The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
TELUGU TRAVEL GUIDE / INFORMATION ABOUT ACHANTISWARALAYAM TEMPLE AT KODERU - INDIA
ఆచంటీశ్వరాలయం
ఆచంటీశ్వరాలయం దక్షిణ భారత దేశములో ఉన్న పుణ్య క్షేత్రములలో ఒకటి. ఈ క్షేత్రము వశిష్ట, గొదావరి నది తీరములో ఉన్న కోడేరు గ్రామానికి, ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నంది. రాజకీయంగానూ, సాంస్కృతికంగాను ఎంతగానో పేరొందిన ఆచంట మండలంలో పుర మధ్యలో శ్రీరామచంద్ర మూర్తి చే ప్రతిష్ఠితుడై శ్రీ రామలింగేశ్వర మూర్తి ఉమా సమేతంగా వెలసి ఎంతో ఖ్యాతి పొంది యున్నాడు. దర్శనీయ స్థలంగానూ, పుణ్యక్షేత్రంగాను ఆచంట విరాజిల్లుతోంది. శివరాత్రి , కార్తీక పూర్ణిమ లాంటి, పర్వదినాలతోపాటు ప్రతి రోజూ తమిళనాదు, కర్ణాటక రాష్ట్రాలనుండి అనేక మంది భక్తులు వస్తూంటారు.
* ఆలయ చరిత్ర
ఈ ఆచంట గ్రామానికి పూర్వం మార్తాండపురమనే పేరు ఉంది. శ్రీ ఒడయనంబి-పరమనాచీమ అనే తమిల దంపతులతో స్వామి పూజింపబడ్డాడాని చరిత్రలొ చెప్పబడి ఉంది. ఒకయనంబి అపర శివభక్తుడు. తీర్థయాత్రలు నేయుచు- శివాజ్ఞ చే చివరికి మార్తాఅండపురం చేరుకొనెను. ప్రతీ రూజూ శివార్చనచే పవిత్రుడగుచుండెను. ఒక రోజు మేలుకొనే సరికి ప్రాతః సమయం దాటి సూర్యకిరణములు భూమిపై ప్రసరించు సరికి ఒడబనంబికి ఏమి చేయాలో శివారాథన ఎట్లు గావించాలో తెలియలేదు. అంతలో నిద్రావస్థలో ఉన్న తన సతీమణియైన పరమనాచీమ స్తనద్వయంబందు ఆత్మలింగ దర్శనం చేసుకొని పూజకావించెను. ఆ తరువాత తను తప్పు చేశానని విచారించుచుండ ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై "నీవు పొరబాటు చేయలేదు. చిత్త శుద్ధితో చేసిన నీ పూజ నేనెరింగితిని." అని అంతర్ధానమయ్యెను. ఆ చనాగ్రంబున వెలసినందున ఆ పరమ శివుడు ఆచంటిశ్వరునిగా వినుతికెక్కెను.
* ఆలయ విశేషాలు
ఆచంటలోని రామేశ్వరాలయం లో క్రీ.శ 1152 - 1255 సంవత్సరాలలో చారిత్రక శాసనాలు అనేకం ఉన్నాయి. ప్రాచీన చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే ఆచంటీశ్వర క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ చుసి తరిస్తారు. గర్భాలయంలో శివలింగతో పాటు ఉమాదేవి, ఆలయ ప్రాంగణంలో శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ వీరభద్రుడు, శ్రీ విశ్వేశ్వర స్వామి, శ్రీ కమఠేశ్వరస్వామి, శ్రీ లక్ష్మణేస్వర స్వామి, శ్రీ కనకదుర్గ అమ్మవారు, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ సరస్వతీ దేవి, నవగ్రహములు, శ్రీ సూర్యనారాయణ స్వామి మొదలైన ఉపాలయాలతో పాటు సప్తమాతృకలచే నిర్మితమై ఉంది ఈ ఆలయం.
* ఆలయంలో జరుగు పూజా వేడుకలు
తొలి ఏకాదశమి
శ్రీరమా సత్యనారాయన (ఉపాలయం) స్వామి వారికి గ్రామోత్సవ పూజలు జరుగును.
కృష్ణాష్టమి
ఆలయంలో కృష్ణుని పూజలు జరిపు పాలకుండ కొట్టడం, పొన్నచెట్టు, గరుడవాహనాల, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరుగును.
దసరా
అమ్మవారికి కుంకుమ పూజలు 9 రోజులు విశేషంగా జరుగును, చివరి రోజు గ్రామోత్సవం జరుపబడును.
కార్తీకమాసం
ఈ ఆచంటీశ్వరుని దేవాలయ్ంలో విశేషంగా ఈ మాసమంతా పూజలు జరుగును. దేవాలయానికి ప్రక్కనే ఉన్న రామగుండమందు భక్తులు కార్తీక మాస దీపాలు విడుస్తారు. ఈ రామగుండమందు ఒక సంవత్సరం పాటు క్రమం తప్పకుండా స్నానమాచరిస్తే కుష్టు కొదలైన భయంకర వ్యాధులనుండి విముక్తులవుతారని చరిత్రలో చెప్పబడింది. అంతే కాకుండా కార్తీక ద్వాదశి రోజున తెప్పోత్సవం రమాసత్య దెవూల్కు కనుల వైభవంగా జరిపు అనంతరం బాణా సంచా కాల్చుదురు. రాత్రివరకు విశేష అర్చనలు జరుగును. ఈ కార్తీక మాసంలో ఏటా 3 సోమవారాలు జ్యోతిర్లింగార్చన, ఏకవార రుద్రాభిషేకం, ప్రతివారం స్మార్త పండ్కితులచే లక్ష బిర్వార్చనలు జరుగును. కార్తీక పూర్ణిమ రోజున జ్వాలాతోరణం వెలిగించి రుద్రహోమం జరుగుతుంది.
కపర్థి పత్తి
కార్తీక పూర్ణిమ రోజున ఈ కపర్థ పత్తి వెలిగించడం జరుగుతుంది. ఈ పత్తి 90 రోజులు నిరాఘాటంగా వెలుగుతుంది. దీని కొరకు కిలోల ఆవునెయ్యి ఉపవాసం ఉండి పోస్తూంటారు. కార్తీక మాసంలో వెలిగించబడిన ఈ ఒత్తి శివరాత్రి వరకు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. కాశీ తరువాత ఇటువంటి దీపం ఈ ఆచంటలో వెలిగించబడుట విశేషం. అందువల్ల దీనిని చిన్న కాశీ అని కూడ అంటారు. ఈ దీప దర్శనం జన్మాంతర పాప నాశనం అని చెప్పబడుతోంది.
