ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HAPPY HOLI FESTIVAL


EARLY WAKE UP HAVING SO MANY ADVANTAGES


ఉదయాన్ని నిద్రలేవకపోతే ఏం జరుగుతుంది?

ఉదయాన్ని నిద్రలేవకపోతే ప్రతికూల ఫలితాలుంటాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. పురాణాలను పరిశీలించినట్టయితే ఆనాటి మహర్షులు ... మహారాజులు బ్రాహ్మీ ముహూర్తంలోనే దైవారాధన కార్యక్రమాన్ని పూర్తిచేసేవాళ్లు.

తెల్లవారుజామునే స్నానం చేసి ప్రశాంతమైన మనసుతో భగవంతుడిని పూజించడం వలన, ఇటు ఆరోగ్యపరంగా ... అటు ఆధ్యాత్మికపరంగాను శుభ ఫలితాలుంటాయి. అందుకే ఉదయాన్నే నిద్రలేవడమనేది ఒక ఆచారంగా పాటిస్తూ వచ్చారు.

అయితే కాలక్రమంలో నిద్రమేల్కోవడమనేది కరువైపోయింది. ఫలానా సమయానికి నిద్రపోవాలి- ఫలానా సమయానికల్లా మేల్కోవాలనే నియమం ఎక్కడా కనిపించకుండా పోయింది. ప్రస్తుతం ఎవరిష్టం వాళ్లదే. అల్పాహారం తీసుకునే సమయానికి నిద్రలేచేవాళ్లు పల్లెల్లో ఉన్నట్టుగానే, మధ్యాహ్నం భోజన సమయానికి నిద్రలేచే వాళ్లు పట్నంలోను కనిపిస్తుంటారు.

ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వలన, ఉదయాన్నే మేల్కోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి పిల్లలకి పెద్దలు చెప్పే అవకాశం లేకుండా పోయింది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి, పూజా మందిరాన్ని అలంకరించి దైవాన్ని సేవించాలి. అలాంటివారి ఇంట్లోనే ధనలక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేవని వారి ఇంట్లోను, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో నిద్రపోయే వారి ఇళ్లలోను లక్ష్మీదేవి ఉండకుండా వెళ్లిపోతుంది.

ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతుందో, అప్పుడు దారిద్ర్యం చుట్టుముడుతుంది. దారిద్ర్యం అనారోగ్యానికి గురిచేసి అనేక కష్టాలకు ఆహ్వానం పలుకుతుంది. అందువల్లనే మన పూర్వీకులు అందరినీ ఉదయాన్నే నిద్రలేపేవాళ్లు ... వేళగాని వేళలో నిద్రపోనిచ్చేవాళ్లు కాదు.

ఇప్పటికి కూడా కొన్ని ఇళ్లలో తమ ఆడపిల్లలను ... కోడళ్లను ఉదయాన్నే నిద్ర లేపడంలోని ఆంతర్యం ఇదే. తెల్లవారు జామున నిద్రలేవడంపైనే సంపదలు ... సంతోషాలు ఆధారపడి ఉంటాయనే విషయాన్నిఎప్పటికీ మరచిపోకూడదు.

HINDU GODS RESIDES IN TULASI TREE - AN ARTILCE IN TELUGU


తులసి మొక్కలో బ్రహ్మ.. విష్ణు.. శంకరుడు

రామాలయంలేని ఊరుగానీ తులసి మొక్కలేని ఇల్లుగాని కనిపించవు. తులసి మొక్కను అంతా పవిత్రంగా పూజిస్తుంటారు. తులసి మొక్క మూలంలో బ్రహ్మ మధ్యలో విష్ణువు చివరిలో శంకరుడు ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే దేవాలయంలో ఇచ్చే తీర్థంలో తులసిని కలుపుతున్నారు.

