The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
SRI SURYANARAYANA SWAMY TEMPLE AT JAINADH VILLAGE, NEAR CHANDRAPUR, ADILABAD, TELANGANA, INDIA
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం
తెలంగాణలో ఎంతో చార్రితక ప్రాధాన్యం గల ‘ఆదిత్యుని ఆలయం’ ఒకటి ఆదిలాబాద్ దగ్గర ఉందన్న సంగతి చాలామందికి తెలియదు.
అది జైనద్ మండల కేంద్రం. ఆదిలాబాద్ పట్టణం నుండి తూర్పువైపున చంద్రాపూర్ మార్గంలో సుమారు 20 కి.మీ. దూరంలో ఈ చిన్న పట్టణం ఉంటది. పూర్వకాలంలో అయితే, ఈ ఊరును ‘ఝేంఝ’ అని పిలిచేవారని, తర్వాత కాలక్షికమేణా అది ‘జైనద్’గా మారిందని చరివూతకారుల కథనం.
తెలంగాణలో ఎంతో చార్రితక ప్రాధాన్యం గల ‘ఆదిత్యుని ఆలయం’ ఒకటి ఆదిలాబాద్ దగ్గర ఉందన్న సంగతి చాలామందికి తెలియదు.
అది జైనద్ మండల కేంద్రం. ఆదిలాబాద్ పట్టణం నుండి తూర్పువైపున చంద్రాపూర్ మార్గంలో సుమారు 20 కి.మీ. దూరంలో ఈ చిన్న పట్టణం ఉంటది. పూర్వకాలంలో అయితే, ఈ ఊరును ‘ఝేంఝ’ అని పిలిచేవారని, తర్వాత కాలక్షికమేణా అది ‘జైనద్’గా మారిందని చరివూతకారుల కథనం.
ఆదిలాబాద్ జిల్లాలోనే దీనిని ‘అతి ప్రాచీనమైన దేవాలయం’గా చెబుతున్నారు. ఈ ఆలయ నిర్మాణ శైలి అంతా మహారాష్ట్ర, త్రయంబకంలలోని దేవాలయాల రీతిని పోలి ఉంటది. అంతేకాదు, ఈ రకమైన అన్ని ఆలయాలకు ఉపయోగించిన ‘శిలా స్వరూపం’ ఒక్కటే కావడం గమనార్హం.
ఇక్కడి మూల విరాట్టును ‘లక్ష్మినారాయణస్వామి’గా పిలవడం మరో విశేషం. అయితే, స్వామి విగ్రహం తల వెనుక భాగంలో నమ్మశక్యం కాని రీతిలో ‘జ్వాలా తోరణం’ ఉంది. ఈ కారణంగానే ఆయన్ని ‘సూర్యనారాయణస్వామి’గా కూడా భక్తులు పిలుస్తారు. దీనికి మరో కారణం ఏమంటే, మందిరంలో ఒకటిన్నర అడుగుల వైశాల్యంలో ఓ శిలా శాసనం ఉంది. దానిపై దేవనాగరి లిపిలో ఇరవై శ్లోకాలు ఉన్నట్టు చెబుతారు. ఈ శాసనం ‘నమః సూర్యాయ’ అంటూ ప్రారంభమైంది. ఈ రీత్యాకూడా ఇక్కడి స్వామి ‘సూర్యనారాయణుడు’ అయ్యాడు.
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయమూ ఉంది. అదేమంటే ఏడాదిలో నాలుగు నెలలపాటు సూర్యకిరణాలు స్వామి పాదాలను స్పృశిస్తాయి. సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో మళ్లీ ఫిబ్రవరి, మార్చి నెలల్లో సూర్యుడు తూర్పు మధ్యలో ఉదయించిన కాలంలో ప్రప్రథమ లేలేత కిరణాలు ఈ స్వామి పాదాలను స్పర్శించడం విశేషం.
ఎంతో అరుదైన ఈ దేవాలయం రాష్ట్ర కూటులు లేదా కళ్యాణి చాళుక్యుల కాలంలో నిర్మితమై ఉండవచ్చునని చరివూతకారులు భావిస్తున్నారు. కాగా, ఈ గ్రామంలో నూతన గృహాల నిర్మాణానికి గాను పలువురు పునాదుల కోసం తవ్వకాలు జరిపినప్పుడు పలు శిల్పాలు బయట పడుతుంటాయని స్థానికులు చెబుతున్నారు. అలాగే, పురాతత్వ శాఖ వారు కూడా రెండుమార్లు ఈ దేవాలయం వద్ద తవ్వకాలు జరిపారు.
ప్రస్తుతం ప్రధాన దేవాలయం పక్కన శిథిలమైన మరో శివాలయమూ ఉంది. దీని ముందున్న పుష్కరిణి కూడా బాగా శిథిలమై ఉంది. ప్రస్తుతం అదొక చెరువులా కనిపిస్తోంది. ఒకప్పుడు ఈ ప్రదేశమంతా ఓ పట్టణంగా ఉండి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అయితే, ఆహ్లాదకరంగా గ్రామం పక్కన ఉన్న ఏరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకప్పుడు వారం వారం సంత జరిగేది. ఇక్కడ పశువుల సంత కూడా ఉండేది. అప్పట్లో చుట్టూ ఉన్న పది, ఇరవై గ్రామాల ప్రజలు ఈ సంతలలో పాల్గొనే వారు. ఇక్కడ పశువుల అమ్మకాలు జోరుగా జరిగేవనీ చెప్తారు. అయితే, ఇప్పుడు ఈ సంతకు ఎవరూ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
1985 వరకూ ఇక్కడికి రోడ్డు సౌకర్యం లేదు. వర్షాకాలంలో పట్టణంతో సంబంధం తెగిపోయేది. గ్రామంలోని రోగులనైతే మంచంపై పడుకోబెట్టి ఆదిలాబాద్ తీసుకెళ్లే వారు. ఇప్పుడు చంద్రాపూర్ వరకూ పక్కా రోడ్డయ్యింది. గుడి దాకా రవాణా సౌకర్యం కొంతవరకు మెరుగైంది. ప్రస్తుతం జైదన్ గ్రామంలో ఆరోగ్య కేంద్రమూ ఉంది. దానికి స్వంత భవనం ఏర్పాటైంది. ఉన్నత పాఠశాల, పోలీస్ స్టేషన్ వంటివీ ఉన్నాయి. ఆదిలాబాద్ తాలూకా పరిధిలో జూనియర్ కళాశాల ఉన్న మండలం కేంద్రం ఇదే. కాకపోతే మెరుగైన మంచినీటి సౌకర్యం లేదు. వేసవి కాలంలో ఇక్కడనీటికి కటకటే.
జైదన్లోని శ్రీ సూర్యనారాయణ స్వామిపట్ల అనేకమంది భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తారు. సంతానం లేని వారు స్వామి వారిని ‘కొంగు బంగారం’గానూ భావిస్తారు. స్వామి వారి దర్శనానికి నాందేడ్, యవత్మాన్, చంద్రాపూర్ (మహారాష్ట్ర) జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో (శుద్ధ ద్వాదశి నుండి బహుళ దశమి దాకా) స్వామి వారి కళ్యాణోత్సవం, రథోత్సవం, జాతరలు వైభవంగా జరుగుతాయి.
TELUGU RAMAYANA KATHALU - RAMAYANA STORIES IN TELUGU - STORY ABOUT GODDESS SITA DEVI AND LORD SRI RAMA IN TELUGU
సీతాదేవి
సీతాదేవి 18 సంవత్సరముల వయస్సులో రామునితో వనవాసమునకు వెళ్ళెను. పంచవటిలో 3 సంవత్సరములు పది సంవత్సరములు రామునితో కలసియే ఉన్నది. అప్పటి నుండి ఆమె స్వామి సన్నిధిని కోల్పోయినది. యుద్ధానంతరము అయోధ్యకి వచ్చినను సంవత్సరము తిరగక ముందే మరల స్వామి సన్నిధికి దూరమైనది. చివరకు భూప్రవేశముతో స్వామికి శాశ్వతముగ దూరమైనది. ఇంత భక్తి ప్రేమ కలిగిన సీత స్వామికి ఏల దూరము కావలసివచ్చినది. ఆమె మహా పతివ్రత. ఇచ్చట పతి శబ్ధము స్వామిని చెప్పును. ఆమె విషయములో స్వామియు భర్తయు ఒక్కరే. దీనికి కారణము అగు కర్మ లేకుండా ఫలము సంభవించదు. ఆమె కొన్ని భగవదపచారములను చేసినది. కాని స్వామి వాటిని లెక్కించలేదు. అవియేమనగా
అరణ్య వాసమునకు పోవునపుడు సీతను అయోధ్యలోనే ఉండమన్నాడు స్వామి. ఇదే ఆజ్ఞను స్వామి మధురకు పోవుచు రాధకు ఇచ్చినాడు. రాధ స్వామి ఆజ్ఞను పాటించి బృందావనములోనే ఉండిపోయినది. కాని సీత స్వామి ఆజ్ఞను పాటించక వెంటపడినది. అప్పుడు ఆవేశములో స్వామిని నిందించినది కూడ. స్వామిని "స్త్రియం పురుష విగ్రహమ్" అనగా నీవు నన్ను అడవిలో రక్షించలేవా నీవు పురుషుడవేనా? నా తండ్రి జనకుడు పురుష వేషములో యున్న ఒక స్త్రీకి నను ఇచ్చి చేసినాడని దూషించినది. దీనికి కూడ స్వామి కోపగించలేదు. ఏలననగా ఆయన స్తోత్రము నుండియును నింద నుండియును సమాన ఆనందము పొందును. ఇదే గీతలో "తుల్య నిందా స్తుతిః" అని చెప్పబడినది. పాయసము ఆనందమును కల్గించినట్లు ఆవకాయ అన్నము కూడా ఆనందము కల్గించును. కాన సుఖదుఃఖము మానవమానములు రెండు ఆనందకరములే. స్వామి విషయములో ఇంకనూ విశేషమేమనగా స్తోత్రము కంటే నిందకే విశేషముగా ఆనందించును. ఏలననగా? ఆయన స్వస్వరూపములో యున్నపుడు దేవతలు ఋషులు నిరంతరము స్తుతించెదరు. కనుక స్తోత్రములతో వెగటు పుట్టి నిందలకే వాచిపోయినట్లుండెను. అందుకే ఆయన నరావతారము దాల్చి ఎవరైన తనను నిందించినపుడు పరమానందము చెందుచుండును. కాని ఆయన భాగవతాపచారమును సహించడు. భాగవతుడు అనగా భక్తుడగు జీవుడు. జీవుడు అవమానమునకు దుఃఖపడును.
