The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
HEALTHY TIPS FOR GOOD DIGETION IN TELUGU
పొట్ట ఉబ్బరం , అజీర్ణం & గ్యాస్ సమస్యలకు సోంపు గింజలు
1) సోంపు గింజలు పొట్ట ఉబ్బరం , గ్యాస్ సమస్యలు , అజీర్ణం సమస్యలను తగ్గిస్తాయి.
2) ఒక స్పూన్ సోంపు గింజలను ఒక గ్లాస్ వాటర్ లో మరిగించి గోరువెచ్చగా తీసుకోవాలి.
3) పొట్ట ఉబ్బరంగా , గ్యాస్ సమస్య వచ్చినప్పుడు తీసుకోవాలి. లేదంటే రెండు పూటలా భోజనం చేసాక తీసుకోవాలి.
4) గ్యాస్ సమస్యలతో ఉన్నవారు పులుపు , కారం , మసాలాలు , జంక్ ఫుడ్ తగ్గించాలి.
5) వేళకు భోజనం చేసి , వేళకు నిద్రపోవాలి. కనీస వ్యాయామం ఉండేలా చూసుకోవాలి.
MAD MASTER
పిచ్చి కుదిరింది.
మా మావయ్య, ఒక సంవత్సరంగా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నాడండీ...’ సైకాలజిస్ట్ దగ్గరకొచ్చి చెప్పాడు శంకర్రావు.
‘‘ఏం చేస్తున్నాడు?’’
‘‘ప్రొద్దున్నుంచీ సాయంత్రం వరకూ కుర్చీలో కూర్చుని చేతుల్లో స్టీరింగ్ ఉన్నట్లు ఊహించుకుని కారు నడుపుతున్నట్లు ప్రవర్తిస్తున్నాడండీ!’’
‘‘అది కారు కాదనీ, కుర్చీ అనీ నువ్వు చెప్పలేదూ?’’
‘‘ఎలా చెప్తానండీ! సాయంత్రం కారు కడిగినందుకు నాకు రోజుకి పాతిక రూపాయలిస్తూంటేనూ!’’
‘‘మరిప్పుడెందుకు ఇక్కడికి వచ్చినట్లు?’’
‘‘ఇప్పుడు కారు తనే కడుక్కుంటున్నాడండీ...’’
SPECIAL SRIRAMANAVAMI FESTIVAL ARTICLE IN TELUGU 28-03-2015 - ABOUT KODANDARAMASWAMY TEMPLE AT ONTIMITTA, KADAPA, ANDHRA PRADESH, INDIA
శ్రీరామనవమి 28-03-2015
శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు.
పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో అడుగిడిన శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము.
ఈసారి ఆంద్ర ప్రదేశ్ లో కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయములో ప్రభుత్వం శ్రీరామ నవమి
వేడుకలు జరపాలని నిర్ణయించింది కళ్యాణం కుడా అక్కడే నిర్వహిస్తారు
ఈ చైత్ర శుద్ధ నవమి నాడే సీతారామ కళ్యాణము జరిగినది .... తెలంగాణా గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలోని కోదండ రామాలయం ప్రాచీనమైన మరియు విశిష్టమైన హిందూ దేవాలయం.
ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది
. ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ది చెందినది. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడివడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో ఈ ఆలయమున్న ఒంటిమిట్ట ఆంధ్రా భద్రాచలం గా పేరుగాంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు ఈ ఆలయానికి సమర్పిస్తారు.
రామాయణం (రాముని జనన విషయం)
రామాయణం లో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర,కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు.
వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్ర కు ఇచ్చారు
. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్యకు రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.
ఉత్సవం
ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు.
ఉత్సవంలో విశేషాలు
ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కల్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.
బెల్లం, మరియు మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది.
ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం.
ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు.
దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరాముని తో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది.
భద్రాచలం లో రామదాసు చే కట్టబడిన రామలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తాడు.
ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికీ ఎక్కువవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఘనంగా నిర్వహిస్తోంది. కొన్ని చోట్ల స్వామి నారాయణ్ జయంతిని కూడా దీనితో కలిపి జరుపుకుంటారు.