రామ తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, కర్పూర తులసి, వనతులసి, శొంఠి తులసి ఇలా పలు రకాల తులసి ప్రజలకుఅందుబాటులో ఉంది. కార్తీక మాసంలో తులసి మరింత పుష్పించి తన సుగంధాలను నలుదిశలా వెదజల్లుతుంది. కొందరు విశిష్టమైన మాసాల్లో తులసిని పూజిస్తే ... మరికొందరు అనునిత్యం కొలుస్తుంటారు. ఆధ్యాత్మిక పథంలో ప్రదక్షిణా పూర్వకంగా పూజలు అందుకునే తులసి, ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ప్రధాన పాత్రను పోషిస్తోంది.

తులసి వనముపై నుంచి వచ్చే గాలి కారణంగా క్రిమి కీటకాలు నశిస్తాయి. పాములు ... తేళ్లు వంటి విష కీటకాలు కూడా ఆ వైపుకు రావడానికి సాహసించవు. ఇంటి చుట్టూ తులసి మొక్కలు ఉన్నట్టయితే, ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించలేవు. ప్రతి నిత్యం రెండు పూటలా తులసి దళములను పూజించడం ద్వారా, ఎన్నో రకాల వ్యాధుల బారినుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా చర్మ వ్యాధులకు ... శ్వాస కోశ వ్యాధులకు తులసిని మించిన దివ్య ఔషధం లేదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

SMALL MONEY NO QUARTER CARTOONS


TOILETS USAGE CARTOON


YELLOW HOTTIE MIDHUNA


LOVE FAILURE


DAILY COLOURFUL MUGGULU 05-03-2015


THERMOMETER TRAINING


SHOWING OF ARUNDHATHI STAR IN INDIAN MARRIAGES - WHY - TRADITIONAL REASON AND SCIENTIFIC IMPORTANCE OF INDIAN MARRIAGES


వివాహము లో అరుంధతీ నక్షత్ర దర్శనము

వివాహములోని అనేకమైన తంతులలో , అనగా , అంకురార్పణము అయిన తర్వాత , పెళ్ళికుమారుని , పెళ్ళికూతురును చేయుట ,గౌరీ పూజ , వరపూజ , అటుతర్వాత మధుపర్కము , జీలకర్రా బెల్లము , తలంబ్రాలు మొదలు ఆచరించు అనేక కార్యముల తో పాటు విశిష్టమైనది అరుంధతీ నక్షత్ర దర్శనము. వివాహ సమయములో వరుడు తన క్షేమాభివృద్ధుల కోసము అనేక మంది దేవతలను ప్రార్థించును . దానికొరకు పెళ్ళికుమారుని చేత పురోహితుడు అనేక మంత్రములను చెప్పించును .

మొదట పెళ్ళికుమారుడు వధువుతో , " ఓ కన్యా , నా గృహమునకు వచ్చి నాతో కాపురము చేయుచూ సంతాన సమృద్ధిగలదానివి కమ్ము , నా గృహమునకు వచ్చి , గృహస్థుని ధర్మములగు అతిథి అభ్యాగతులను పూజించుట , ఆదరించుట చేయుటలో నాకు సహకరించుము , పుత్రులు , మనవలు కలిగినాక వారికి కూడా ఇవియన్నియూ బోధించుము " అని చెప్పును ( ఇహ ప్రియం ప్రజయా తే సమృధ్యతా ......వివిధ మావదాసి || అనే మంత్రము )

ఆ తరువాత , || సుమంగలీరియమ్ వధూరిమాగ్ం .........విపరేతన || అనే మంత్రము చెప్పును . దాని అర్థము , వివాహమునకు వచ్చిన వారితో , " బహుకాలము వరకూ సువాసినీత్వము కలిగియుండెడి ఈ వధువు చూచి , ఆమెకు ఆయుర్భాగ్యములనొసగి , ఆశీర్వదించి తరువాత మీ ఇండ్లకు స్వేఛ్చగా వెళ్ళుడు " అని ప్రార్థిస్తాడు .

తరువాత ధృవ నక్షత్రమును గూర్చి , ’ తనకు జీవితమున శత్రు బాధలు లేకుండా కాపాడుమని ’ ప్రార్థించును .