ఆదిశేషుడు పరమ భాగవతోత్తముడు. లక్ష్మీదేవి కేవలము పాదస్పర్శయే నిరంతరము అనుగ్రహించినాడు. ఆదిశేషునకు ఆ పాదమస్తక స్పర్శను శయనించి అనుగ్రహించినాడు. ఆ ఆదిశేషుడు లక్ష్మణుడుగా అవతరించి రాముని వెంట నిరంతరము ఉండినాడు. రాముని విడచి భరత శతృఘ్నులు మేనమామ ఇంటికి పోయినారే గాని లక్ష్మణుడు పోలేదు. సీత లంకలో ఉండినప్పుడు కూడ లక్ష్మణుడు రామునితో ఉన్నాడు. మరల సీతను అడవులకు పంపినను లక్ష్మణుడు రామునితోనే ఉన్నాడు. లక్ష్మణుడు సరయూ నదిలో దూకిన కొన్ని గంటలకే రాముడు సరయూ నదిలో దూకినాడు. సీతయును భక్తుడగు జీవుడే. సీత యనగా నాగటి చాలు అది ఎట్టి వంకర లేక నేరుగా యుండును. శేషుడనగా సర్పము. అది వంకర టింకరలుగా పోవుచుండును. నేరు మార్గమున వచ్చు భక్తులు, వంకర మార్గమున వచ్చు భక్తులు ఆక్షేపించగనే పతనము ప్రారంభమగును. సీతాదేవి లక్ష్మణునిపై ఘోరనింద వేసినది. ఇది భాగవతాపచారము. అందుకే స్వామి సంకల్పించి చాకలి వానిచే సీతపై నింద వేయించినాడు. నిందాకర్మకు నిందయే ఫలము. ఆమె లక్ష్మణును నిందించిన కొన్ని నిమిషములకే రామునికి దూరమై పోయినది. అంతటితో ఫలానుభవము ఆగలేదు. మరల రజకుని చేత నిందింపబడి స్వామికి దూరమైనది. స్వామి వియోగములో ఆవేశములో మనస్సు స్ధిమితమును కోల్పోయినది. అందుకే చివరలో నీవు అయోధ్యా జనులకు మరల ఒక నిరూపణము చేసి చూపించమని స్వామి ఆదేశించినప్పుడు స్వామి ఆజ్ఞను తిరస్కరించి భూప్రవేశము చేసినది. ఆ సమయములో ఆ బుద్ధి పుట్టుటకు కారణము కూడా లక్ష్మణుని నిందించుటయే. ఈ విధముగా భాగవతాపచారము వలన ఆమె స్వామి సన్నిధిని శాశ్వతముగా కోల్పోయినది. ఈ పాపకర్మ ఫలము మరుజన్మలో కూడ వెంటపడినది. ఆమె రుక్మిణిగా అవతరించినప్పుడు శిశుపాలుడు పెండ్లి కొడుకుగా వచ్చి వియ్యాల వారి యింటిలో కూర్చునియున్నాడు. గౌరీపూజ సిద్ధమైనది. అప్పుడు ఆమె పడిన వేదన వర్ణనాతీతము. ఎంత వేదన పడినదంటే తాను లక్ష్మణుని నిందించినప్పుడు ఎంత భాధపడినాడో అంత తపన పడినది. ఇంకనూ కొంత కర్మ శేషము మిగిలియున్నది. దానిని కూడా పోగొట్టుటకు, పెండ్లి తరువాత ఒకనాడు శ్రీ కృష్ణుడు "మేము రాజులము కాము. శిశుపాలునే మరల పెండ్లి చేసికొమ్మని చెప్పగా రుక్మిణి దేవి మూర్చపోయినది". దానిని రాధకు వేడిపాలను ఇచ్చిన సందర్భములో రుక్మిణి దేవి ఓడిపోయినట్లు చేసి అవమానము చేసినాడు. ఈ విధముగా పంచభూతములతో నిర్మింపబడిన శరీరము, చేసిన భాగవతాపచారమునకు పంచ విధములుగా భాగించినారు స్వామి.
ఈ ఐదు భాగము మాత్రమే సీతను అడవులకు పంపించుట. ఇది చూచి అజ్ఞానులు రాముడు సీతకు ఎంత అవమానము చేసినాడని వాపోవుదురు. హనుమంతుడు రాధ మార్గమును వంకరయని ఆక్షేపించినాడు. కావున స్వామి రాధనే ఆదరించినాడు. అట్లే సీత లక్ష్మణుని ఆక్షేపించినది. కావున స్వామి లక్ష్మణుని ఆదరించినాడు. రాధ స్త్రీ అయినచో, లక్ష్మణుడు పురుషుడు. కావున స్వామికి స్త్రీ, పురుష వివక్షత లేదు. భక్తి పరీక్షను పట్టియే ఫలము లభించును. నీవు ఒక దైవ స్వరూపమును ఎన్నుకొని ఆరాధించుచుండగా ఆ దైవ స్వరూపము మీద నీకున్న చెదరని దృష్టియే నిష్ట అనబడును. నీవు సాధనలో క్రమముగా పైకి వచ్చుచుండగా, ఆ దైవ స్వరూపములోని అంతస్వరూపుడగు దత్తుడు క్రమముగా ప్రకటితమగుచుండును. దత్తుడు ప్రకటింపబడిన కొలది ఉష్ణము పెరుగును. సూర్యుని సమీపించిన కొలది ఉష్ణము పెరుగును. దత్తుడు పరిపూర్ణముగా ప్రకటితమగు సమయమున నీవు సాక్షాత్తు సూర్యగోళములో ఉందువు. దత్తపరీక్షలకు ఎంతో ఓర్పు కావలయును. అందుకే సాధన గుణ సంపత్తిలో మొట్ట మొదటి గుణము శమము అనగా ఓర్పు అని శంకరులు అద్వైత భాష్యమున వచించియున్నారు. కావున నిష్టతో పాటు సబూరి అవసరమన్నారు. సబూరి యనగా ఓర్పు కావలయునని శిరిడి సాయి ఎల్లప్పుడు బోధించెడివారు. రాధ స్వామి ఆజ్ఞననుసరించి, ఎల్లప్పుడును బృందావనములోనే నిద్రాహారములు మాని స్వామి ఆజ్ఞను పాటించుచు స్వామిని పల్లెత్తు మాట అనక జీవితమంతయును గడిపినది.
లక్ష్మణుడు కూడ పదునాలుగు సంవత్సరములు నిద్రాహారములు లేక స్వామిని సేవించినాడు. అంతే కాదు లంకలో సీత యొక్క అగ్ని ప్రవేశమునకు అగ్నిని కాల్చమని స్వామి ఆదేశించగా మారు మాట్లాడక సిద్ధము చేసినాడు. సీతను అడవులలో దింపి రమ్మని స్వామి ఆజ్ఞాపించగా ఎదురు చెప్పక స్వామి ఆజ్ఞను పాటించినాడు. ఇచ్చటి లక్ష్మణ భక్తియే కాక మరొక విశేషము కలదు. లక్ష్మణుని నిందా పాప కర్మ ఫలమును లక్ష్మణుని ద్వారానే అందించినాడు. కావున స్వామిలో ఎప్పుడు ఎట్టి పొరపాటు కూడా ఉండదు. ఆయన చర్యలోని అంతరార్ధమును మనము గ్రహించ లేక చాలా సార్లు స్వామిని అపార్ధము చేసుకొందుము. నిరాకారమైన స్వామిపై ఎట్టి బంధమును ఉంచలేము. కావున నిరాకారము యొక్క ధ్యానము వ్యర్ధము. నిరాకారము కొరకు సాకారులగు ధన గృహములను, నరాకారులగు భార్యాపుత్రాదులను త్యజించుట హస్యాస్పదము. మనకు ప్రత్యక్షము కూడా కాని అమృతము కొరకు మనకు ప్రత్యక్షముగ లభించుచున్న కాఫీ మొదలగు పానీయములను త్యజించెదమా? ఒక ప్రత్యక్ష పదార్ధము కొరకు మరియొక ప్రత్యక్ష పదార్ధమును త్యజించవచ్చును. ప్రత్యక్షము కాని నిరాకారము కొరకు ప్రత్యక్షములను ఏల త్యజించ వలెను. ఒక గ్లాసులో అమృతము పోసి యిచ్చి త్రాగించి రుచి చూపినచో, నీవు చెప్పనక్కరలేకయే వాడు కాఫీని త్యజించును. అంతే కాని అమృతము ఉన్నది. దాని ఆకారము కూడ నాకు తెలియదు. దాని కొరకు నీవు కాఫీని త్యజించమన్నచో ఎవడును త్యజించడు. త్యజించుటయు అవివేకము. కావున నిరాకార ధ్యాన మార్గములో వైరాగ్యము రాదు. ఇక సాకార మార్గములో ఒక విగ్రహమును, పటమును ధ్యానించుచున్నాము. అది అచేతనమైన జడపదార్ధము. జడము కన్నను చేతనము విలువ కలదు అని బాలుడు కూడ చెప్పును. కావున ఒక విగ్రహము పటము కొరకు చేతనమగు భార్యాపుత్రాదులను త్యజించనేల?