మహా శివరాత్రి
శివరాత్రి సందర్భంగా 5 రోజులు విశేషంగా ఉత్సవం జరుపబడును. అందులో భాగంగా దశమి రోజున స్వామివారిని ఊరేగింపు, బాణాసంచా కొలువు, ఏకాదశి రోజు ఉమారామేశ్వరులకు కళ్యాణోత్సవం జరిపించబడును. మరునాదు ఉఅమ రామేశ్వరుల ఊరేగింపు గజ, సింహ,సర్ప, గరుఢ, వృషభ వాహనాల ఊరేగింపు , అనేక విధములైన నృత్య, గీత ప్రదర్శనలు జరుగును.
శివరాత్రి రూజున లింగోద్భవ కాలమందు విశేషంగా అభిషేకం జరుపబడును. అనంతరం భక్తుల అభిషేకములు, మధ్యాహ్నం కన్ను వైభోగంగా రథోత్సవం జరుగును. నాలుగవ రోజు స్వామివారికి తెప్పోత్సవం జరుపబడును. ఐదవ రొజున పుష్పోత్సవం, కుంకుమ భరిణలు, ప్రసాదాలు, భక్తులకు పంచిపెట్టబడును. శివరాత్రి ఐదు రోజులు స్వామివారి సత్రమందు భక్తులకు అన్నదాన మహోత్సవములు జరుగు. శివరాత్రి రోజున విశ్వేశ్వరుని కళ్యాణం జరుగును. శివరాత్రి ఉత్సవం సందర్భంగా ప్రభుత్వం వారు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను, ఉచిత వైద్య సదుపాయాలను కల్పించడం జరుగుతుంది.
ఆచంటీశ్వరాలయం దక్షిణ భారత దేశములో ఉన్న పుణ్య క్షేత్రములలో ఒకటి. ఈ క్షేత్రము వశిష్ట, గొదావరి నది తీరములో ఉన్న కోడేరు గ్రామానికి, ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నంది. రాజకీయంగానూ, సాంస్కృతికంగాను ఎంతగానో పేరొందిన ఆచంట మండలంలో పుర మధ్యలో శ్రీరామచంద్ర మూర్తి చే ప్రతిష్ఠితుడై శ్రీ రామలింగేశ్వర మూర్తి ఉమా సమేతంగా వెలసి ఎంతో ఖ్యాతి పొంది యున్నాడు. దర్శనీయ స్థలంగానూ, పుణ్యక్షేత్రంగాను ఆచంట విరాజిల్లుతోంది. శివరాత్రి , కార్తీక పూర్ణిమ లాంటి, పర్వదినాలతోపాటు ప్రతి రోజూ తమిళనాదు, కర్ణాటక రాష్ట్రాలనుండి అనేక మంది భక్తులు వస్తూంటారు.
* ఆలయ చరిత్ర
ఈ ఆచంట గ్రామానికి పూర్వం మార్తాండపురమనే పేరు ఉంది. శ్రీ ఒడయనంబి-పరమనాచీమ అనే తమిల దంపతులతో స్వామి పూజింపబడ్డాడాని చరిత్రలొ చెప్పబడి ఉంది. ఒకయనంబి అపర శివభక్తుడు. తీర్థయాత్రలు నేయుచు- శివాజ్ఞ చే చివరికి మార్తాఅండపురం చేరుకొనెను. ప్రతీ రూజూ శివార్చనచే పవిత్రుడగుచుండెను. ఒక రోజు మేలుకొనే సరికి ప్రాతః సమయం దాటి సూర్యకిరణములు భూమిపై ప్రసరించు సరికి ఒడబనంబికి ఏమి చేయాలో శివారాథన ఎట్లు గావించాలో తెలియలేదు. అంతలో నిద్రావస్థలో ఉన్న తన సతీమణియైన పరమనాచీమ స్తనద్వయంబందు ఆత్మలింగ దర్శనం చేసుకొని పూజకావించెను. ఆ తరువాత తను తప్పు చేశానని విచారించుచుండ ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై "నీవు పొరబాటు చేయలేదు. చిత్త శుద్ధితో చేసిన నీ పూజ నేనెరింగితిని." అని అంతర్ధానమయ్యెను. ఆ చనాగ్రంబున వెలసినందున ఆ పరమ శివుడు ఆచంటిశ్వరునిగా వినుతికెక్కెను.
* ఆలయ విశేషాలు
ఆచంటలోని రామేశ్వరాలయం లో క్రీ.శ 1152 - 1255 సంవత్సరాలలో చారిత్రక శాసనాలు అనేకం ఉన్నాయి. ప్రాచీన చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే ఆచంటీశ్వర క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ చుసి తరిస్తారు. గర్భాలయంలో శివలింగతో పాటు ఉమాదేవి, ఆలయ ప్రాంగణంలో శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ వీరభద్రుడు, శ్రీ విశ్వేశ్వర స్వామి, శ్రీ కమఠేశ్వరస్వామి, శ్రీ లక్ష్మణేస్వర స్వామి, శ్రీ కనకదుర్గ అమ్మవారు, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ సరస్వతీ దేవి, నవగ్రహములు, శ్రీ సూర్యనారాయణ స్వామి మొదలైన ఉపాలయాలతో పాటు సప్తమాతృకలచే నిర్మితమై ఉంది ఈ ఆలయం.
* ఆలయంలో జరుగు పూజా వేడుకలు
తొలి ఏకాదశమి
శ్రీరమా సత్యనారాయన (ఉపాలయం) స్వామి వారికి గ్రామోత్సవ పూజలు జరుగును.
కృష్ణాష్టమి
ఆలయంలో కృష్ణుని పూజలు జరిపు పాలకుండ కొట్టడం, పొన్నచెట్టు, గరుడవాహనాల, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరుగును.
దసరా
అమ్మవారికి కుంకుమ పూజలు 9 రోజులు విశేషంగా జరుగును, చివరి రోజు గ్రామోత్సవం జరుపబడును.
కార్తీకమాసం
ఈ ఆచంటీశ్వరుని దేవాలయ్ంలో విశేషంగా ఈ మాసమంతా పూజలు జరుగును. దేవాలయానికి ప్రక్కనే ఉన్న రామగుండమందు భక్తులు కార్తీక మాస దీపాలు విడుస్తారు. ఈ రామగుండమందు ఒక సంవత్సరం పాటు క్రమం తప్పకుండా స్నానమాచరిస్తే కుష్టు కొదలైన భయంకర వ్యాధులనుండి విముక్తులవుతారని చరిత్రలో చెప్పబడింది. అంతే కాకుండా కార్తీక ద్వాదశి రోజున తెప్పోత్సవం రమాసత్య దెవూల్కు కనుల వైభవంగా జరిపు అనంతరం బాణా సంచా కాల్చుదురు. రాత్రివరకు విశేష అర్చనలు జరుగును. ఈ కార్తీక మాసంలో ఏటా 3 సోమవారాలు జ్యోతిర్లింగార్చన, ఏకవార రుద్రాభిషేకం, ప్రతివారం స్మార్త పండ్కితులచే లక్ష బిర్వార్చనలు జరుగును. కార్తీక పూర్ణిమ రోజున జ్వాలాతోరణం వెలిగించి రుద్రహోమం జరుగుతుంది.