రామ రాజ్యం
దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు
. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం, అందులో రాముడు, లక్ష్మణుడు, సీత , హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు. ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు,నినాదాలతో యాత్ర సాగిపోతుంది .
శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు. వీరిలో రఘు ఖచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధి గాంచాడు
. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి తన పినతల్లి కైక కు ఇచ్చిన మాటకోసం పదునాల్గేళ్ళు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలవబడుతుంటాడు.
శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే అని రాముని స్మరిస్తారు
LEAVE FOR HAND CUT - NO WAY
సిగ్గు చేటు జోక్
"సిగ్గులేదటయ్య నీకు? కూరలు తరుగుతుంటే
వేలు తెగిందని లీవు కావాలంటున్నావా?
ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా" అరిచాడు ఆఫీసర్.
"నిజం సార్... నిజంగానే వేలు తెగింది" వినయంగా అన్నాడు సుబ్బు.
"చాల్చాల్లే నోర్ముయ్... గత పాతిక సంవత్సరాలుగా కూరలు తరుగుతున్నా,
ఒక్కసారి కూడా నాకు కనీసం గోరుకూడా తెగలేదు.
అండర్ స్టాండ్" ఇంకా పెద్దగా అరిచాడు ఆఫీసర్...!
SPEED UP READING TONGUE TWISTERS IN ENGLISH
TONGUE TWISTERS IN ENGLISH
THIRTY THREE THIRSTY,
THUNDERING THOROUGHBREDS
THUMPED Mr.THURBER ON THURSDAY
BLACK BACKGROUND,
BROWN BACKGROUND.
QUOTES:
NO GOOD MAN EVER
BECOMES SUDDENLY RICH
GODDESS SRI BHUVANESWARI DEVI - MANIDEEPAM - TELUGU DEVOTIONAL ARTICLE ABOUT GODDESS SRI BHUVANESWARI DEVI
భువనేశ్వరీ దేవి - మణిద్వీపము
వ్యాస భగవానుడు జనమేజయునకు దేవీ భాగవతమును వినిపించుచూ చివరకు శ్రీదేవీ నివాసమైన మణిద్వీపమును గూర్చి ఇట్లు చెప్పసాగెను.
మహారాజా! శ్రీ భువనేశ్వరీ దేవి పాల సముద్రము మధ్యలో నున్న మణిద్వీపములో నివసించును " శ్రీ సుధాబ్ది మణిద్వీప మధ్యగాయై నమోనమః" అని లలితా ష్టోత్తర శతనామములలో ఒకటి. ఆ ద్వీప మిట్లుండునని వర్ణించుటకు ఎవ్వరికిని సాధ్యము కాదు. ఐననూ నీవడిగినావు కనుక నాశక్తి కొలది వర్ణించెదను వినుము.
భువనేశ్వరి యైన ఆ తల్లి నివసించు ద్వీపము బ్రహ్మలోకమునకు పైన ఉన్నది. దానికి సర్వలోకమని పేరు. సృష్టికి ముందు దీనిని దేవి తనఇచ్చా శక్తిచే సృష్టించెను. అది సమస్త బ్రహ్మాండములకును గొడుగువలె నుండును. దాని చుట్టును ఆమృత సముద్రము కందకముగా నుండును. రత్నాల ఇసుక తిన్నెలు గలవు.
అక్కడ ఏడామడల విస్తీర్ణముతో ఇనుపకోట యొకటి కలదు. దాని ద్వారములందును ఋరుజులందును చాలామంది భటులు కావలి యుందురు. దేవీ దర్శనమునకు వెళ్ళిన దేవతలు అక్కడ వేచి యుందురు. రత్న వృక్షములతో నిండిన తోటలు కన్నుల పండువు చేయును.
ఆపైన ఆకాశము నంటు కంచుకోట యున్నది. ఇది ఇనుపకోట కన్నా నూరురెట్లు కాంతి కలది. అక్కడ నున్న తోటలు చూడముచ్చటగా నుండును.
దీనికావల రాగికోట యున్నది. ఈ ప్రాకారములోపల కల్పవృక్షము లున్నవి. పండ్లలోని బీజములు రత్నములే. వాని సువాసనలు చాల దూరముదాకా వ్యాపించును. ఆ వనములో వసంతుడు మధుశ్రీ మాధవశ్రీ యను భార్యలతో నివసించును. గంధర్వుల గానములు చెవుల కింపుగా నుండును.