కావున అచేతనములను ఆరాధించు సాకారమార్గములో కూడ వైరాగ్యము అర్ధరహితమై యున్నది. దీనిని బోధించుటకే త్యాగరాజు ఆరాధించు రామ విగ్రహమును స్వామి సంకల్పము చేత నదిలో పారవేయబడెను. దానితో త్యాగరాజు ఉన్మత్తుడై నిరాహారియై దేశ భ్రమణము చేయుచుండగా భార్యయును నిరాహారియై ప్రాణములను విడచినది. ఇది సరియైన మార్గము కాదని స్వామి త్యాగరాజుకు స్వప్న దర్శనములో బోధించినాడు. కాని స్వామి నరాకారమున అవతరించినప్పుడు అచేతనములైన గృహాదులను చేతనులైనన భార్యాపుత్రాదులను త్యజించుటలో అర్ధమున్నది. చేతనము కొరకు జడములను త్యజించుట యుక్తమే కదా. ఇక చేతనులగు నరులలో అత్యుత్తముడగు పురషోత్తముని కొరకు ఇతర నరులను త్యజించుట కూడా యుక్తమే అగును. పురుషుడనగా జీవుడు అని అర్ధము కూడా ఉన్నది. "పురి" "దేహి"చేతే"పురుషః" అని అర్ధమున్నది. అనగా పురము అనబడు దేహము నందు వ్యాపించి యుండు చైతన్య స్వరూపుడు జీవుడు అని అర్ధము. కావున పురుషులలో అనగా జీవులలో ఉత్తముడగు పురషోత్తమముడగు నరావతారములో యున్న స్వామి కొరకు ఇతర పురుషులను అనగా ఇతర జీవులను త్యజించుటలో అర్ధమున్నది. కావున మార్గములోనే వైరాగ్యము సాధ్యము సార్ధకము. ఒకే సమయమున స్వామి ఒకే నరావతారములో ఉండవచ్చును లేక అనేక నరావతారములలో ఉండవచ్చును. అక్కలకోట మహారాజ్, శిరిడిసాయి ఒకే సమయమున ఉన్నారు. ఇరువురు దత్తావతారములే కావున నేనొక్కడనే దత్తుడన్నవాడు మూర్ఖుడు. వాడు అసలు దత్తుడే కాదు. వాడిని మనము పరీక్షింప పనిలేదు. పరీక్ష ఫలమును వాడే స్వయముగా చెప్పుచున్నాడు.
పౌండ్రక వాసుదేవుడు శంఖ చక్రములు ధరించి నేనొక్కడనే నారాయణావతారుడనని వాగినాడు. ఒకే సమయమున రెండు తీగెల ద్వారా ఒకే విద్యుత్తు ప్రవహించి ఫ్యాను త్రిప్పుట, లైటును వెలిగించుట అను రెండు వేరు వేరు పనులను చేయుచున్నది. కావున స్వామి కార్యమును అనుసరించి ఒకే సమయమున అనేక నరావతారములు రావచ్చును. ఒకే సమయమున అర్జునుడు విశ్వరూపమును చూచినాడు. విశ్వరూపము యొక్క పటములో అనేక ముఖములు అనేక బాహువులు ఉండును. కాని రెండే కాళ్ళు ఒకే ఉదరము ఉండును. ఈ చిత్రపటము సరియైనది కాదు. విశ్వరూపములో అర్జునుడు ఒకే సమయమున అవతరించిన అనేక నరావతారములను చూచినాడు. కావుననే అనేక బాహుదర వక్త్ర నేత్రం అని సూచించినాడు. అనగా అనేక బాహువులు అనేక ఉదరములు అనేక వక్త్రములు అనేక నేత్రములు అని అర్ధము. ఇదే అర్ధము సహస్రాత్ అని పురుష సూక్తములో అనేక పాదములు అనియును చెప్పబడినది. అనగా అనేక నరావతారములు అని అర్ధము. అయితే సృష్టి మొదలు ఇప్పటి వరకును వచ్చిన నరావతారముల సమూహము అని కూడా చెప్పవచ్చును గదా. కావున ఒకే సమయమున అనేక నరావతారములు ఉండవు అని వాదించరాదు.
సీతాదేవి 18 సంవత్సరముల వయస్సులో రామునితో వనవాసమునకు వెళ్ళెను. పంచవటిలో 3 సంవత్సరములు పది సంవత్సరములు రామునితో కలసియే ఉన్నది. అప్పటి నుండి ఆమె స్వామి సన్నిధిని కోల్పోయినది. యుద్ధానంతరము అయోధ్యకి వచ్చినను సంవత్సరము తిరగక ముందే మరల స్వామి సన్నిధికి దూరమైనది. చివరకు భూప్రవేశముతో స్వామికి శాశ్వతముగ దూరమైనది. ఇంత భక్తి ప్రేమ కలిగిన సీత స్వామికి ఏల దూరము కావలసివచ్చినది. ఆమె మహా పతివ్రత. ఇచ్చట పతి శబ్ధము స్వామిని చెప్పును. ఆమె విషయములో స్వామియు భర్తయు ఒక్కరే. దీనికి కారణము అగు కర్మ లేకుండా ఫలము సంభవించదు. ఆమె కొన్ని భగవదపచారములను చేసినది. కాని స్వామి వాటిని లెక్కించలేదు. అవియేమనగా
అరణ్య వాసమునకు పోవునపుడు సీతను అయోధ్యలోనే ఉండమన్నాడు స్వామి. ఇదే ఆజ్ఞను స్వామి మధురకు పోవుచు రాధకు ఇచ్చినాడు. రాధ స్వామి ఆజ్ఞను పాటించి బృందావనములోనే ఉండిపోయినది. కాని సీత స్వామి ఆజ్ఞను పాటించక వెంటపడినది. అప్పుడు ఆవేశములో స్వామిని నిందించినది కూడ. స్వామిని "స్త్రియం పురుష విగ్రహమ్" అనగా నీవు నన్ను అడవిలో రక్షించలేవా నీవు పురుషుడవేనా? నా తండ్రి జనకుడు పురుష వేషములో యున్న ఒక స్త్రీకి నను ఇచ్చి చేసినాడని దూషించినది. దీనికి కూడ స్వామి కోపగించలేదు. ఏలననగా ఆయన స్తోత్రము నుండియును నింద నుండియును సమాన ఆనందము పొందును. ఇదే గీతలో "తుల్య నిందా స్తుతిః" అని చెప్పబడినది. పాయసము ఆనందమును కల్గించినట్లు ఆవకాయ అన్నము కూడా ఆనందము కల్గించును. కాన సుఖదుఃఖము మానవమానములు రెండు ఆనందకరములే. స్వామి విషయములో ఇంకనూ విశేషమేమనగా స్తోత్రము కంటే నిందకే విశేషముగా ఆనందించును. ఏలననగా? ఆయన స్వస్వరూపములో యున్నపుడు దేవతలు ఋషులు నిరంతరము స్తుతించెదరు. కనుక స్తోత్రములతో వెగటు పుట్టి నిందలకే వాచిపోయినట్లుండెను. అందుకే ఆయన నరావతారము దాల్చి ఎవరైన తనను నిందించినపుడు పరమానందము చెందుచుండును. కాని ఆయన భాగవతాపచారమును సహించడు. భాగవతుడు అనగా భక్తుడగు జీవుడు. జీవుడు అవమానమునకు దుఃఖపడును.
ఆదిశేషుడు పరమ భాగవతోత్తముడు. లక్ష్మీదేవి కేవలము పాదస్పర్శయే నిరంతరము అనుగ్రహించినాడు. ఆదిశేషునకు ఆ పాదమస్తక స్పర్శను శయనించి అనుగ్రహించినాడు. ఆ ఆదిశేషుడు లక్ష్మణుడుగా అవతరించి రాముని వెంట నిరంతరము ఉండినాడు. రాముని విడచి భరత శతృఘ్నులు మేనమామ ఇంటికి పోయినారే గాని లక్ష్మణుడు పోలేదు. సీత లంకలో ఉండినప్పుడు కూడ లక్ష్మణుడు రామునితో ఉన్నాడు. మరల సీతను అడవులకు పంపినను లక్ష్మణుడు రామునితోనే ఉన్నాడు. లక్ష్మణుడు సరయూ నదిలో దూకిన కొన్ని గంటలకే రాముడు సరయూ నదిలో దూకినాడు. సీతయును భక్తుడగు జీవుడే. సీత యనగా నాగటి చాలు అది ఎట్టి వంకర లేక నేరుగా యుండును. శేషుడనగా సర్పము. అది వంకర టింకరలుగా పోవుచుండును. నేరు మార్గమున వచ్చు భక్తులు, వంకర మార్గమున వచ్చు భక్తులు ఆక్షేపించగనే పతనము ప్రారంభమగును. సీతాదేవి లక్ష్మణునిపై ఘోరనింద వేసినది. ఇది భాగవతాపచారము. అందుకే స్వామి సంకల్పించి చాకలి వానిచే సీతపై నింద వేయించినాడు. నిందాకర్మకు నిందయే ఫలము. ఆమె లక్ష్మణును నిందించిన కొన్ని నిమిషములకే రామునికి దూరమై పోయినది. అంతటితో ఫలానుభవము ఆగలేదు. మరల రజకుని చేత నిందింపబడి స్వామికి దూరమైనది. స్వామి వియోగములో ఆవేశములో మనస్సు స్ధిమితమును కోల్పోయినది. అందుకే చివరలో నీవు అయోధ్యా జనులకు మరల ఒక నిరూపణము చేసి చూపించమని స్వామి ఆదేశించినప్పుడు స్వామి ఆజ్ఞను తిరస్కరించి భూప్రవేశము చేసినది. ఆ సమయములో ఆ బుద్ధి పుట్టుటకు కారణము కూడా లక్ష్మణుని నిందించుటయే. ఈ విధముగా భాగవతాపచారము వలన ఆమె స్వామి సన్నిధిని శాశ్వతముగా కోల్పోయినది. ఈ పాపకర్మ ఫలము మరుజన్మలో కూడ వెంటపడినది. ఆమె రుక్మిణిగా అవతరించినప్పుడు శిశుపాలుడు పెండ్లి కొడుకుగా వచ్చి వియ్యాల వారి యింటిలో కూర్చునియున్నాడు. గౌరీపూజ సిద్ధమైనది. అప్పుడు ఆమె పడిన వేదన వర్ణనాతీతము. ఎంత వేదన పడినదంటే తాను లక్ష్మణుని నిందించినప్పుడు ఎంత భాధపడినాడో అంత తపన పడినది. ఇంకనూ కొంత కర్మ శేషము మిగిలియున్నది. దానిని కూడా పోగొట్టుటకు, పెండ్లి తరువాత ఒకనాడు శ్రీ కృష్ణుడు "మేము రాజులము కాము. శిశుపాలునే మరల పెండ్లి చేసికొమ్మని చెప్పగా రుక్మిణి దేవి మూర్చపోయినది". దానిని రాధకు వేడిపాలను ఇచ్చిన సందర్భములో రుక్మిణి దేవి ఓడిపోయినట్లు చేసి అవమానము చేసినాడు. ఈ విధముగా పంచభూతములతో నిర్మింపబడిన శరీరము, చేసిన భాగవతాపచారమునకు పంచ విధములుగా భాగించినారు స్వామి.