కపర్థి పత్తి
కార్తీక పూర్ణిమ రోజున ఈ కపర్థ పత్తి వెలిగించడం జరుగుతుంది. ఈ పత్తి 90 రోజులు నిరాఘాటంగా వెలుగుతుంది. దీని కొరకు కిలోల ఆవునెయ్యి ఉపవాసం ఉండి పోస్తూంటారు. కార్తీక మాసంలో వెలిగించబడిన ఈ ఒత్తి శివరాత్రి వరకు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. కాశీ తరువాత ఇటువంటి దీపం ఈ ఆచంటలో వెలిగించబడుట విశేషం. అందువల్ల దీనిని చిన్న కాశీ అని కూడ అంటారు. ఈ దీప దర్శనం జన్మాంతర పాప నాశనం అని చెప్పబడుతోంది.
మహా శివరాత్రి
శివరాత్రి సందర్భంగా 5 రోజులు విశేషంగా ఉత్సవం జరుపబడును. అందులో భాగంగా దశమి రోజున స్వామివారిని ఊరేగింపు, బాణాసంచా కొలువు, ఏకాదశి రోజు ఉమారామేశ్వరులకు కళ్యాణోత్సవం జరిపించబడును. మరునాదు ఉఅమ రామేశ్వరుల ఊరేగింపు గజ, సింహ,సర్ప, గరుఢ, వృషభ వాహనాల ఊరేగింపు , అనేక విధములైన నృత్య, గీత ప్రదర్శనలు జరుగును.
శివరాత్రి రూజున లింగోద్భవ కాలమందు విశేషంగా అభిషేకం జరుపబడును. అనంతరం భక్తుల అభిషేకములు, మధ్యాహ్నం కన్ను వైభోగంగా రథోత్సవం జరుగును. నాలుగవ రోజు స్వామివారికి తెప్పోత్సవం జరుపబడును. ఐదవ రొజున పుష్పోత్సవం, కుంకుమ భరిణలు, ప్రసాదాలు, భక్తులకు పంచిపెట్టబడును. శివరాత్రి ఐదు రోజులు స్వామివారి సత్రమందు భక్తులకు అన్నదాన మహోత్సవములు జరుగు. శివరాత్రి రోజున విశ్వేశ్వరుని కళ్యాణం జరుగును. శివరాత్రి ఉత్సవం సందర్భంగా ప్రభుత్వం వారు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను, ఉచిత వైద్య సదుపాయాలను కల్పించడం జరుగుతుంది.
REDUCE FAT WITH HARMONS
కొవ్వును కరిగించే హార్మోన్
శరీరంలో అవసరానికి మించి చేరే కొవ్వు బరువు పెంచుతుందని దీన్ని వదిలించుకునేందుకు వ్యాయామంపైన ఆధారపడడం మామూలే.. అయితే సరిగ్గా ఇదే పనిని మన శరీరంలోని ఓ హార్మోన్ చేస్తుందని యూనివర్శిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా పరిశోధకులు చెబుతున్నారు. మాట్స్ - సి గా వ్యవహరించే ఈ హార్మోన్ శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని రీస్టోర్ చేస్తుందన్నారు.
శరీరంలో పెరిగే ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుందని పరిశోధనలో పాల్గొన్న సీనియర్ శాస్త్రవేత్త పించాస్ కోహెన్ వివరించారు. ఎలుకల శరీరంలోకి ఈ హార్మోన్ను ప్రవేశపెట్టి ఈ ఫలితాలను నిర్ధారించుకున్నట్లు పేర్కొన్నారు.
శరీరంలో అవసరానికి మించి చేరే కొవ్వు బరువు పెంచుతుందని దీన్ని వదిలించుకునేందుకు వ్యాయామంపైన ఆధారపడడం మామూలే.. అయితే సరిగ్గా ఇదే పనిని మన శరీరంలోని ఓ హార్మోన్ చేస్తుందని యూనివర్శిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా పరిశోధకులు చెబుతున్నారు. మాట్స్ - సి గా వ్యవహరించే ఈ హార్మోన్ శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని రీస్టోర్ చేస్తుందన్నారు.
శరీరంలో పెరిగే ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుందని పరిశోధనలో పాల్గొన్న సీనియర్ శాస్త్రవేత్త పించాస్ కోహెన్ వివరించారు. ఎలుకల శరీరంలోకి ఈ హార్మోన్ను ప్రవేశపెట్టి ఈ ఫలితాలను నిర్ధారించుకున్నట్లు పేర్కొన్నారు.
LESS SLEEP LEADS TO SO MANY HEALTH PROBLEMS - DONT NEGLECT SLEEPING
కునుకు తగ్గితే మునక!
ఒకప్పుడు ఎంత తక్కువ నిద్రపోతే అంత ఘనం! ఫలానా మహాత్ముడురోజుకు నాలుగు గంటలే నిద్రపోయేవాడని గొప్పగా చెప్పుకునేవాళ్లం. కానీ ఆధునిక వైద్య పరిశోధనా రంగం నిద్రను ఏమాత్రం తక్కువగా అంచనా వెయ్యటానికి లేదనీ, ప్రతి రోజూ తగినంత నిద్రపోకపోతే జీవితం వ్యాధుల పరం కావటం తథ్యమని స్పష్టంగా హెచ్చరిస్తోంది. నిద్ర ఎంత తక్కువపోతే ఏమవుతుందో చూద్దామని దోహాలోని వెయిల్ కార్నెల్ మెడికల్ కాలేజీ పరిశోధకులు అధ్యయనాలు చేశారు. రోజూ ఒక అరగంట తక్కువ నిద్రపోవటం వల్ల వారి ఒంట్లో జీవక్రియలన్నీ అస్తవ్యస్తమై, బరువు పెరగటంతో పాటు చాలామంది మధుమేహం బారిన కూడా పడుతున్నారని వీరు గుర్తించటం ఆందోళనకరమైన అంశం. అలాగే వారమంతా తక్కువ నిద్రపోయి, దాన్ని భర్తీ చేసుకోవటానికి వారాంతంలో ఎక్కువ నిద్రపోవటం కూడా రుగ్మతలు తెచ్చిపెట్టే అలవాటేనని వీరు గుర్తించారు. అరగంట నిద్ర కొరత ఏర్పడినా ఫలితాలు ప్రతికూలంగానే ఉంటున్నాయని వీరు గుర్తించటం చెప్పుకోవాల్సిన అంశం.