ఆ పైన సీసపు కోట గలదు. (ప్రాకారమునే కోటలందురు) దీని యందు సంతాన వృక్షము లుండును. శుక్లశ్రీ శుచిశ్రీ అను భార్యలతో ఇక్కడ గ్రీష్మర్తు రాజుండును.
దానిలోపల ఇత్తడి కోట యున్నది. దేనిలో హరిచందన వనమున్నది. నభశ్రీ మున్నగు పండ్రెండుగురు భార్యలతో వర్షర్తు రాజిక్కడ నివసించును. నదీనదము లెక్కువ యుండును. చెట్లు, లతలు పచ్చగా శోభించును. ఆపైన పంచలోహమయమైన కోటగలదు. మందార వృక్షము లిక్కడ నుండును. ఇష్టలక్ష్మి, ఊర్జలక్ష్మి అను భార్యలతో శరదృతురాజిక్కడ విహరించుచుండును.
ఆ మీద వెండి కోట యున్నది. ఇక్కడ పారిజాతవన మున్నది. ఆ పూలవాసన పది యోజనముల వరకు వ్యాపించును. సహశ్రీ, సహస్యశ్రీ అను భార్యలతో హేమంతఋతు రాజిక్కడ నివసించును.
దానికావల బంగారు కోట గలదు. అక్కడ కదంబ (కడిమి) వృక్షములు గలవు. సిద్ధుల కది నివాసము. తపఃశ్రీ పస్యశ్రీ అను భార్యలతో శిశిర ర్తురాజు ఆవనములో నివసించును.
ఆపైన పుష్యరాగ ప్రకార మున్నది. ఆ ప్రాంత మంతయు పుష్య రాగమయమే. కాంతితో మెరయు చుండును. ఇక్కడ అష్టదిక్కులందును దిక్పాలకులు నివసింతురు.
ఆమీద కుంకుమారుణమైన పద్మరాగ ప్రాకారము గలదు. ఇక్కడ అంతయు పద్మరాగ మణిమయమే. పింగాక్షి మున్నగు నమాములు గల చతుష్పష్టి యోగినీ గానము లుందురు. అందు ఒకొక్క శక్తి లక్ష బ్రహ్మాండములను త్రుటిలో నశింపజేయగలదు.
ఆ లోపల గోమేధిక సాల యున్నది. అక్కడ నంతయు గోమేధిక మయమే. విద్యాది శక్తులు ముప్పది యిద్దరు సేనలతో ఉందురు.
దాని కవ్వల వజ్రమయ దుర్గ మున్నది. అక్కడ అనంగరూప మున్నగు దేవి పరిచారిక లుందురు.
దాని పైన వైడూర్యమణుల ప్రాకార మున్నది. అక్కడ మున్నగు మాతృకలు లోక కళ్యాణము చేయుచుందురు. సైన్యములు గూడ నుండును.
దీని తరువాత ఇంద్రనీలమణి ప్రకార మున్నది. అక్కడ పదనారు రేకులు గల పెద్ద పద్మ ముండును. ఆ రేకులలో పదునారు శక్తు లుందురు. వీరు దేవి సేవలు నడుపుదురు.
ఆవల ముత్యాలతో నిండిన కోట యున్నది. అక్కడ దేవితో సమాన రూపముగల అన్మ్గా కుసుమాదులు అష్ట మంత్రిణు లుందురు. వీరెప్పుడును దేవికి జగద్వార్తలు తెలుపు చుందురు.
ఆపైన మరకత సాలము. దానిలో షట్కోణయంత్ర మున్నది. గాయత్రీ, సావిత్రీ, బ్రహ్మ, విష్ణు, రుద్రాదులు ఆ కోణములలో నివసింతురు. వేద, పురాణ, శాస్త్రములు తమ స్వరూపములతో ఇక్కడ నివసించును.
ఆవల ప్రవాళసాలము (పగడాల కోట) ఉన్నది. అక్కడ పంచభూతములకు నాధిపత్యము వహించు హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోచ్చష్మ అను శక్తు లుందురు.