ఈ ఐదు భాగము మాత్రమే సీతను అడవులకు పంపించుట. ఇది చూచి అజ్ఞానులు రాముడు సీతకు ఎంత అవమానము చేసినాడని వాపోవుదురు. హనుమంతుడు రాధ మార్గమును వంకరయని ఆక్షేపించినాడు. కావున స్వామి రాధనే ఆదరించినాడు. అట్లే సీత లక్ష్మణుని ఆక్షేపించినది. కావున స్వామి లక్ష్మణుని ఆదరించినాడు. రాధ స్త్రీ అయినచో, లక్ష్మణుడు పురుషుడు. కావున స్వామికి స్త్రీ, పురుష వివక్షత లేదు. భక్తి పరీక్షను పట్టియే ఫలము లభించును. నీవు ఒక దైవ స్వరూపమును ఎన్నుకొని ఆరాధించుచుండగా ఆ దైవ స్వరూపము మీద నీకున్న చెదరని దృష్టియే నిష్ట అనబడును. నీవు సాధనలో క్రమముగా పైకి వచ్చుచుండగా, ఆ దైవ స్వరూపములోని అంతస్వరూపుడగు దత్తుడు క్రమముగా ప్రకటితమగుచుండును. దత్తుడు ప్రకటింపబడిన కొలది ఉష్ణము పెరుగును. సూర్యుని సమీపించిన కొలది ఉష్ణము పెరుగును. దత్తుడు పరిపూర్ణముగా ప్రకటితమగు సమయమున నీవు సాక్షాత్తు సూర్యగోళములో ఉందువు. దత్తపరీక్షలకు ఎంతో ఓర్పు కావలయును. అందుకే సాధన గుణ సంపత్తిలో మొట్ట మొదటి గుణము శమము అనగా ఓర్పు అని శంకరులు అద్వైత భాష్యమున వచించియున్నారు. కావున నిష్టతో పాటు సబూరి అవసరమన్నారు. సబూరి యనగా ఓర్పు కావలయునని శిరిడి సాయి ఎల్లప్పుడు బోధించెడివారు. రాధ స్వామి ఆజ్ఞననుసరించి, ఎల్లప్పుడును బృందావనములోనే నిద్రాహారములు మాని స్వామి ఆజ్ఞను పాటించుచు స్వామిని పల్లెత్తు మాట అనక జీవితమంతయును గడిపినది.
లక్ష్మణుడు కూడ పదునాలుగు సంవత్సరములు నిద్రాహారములు లేక స్వామిని సేవించినాడు. అంతే కాదు లంకలో సీత యొక్క అగ్ని ప్రవేశమునకు అగ్నిని కాల్చమని స్వామి ఆదేశించగా మారు మాట్లాడక సిద్ధము చేసినాడు. సీతను అడవులలో దింపి రమ్మని స్వామి ఆజ్ఞాపించగా ఎదురు చెప్పక స్వామి ఆజ్ఞను పాటించినాడు. ఇచ్చటి లక్ష్మణ భక్తియే కాక మరొక విశేషము కలదు. లక్ష్మణుని నిందా పాప కర్మ ఫలమును లక్ష్మణుని ద్వారానే అందించినాడు. కావున స్వామిలో ఎప్పుడు ఎట్టి పొరపాటు కూడా ఉండదు. ఆయన చర్యలోని అంతరార్ధమును మనము గ్రహించ లేక చాలా సార్లు స్వామిని అపార్ధము చేసుకొందుము. నిరాకారమైన స్వామిపై ఎట్టి బంధమును ఉంచలేము. కావున నిరాకారము యొక్క ధ్యానము వ్యర్ధము. నిరాకారము కొరకు సాకారులగు ధన గృహములను, నరాకారులగు భార్యాపుత్రాదులను త్యజించుట హస్యాస్పదము. మనకు ప్రత్యక్షము కూడా కాని అమృతము కొరకు మనకు ప్రత్యక్షముగ లభించుచున్న కాఫీ మొదలగు పానీయములను త్యజించెదమా? ఒక ప్రత్యక్ష పదార్ధము కొరకు మరియొక ప్రత్యక్ష పదార్ధమును త్యజించవచ్చును. ప్రత్యక్షము కాని నిరాకారము కొరకు ప్రత్యక్షములను ఏల త్యజించ వలెను. ఒక గ్లాసులో అమృతము పోసి యిచ్చి త్రాగించి రుచి చూపినచో, నీవు చెప్పనక్కరలేకయే వాడు కాఫీని త్యజించును. అంతే కాని అమృతము ఉన్నది. దాని ఆకారము కూడ నాకు తెలియదు. దాని కొరకు నీవు కాఫీని త్యజించమన్నచో ఎవడును త్యజించడు. త్యజించుటయు అవివేకము. కావున నిరాకార ధ్యాన మార్గములో వైరాగ్యము రాదు. ఇక సాకార మార్గములో ఒక విగ్రహమును, పటమును ధ్యానించుచున్నాము. అది అచేతనమైన జడపదార్ధము. జడము కన్నను చేతనము విలువ కలదు అని బాలుడు కూడ చెప్పును. కావున ఒక విగ్రహము పటము కొరకు చేతనమగు భార్యాపుత్రాదులను త్యజించనేల?
కావున అచేతనములను ఆరాధించు సాకారమార్గములో కూడ వైరాగ్యము అర్ధరహితమై యున్నది. దీనిని బోధించుటకే త్యాగరాజు ఆరాధించు రామ విగ్రహమును స్వామి సంకల్పము చేత నదిలో పారవేయబడెను. దానితో త్యాగరాజు ఉన్మత్తుడై నిరాహారియై దేశ భ్రమణము చేయుచుండగా భార్యయును నిరాహారియై ప్రాణములను విడచినది. ఇది సరియైన మార్గము కాదని స్వామి త్యాగరాజుకు స్వప్న దర్శనములో బోధించినాడు. కాని స్వామి నరాకారమున అవతరించినప్పుడు అచేతనములైన గృహాదులను చేతనులైనన భార్యాపుత్రాదులను త్యజించుటలో అర్ధమున్నది. చేతనము కొరకు జడములను త్యజించుట యుక్తమే కదా. ఇక చేతనులగు నరులలో అత్యుత్తముడగు పురషోత్తముని కొరకు ఇతర నరులను త్యజించుట కూడా యుక్తమే అగును. పురుషుడనగా జీవుడు అని అర్ధము కూడా ఉన్నది. "పురి" "దేహి"చేతే"పురుషః" అని అర్ధమున్నది. అనగా పురము అనబడు దేహము నందు వ్యాపించి యుండు చైతన్య స్వరూపుడు జీవుడు అని అర్ధము. కావున పురుషులలో అనగా జీవులలో ఉత్తముడగు పురషోత్తమముడగు నరావతారములో యున్న స్వామి కొరకు ఇతర పురుషులను అనగా ఇతర జీవులను త్యజించుటలో అర్ధమున్నది. కావున మార్గములోనే వైరాగ్యము సాధ్యము సార్ధకము. ఒకే సమయమున స్వామి ఒకే నరావతారములో ఉండవచ్చును లేక అనేక నరావతారములలో ఉండవచ్చును. అక్కలకోట మహారాజ్, శిరిడిసాయి ఒకే సమయమున ఉన్నారు. ఇరువురు దత్తావతారములే కావున నేనొక్కడనే దత్తుడన్నవాడు మూర్ఖుడు. వాడు అసలు దత్తుడే కాదు. వాడిని మనము పరీక్షింప పనిలేదు. పరీక్ష ఫలమును వాడే స్వయముగా చెప్పుచున్నాడు.