అటుతరువాత , భార్యతో సహా ఆకాశములోని సప్తర్షి మండలములో నున్న అరుంధతీ నక్షత్రమును దర్శించి , ఈ విధముగా ప్రార్థించును " కశ్యపుడు మొదలగు ఏడుగురు ఋషులు తమ తమ భార్యలు ఏడుగురిలోను , వశిష్ఠుని భార్య యైన అరుంధతీ దేవి అగ్రగణ్యురాలనీ , అతి పవిత్రమైన పతివ్రత యని, మనస్సునందైననూ , ఒక్క క్షణమైననూ పతిని మరువక సదా తలచుచుండుననీ , అతి నిశ్చలమైనదనీ తలచి ఒప్పుకొనిరి . అందువలన , అరుంధతిగాక మిగిలిన ఆరుగురు స్త్రీలు అరుంధతిని తమలో అగ్రగణ్యురాలు అను భావమును వహించిరి . అట్టి పరమ సాధ్వియైన అరుంధతీ దర్శనముచేత పవిత్ర భావములు పెంపొందిన , నా భార్యను మీ ఏడుగురితో పాటు ఎనిమిదవ దానినిగా ను , పవిత్రమైనదానిగాను తలచి ఆశీర్వదించండి . " . అనగా తాను ఎనిమిదవ ఋషిని యని భావించునట్లు అర్థము .

( || సప్త ఋషయః ప్రథమం కృత్తికానామరుంధతీం ......అస్మాకమేధత్వష్టమీ || అనే మంత్రము )

తర్వాత అగ్నిహోత్రుని , గంధర్వులను , సూర్యుడిని , ఇతర దేవతలనూ ప్రార్థించును .

ఒక సంసారము బాగుగా నడవవలెనంటే దానిలో ఆ ఇంటి గృహిణి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది . అందుకే ఇంటిని చూచి ఇల్లాలిని చూడు అన్నారు . ఒక ఇల్లు నిలవాలన్నా , కూలిపోవాలన్నా అది ఆ ఇంటి ఇల్లాలి వల్లనే అవుతుంది . కాబట్టి తన ఇల్లాలికి అరుంధతిని చూపించి సద్బుద్ధి కలిగించునట్లు చేయమని ప్రార్థించుట.

సముద్రము పక్కన కూర్చొనగానే , మనము వద్దనుకొన్ననూ చల్లగాలి వచ్చి ఎటుల తాకునో , అట్లు , అరుంధతిని చూడగనే ఆమె ప్రభావము వలన మనసు పవిత్రమగును అని ప్రతీతి .

* అరుంధతి,ద్రవ,సప్త ఋషి నక్షత్రాలు ఎలా గుర్తుపట్టాలి?

హిందూ వివాహ వేడుకలలో అరుంధతీ నక్షత్రం, వసిష్ఠ నక్షత్రాలకున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు... ప్రతి వివాహ అనంతరం ఈ ఈనక్షత్రాలను తప్పనిసరిగా చూపిస్తారు... దీనిలో పరమార్ధం ఆ దంపతులలాగా చిరకాలం లోకానికి ఆదర్శ దంపతులలా వెలుగొందాలనే .. ఇంకా దీనిని ఆధారంగా చేసుకునే మనం ధృవనక్షత్రాన్ని గుర్తిస్తాంఎందుకంటే దీనిని ఆధారంగా చేసుకొనే మనం దిక్కులను కనిపెట్టవచు.... మనం భౌగోళికంగా ఎక్కడ ఉన్నా సరేఎప్పుడూ ఉత్తర దిశనే సూచిస్తుంది... దీనిని ఆధారంగా చేసుకునే పూర్వం నావికులు సముద్రయానం చేసేవారట