NEVER SIT FOR A LONG TIME WHICH REDUCES LIFE SPAM - AN ANALYSIS
కూర్చుంటే కరిగిపోతుంది!
ఒకప్పుడు కూర్చుని తింటే కొండైనా కరిగిపోతుందనే వాళ్లం! ఇప్పుడు తెలుసుకోవాల్సిందేమంటే రోజులో ఎంత సేపు కూర్చుంటే మన ఆయుర్దాయం అంత తరిగిపోతుందని!! హాయిగా కాలు మీద కాలు వేసుకుని కుర్చీల్లో కూర్చోవటాన్ని ఒకప్పుడు గొప్పగా భావించేవాళ్లం. కానీ ఆధునిక వైద్య పరిశోధనలన్నీ కూడా ఎక్కువసేపు కూర్చుని ఉండటం ఏమాత్రం మంచిది కాదని ఘోషిస్తున్నాయి. రోజులో ఎక్కువ సేపు కూర్చుని ఉండేవారిలో.. కూర్చుని ఉండే ప్రతి గంటకూ.. 14% గుండె జబ్బు ముప్పు పెరుగుతోందని తాజాగా అమెరికా పరిశోధకుల అధ్యయనంలో గుర్తించారు.ఒక్క గుండె జబ్బులే కాదు.. అధిక రక్తపోటు, వూబకాయం, కొలెస్ట్రాల్ స్థాయులు పెరగటం, బొజ్జ దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకోవటం.. ఇలాంటి సమస్యలన్నీ వరస కడుతున్నాయని అధ్యయనాలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి.
• మరో కీలకమైన అంశమేమంటే-
రోజులో ఓ గంటపాటు నడక/జాగింగ్ వంటివి చేసేసి.. ఆ తర్వాత ఏకధాటిగా 8 గంటలు కూర్చుని ఉండిపోయినా కూడా ఏమంత మంచి ఫలితాలు కనబడటం లేదు. కూర్చుని ఉండటం వల్ల ఒంటికి జరిగే నష్టాన్ని ఆ గంట నడకా ఏమాత్రం పూడ్చలేకపోతోందని, కాబట్టి ఏకబిగిన కూర్చుని ఉండటం కాకుండా.. మధ్యమధ్యలో ప్రతి 30 నిమిషాలకూ లేచి నాలుగు అడుగులు నడవాలని పరిశోధకులు చెబుతున్నారు.
ఒకప్పుడు కూర్చుని తింటే కొండైనా కరిగిపోతుందనే వాళ్లం! ఇప్పుడు తెలుసుకోవాల్సిందేమంటే రోజులో ఎంత సేపు కూర్చుంటే మన ఆయుర్దాయం అంత తరిగిపోతుందని!! హాయిగా కాలు మీద కాలు వేసుకుని కుర్చీల్లో కూర్చోవటాన్ని ఒకప్పుడు గొప్పగా భావించేవాళ్లం. కానీ ఆధునిక వైద్య పరిశోధనలన్నీ కూడా ఎక్కువసేపు కూర్చుని ఉండటం ఏమాత్రం మంచిది కాదని ఘోషిస్తున్నాయి. రోజులో ఎక్కువ సేపు కూర్చుని ఉండేవారిలో.. కూర్చుని ఉండే ప్రతి గంటకూ.. 14% గుండె జబ్బు ముప్పు పెరుగుతోందని తాజాగా అమెరికా పరిశోధకుల అధ్యయనంలో గుర్తించారు.ఒక్క గుండె జబ్బులే కాదు.. అధిక రక్తపోటు, వూబకాయం, కొలెస్ట్రాల్ స్థాయులు పెరగటం, బొజ్జ దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకోవటం.. ఇలాంటి సమస్యలన్నీ వరస కడుతున్నాయని అధ్యయనాలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి.
• మరో కీలకమైన అంశమేమంటే-
రోజులో ఓ గంటపాటు నడక/జాగింగ్ వంటివి చేసేసి.. ఆ తర్వాత ఏకధాటిగా 8 గంటలు కూర్చుని ఉండిపోయినా కూడా ఏమంత మంచి ఫలితాలు కనబడటం లేదు. కూర్చుని ఉండటం వల్ల ఒంటికి జరిగే నష్టాన్ని ఆ గంట నడకా ఏమాత్రం పూడ్చలేకపోతోందని, కాబట్టి ఏకబిగిన కూర్చుని ఉండటం కాకుండా.. మధ్యమధ్యలో ప్రతి 30 నిమిషాలకూ లేచి నాలుగు అడుగులు నడవాలని పరిశోధకులు చెబుతున్నారు.
HOW TO OVERCOME GENERAL SICKNESS TO ALL AGES - HEALTH TIPS IN TELUGU TO FIGHT AGAINST GENERAL SICKNESS
మీరు బాగా అలసిపోతున్నారా..?
కొందరికి కొద్దిగా పని చేస్తే చాలు అలసట వచ్చేస్తుంది. చాలాసార్లు ఈ అలసట పనిఒత్తిడి, డిప్రెషన్ వంటి కారణాల వల్ల అనుకుంటారు. రక్తహీనత వల్ల కూడా అలసట వస్తుందనే విషయాన్ని పట్టించుకోరు. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మన దేశంలో ప్రతి ఐదుగురు మహిళలల్లోను ముగ్గురికి రక్తహీనత సమస్య ఉందని నిపుణుల అంచనా. గర్భిణిలలోను, పాలు ఇచ్చే తల్లుల్లోను, అప్పుడే రసజ్వల అయిన అమ్మాయిల్లోను రక్తహీనత సమస్య కనిపిస్తూ ఉంటుంది.
ఎలా కనుగొనాలి?
రక్తహీనత లక్షణాలను ఎలా అంచనా వేయాలనే విషయాన్ని తెలుసుకొనే ముందు- అసలు ఈ సమస్య మూలాలను తెలుసుకోవాలి. మన శరీరంలో కణాలు సక్రమంగా పనిచేయాలంటే వాటికి ఆక్సిజన్ అవసరం. ఎర్ర రక్తకణాలలో ఈ ఆక్సిజన్ను హిమోగ్లోబిన్ అనే ప్రొటీన్ తీసుకువెళ్తూ ఉంటుంది. దీనిలోనే ఐరన్ కూడా ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ శాతాన్ని జీఎంజ డీఎల్గా కొలుస్తారు. ఈ శాతం 13 కన్నా తక్కువ ఉంటే మన శరీరానికి తగినంత ఐరన్, ఆక్సిజన్లు అందవు. కొన్ని సందర్భాలలో ఆక్సిజన్ తక్కువ ఉండటం వల్ల- గుండెపై చాలా ఒత్తిడి పడుతుంది. అలాంటి సమయాల్లో గుండె నొప్పి కూడా వస్తుంది. హిమోగ్లోబిన్ శాతం 7జీఎం డీఎల్ కన్నా తక్కువ అయినప్పుడు- త్వరగా అలిసిపోవటం, తలనొప్పి, కళ్లు తిరగటం, ఏకాగ్రత లేకపోవటం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి సమయాల్లో వెంటనే విటమిన్ బీ12, ఐరన్లను వృద్ధి చేసే మందులను తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే రక ్తమార్పిడి చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. ఇక గర్భవతుల్లో- రక్తహీనత రకరకాల సమస్యలకు కారణమవుతుంది. ఇటీవల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం- గర్భవతుల మరణాలలో- ప్రతి ఐదింటిలో ఒకటి రక్తహీనత వల్లే జరుగుతోంది.