పౌండ్రక వాసుదేవుడు శంఖ చక్రములు ధరించి నేనొక్కడనే నారాయణావతారుడనని వాగినాడు. ఒకే సమయమున రెండు తీగెల ద్వారా ఒకే విద్యుత్తు ప్రవహించి ఫ్యాను త్రిప్పుట, లైటును వెలిగించుట అను రెండు వేరు వేరు పనులను చేయుచున్నది. కావున స్వామి కార్యమును అనుసరించి ఒకే సమయమున అనేక నరావతారములు రావచ్చును. ఒకే సమయమున అర్జునుడు విశ్వరూపమును చూచినాడు. విశ్వరూపము యొక్క పటములో అనేక ముఖములు అనేక బాహువులు ఉండును. కాని రెండే కాళ్ళు ఒకే ఉదరము ఉండును. ఈ చిత్రపటము సరియైనది కాదు. విశ్వరూపములో అర్జునుడు ఒకే సమయమున అవతరించిన అనేక నరావతారములను చూచినాడు. కావుననే అనేక బాహుదర వక్త్ర నేత్రం అని సూచించినాడు. అనగా అనేక బాహువులు అనేక ఉదరములు అనేక వక్త్రములు అనేక నేత్రములు అని అర్ధము. ఇదే అర్ధము సహస్రాత్ అని పురుష సూక్తములో అనేక పాదములు అనియును చెప్పబడినది. అనగా అనేక నరావతారములు అని అర్ధము. అయితే సృష్టి మొదలు ఇప్పటి వరకును వచ్చిన నరావతారముల సమూహము అని కూడా చెప్పవచ్చును గదా. కావున ఒకే సమయమున అనేక నరావతారములు ఉండవు అని వాదించరాదు.
LORD SRI KRISHNA - VISWAROOPAM IN TELUGU
శ్రీ కృష్ణుడు-విశ్వరూపము
శ్రీ కృష్ణ భగవానుడు ప్రదర్శించిన విశ్వరూపమును అర్ధము చేసుకొనుటయే సర్వ వేదముల యొక్కయు సర్వ శాస్త్రముల యొక్కయు సారమైయున్నది. శ్రీ కృష్ణుడు విశ్వరూపమును ప్రదర్శించక ముందు కూడ విశ్వరూపముతోనే యున్నాడు. విశ్వరూపమును ఉపసంహరించిన తర్వాత కూడ విశ్వరూపముతోనే యున్నాడు. అర్జునుని యొక్క దృష్టి మాత్రమే మారినది. సూర్యుడు ఎప్పుడును ప్రకాశించుచునే యున్నాడు. నల్ల కళ్ళజోడు పెట్టగనే ప్రకాశములేని ఒక బింబమాతృనిగా గోచరించుచున్నాడు. ఆ కళ్ళ జోడు తీయగనే మరల చూచుటకు వీలుకాని మహా ప్రకాశముతో మండుచున్నాడు. నీవు నల్ల కళ్ళజోడు పెట్టినపుడు సూర్యుని యొక్క తేజస్సు సూర్యుని నుండి పోవుటలేదు. ఆ కళ్ళజోడు తీయగనే సూర్యునికి కొత్త తేజస్సు వచ్చుట లేదు. అందుకే విశ్వరూప ప్రదర్శనమునకు ముందు "దివ్యందదామి తేచక్షుః" అనగా నీకు దివ్య దృష్టిని ఇచ్చుచున్నాను అన్నాడు. అనగా నీ కళ్ళకు ఉన్న నల్ల కళ్ళజోడును తీసివేసి నీ యొక్క స్వభావ సిద్ధమైన సత్యమైన దృష్టితో నన్ను తిలకించుము అని అర్ధము. కావున పరమాత్మ అవతరించునపుడు మనుష్య రూపమున ఉన్నట్లు మనకు గోచరించుటకు కారణము మనకున్న అజ్ఞానమే కాని ఆయన నిజముగా అజ్ఞానము చేత కప్పబడిలేడు. కొందరు పచ్చని వర్ణములో ఉన్నారు. వారి మధ్యకు ఎర్రని వర్ణము ఉన్న వ్యక్తి రావలసి వచ్చెను. వారు ఎరుపు వర్ణమును సహించలేరు.
అప్పుడు ఆ పచ్చని వర్ణము కలవారి కండ్లకు పచ్చని వర్ణము కల కళ్ళజోళ్ళను పెట్టించినాడు. ఇప్పుడు వారి మధ్యకు ఎర్రని రంగు కలవాడు వచ్చినాడు కాని వారందరికిని వారి కళ్ళజోళ్ళ ప్రభావము వలన వాడు పచ్చగనే కనిపించుచున్నాడు. ఇప్పుడు వారిలో ఒకని యొక్క కండ్ల జోడు తీసివేసి వాని యొక్క స్వభావ సిద్ధమైన సత్యమైన దృష్టితో తనను చూడమన్నాడు. అప్పుడు వానికి ఎర్రని రంగుతో ఈ వ్యక్తి కనపడినాడు. వారందరికిని ఎరుపు రంగు చూచిన భయము కాన వాడు భయముతో కేకలు పెట్టు నీవు మరల పచ్చగనే కనిపించమని ప్రార్ధించినాడు. అప్పుడు ఈ వ్యక్తి వానికి మరల పచ్చ కళ్ళజోడును పెట్టి పచ్చగా కనిపించినాడు. ఇదే విధముగా అర్జునుడు మాయ యను పచ్చ కండ్లజోడును పెట్టుకున్నంత కాలము కృష్ణునిగా కనిపించినాడు. సర్వ జీవులకును ఈ మాయయను కళ్ళజోడు జన్మ నుండి మరణ పర్యంతము ఉండుచున్నది. ఈ కళ్ళజోడే అహంకార, మమకారములను రెండు కంటి పొరలు. స్వామి యొక్క నిజ స్వరూపమును దర్శించకోరినపుడు స్వామి అర్జునుని యొక్క కళ్ళజోడును తీసివేసినాడు. అప్పుడు అర్జునుడు తన నిజ నేత్రములతో సత్యమైన దృష్టితో స్వామి యొక్క నిజ స్వరూపమును చూచినాడు. దానిని చూడలేక భయపడినందున మరల అర్జునునకు ఆ కళ్ళజోడును పెట్టినాడు. కావున పరమాత్మ అవతరించునపుడు తన యొక్క నిజ స్వరూపముతోనే క్రిందకి వచ్చినాడు. దానిని జీవులు చూడలేరు.
కావున మాయ జీవుల కండ్లకు స్వామి మనుష్యునిగ కనిపించు భ్రమను కలిగించు కళ్ళజోళ్ళను జీవుల కండ్లకు పెట్టినది. అవ = అనగా క్రిందకు, తర = అనగా దిగుట. ఒక వ్యక్తి మేడపై నుండి క్రిందకి దిగునప్పుడు తన నిజ స్వరూపముతోనే క్రిందకు దిగుచున్నాడు. అంతే తప్ప దిగునపుడు ఒక ముసుగు వేసుకొని దిగుటలేదు. కావున పరమాత్మ అవతరించునపుడు నిజముగ మనుష్య శరీరమును ఆశ్రయించిలేడు. ఆయన మనుష్య శరీరములో ఉన్నట్లు మనకు మాయ భ్రమను కలిగించుచున్నది. కావున అవతార పురషుని శరీరము లోపల మరియొక పరమాత్మ శరీరము ఉన్నదని భావించుట జీవుల యొక్క అజ్ఞానమే. పచ్చ కళ్ళజోడు పెట్టుకునప్పుడు ఎర్రని వ్యక్తిపై పచ్చ రంగు పూయబడలేదు. నీవు కళ్ళజోడు తీయగనే ఆ వ్యక్తి పచ్చరంగును నీటితో కడుకుని మరల ఎర్రగా కనిపించుట లేదు. అతడు ఎప్పుడునూ ఎర్రగానే ఉన్నాడు. కావున శ్రీ కృష్ణుడు ఎల్లప్పుడును విశ్వరూపముతోనే ఉన్నాడు. ఆయన యొక్క పరిమితమైన మానవాకారము మన యొక్క కంటి భ్రమయే. కావున అవతార పురుషుడు దివ్య దర్శనములను చూపుచున్నప్పుడు ఆయనలో ఎట్టి మార్పులేదు. ఆయన చేయుచున్నది మన యొక్క కంటి పొరలను కొంచెము ప్రక్కకు త్రోయుచున్నాడు. ఇదియే వేదాంతము యొక్క చిట్ట చివరి కొస. కావున గోపికలు శ్రీ కృష్ణుని బాహ్య స్వరూపము అంతః స్వరూపము అను రెండు స్వరూపములున్న వానిగా చూడలేదు. వారికి శ్రీ కృష్ణుడు సాక్షాత్తుగా పరబహ్మమే. వారి కండ్లకు మాయలేనే లేదు.
కావున వారికి కృష్ణుడు ఎప్పుడును మానవునిగ గోచరించలేదు. వాళ్ళు కళ్లద్దములు లేనివారు. వారికి పసుపు, ఎరుపు అను రెండు రంగులు లేవు. ఒకే ఒక ఎరుపు రంగు నత్త్యము కనిపించుచున్నది. కావున వారికి కృష్ణుని పైనున్న విశ్వాసము ఒక క్షణకాలము కూడ చలించలేదు. వారికి ఈ మాయ లేకపోవుటకు కారణమేమనగా, వారికి ఎన్నడును అజ్ఞానము రాలేదు. ఏలననగా వారి జ్ఞానము అగ్నివలె ప్రకాశించుచున్నది. వారు ఎన్నో జన్మల నుండి నిద్రహారములు లేక ఏ ఇతర విషయమును మనస్సుకు రానీయక నిరంతరము భగవంతుని సత్సంగములో కోటాను కోట్ల జన్మలు గడిపిన బ్రహ్మర్షులు. వారికి కల ఆ నిశ్చలమైన శ్రద్ధయే వారి బ్రహ్మ జ్ఞానాగ్నికి కారణము. "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" అనగా శ్రద్ధయే జ్ఞానమునకు మూల కారణము. శ్రద్ధలేని కారణముననే జ్ఞానము బలహీనమై అజ్ఞానము ఆవహించుచున్నది. మిధిలా నగరము తగలబడుచున్నను బ్రహ్మ జ్ఞానము ఆస్వాదించు జనకుడు లేచిపోలేదు. ఆయన యొక్క శ్రద్ధ ఎంతయో ఆలోచించుడు. మనము సినిమా హాలులో కూర్చునప్పుడు నల్లులు పీకుచున్నను, దోమలు రక్తము త్రాగుచున్నను తలుపులు బంధించుట వలన ప్రాణవాయువు లేక శ్వాస ఆడక ఆయాసము వచ్చుచున్నను, ఇంత ఏల పిడుగులు పడినను చలించము. ఆ పిడుగు మూలకముగా సినిమా ఆగిపోయినపుడు ఈ లోకమునకు వచ్చి ఏమి జరిగినదని ఆలోచించెదము.