దీని తరువాత రత్న మహాప్రాకార మున్నది. అక్కడ సప్తకోటి మహామంత్రములును, ఆది మహావిద్యలును ప్రకాశించుచుండును. ఈకోట తరువాతనే చింతామణి గృహము గలదు. "చింతామణి గృహాంత స్థాయై నమః" అని లలితా సహస్రములో నొక నామము. అక్కడ వేయి స్త్మభాల మండపాలు నాలుగున్నవి. శృంగారము, ముక్తి, జ్ఞానము, ఏకాంతము అని వాని పేరులు. కుంకుమ పూవుతోటల మీది నుండి వచ్చు సువాసన లక్కడ వ్యాపించును. శృంగార మండపములో దేవి కొలువు దీర్చును. ముక్తి మండపములో నుండి జ్ఞానమిచ్చును. ఏకాంత మండపములో మంత్రిణులతో గలిసి కార్యతంత్రములు నడుపును. ఇక్కడ శక్తి తత్త్వాత్మకములైన పది తొట్టెలు గలవు. వానికి బ్రహ్మ, విష్ణు, రుద్రులు డెక్కలు (చిన్న చక్రములు) గా నుందురు. సదాశివుడు వాని పైన బల్లగా నుండును. దీనిపై కోటి మన్మథ సుందరుడైన మహాదేవుడును, అతని ప్రక్క సర్వాలంకార శోభితయై పరమేశ్వరి యు అధి వసించి యుందురు.
లబ్జాది పీట శక్తులును, శంఖాది నిధులును ఆమెను పరివేష్టించి యుండును. శ్రీ మహాదేవి విపాశ్వమున నుండుటచేతనే మహాదేవుడు సర్వేశ్వరు డయ్యెను. ఈ గృహము సహస్ర యోజన విస్తీర్ణము గలిగి అంతరిక్షములో నిరాధారముగా నుండును. దీనికి ప్రళయమున సంకోచముగాని, సృష్టి కాలమున వికాసముగాని లేకుండును. దేవ, మనుష్య, నాగాడులలో సిద్దులైనవారీ గృహమున శాశ్వతముగా నివసింతురు. కోరికలు దీర్చెడి కల్పవృక్షము లక్కడ కలవు. రోగము, శోకము, వార్ధక్యము అక్కడ నండువారికి కలుగవు.
అక్కడ కొందరు సాలోక్యముక్తు లుందురు. కొందరు సామీప్య ముక్తు లుందురు. మరికొందరు సాయుజ్యముక్తు లుందురు. మహొన్నత స్థితి గలిగించు సప్తకోటి మహామంత్రములు మూర్తి మంతములై దేవిని స్తుతించుచుండును.
ఇది మణిద్వీపవర్ణనము. దీనిని స్మరించిన వారికి సర్వపాపములు తొలగును. ప్రాణము పోవునప్పుడీ మణిద్వీపము స్మృతికి దగిలినచో వానికి ఈ ద్వీపమున దేవీ సాన్నిధ్యము దొరకును. దీనిని నిత్య పారాయణము చేయువారికి దేవీ యనుగ్రహము లభించును. విశేషించి నూతన గృహప్రవేశ సమయమున పారాయణ చేసినచో ఆ యింటిలో నుండువారికి భూతాది బాధలుండవు. ఇల్లు నిత్యకళ్యాణము పచ్చతోరణముగా నుండును. శ్రీ మహాలక్ష్మి మహాగౌరీ మహాసరస్వతీ స్వరూప శ్రీ లలితాంబికాను గ్రహము వలన సకల శుభములును గలుగును.
"సర్వేలోకాయ మాశ్రిత్య వర్ధంతే వీత కల్మషాః
పురాణ పురుషం వందే విశ్వ విజ్ఞాన భాస్కరమ్ "
వ్యాస భగవానుడు జనమేజయునకు దేవీ భాగవతమును వినిపించుచూ చివరకు శ్రీదేవీ నివాసమైన మణిద్వీపమును గూర్చి ఇట్లు చెప్పసాగెను.