ఎలా ఎదుర్కోవాలి?
హిమోగ్లోబిన్ శాతం బాగా తక్కువుంటే మందులు వాడాలి. లేకపోతే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది. కాయగూరలు, ఆకుకూరలతో పాటుగా గుడ్లు, ఎర్రమాంసం, లివర్, రొయ్యలు, ఆయిస్టర్స్ వంటివి తింటే హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. సాధారణంగా పప్పుదినుసులు, ఆకుకూరలు, కాయగూరలలో ఐరన్ శాతం 2 నుంచి 10 శాతం దాకా ఉంటుంది. అదే మాంసాహారంలో ఇది 15-35 శాతం దాకా లభిస్తుంది. దీనితో పాటు ఇనుప మూకుడులలో ఆహారపదార్థాలను వండటం వల్ల కూడా ఐరన్ శాతం పెరుగుతుంది. ఆకుకూరలు, కాయగూరల్లో నిమ్మకాయ రసం పిండుకు తింటే- ఆ పదార్థాలలో ఉన్న ఐరన్ త్వరగా రక్తంలోకి ప్రవేశిస్తుంది. ప్రతి ఏడాదికి ఒక సారి మహిళలు హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్ష చేయించుకోవాలి.
కొందరికి కొద్దిగా పని చేస్తే చాలు అలసట వచ్చేస్తుంది. చాలాసార్లు ఈ అలసట పనిఒత్తిడి, డిప్రెషన్ వంటి కారణాల వల్ల అనుకుంటారు. రక్తహీనత వల్ల కూడా అలసట వస్తుందనే విషయాన్ని పట్టించుకోరు. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మన దేశంలో ప్రతి ఐదుగురు మహిళలల్లోను ముగ్గురికి రక్తహీనత సమస్య ఉందని నిపుణుల అంచనా. గర్భిణిలలోను, పాలు ఇచ్చే తల్లుల్లోను, అప్పుడే రసజ్వల అయిన అమ్మాయిల్లోను రక్తహీనత సమస్య కనిపిస్తూ ఉంటుంది.
ఎలా కనుగొనాలి?
రక్తహీనత లక్షణాలను ఎలా అంచనా వేయాలనే విషయాన్ని తెలుసుకొనే ముందు- అసలు ఈ సమస్య మూలాలను తెలుసుకోవాలి. మన శరీరంలో కణాలు సక్రమంగా పనిచేయాలంటే వాటికి ఆక్సిజన్ అవసరం. ఎర్ర రక్తకణాలలో ఈ ఆక్సిజన్ను హిమోగ్లోబిన్ అనే ప్రొటీన్ తీసుకువెళ్తూ ఉంటుంది. దీనిలోనే ఐరన్ కూడా ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ శాతాన్ని జీఎంజ డీఎల్గా కొలుస్తారు. ఈ శాతం 13 కన్నా తక్కువ ఉంటే మన శరీరానికి తగినంత ఐరన్, ఆక్సిజన్లు అందవు. కొన్ని సందర్భాలలో ఆక్సిజన్ తక్కువ ఉండటం వల్ల- గుండెపై చాలా ఒత్తిడి పడుతుంది. అలాంటి సమయాల్లో గుండె నొప్పి కూడా వస్తుంది. హిమోగ్లోబిన్ శాతం 7జీఎం డీఎల్ కన్నా తక్కువ అయినప్పుడు- త్వరగా అలిసిపోవటం, తలనొప్పి, కళ్లు తిరగటం, ఏకాగ్రత లేకపోవటం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి సమయాల్లో వెంటనే విటమిన్ బీ12, ఐరన్లను వృద్ధి చేసే మందులను తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే రక ్తమార్పిడి చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. ఇక గర్భవతుల్లో- రక్తహీనత రకరకాల సమస్యలకు కారణమవుతుంది. ఇటీవల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం- గర్భవతుల మరణాలలో- ప్రతి ఐదింటిలో ఒకటి రక్తహీనత వల్లే జరుగుతోంది.
ఎలా ఎదుర్కోవాలి?
హిమోగ్లోబిన్ శాతం బాగా తక్కువుంటే మందులు వాడాలి. లేకపోతే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది. కాయగూరలు, ఆకుకూరలతో పాటుగా గుడ్లు, ఎర్రమాంసం, లివర్, రొయ్యలు, ఆయిస్టర్స్ వంటివి తింటే హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. సాధారణంగా పప్పుదినుసులు, ఆకుకూరలు, కాయగూరలలో ఐరన్ శాతం 2 నుంచి 10 శాతం దాకా ఉంటుంది. అదే మాంసాహారంలో ఇది 15-35 శాతం దాకా లభిస్తుంది. దీనితో పాటు ఇనుప మూకుడులలో ఆహారపదార్థాలను వండటం వల్ల కూడా ఐరన్ శాతం పెరుగుతుంది. ఆకుకూరలు, కాయగూరల్లో నిమ్మకాయ రసం పిండుకు తింటే- ఆ పదార్థాలలో ఉన్న ఐరన్ త్వరగా రక్తంలోకి ప్రవేశిస్తుంది. ప్రతి ఏడాదికి ఒక సారి మహిళలు హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్ష చేయించుకోవాలి.
EARLY WAKE UP TIPS IN TELUGU
నిద్ర మత్తు వదలాలంటే..!
ఉదయాన్నే నిద్రలేవటం అనేది ఓ మంచి అలవాటు. తెల్లారుజామున నిద్రలేచిన వాళ్ళు రోజంతా ఫ్రెష్గా ఉండటంతో పాటు డైలీలై్ఫలో ఎక్కువ పనులు చక్కబెట్టుకోవచ్చనే నమ్మకం కలుగుతుంది.
ఇంతకీ ఉదయాన్నే నిద్రలేవాలంటే ఏం చేయాలి?
అసలు నిద్రలేచాక మళ్ళీ నిద్రపోకుండా ఉండాలంటే..?