కాని సత్సంగము యున్నప్పుడు లేక పురాణమో భాష్య ప్రవచనమో వినుచున్నప్పుడు చీమ చిటుక్కు మన్నను ప్రక్కకు చూచెదము. అన్ని ముచట్లు అప్పుడే వచ్చును. ఏ పనియు లేకపోయినను కొంప మునిపోయినట్లు లేచిపోయెదము. పొయ్య మీద పాలు పెట్టివచ్చి క్షణమే అయిననూ అవి పొంగిపోవుటకు ఇంకనూ ఎంతో సమయమున్ననూ ఆ పొంగు సాకుతో వెంటనే లేచిపోయెదము. ఇటువంటి వీరికిని, రాజ్యము తగలపడినను లేవని జనకునకు ఎంత బేధము గలదు. కావున పరమాత్మ పై నిజముగా మనకు శ్రద్ధ లేదు. విలువ లేదు. లౌకికములకు ఉపయోగించునేమోయని, మరణానంతరము రక్షించునేమో అని, అదియును కొందరి విశ్వాసము. అనుమానముతో మనకు శ్రద్ధ లేకపోవుట వలన బ్రహ్మ జ్ఞానము మనలో ఇముడుటలేదు. ఇల్లు, వాకిలి, సంసారబంధము అను నీటితో చల్లారి అజ్ఞానమను పొగతో మనము చుట్టబడియున్నాము. ఇదే "ధూమేనా వ్రయతే వహ్నిః అశ్వతం జ్ఞానమేతేని" అని గీతలో చెప్పబడినది. ఈ అజ్ఞానము యొక్క పొరల వల్లనే మాధవుడు స్వస్వరూపమున క్రిందకు దిగివచ్చినను, మనము ఆయనను గుర్తించ లేక మానవునిగనే చూచున్నాము. మనకు ఆయన యొక్క మాధవ స్వరూపము గోచరించుట లేదు. కావున స్వామిని మాయకప్పి యున్నది. స్వామి స్వ స్వరూపమును ప్రకటించనక్కరలేదు. మన మాయ పొరలను తొలగించుకొన్నచో ఆయన యొక్క స్వ స్వరూపమును మనము చూడ గలుగుదుము. ఆయన యొక్క దివ్య దర్శనము కొరకు ఆయన ఎట్టి ప్రయత్నము చేయనక్కర లేదు. మనమే ప్రయత్నము చేయవలెను.
శ్రీ కృష్ణ భగవానుడు ప్రదర్శించిన విశ్వరూపమును అర్ధము చేసుకొనుటయే సర్వ వేదముల యొక్కయు సర్వ శాస్త్రముల యొక్కయు సారమైయున్నది. శ్రీ కృష్ణుడు విశ్వరూపమును ప్రదర్శించక ముందు కూడ విశ్వరూపముతోనే యున్నాడు. విశ్వరూపమును ఉపసంహరించిన తర్వాత కూడ విశ్వరూపముతోనే యున్నాడు. అర్జునుని యొక్క దృష్టి మాత్రమే మారినది. సూర్యుడు ఎప్పుడును ప్రకాశించుచునే యున్నాడు. నల్ల కళ్ళజోడు పెట్టగనే ప్రకాశములేని ఒక బింబమాతృనిగా గోచరించుచున్నాడు. ఆ కళ్ళ జోడు తీయగనే మరల చూచుటకు వీలుకాని మహా ప్రకాశముతో మండుచున్నాడు. నీవు నల్ల కళ్ళజోడు పెట్టినపుడు సూర్యుని యొక్క తేజస్సు సూర్యుని నుండి పోవుటలేదు. ఆ కళ్ళజోడు తీయగనే సూర్యునికి కొత్త తేజస్సు వచ్చుట లేదు. అందుకే విశ్వరూప ప్రదర్శనమునకు ముందు "దివ్యందదామి తేచక్షుః" అనగా నీకు దివ్య దృష్టిని ఇచ్చుచున్నాను అన్నాడు. అనగా నీ కళ్ళకు ఉన్న నల్ల కళ్ళజోడును తీసివేసి నీ యొక్క స్వభావ సిద్ధమైన సత్యమైన దృష్టితో నన్ను తిలకించుము అని అర్ధము. కావున పరమాత్మ అవతరించునపుడు మనుష్య రూపమున ఉన్నట్లు మనకు గోచరించుటకు కారణము మనకున్న అజ్ఞానమే కాని ఆయన నిజముగా అజ్ఞానము చేత కప్పబడిలేడు. కొందరు పచ్చని వర్ణములో ఉన్నారు. వారి మధ్యకు ఎర్రని వర్ణము ఉన్న వ్యక్తి రావలసి వచ్చెను. వారు ఎరుపు వర్ణమును సహించలేరు.
అప్పుడు ఆ పచ్చని వర్ణము కలవారి కండ్లకు పచ్చని వర్ణము కల కళ్ళజోళ్ళను పెట్టించినాడు. ఇప్పుడు వారి మధ్యకు ఎర్రని రంగు కలవాడు వచ్చినాడు కాని వారందరికిని వారి కళ్ళజోళ్ళ ప్రభావము వలన వాడు పచ్చగనే కనిపించుచున్నాడు. ఇప్పుడు వారిలో ఒకని యొక్క కండ్ల జోడు తీసివేసి వాని యొక్క స్వభావ సిద్ధమైన సత్యమైన దృష్టితో తనను చూడమన్నాడు. అప్పుడు వానికి ఎర్రని రంగుతో ఈ వ్యక్తి కనపడినాడు. వారందరికిని ఎరుపు రంగు చూచిన భయము కాన వాడు భయముతో కేకలు పెట్టు నీవు మరల పచ్చగనే కనిపించమని ప్రార్ధించినాడు. అప్పుడు ఈ వ్యక్తి వానికి మరల పచ్చ కళ్ళజోడును పెట్టి పచ్చగా కనిపించినాడు. ఇదే విధముగా అర్జునుడు మాయ యను పచ్చ కండ్లజోడును పెట్టుకున్నంత కాలము కృష్ణునిగా కనిపించినాడు. సర్వ జీవులకును ఈ మాయయను కళ్ళజోడు జన్మ నుండి మరణ పర్యంతము ఉండుచున్నది. ఈ కళ్ళజోడే అహంకార, మమకారములను రెండు కంటి పొరలు. స్వామి యొక్క నిజ స్వరూపమును దర్శించకోరినపుడు స్వామి అర్జునుని యొక్క కళ్ళజోడును తీసివేసినాడు. అప్పుడు అర్జునుడు తన నిజ నేత్రములతో సత్యమైన దృష్టితో స్వామి యొక్క నిజ స్వరూపమును చూచినాడు. దానిని చూడలేక భయపడినందున మరల అర్జునునకు ఆ కళ్ళజోడును పెట్టినాడు. కావున పరమాత్మ అవతరించునపుడు తన యొక్క నిజ స్వరూపముతోనే క్రిందకి వచ్చినాడు. దానిని జీవులు చూడలేరు.
కావున మాయ జీవుల కండ్లకు స్వామి మనుష్యునిగ కనిపించు భ్రమను కలిగించు కళ్ళజోళ్ళను జీవుల కండ్లకు పెట్టినది. అవ = అనగా క్రిందకు, తర = అనగా దిగుట. ఒక వ్యక్తి మేడపై నుండి క్రిందకి దిగునప్పుడు తన నిజ స్వరూపముతోనే క్రిందకు దిగుచున్నాడు. అంతే తప్ప దిగునపుడు ఒక ముసుగు వేసుకొని దిగుటలేదు. కావున పరమాత్మ అవతరించునపుడు నిజముగ మనుష్య శరీరమును ఆశ్రయించిలేడు. ఆయన మనుష్య శరీరములో ఉన్నట్లు మనకు మాయ భ్రమను కలిగించుచున్నది. కావున అవతార పురషుని శరీరము లోపల మరియొక పరమాత్మ శరీరము ఉన్నదని భావించుట జీవుల యొక్క అజ్ఞానమే. పచ్చ కళ్ళజోడు పెట్టుకునప్పుడు ఎర్రని వ్యక్తిపై పచ్చ రంగు పూయబడలేదు. నీవు కళ్ళజోడు తీయగనే ఆ వ్యక్తి పచ్చరంగును నీటితో కడుకుని మరల ఎర్రగా కనిపించుట లేదు. అతడు ఎప్పుడునూ ఎర్రగానే ఉన్నాడు. కావున శ్రీ కృష్ణుడు ఎల్లప్పుడును విశ్వరూపముతోనే ఉన్నాడు. ఆయన యొక్క పరిమితమైన మానవాకారము మన యొక్క కంటి భ్రమయే. కావున అవతార పురుషుడు దివ్య దర్శనములను చూపుచున్నప్పుడు ఆయనలో ఎట్టి మార్పులేదు. ఆయన చేయుచున్నది మన యొక్క కంటి పొరలను కొంచెము ప్రక్కకు త్రోయుచున్నాడు. ఇదియే వేదాంతము యొక్క చిట్ట చివరి కొస. కావున గోపికలు శ్రీ కృష్ణుని బాహ్య స్వరూపము అంతః స్వరూపము అను రెండు స్వరూపములున్న వానిగా చూడలేదు. వారికి శ్రీ కృష్ణుడు సాక్షాత్తుగా పరబహ్మమే. వారి కండ్లకు మాయలేనే లేదు.