మహారాజా! శ్రీ భువనేశ్వరీ దేవి పాల సముద్రము మధ్యలో నున్న మణిద్వీపములో నివసించును " శ్రీ సుధాబ్ది మణిద్వీప మధ్యగాయై నమోనమః" అని లలితా ష్టోత్తర శతనామములలో ఒకటి. ఆ ద్వీప మిట్లుండునని వర్ణించుటకు ఎవ్వరికిని సాధ్యము కాదు. ఐననూ నీవడిగినావు కనుక నాశక్తి కొలది వర్ణించెదను వినుము.
భువనేశ్వరి యైన ఆ తల్లి నివసించు ద్వీపము బ్రహ్మలోకమునకు పైన ఉన్నది. దానికి సర్వలోకమని పేరు. సృష్టికి ముందు దీనిని దేవి తనఇచ్చా శక్తిచే సృష్టించెను. అది సమస్త బ్రహ్మాండములకును గొడుగువలె నుండును. దాని చుట్టును ఆమృత సముద్రము కందకముగా నుండును. రత్నాల ఇసుక తిన్నెలు గలవు.
అక్కడ ఏడామడల విస్తీర్ణముతో ఇనుపకోట యొకటి కలదు. దాని ద్వారములందును ఋరుజులందును చాలామంది భటులు కావలి యుందురు. దేవీ దర్శనమునకు వెళ్ళిన దేవతలు అక్కడ వేచి యుందురు. రత్న వృక్షములతో నిండిన తోటలు కన్నుల పండువు చేయును.
ఆపైన ఆకాశము నంటు కంచుకోట యున్నది. ఇది ఇనుపకోట కన్నా నూరురెట్లు కాంతి కలది. అక్కడ నున్న తోటలు చూడముచ్చటగా నుండును.
దీనికావల రాగికోట యున్నది. ఈ ప్రాకారములోపల కల్పవృక్షము లున్నవి. పండ్లలోని బీజములు రత్నములే. వాని సువాసనలు చాల దూరముదాకా వ్యాపించును. ఆ వనములో వసంతుడు మధుశ్రీ మాధవశ్రీ యను భార్యలతో నివసించును. గంధర్వుల గానములు చెవుల కింపుగా నుండును.
ఆ పైన సీసపు కోట గలదు. (ప్రాకారమునే కోటలందురు) దీని యందు సంతాన వృక్షము లుండును. శుక్లశ్రీ శుచిశ్రీ అను భార్యలతో ఇక్కడ గ్రీష్మర్తు రాజుండును.
దానిలోపల ఇత్తడి కోట యున్నది. దేనిలో హరిచందన వనమున్నది. నభశ్రీ మున్నగు పండ్రెండుగురు భార్యలతో వర్షర్తు రాజిక్కడ నివసించును. నదీనదము లెక్కువ యుండును. చెట్లు, లతలు పచ్చగా శోభించును. ఆపైన పంచలోహమయమైన కోటగలదు. మందార వృక్షము లిక్కడ నుండును. ఇష్టలక్ష్మి, ఊర్జలక్ష్మి అను భార్యలతో శరదృతురాజిక్కడ విహరించుచుండును.
ఆ మీద వెండి కోట యున్నది. ఇక్కడ పారిజాతవన మున్నది. ఆ పూలవాసన పది యోజనముల వరకు వ్యాపించును. సహశ్రీ, సహస్యశ్రీ అను భార్యలతో హేమంతఋతు రాజిక్కడ నివసించును.
దానికావల బంగారు కోట గలదు. అక్కడ కదంబ (కడిమి) వృక్షములు గలవు. సిద్ధుల కది నివాసము. తపఃశ్రీ పస్యశ్రీ అను భార్యలతో శిశిర ర్తురాజు ఆవనములో నివసించును.
ఆపైన పుష్యరాగ ప్రకార మున్నది. ఆ ప్రాంత మంతయు పుష్య రాగమయమే. కాంతితో మెరయు చుండును. ఇక్కడ అష్టదిక్కులందును దిక్పాలకులు నివసింతురు.
ఆమీద కుంకుమారుణమైన పద్మరాగ ప్రాకారము గలదు. ఇక్కడ అంతయు పద్మరాగ మణిమయమే. పింగాక్షి మున్నగు నమాములు గల చతుష్పష్టి యోగినీ గానము లుందురు. అందు ఒకొక్క శక్తి లక్ష బ్రహ్మాండములను త్రుటిలో నశింపజేయగలదు.