ANCIENT HINDU AYURVEDAM TIPS - HEALTH WITH TULASI TREE AND LEAVES


RAMAYAN STORIES IN TELUGU - ARTICLE ABOUT THE GREAT WARRIOR KING - VAALI


వాలి

ఇతడు మహా బలశాలి. తన ఎదురుగా వొచ్చి యుద్దం చేసే శత్రువుల బలాన్ని సగానికి తగ్గించగల శక్తి వాలీ కి ఉన్నదని ప్రతీతి. ఇతడు సూర్యోదయనికన్నా ముందుగా లేచి, నాలుగు సముద్రాలలో స్నానమచరించి, ఆనుస్తానం పూర్తి చేసి దినఛర్య మొదలు పెట్టేవాడు.కిష్కీంధ లోని అసంఖ్యాకమైన వానరులందరికి ఇతడు రాజుగా ఉండేవాడు. ఇతని భార్య శూర, కుమారుడు అంగదుడు. దుందుభి అనే రాక్షసుడు మహా బలవంతుడు. ఇతడు ఒకనాడు బ్రహ్మ వద్దకు వెళ్ళి యుద్ధానికి రమ్మని పిలవగా బ్రహ్మ ఇతనిని హిమావంతుని వద్దకు పంపుతాడు. దుందుభి హిమావంతుని జయించ తలాపోసి హిమాలయాలకు వెళ్ళగా, హిమావంతుడు వాలీ మాత్రమే నీ యుద్ధ దాహాన్ని తీర్చగలదు అని దుందుభి ని వాలీ వద్దకు పంపుతాడు.నగర ద్వారం వద్దకు వొచ్చి గొప్ప సింహానాదం తో వాలీ ని యుద్ధానికి పిలిచిన దుందుభి కి తన అంతఃపుర స్త్రీ లతో వాలీ కనిపిస్తాడు. తనను అవహేళన చేసిన దుందుభి ని ముష్టి ఘతలతో , పిడి గుద్దులతో అవలీలగా సంహరిస్తాడు వాలీ. దున్నపోతు రూపంలో ఉన్న దుందుభి శరీరాన్ని గిరగిర తిప్పి విసరగా రుష్యముక పర్వథమ్ పై ఉన్న మాతన్గ మహముని ఆశ్రమం పై రక్తపు వర్షం కురుస్తుంది. దానికి కోపించిన మహముని, తన ఆశ్రమం ఆవరణ లోకి ప్రవేశిస్తే తల పగిలి మరణిస్తా వాణి సపిస్తాడు దుందుభి తమ్ముడు మాయావి.

తన అన్న మరణానికి ప్రతీకారం తెర్చుకోవాలని తలాపోసి, వాలీ వద్దకు వెళ్ళి యుద్ధానికి కావ్విస్తాడు. అర్ధరాత్రి దాటుతున్న వాలీ, సుగ్రీవులు మాయావిని వెంబాదిస్తారు. కొండ బిలాం లో దురిన మాయావి ని సంహరించి గాని రానని తన తమ్ముడి తో చెప్పి గుహ లో ప్రవేశిస్తాడు వాలీ. కొన్ని రోజులు గడిచాక గుహ బయటకు ప్రవహించే రక్తాన్ని తన అన్న రక్తంగా భ్రమిస్తాడు సుగ్రీవుడు. గుహ లోపలి విజయ నాదాన్ని మాయావి గొంతుగా తలాపోసి, గుహ ముఖ ద్వారాన్ని ఒక బండరాయి తో కప్పి, కిష్కీంధ కు చేరి వాలీ మరణ వార్తను అందరికి తెలియ చేస్తాడు సుగ్రీవుడు. సుగ్రీవుడి ని రాజు గా పట్టాభిశిక్తుడిని చేసిన అనంతరం వాలీ తిరిగి వొచ్చి, సుగ్రీవుడి ని తులనది, అతడిని రాజ్యం నుండి తరిమి వేస్తాడు. అతని భార్య ఐన తార ను, తన రాణి గా చేసుకుంటాడు. ఆ తదనంతర పరిణామాలలో, సుగ్రీవుడి స్నేహితుడైన రాముడి చేతిలో మరణిస్తాడు వాలీ. సాక్షత్ విష్ణు రూపమైన రాముడు సైతం చెట్టు చాటు నుంచి ఛంపల్సిన పరిస్థితీ కల్పిస్తాడు వాలీ.

TELUGU LEGENDARY ARTIST - SRI CHITTHRI NAGAYYA GARU - PENCIL SKETCH


PRESENT SITUATION IN INDIA CARTOON