కావున వారికి కృష్ణుడు ఎప్పుడును మానవునిగ గోచరించలేదు. వాళ్ళు కళ్లద్దములు లేనివారు. వారికి పసుపు, ఎరుపు అను రెండు రంగులు లేవు. ఒకే ఒక ఎరుపు రంగు నత్త్యము కనిపించుచున్నది. కావున వారికి కృష్ణుని పైనున్న విశ్వాసము ఒక క్షణకాలము కూడ చలించలేదు. వారికి ఈ మాయ లేకపోవుటకు కారణమేమనగా, వారికి ఎన్నడును అజ్ఞానము రాలేదు. ఏలననగా వారి జ్ఞానము అగ్నివలె ప్రకాశించుచున్నది. వారు ఎన్నో జన్మల నుండి నిద్రహారములు లేక ఏ ఇతర విషయమును మనస్సుకు రానీయక నిరంతరము భగవంతుని సత్సంగములో కోటాను కోట్ల జన్మలు గడిపిన బ్రహ్మర్షులు. వారికి కల ఆ నిశ్చలమైన శ్రద్ధయే వారి బ్రహ్మ జ్ఞానాగ్నికి కారణము. "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" అనగా శ్రద్ధయే జ్ఞానమునకు మూల కారణము. శ్రద్ధలేని కారణముననే జ్ఞానము బలహీనమై అజ్ఞానము ఆవహించుచున్నది. మిధిలా నగరము తగలబడుచున్నను బ్రహ్మ జ్ఞానము ఆస్వాదించు జనకుడు లేచిపోలేదు. ఆయన యొక్క శ్రద్ధ ఎంతయో ఆలోచించుడు. మనము సినిమా హాలులో కూర్చునప్పుడు నల్లులు పీకుచున్నను, దోమలు రక్తము త్రాగుచున్నను తలుపులు బంధించుట వలన ప్రాణవాయువు లేక శ్వాస ఆడక ఆయాసము వచ్చుచున్నను, ఇంత ఏల పిడుగులు పడినను చలించము. ఆ పిడుగు మూలకముగా సినిమా ఆగిపోయినపుడు ఈ లోకమునకు వచ్చి ఏమి జరిగినదని ఆలోచించెదము.
కాని సత్సంగము యున్నప్పుడు లేక పురాణమో భాష్య ప్రవచనమో వినుచున్నప్పుడు చీమ చిటుక్కు మన్నను ప్రక్కకు చూచెదము. అన్ని ముచట్లు అప్పుడే వచ్చును. ఏ పనియు లేకపోయినను కొంప మునిపోయినట్లు లేచిపోయెదము. పొయ్య మీద పాలు పెట్టివచ్చి క్షణమే అయిననూ అవి పొంగిపోవుటకు ఇంకనూ ఎంతో సమయమున్ననూ ఆ పొంగు సాకుతో వెంటనే లేచిపోయెదము. ఇటువంటి వీరికిని, రాజ్యము తగలపడినను లేవని జనకునకు ఎంత బేధము గలదు. కావున పరమాత్మ పై నిజముగా మనకు శ్రద్ధ లేదు. విలువ లేదు. లౌకికములకు ఉపయోగించునేమోయని, మరణానంతరము రక్షించునేమో అని, అదియును కొందరి విశ్వాసము. అనుమానముతో మనకు శ్రద్ధ లేకపోవుట వలన బ్రహ్మ జ్ఞానము మనలో ఇముడుటలేదు. ఇల్లు, వాకిలి, సంసారబంధము అను నీటితో చల్లారి అజ్ఞానమను పొగతో మనము చుట్టబడియున్నాము. ఇదే "ధూమేనా వ్రయతే వహ్నిః అశ్వతం జ్ఞానమేతేని" అని గీతలో చెప్పబడినది. ఈ అజ్ఞానము యొక్క పొరల వల్లనే మాధవుడు స్వస్వరూపమున క్రిందకు దిగివచ్చినను, మనము ఆయనను గుర్తించ లేక మానవునిగనే చూచున్నాము. మనకు ఆయన యొక్క మాధవ స్వరూపము గోచరించుట లేదు. కావున స్వామిని మాయకప్పి యున్నది. స్వామి స్వ స్వరూపమును ప్రకటించనక్కరలేదు. మన మాయ పొరలను తొలగించుకొన్నచో ఆయన యొక్క స్వ స్వరూపమును మనము చూడ గలుగుదుము. ఆయన యొక్క దివ్య దర్శనము కొరకు ఆయన ఎట్టి ప్రయత్నము చేయనక్కర లేదు. మనమే ప్రయత్నము చేయవలెను.
SRI HANUMAN CHALISA - TELUGU HANUMAN BHAKTHI PRAYER IN TELUGU
శ్రీ హనుమాన్ చాలిసా
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
బుద్దిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
1. జయహనుమంత జ్ఞానగుణవందిత జయపండిత త్రిలోకపూజిత |
2. రామదూత అతులితబలధామ అంజనీపుత్ర పవనసుతనామ |
3. ఉదయభానుని మధురఫలమని భావనలీలా అమృతమునుబ్రోలిన |
4. కాంచనవర్ణ విరాజితవేష కుండలామండిత కుంచితకేశ |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
5. రామసుగ్రీవుల మైత్రినిగొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి |
6. జానకీపతి ముద్రికదోడ్కొని జలధిలంకించి లంకజేరుకొని |
7. సూక్ష్మరూపమున సీతను జూచి వికటరూపమున లంకనుగాల్చి |
8. భీమరూపమున అసురులజంపిన రామకార్యమును సఫలముజేసిన |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
9. సీతజాడగని వచ్చిననినుగని శ్రీరఘువీరుడు కౌగిటనినుగొని |
10. సహస్రరీతుల నినుగొనియాడగ కాగలకార్యము నీపైనిడగ |
11. వానరసేనతో వారిధిదాటి లంకేశునితో తలపడిపోరి |
12. హోరుహోరున పోరుసాగిన అసురసేనల వరుసనగోల్చిన |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
13. లక్ష్మణమూర్ఛతో రాముడడలగ సంజీవిదెచ్చిన ప్రాణప్రదాత |
14. రామలక్ష్మణుల అస్థ్రదాటికి అసురవీరులు అస్తమించిరి |
15. తిరుగులేని శ్రీరామబాణము జరిపించెను రావణసంహారము |
16. ఎదిరిలేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణుజేసిన |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
17. సీతారాములు నగవులగనిరి ముల్లోకాల హారతులందిరి |
18. అంతులేని ఆనందాశ్రువులె అయోధ్యాపురి పొంగిపొరలె |
19. సీతారాముల సుందరమందిరం శ్రీకాంతుపదం నీహృదయం |
20. రామచరిత కర్ణామృతగాన రామనామ రసామృతాపానా |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
21. దుర్గమమగు ఏ కార్యమైన సుగమమేయగు నీకృపజాలిన |
22. కలుగుసుఖములు నినుశరణన్న తొలగు భయములు నీ రక్షణయున్న |
23. రామద్వారపు కాపరివైన నీ కట్టడిమీర బ్రహ్మదుల తరమా |
24. భూతపిశాచశాఖినీ ఢాఖినీ భయపడి పాదు నీ నామజపమువిని |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
25. ధ్వజావిరాజా వజ్రశరీరా ఋజబలతేజా గదాధరా |
26. ఈశ్వరాంశ సంభూతపవిత్ర కేసరీపుత్ర పావనగాత్ర |
27. సనకాదులు బ్రహ్మాదిదేవతలు శారద నారద ఆదిశేషులు |
28. యమకుబేర దిక్పాలురు కవులు పులకితులైరి నీకిర్తి గానముల |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
29. సోదరభరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా |
30. సాధులపాలిట ఇంద్రుడవన్నా అసురులపాలిట కాలుడవన్నా |
31. అష్టసిద్ది నవనిధులకు దాతగ జానకీమాత దీవించెనుగ |
32. రామ రసామృత పానము జేసిన మృత్యుంజయుడవై వెలసిన |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
33. నీనామభజన శ్రీరామ రంజన జన్మజన్మాంతర దుఃఖభంజన |
34. ఎచ్చటుండినా రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు |
35. ఇతరచింతనలు మనసున మోతలు స్ధిరముగ మారుతిసేవలు సుఖములు |
36. ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
37. శ్రద్ధగా దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగుసుమా |
38. భక్తి మీరగ గానము సేయగ ముక్తికలగు గౌరీశులు సాక్షిగ |
39. తులసీదాస హనుమాను చాలీసా తెలుగున సుళువుగ నలుగురు పాడగ |
40. పలికిన సీతా రాముని పలుకున దోషములున్న మన్నింపుమన్నా |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
మంగళహరతి గొనుహనుమంతా సీతారామలక్ష్మణ సమేత |
నాఅంతరాత్మ నిలువుఅనంత| నీవే అంతా శ్రీ హనుమంతా |
ఓం శాంతిః శాంతిః శాంతిః
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
బుద్దిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
1. జయహనుమంత జ్ఞానగుణవందిత జయపండిత త్రిలోకపూజిత |
2. రామదూత అతులితబలధామ అంజనీపుత్ర పవనసుతనామ |
3. ఉదయభానుని మధురఫలమని భావనలీలా అమృతమునుబ్రోలిన |
4. కాంచనవర్ణ విరాజితవేష కుండలామండిత కుంచితకేశ |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
5. రామసుగ్రీవుల మైత్రినిగొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి |
6. జానకీపతి ముద్రికదోడ్కొని జలధిలంకించి లంకజేరుకొని |
7. సూక్ష్మరూపమున సీతను జూచి వికటరూపమున లంకనుగాల్చి |
8. భీమరూపమున అసురులజంపిన రామకార్యమును సఫలముజేసిన |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