ఉదయాన్నే నిద్రలేవాలంటే మాత్రం రాత్రి త్వరగా నిద్రపోవాలనేది కాదనలేని నిబంధన. ఎన్ని పనులున్నా, అసలు నిద్ర వచ్చే మూడ్ లేకున్నా కనీసం పది నుంచి పదకొండు గంటల లోపు బెడ్పై చేరాలి. అనవసరంగా రాత్రిపూట టీవీ ఎక్కువ చూడటం, నెట్ చూడటం మంచిది కాదు. వీటిని మానేస్తే త్వరగా నిద్ర లేవచ్చు.
నిద్రలేవటానికి చాలా మంది అలారమ్ పెట్టుకుంటారు. ఉదయాన్నే అది మోగగానే స్నూజ్ బటన్ని ఆఫ్ చేసి ఎంచక్కా నిద్రలోకి జారుకుంటారు. దీనివల్ల ఫలితం ఉండదు. అందుకే సెల్ రింగ్టోన్ అలారంగా సెట్ చేసి, లేదా టోన్ అలారమ్ క్లాక్ని మనం నిద్రపోతున్న స్థలానికి దూరంగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా బెడ్దిగి కొంచెం నడిచి అలారమ్ని ఆఫ్ చేయటానికి వెళ్ళాలి. ఆ సమయంలో ఫిజికల్ యాక్టివిటీ జరగటం వల్ల నిద్రమత్తు వదిలే చాన్స్ ఉంది. ఇది రెగ్యులర్గా చేస్తే కొన్నాళ్ళయ్యాక మీరే ఖచ్చితమైన సమయానికి స్వతహాగా నిద్రలేస్తారు.
కిటికీ కర్టెన్స్ని ఓపెన్ చేయాలి. ఒక వేళ అలారం మీరు ఆఫ్ చేసి పడుకున్నా కిటికీ లోంచి పడే వెలుతురు పడుకోనివ్వదు. ఇక నిద్రలేచిన వెంటనే పళ్ళు తోమటం, లేకుంటే టీ తయారు చేయటం చేస్తే చురుకుదనం వస్తుంది.
ఉదయాన్నే జాగింగ్కి వెళ్లటం లేదా యోగా చేయటం అలవర్చుకోవాలి. లేకుంటే ప్రశాంతంగా ధ్యానం చేసినా ఎంతో మేలు జరుగుతుంది.
ఉదయాన్నే నిద్రలేవటం అనేది ఓ మంచి అలవాటు. తెల్లారుజామున నిద్రలేచిన వాళ్ళు రోజంతా ఫ్రెష్గా ఉండటంతో పాటు డైలీలై్ఫలో ఎక్కువ పనులు చక్కబెట్టుకోవచ్చనే నమ్మకం కలుగుతుంది.
ఇంతకీ ఉదయాన్నే నిద్రలేవాలంటే ఏం చేయాలి?
అసలు నిద్రలేచాక మళ్ళీ నిద్రపోకుండా ఉండాలంటే..?
ఉదయాన్నే నిద్రలేవాలంటే మాత్రం రాత్రి త్వరగా నిద్రపోవాలనేది కాదనలేని నిబంధన. ఎన్ని పనులున్నా, అసలు నిద్ర వచ్చే మూడ్ లేకున్నా కనీసం పది నుంచి పదకొండు గంటల లోపు బెడ్పై చేరాలి. అనవసరంగా రాత్రిపూట టీవీ ఎక్కువ చూడటం, నెట్ చూడటం మంచిది కాదు. వీటిని మానేస్తే త్వరగా నిద్ర లేవచ్చు.
నిద్రలేవటానికి చాలా మంది అలారమ్ పెట్టుకుంటారు. ఉదయాన్నే అది మోగగానే స్నూజ్ బటన్ని ఆఫ్ చేసి ఎంచక్కా నిద్రలోకి జారుకుంటారు. దీనివల్ల ఫలితం ఉండదు. అందుకే సెల్ రింగ్టోన్ అలారంగా సెట్ చేసి, లేదా టోన్ అలారమ్ క్లాక్ని మనం నిద్రపోతున్న స్థలానికి దూరంగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా బెడ్దిగి కొంచెం నడిచి అలారమ్ని ఆఫ్ చేయటానికి వెళ్ళాలి. ఆ సమయంలో ఫిజికల్ యాక్టివిటీ జరగటం వల్ల నిద్రమత్తు వదిలే చాన్స్ ఉంది. ఇది రెగ్యులర్గా చేస్తే కొన్నాళ్ళయ్యాక మీరే ఖచ్చితమైన సమయానికి స్వతహాగా నిద్రలేస్తారు.
కిటికీ కర్టెన్స్ని ఓపెన్ చేయాలి. ఒక వేళ అలారం మీరు ఆఫ్ చేసి పడుకున్నా కిటికీ లోంచి పడే వెలుతురు పడుకోనివ్వదు. ఇక నిద్రలేచిన వెంటనే పళ్ళు తోమటం, లేకుంటే టీ తయారు చేయటం చేస్తే చురుకుదనం వస్తుంది.
ఉదయాన్నే జాగింగ్కి వెళ్లటం లేదా యోగా చేయటం అలవర్చుకోవాలి. లేకుంటే ప్రశాంతంగా ధ్యానం చేసినా ఎంతో మేలు జరుగుతుంది.
TRAVEL GUIDE ARTICLE IN TELUGU ABOUT SRI MAAVULLAMMA TEMPLE, BHIMAVARAM - WEST GODAVARI DISTRICT - ANDHRA PRADESH - INDIA
మావుళ్ళమ్మ దేవస్థానం, భీమవరం
భీమవరం మావుళ్ళమ్మ విజయవాడ కనకదుర్గ తరువాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత. తొమ్మిది దశాబ్దాల క్రిందట భీమవరం అనే కుగ్రామమంలో వెలసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా విలసిల్లుతూ ఉన్నది. ఆమె విశిష్ట రూపం దేవతలలో మరెవరికీ కానరాదని అంటారు.
