 21/2 సం||రాలుంటాడు. సహజంగానే అశుభుడు. సూర్యపుత్రుడైన ఇతడికి కటాక్ష వీక్షణం కూడా ఉంది. కాని అది పొందడానికి శ్రమించాల్సి ఉంటుంది.
ఇక్కడకు నవగ్రహాల ఉనికిని స్థిరపరచిన తరువాత, జగదంబిక, ఈశనైశ్చరునికి 11 లక్షల యోజనాల దూరంలో సప్తర్షి మండలాన్ని ఏర్పరచింది. ఈ సప్త ఋషులు లోకాలకు ఎల్లవేళలా శుభం కోరుతూ ఆకాశాన దక్షిణంగా తిరుగుతుంటారు. ఈ సప్తర్షి మండలానికి 13 లక్షల యోజనాల దూరంలో దిక్పాలకులతో సమానంగా దక్షిణం వైపున నిశ్చలంగా కనిపించే సర్వదేవపూజితుడైన ధృవుడున్నాడు. పరమ భాగవతోత్తముడు. లోక వందితుడు. తన తేజస్సుతో ఇతర గ్రహాలను ప్రకాశింపచేస్తుంటాడు. గ్రహ రాశులన్నీ ధ్రువుడి చుట్టూ తిరుగుతూంటాయి.
శ్లో|| ఆ కల్పాంతం చ క్రమంతి ఖే శ్యేనాద్యాః ఖగా ఇవ |
కర్మ సారథ్యయో వాయు వశగాః సర్వ యేవ తే ||
కాల చక్రాన్ని తిప్పే నిమిత్తం గ్రహాలన్నీ ధ్రువుడు కేంద్రబిందువుగా, వాయుప్రేరితాలై కదలాడటం - అదీ ఆ కల్పాంతం వరకు ఆకాశంలో గరుడ పక్షుల్లా చలించటం గొప్ప నిర్మాణ వైచిత్రి. ఈ గ్రహాలే ప్రాణికోటి కర్మల సారధులు. ఈ జ్యోతిర్గణాలు అలా చలిస్తూనే ఉంటాయి తప్ప, ఎన్నడూ రాలిపోవు.
సూర్య మండలానికి క్రిందుగా ఉన్నలోకాలలో సిద్ధ, చారణ, విద్యాధరలోకాలు కూడా ఉన్నాయి. వీటికి క్రిందుగా యక్ష, రాక్షస, పిశాచ, ప్రేత, భూత విహారానికి సంబంధించిన లోకాలూ ఉన్నాయి. వాయుసంచారం ఉన్నంతవరకు అంతరిక్షం అనీ - దీనికి నూరుయోజనాల క్రిందుగా భూగోళం ఉన్నదనీ చెప్పబడింది.
ARTICLE ON AMMARVARI PUJA AND ITS RESULTS
శ్లో|| యే నా నుష్ఠిత మాత్రేణ నరో న నరకం వ్రజేత్ |
సా దేవీ భవ పాథోధేః ఉద్ధర్త్రీ పూజితా నృణామ్ ||
దేవీ ఆరాధన, దేవీపూజ ఒక్కటే సర్వపాప పరిహారకమై, నరకాన్నుంచి రక్షిస్తుంది.
దేవీపూజ - నైవేద్య ఫలితాలు
నారదా! ఇప్పుడు వివిధ వారాలలో చేసే దేవీ పూజకూ - అట్లే ఆ అమ్మవారికి చేసే నైవేద్యాలకూ కలిగే ఫలితాలు చెప్తున్నాను. శ్రద్ధగా ఆలకించు! ఆదివారం పాలు, సోమవారం పాయసం, మంగళవారం కదళీ ఫలం, బుధవారం వెన్న, గురువారం పటిక బెల్లం, శుక్రవారం శర్కర, శనివారం ఆవునెయ్యి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఇవి విశేష ఫలప్రదం. నివేదన చేయదగిన ఇతర వ్యంజనాలలో బెల్లం; తేనె; పెరుగు; ఉండ్రాళ్లు; దోస, గుమ్మడి, పనస, మామిడి ఇత్యాది ఫలాలు; లడ్డు, కజ్జికాయలు, చల్ల బూరెలు వంటిపిండివంటలూ ఉన్నాయి.