9. సీతజాడగని వచ్చిననినుగని శ్రీరఘువీరుడు కౌగిటనినుగొని |
10. సహస్రరీతుల నినుగొనియాడగ కాగలకార్యము నీపైనిడగ |
11. వానరసేనతో వారిధిదాటి లంకేశునితో తలపడిపోరి |
12. హోరుహోరున పోరుసాగిన అసురసేనల వరుసనగోల్చిన |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
13. లక్ష్మణమూర్ఛతో రాముడడలగ సంజీవిదెచ్చిన ప్రాణప్రదాత |
14. రామలక్ష్మణుల అస్థ్రదాటికి అసురవీరులు అస్తమించిరి |
15. తిరుగులేని శ్రీరామబాణము జరిపించెను రావణసంహారము |
16. ఎదిరిలేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణుజేసిన |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
17. సీతారాములు నగవులగనిరి ముల్లోకాల హారతులందిరి |
18. అంతులేని ఆనందాశ్రువులె అయోధ్యాపురి పొంగిపొరలె |
19. సీతారాముల సుందరమందిరం శ్రీకాంతుపదం నీహృదయం |
20. రామచరిత కర్ణామృతగాన రామనామ రసామృతాపానా |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
21. దుర్గమమగు ఏ కార్యమైన సుగమమేయగు నీకృపజాలిన |
22. కలుగుసుఖములు నినుశరణన్న తొలగు భయములు నీ రక్షణయున్న |
23. రామద్వారపు కాపరివైన నీ కట్టడిమీర బ్రహ్మదుల తరమా |
24. భూతపిశాచశాఖినీ ఢాఖినీ భయపడి పాదు నీ నామజపమువిని |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
25. ధ్వజావిరాజా వజ్రశరీరా ఋజబలతేజా గదాధరా |
26. ఈశ్వరాంశ సంభూతపవిత్ర కేసరీపుత్ర పావనగాత్ర |
27. సనకాదులు బ్రహ్మాదిదేవతలు శారద నారద ఆదిశేషులు |
28. యమకుబేర దిక్పాలురు కవులు పులకితులైరి నీకిర్తి గానముల |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
29. సోదరభరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా |
30. సాధులపాలిట ఇంద్రుడవన్నా అసురులపాలిట కాలుడవన్నా |
31. అష్టసిద్ది నవనిధులకు దాతగ జానకీమాత దీవించెనుగ |
32. రామ రసామృత పానము జేసిన మృత్యుంజయుడవై వెలసిన |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
33. నీనామభజన శ్రీరామ రంజన జన్మజన్మాంతర దుఃఖభంజన |
34. ఎచ్చటుండినా రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు |
35. ఇతరచింతనలు మనసున మోతలు స్ధిరముగ మారుతిసేవలు సుఖములు |
36. ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
37. శ్రద్ధగా దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగుసుమా |
38. భక్తి మీరగ గానము సేయగ ముక్తికలగు గౌరీశులు సాక్షిగ |
39. తులసీదాస హనుమాను చాలీసా తెలుగున సుళువుగ నలుగురు పాడగ |
40. పలికిన సీతా రాముని పలుకున దోషములున్న మన్నింపుమన్నా |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
మంగళహరతి గొనుహనుమంతా సీతారామలక్ష్మణ సమేత |
నాఅంతరాత్మ నిలువుఅనంత| నీవే అంతా శ్రీ హనుమంతా |
ఓం శాంతిః శాంతిః శాంతిః
TELUGU LIST OF ALPHABETS - GRAMMER
తెలుగు అక్షరములు
తెలుగు అక్షరములు మొత్తం 52 ప్రస్తుత వాడుకలో వున్నాయి.
అచ్చులు 16 - అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఋూ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
హల్లులు 36 - క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ
న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష ఱ.
--------------------------------------------------------------------------------------------------
విభాగములు:
ఉభయాక్షరములు - కం కఁ కః ఈ మూడింటిని - కం సున, కఁ అరసున్న, కః విసర్గము అని అందురు.
అచ్చులు 16 - అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఋూ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
హల్లులు 36 - క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ
న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష ఱ.
--------------------------------------------------------------------------------------------------
విభాగములు:
ఉభయాక్షరములు - కం కఁ కః ఈ మూడింటిని - కం సున, కఁ అరసున్న, కః విసర్గము అని అందురు.
అచ్చుల విభాగములు -
హ్రస్వములు.. 6 - అ ఇ ఉ ఋ ఎ ఒ
దీర్ఘములు ... 3 - ఆ ఈ ఊ
నక్రములు 4 - ఎ ఏ ఒ ఓ
వక్రతములు 2 - ఐ ఔ.
హ్రస్వములు.. 6 - అ ఇ ఉ ఋ ఎ ఒ
దీర్ఘములు ... 3 - ఆ ఈ ఊ
నక్రములు 4 - ఎ ఏ ఒ ఓ
వక్రతములు 2 - ఐ ఔ.
వర్గములు -
వర్గప్రథంమములు = క చ ట త న......
వర్గద్వితీయములు = ఖ ఛ ఠ థం ఫ.....
వర్గ తృతీయములు = గ జ డ ద బ.....
వర్గ చతుర్థములు = ఘ ఝ ఢ ధ భ...
వర్గ పంచమములు = ఙ ఞ ణ న మ ...
వర్గప్రథంమములు = క చ ట త న......
వర్గద్వితీయములు = ఖ ఛ ఠ థం ఫ.....
వర్గ తృతీయములు = గ జ డ ద బ.....
వర్గ చతుర్థములు = ఘ ఝ ఢ ధ భ...
వర్గ పంచమములు = ఙ ఞ ణ న మ ...
హల్లుల విభాగములు -
పరుషములు.. 5 - క చ ట త ప
సరళములు.. 5 - గ జ డ ద బ
ద్రుతము 1 - న
స్థిరములు.. 25 - ఖ ఘ ఙ ఛ ఝ ఞ ఠ ఢ ణ థ ధ న ఫ భ మ య ర ఱ ల ళ వ శ ష స హ.
కేవల స్థిరములు.. 10- ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ
అను నాసికములు ..5- ఙ ఞ ణ న మ
అంతస్థములు... 6 - య ర ఱ ల ళ వ
ఊష్మములు... 4- శ ష స హ
పరుషములు.. 5 - క చ ట త ప
సరళములు.. 5 - గ జ డ ద బ
ద్రుతము 1 - న
స్థిరములు.. 25 - ఖ ఘ ఙ ఛ ఝ ఞ ఠ ఢ ణ థ ధ న ఫ భ మ య ర ఱ ల ళ వ శ ష స హ.
కేవల స్థిరములు.. 10- ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ
అను నాసికములు ..5- ఙ ఞ ణ న మ
అంతస్థములు... 6 - య ర ఱ ల ళ వ
ఊష్మములు... 4- శ ష స హ
అ ఆ క ఖ ఘ ఘ ఙ హ - కంఠ్యములు
ఇ ఈ చ ఛ జఝ ఞ య శ - తాలవ్యములు
ఋ బుూ ట ఠ డ ఢ ణ
ర ఱ ష - మూర్ధన్యములు
త థం ద ధ న ల స చ జ - దంత్యములు
ఉ ఊ ప ఫ బ భ మ - ఓషస్యములు
ఙ ఞ ణ న మ - అనునాసికములు
ఎ ఏ ఐ - కంఠతాలవ్యములు
ఒ ఓ ఔ - కంఠోషస్యములు
వ - దంతోషస్యములు
ం - నాసిక్యము
--------------------------------------------------------------------------------------------------
పదములు
అర ఊడ ఒర గద ఝంప దశ బక లత ఆశ ఋణ ఓడ ఘట తడ ధన భవ వధ
ఇల ఎద ఔర చల టంక నస మఖ శర ఈగ ఏల కథం ఛట ఠవ పగ యమ సభ
ఉష ఐన ఖర జడ డంక ఫణ రస హఠ
--------------------------------------------------------------------------------------------------
సంయుక్తాక్షరములు - రెండు హల్లులపై అచ్చు కలియుట
క్ష్య, క్ష్మ, గ్బ్ర, త్య్ర , త్థ్స , త్మ్య స్స్ప, ప్య్ర, స్త్య , స్థ్య, స్త్ర, ర్ఘ్య , ష్ట్ర, ష్ట్య.
ఇ ఈ చ ఛ జఝ ఞ య శ - తాలవ్యములు
ఋ బుూ ట ఠ డ ఢ ణ
ర ఱ ష - మూర్ధన్యములు
త థం ద ధ న ల స చ జ - దంత్యములు
ఉ ఊ ప ఫ బ భ మ - ఓషస్యములు
ఙ ఞ ణ న మ - అనునాసికములు
ఎ ఏ ఐ - కంఠతాలవ్యములు
ఒ ఓ ఔ - కంఠోషస్యములు
వ - దంతోషస్యములు
ం - నాసిక్యము
--------------------------------------------------------------------------------------------------
పదములు
అర ఊడ ఒర గద ఝంప దశ బక లత ఆశ ఋణ ఓడ ఘట తడ ధన భవ వధ
ఇల ఎద ఔర చల టంక నస మఖ శర ఈగ ఏల కథం ఛట ఠవ పగ యమ సభ
ఉష ఐన ఖర జడ డంక ఫణ రస హఠ
--------------------------------------------------------------------------------------------------
సంయుక్తాక్షరములు - రెండు హల్లులపై అచ్చు కలియుట
క్ష్య, క్ష్మ, గ్బ్ర, త్య్ర , త్థ్స , త్మ్య స్స్ప, ప్య్ర, స్త్య , స్థ్య, స్త్ర, ర్ఘ్య , ష్ట్ర, ష్ట్య.
Subscribe to:
Posts (Atom)