ఆ లోపల గోమేధిక సాల యున్నది. అక్కడ నంతయు గోమేధిక మయమే. విద్యాది శక్తులు ముప్పది యిద్దరు సేనలతో ఉందురు.
దాని కవ్వల వజ్రమయ దుర్గ మున్నది. అక్కడ అనంగరూప మున్నగు దేవి పరిచారిక లుందురు.
దాని పైన వైడూర్యమణుల ప్రాకార మున్నది. అక్కడ మున్నగు మాతృకలు లోక కళ్యాణము చేయుచుందురు. సైన్యములు గూడ నుండును.
దీని తరువాత ఇంద్రనీలమణి ప్రకార మున్నది. అక్కడ పదనారు రేకులు గల పెద్ద పద్మ ముండును. ఆ రేకులలో పదునారు శక్తు లుందురు. వీరు దేవి సేవలు నడుపుదురు.
ఆవల ముత్యాలతో నిండిన కోట యున్నది. అక్కడ దేవితో సమాన రూపముగల అన్మ్గా కుసుమాదులు అష్ట మంత్రిణు లుందురు. వీరెప్పుడును దేవికి జగద్వార్తలు తెలుపు చుందురు.
ఆపైన మరకత సాలము. దానిలో షట్కోణయంత్ర మున్నది. గాయత్రీ, సావిత్రీ, బ్రహ్మ, విష్ణు, రుద్రాదులు ఆ కోణములలో నివసింతురు. వేద, పురాణ, శాస్త్రములు తమ స్వరూపములతో ఇక్కడ నివసించును.
ఆవల ప్రవాళసాలము (పగడాల కోట) ఉన్నది. అక్కడ పంచభూతములకు నాధిపత్యము వహించు హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోచ్చష్మ అను శక్తు లుందురు.
దీని తరువాత రత్న మహాప్రాకార మున్నది. అక్కడ సప్తకోటి మహామంత్రములును, ఆది మహావిద్యలును ప్రకాశించుచుండును. ఈకోట తరువాతనే చింతామణి గృహము గలదు. "చింతామణి గృహాంత స్థాయై నమః" అని లలితా సహస్రములో నొక నామము. అక్కడ వేయి స్త్మభాల మండపాలు నాలుగున్నవి. శృంగారము, ముక్తి, జ్ఞానము, ఏకాంతము అని వాని పేరులు. కుంకుమ పూవుతోటల మీది నుండి వచ్చు సువాసన లక్కడ వ్యాపించును. శృంగార మండపములో దేవి కొలువు దీర్చును. ముక్తి మండపములో నుండి జ్ఞానమిచ్చును. ఏకాంత మండపములో మంత్రిణులతో గలిసి కార్యతంత్రములు నడుపును. ఇక్కడ శక్తి తత్త్వాత్మకములైన పది తొట్టెలు గలవు. వానికి బ్రహ్మ, విష్ణు, రుద్రులు డెక్కలు (చిన్న చక్రములు) గా నుందురు. సదాశివుడు వాని పైన బల్లగా నుండును. దీనిపై కోటి మన్మథ సుందరుడైన మహాదేవుడును, అతని ప్రక్క సర్వాలంకార శోభితయై పరమేశ్వరి యు అధి వసించి యుందురు.
లబ్జాది పీట శక్తులును, శంఖాది నిధులును ఆమెను పరివేష్టించి యుండును. శ్రీ మహాదేవి విపాశ్వమున నుండుటచేతనే మహాదేవుడు సర్వేశ్వరు డయ్యెను. ఈ గృహము సహస్ర యోజన విస్తీర్ణము గలిగి అంతరిక్షములో నిరాధారముగా నుండును. దీనికి ప్రళయమున సంకోచముగాని, సృష్టి కాలమున వికాసముగాని లేకుండును. దేవ, మనుష్య, నాగాడులలో సిద్దులైనవారీ గృహమున శాశ్వతముగా నివసింతురు. కోరికలు దీర్చెడి కల్పవృక్షము లక్కడ కలవు. రోగము, శోకము, వార్ధక్యము అక్కడ నండువారికి కలుగవు.