మధూక పూజ అని ఇంకొక విధానం కూడా ఉంది. అంటే 'విప్పచెట్టు' క్రింద పూజించడం. చైత్రశుద్ధ తదియ మొదలు, ప్రతి మాసంలోనూ వచ్చే తదియ రోజున ఒక్కొక్కనామధేయంతో అలరారే అమ్మవారిని విప్పచెట్టుక్రింద షోడషోపచార పూజతో అర్చించడం. అసలు - ఆ అమ్మవారే కల్పవృక్షం కనుక ఇలా పూజించిన వారికి అలా కోరింది కోరినట్టు లభించడం ఖాయం!
ఈ 12 తదియలకూ అమ్మవారికి ఉండే 12 నామాలూ ఇవి:
శ్లో|| మంగళా వైష్ణవీ మాయా కాళరాత్రిర్దు రత్యయా|
మహామాయా మాతంగీ చ కాళీ కమల వాసినీ ||
శివా సహస్ర చరణా సర్వమంగళ రూపిణీ |
ఏ భిర్నామపదైర్దేవీం మధూకే పరిపూజయేత్ ||
ఈ నామాలకున్న విశిష్టత రీత్యా నైవేద్యాలు ఇవీ: చైత్రశుద్ధ తృతీయ నాడు పంచఖాద్యాలు, వైశాఖ శుద్ధ తృతీయకు గుడం (బెల్లం), ఆపైన వరుసగా ప్రతినెలలో తృతీయకు తేనె, వెన్న, పెరుగు, చక్కెర, పాయసం, పాలు, పేరిన నెయ్యి, ధధికూర్చి, ఆవునెయ్యి, కొబ్బరి...నివేదనలు.
విధి విధానంగా అర్చించాక, మధూకస్థమైన జగదంబను వ్రతపరిపూర్ణ సిద్ధికై భక్తి ప్రపత్తులతో ఇలా స్తుతించాలి.
నమః పుష్కర నేత్రాయై జగద్ధాత్రే నమో స్తుతే |
మహేశ్వర్యై మహాదేవ్యై మహా మంగళ మూర్తయే ||
యమలోకా భావ కర్త్రీ యమపూజ్యా యమాగ్రజా |
యమ నిగ్రహ రూపాచ యజనీయే నమోనమః ||
కంకాళ కౄరా కామాక్షీ మీనాక్షీ మర్మ భేదినీ |
మాధుర్య రూపశీలాచ మధుర స్వర పూజితా ||
దుగ్ధవల్లీ నివాసార్హే దయనీయే దయాధికే |
దాక్షిణ్య కరుణా రూపే జయ సర్వజ్ఞ వల్లభే ||
(8-24-46 నుండి 55 వరకు)
ఈ స్తోత్రం కూడా పఠించి, అంబను అర్చించడం ద్వారా సర్వపాపాల్నుంచీ విముక్తులవుతారు. కలలోనైనా యమలోక భయం కలగదు. వంశ పరం పరాభివృద్ధి దాయకం. సర్వ మంగళ కారకం. ఇదంతా నరకం నుంచి మనల్ని మనం ఉద్ధరించుకోడానికి అన్ని విధాలా అనుకూలమయిన మార్గం! ఇక్కడ చెప్పిన 12 నామాలూ కాక, ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారికి అయిదు రూపాలున్నాయి. నామ, రూప రీత్యా అవి జగదానంద సంధాయకాలు. వాటి అర్చా - స్వరూపా - మాహాత్మ్యాలను వివరిస్తాను. ముక్తిప్రదంగానూ - కుతూహల దాయకంగానూ ఉంటాయవి అని కొద్దిసేపు విరామం ఇచ్చాడు - నారాయణ ఋషి.
Subscribe to:
Posts (Atom)