* చారిత్రక నేపథ్యం
చారిత్రక నేపధ్యాన్ని అనుసరించి మావుళ్ళమ్మ వారి చరిత్రవిశేషాలు ఈ విధంగా ఉన్నాయి.1880 వైశాఖ మాసం రోజులల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు, గ్రంది అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతాన్ని గురించి చెపుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరినది. మరుసటి రోజున వారిరువురు ఆప్రాంతానికి వెదుకగా అమ్మవారి విగ్రహం లభ్యమయినది. అటునుండి వారు అక్కడ ఒక పాక వేసి అమ్మవారిని అక్కడ నిలిపిఉంచారు. అమ్మవారి ఆదేశానుసారం వారు అయిదు దీపాలు ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మించారు. మామిడితోటలో వెలసిన అమ్మవారిని తొలినాళ్ళలో 'మామిళ్ళమ్మ'గా తదనంతరం 'మావుళ్ళమ్మ'గా పిలవటం అలవాటయ్యింది. ప్రస్తుతం ఈ ఊరిలోని మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవన ప్రాంతంలో ఉన్న వేప, రావి చెట్లు కలిసిన చోట అమ్మవారు వెలిసినట్లు స్థానికుల కథనము. అప్పన్న, మంచిరాజులు ఉన్న మోటుపల్లివారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నడి మధ్యకు తీసుకొచ్చారు. అమ్మవారికి జాతర, ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు. మొదట్లో అమ్మవారికి అర్చకుడిగా ఒక రజకుడు ఉండేవాడు. అందువలన రజక సంఘం ఆద్వర్యంలో ఒకసారి పండ్ల, పూల, వర్తక సంఘము వారి ఆద్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి. 1910 వ సంవత్సరంలో భీమవరాన్ని ముంచెత్తిన వరదల్లో అమ్మవారి విగ్రహం చాల వరకు పాడైంది. 1920 లో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మలిచాడు. కాని ఆ విగ్రహం భీకర రూపంలో ఉన్నందున గ్రంధి అప్పారావు అనే శిల్పి ఆ విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చి దిద్దాడు.
* ఆలయ విశిష్టత
ఈ క్షేత్రంలో గర్భాలయానికి ఇరువైపులా గౌతమ బుద్ధుని, రామకృష్ణ పరమహంస విగ్రహాలు ఉండడము ఇందలి ప్రత్యేకత. అమ్మవారి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు.... చీరలు వంటి వాటిద్వారా ప్రతియేటా రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం అమ్మవారికి ఆభారణాల రూపంలో 24 కిలోల బంగారం, 274 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. అమ్మవారికి 65 కిలోల బంగారంతో చీర ఆభరణాలు తయారు చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. దీని కొరకు స్థానిక ప్రముఖులు.... విదేశాలలో ఉన్నవారు స్పందిస్తున్నారు. అమ్మవారికి 16 కిలోల బంగారంతో త్రిశూలం, ఢమరుకం తయారు చేశారు. ప్రస్తుతం అమ్మవారికి బంగారు కిరీటము, త్రిశూలము ఉన్నాయి. ఒక గ్రామ దేవతకు ఇంతటి సంపద ఉండడము, ఇంతటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగడము దేశంలో మరెక్కడా లేదని అదే ఈ ఆలయ విశిష్టత అని పూజారి రామలింగేశ్వర శర్మ అంటాడు.
* పూజలు, ఉత్సవాలు
ఈ క్షేత్రంలో ప్రతి నిత్యం పులిహోరను ప్రసాదంగా భక్తులకు ఉచితంగా అందిస్తారు. జ్యేష్ట మాసంలో నెల రోజులు గ్రామ జాతర, నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులలో అమ్మవారిని రోజుకొక అవతారంలో అలంకరిస్తారు. ప్రతి రోజు లక్ష కుంకుమార్చన, చండీ హోమం ఇతర పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడు జనవరి 13 నుండి దేవస్థానం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. ఉత్సవాల చివరి 8 రోజులలో అమ్మవారిని అష్టలక్ష్ములుగా అలంకరించి పూజిస్తారు. చివరిరోజున వేలాదిమంది భక్తులకు అన్నదాన కార్యక్రమము జరుగుతుంది.
* ఈక్షేత్రం ఎక్కడున్నది?
పశ్చిమగోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన ఏలూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమవరంలో ఉన్నది ఈ క్షేత్రము.
* ఇతర విశేషాలు
ఇప్పుడూన్న మావుళ్ళమ్మ వారు శాంత స్వరూపిణిగా ఉంటారు. కొన్నేళ్లక్రితం వరకూ ఉగ్రరూపిణిగా ఉండే అమ్మవారిని చూచేందుకు భయపడేవిధంగా ఉండే అమ్మవారిని అనేక సార్లు మార్చుకొంటూ ఇప్పటి రూపానికి తీసుకొచ్చారు.
1910 సంవత్సరంలో వరదల కారణంగా అమ్మవారి విగ్రహం నీటిలో నాని చాలా వరకూ దెబ్బతిన్నది. దానితో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అనే శిల్పి ద్వారా అమ్మవారి పునర్నిర్మాణం జరిగింది. గర్భాలయానికి నిండుగా అమ్మవారికి రూపాన్నిచ్చాడూ. అయితే అప్పటికి ప్రలయభీకరంగా ఉన్న అమ్మవారిని శిల్పి గ్రంధి నర్సన్న కుమారుడు అప్పారావు శాంత స్వరూపిణిగా తీర్చిదిద్దారు. గర్భాలయానికి ఇరుప్రక్కలా అహింసకు ప్రతీకలైన రామకృష్ణ పరమ హంస, గౌతమ బుద్ధుడు విగ్రహాలను చెక్కారు.
మెంటే వెంకటస్వామి పూర్వికులు, అల్లూరి రామరాజు, భీమరాజుల కుటుంభీకులు అమ్మవారి పుట్టింటి వారు గానూ, గ్రంధి అప్పన్న, తదితరులు అమ్మవారి అత్తింటివారుగానూ వ్యవహరిస్తారు.
* ఉత్సవ విశేషాలు
ఇక్కడి విశేషాలలో ముఖ్యమైనది అంతరించిపోతున్న కళలను ఆదరిస్తూ వారికి ప్రధర్శనలకు పిలుస్తూ తగిన పారితోషికాలతో ప్రోత్సహీమ్చడం. ఇక్కడ తొలిరోజు హరికథతో ప్రారంభించి ప్రదర్శనలు ఇలా జరుగుతుంటాయి.
బుర్రకథలు, హరి కథలు, కోలాటాలు, భజనలు, సంగీత కఛేరీలు, పురాణ ప్రవచనాలు, కంజరి కథలు, ఏకపాత్రాభ్నయాలు. ఇలా అనేక ప్రధర్శనలు జరుపుతుంటారు. ఇక్కడ ఉత్సవాలకు ఎప్పటికప్పుడు వ్యయం పెరుగుతూ ఉన్నది.
భీమవరం మావుళ్ళమ్మ విజయవాడ కనకదుర్గ తరువాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత. తొమ్మిది దశాబ్దాల క్రిందట భీమవరం అనే కుగ్రామమంలో వెలసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా విలసిల్లుతూ ఉన్నది. ఆమె విశిష్ట రూపం దేవతలలో మరెవరికీ కానరాదని అంటారు.