అక్కడ కొందరు సాలోక్యముక్తు లుందురు. కొందరు సామీప్య ముక్తు లుందురు. మరికొందరు సాయుజ్యముక్తు లుందురు. మహొన్నత స్థితి గలిగించు సప్తకోటి మహామంత్రములు మూర్తి మంతములై దేవిని స్తుతించుచుండును.
ఇది మణిద్వీపవర్ణనము. దీనిని స్మరించిన వారికి సర్వపాపములు తొలగును. ప్రాణము పోవునప్పుడీ మణిద్వీపము స్మృతికి దగిలినచో వానికి ఈ ద్వీపమున దేవీ సాన్నిధ్యము దొరకును. దీనిని నిత్య పారాయణము చేయువారికి దేవీ యనుగ్రహము లభించును. విశేషించి నూతన గృహప్రవేశ సమయమున పారాయణ చేసినచో ఆ యింటిలో నుండువారికి భూతాది బాధలుండవు. ఇల్లు నిత్యకళ్యాణము పచ్చతోరణముగా నుండును. శ్రీ మహాలక్ష్మి మహాగౌరీ మహాసరస్వతీ స్వరూప శ్రీ లలితాంబికాను గ్రహము వలన సకల శుభములును గలుగును.
"సర్వేలోకాయ మాశ్రిత్య వర్ధంతే వీత కల్మషాః
పురాణ పురుషం వందే విశ్వ విజ్ఞాన భాస్కరమ్ "
SRI BHUVANESWARI AMMA VARU PRAYER IN TELUGU
శ్రీ భువనేశ్వరీ అమ్మవారు"
సకల ఆర్థిక ఒడిదుడుకులనుండి, వ్యాపార సంబంధమైన సమస్యలనుండి రక్షించి ప్రజలలో మంచి గుర్తింపును & గౌరవాన్ని ప్రసాదించే
"శ్రీ భువనేశ్వరీ అమ్మవారు"
జ్యోతిర్మాలాం త్రిణేత్రాం వివిధ మణిలసత్ కుండలాం పద్మసంస్థామ్ ।
ఆద్యాం పాశాంకుశాభాం అభయవరకరాం భావయేత్ భువనేశీమ్ ।
ప్రతి నిత్యం పై మూర్తిని దర్శిస్తూ ధ్యాన శ్లోకాన్ని పఠించిన వ్యాపార సంబంధమైన దోషములు తొలగునని శాస్త్రవచనము.
ప్రతి గృహము యందు లేదా వ్యాపారస్థలములయందు ఈ మూర్తిని తూర్పు దిశలో పడమర ముఖముగా ఉంచి ఆరాధించిన త్వరితముగా వ్యాపారాదులలో అభివృద్ధి & ప్రజల మన్నత & సేవకుల అనుకూల సహకారములు కలుగునని శాస్త్రవచనము.
సకల ఆర్థిక ఒడిదుడుకులనుండి, వ్యాపార సంబంధమైన సమస్యలనుండి రక్షించి ప్రజలలో మంచి గుర్తింపును & గౌరవాన్ని ప్రసాదించే
"శ్రీ భువనేశ్వరీ అమ్మవారు"
జ్యోతిర్మాలాం త్రిణేత్రాం వివిధ మణిలసత్ కుండలాం పద్మసంస్థామ్ ।
ఆద్యాం పాశాంకుశాభాం అభయవరకరాం భావయేత్ భువనేశీమ్ ।
ప్రతి నిత్యం పై మూర్తిని దర్శిస్తూ ధ్యాన శ్లోకాన్ని పఠించిన వ్యాపార సంబంధమైన దోషములు తొలగునని శాస్త్రవచనము.
ప్రతి గృహము యందు లేదా వ్యాపారస్థలములయందు ఈ మూర్తిని తూర్పు దిశలో పడమర ముఖముగా ఉంచి ఆరాధించిన త్వరితముగా వ్యాపారాదులలో అభివృద్ధి & ప్రజల మన్నత & సేవకుల అనుకూల సహకారములు కలుగునని శాస్త్రవచనము.
Subscribe to:
Posts (Atom)