* చారిత్రక నేపథ్యం
చారిత్రక నేపధ్యాన్ని అనుసరించి మావుళ్ళమ్మ వారి చరిత్రవిశేషాలు ఈ విధంగా ఉన్నాయి.1880 వైశాఖ మాసం రోజులల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు, గ్రంది అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతాన్ని గురించి చెపుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరినది. మరుసటి రోజున వారిరువురు ఆప్రాంతానికి వెదుకగా అమ్మవారి విగ్రహం లభ్యమయినది. అటునుండి వారు అక్కడ ఒక పాక వేసి అమ్మవారిని అక్కడ నిలిపిఉంచారు. అమ్మవారి ఆదేశానుసారం వారు అయిదు దీపాలు ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మించారు. మామిడితోటలో వెలసిన అమ్మవారిని తొలినాళ్ళలో 'మామిళ్ళమ్మ'గా తదనంతరం 'మావుళ్ళమ్మ'గా పిలవటం అలవాటయ్యింది. ప్రస్తుతం ఈ ఊరిలోని మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవన ప్రాంతంలో ఉన్న వేప, రావి చెట్లు కలిసిన చోట అమ్మవారు వెలిసినట్లు స్థానికుల కథనము. అప్పన్న, మంచిరాజులు ఉన్న మోటుపల్లివారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నడి మధ్యకు తీసుకొచ్చారు. అమ్మవారికి జాతర, ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు. మొదట్లో అమ్మవారికి అర్చకుడిగా ఒక రజకుడు ఉండేవాడు. అందువలన రజక సంఘం ఆద్వర్యంలో ఒకసారి పండ్ల, పూల, వర్తక సంఘము వారి ఆద్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి. 1910 వ సంవత్సరంలో భీమవరాన్ని ముంచెత్తిన వరదల్లో అమ్మవారి విగ్రహం చాల వరకు పాడైంది. 1920 లో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మలిచాడు. కాని ఆ విగ్రహం భీకర రూపంలో ఉన్నందున గ్రంధి అప్పారావు అనే శిల్పి ఆ విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చి దిద్దాడు.
* ఆలయ విశిష్టత
ఈ క్షేత్రంలో గర్భాలయానికి ఇరువైపులా గౌతమ బుద్ధుని, రామకృష్ణ పరమహంస విగ్రహాలు ఉండడము ఇందలి ప్రత్యేకత. అమ్మవారి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు.... చీరలు వంటి వాటిద్వారా ప్రతియేటా రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం అమ్మవారికి ఆభారణాల రూపంలో 24 కిలోల బంగారం, 274 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. అమ్మవారికి 65 కిలోల బంగారంతో చీర ఆభరణాలు తయారు చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. దీని కొరకు స్థానిక ప్రముఖులు.... విదేశాలలో ఉన్నవారు స్పందిస్తున్నారు. అమ్మవారికి 16 కిలోల బంగారంతో త్రిశూలం, ఢమరుకం తయారు చేశారు. ప్రస్తుతం అమ్మవారికి బంగారు కిరీటము, త్రిశూలము ఉన్నాయి. ఒక గ్రామ దేవతకు ఇంతటి సంపద ఉండడము, ఇంతటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగడము దేశంలో మరెక్కడా లేదని అదే ఈ ఆలయ విశిష్టత అని పూజారి రామలింగేశ్వర శర్మ అంటాడు.
* పూజలు, ఉత్సవాలు
ఈ క్షేత్రంలో ప్రతి నిత్యం పులిహోరను ప్రసాదంగా భక్తులకు ఉచితంగా అందిస్తారు. జ్యేష్ట మాసంలో నెల రోజులు గ్రామ జాతర, నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులలో అమ్మవారిని రోజుకొక అవతారంలో అలంకరిస్తారు. ప్రతి రోజు లక్ష కుంకుమార్చన, చండీ హోమం ఇతర పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడు జనవరి 13 నుండి దేవస్థానం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. ఉత్సవాల చివరి 8 రోజులలో అమ్మవారిని అష్టలక్ష్ములుగా అలంకరించి పూజిస్తారు. చివరిరోజున వేలాదిమంది భక్తులకు అన్నదాన కార్యక్రమము జరుగుతుంది.
* ఈక్షేత్రం ఎక్కడున్నది?
పశ్చిమగోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన ఏలూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమవరంలో ఉన్నది ఈ క్షేత్రము.
* ఇతర విశేషాలు
ఇప్పుడూన్న మావుళ్ళమ్మ వారు శాంత స్వరూపిణిగా ఉంటారు. కొన్నేళ్లక్రితం వరకూ ఉగ్రరూపిణిగా ఉండే అమ్మవారిని చూచేందుకు భయపడేవిధంగా ఉండే అమ్మవారిని అనేక సార్లు మార్చుకొంటూ ఇప్పటి రూపానికి తీసుకొచ్చారు.
1910 సంవత్సరంలో వరదల కారణంగా అమ్మవారి విగ్రహం నీటిలో నాని చాలా వరకూ దెబ్బతిన్నది. దానితో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అనే శిల్పి ద్వారా అమ్మవారి పునర్నిర్మాణం జరిగింది. గర్భాలయానికి నిండుగా అమ్మవారికి రూపాన్నిచ్చాడూ. అయితే అప్పటికి ప్రలయభీకరంగా ఉన్న అమ్మవారిని శిల్పి గ్రంధి నర్సన్న కుమారుడు అప్పారావు శాంత స్వరూపిణిగా తీర్చిదిద్దారు. గర్భాలయానికి ఇరుప్రక్కలా అహింసకు ప్రతీకలైన రామకృష్ణ పరమ హంస, గౌతమ బుద్ధుడు విగ్రహాలను చెక్కారు.
మెంటే వెంకటస్వామి పూర్వికులు, అల్లూరి రామరాజు, భీమరాజుల కుటుంభీకులు అమ్మవారి పుట్టింటి వారు గానూ, గ్రంధి అప్పన్న, తదితరులు అమ్మవారి అత్తింటివారుగానూ వ్యవహరిస్తారు.
* ఉత్సవ విశేషాలు
ఇక్కడి విశేషాలలో ముఖ్యమైనది అంతరించిపోతున్న కళలను ఆదరిస్తూ వారికి ప్రధర్శనలకు పిలుస్తూ తగిన పారితోషికాలతో ప్రోత్సహీమ్చడం. ఇక్కడ తొలిరోజు హరికథతో ప్రారంభించి ప్రదర్శనలు ఇలా జరుగుతుంటాయి.
బుర్రకథలు, హరి కథలు, కోలాటాలు, భజనలు, సంగీత కఛేరీలు, పురాణ ప్రవచనాలు, కంజరి కథలు, ఏకపాత్రాభ్నయాలు. ఇలా అనేక ప్రధర్శనలు జరుపుతుంటారు. ఇక్కడ ఉత్సవాలకు ఎప్పటికప్పుడు వ్యయం పెరుగుతూ ఉన్నది.
Subscribe to:
Posts (Atom)