The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
TELUGU PURANA STORY OF A GREAT KING - RANTHIDEVUDU
దానంతో శాశ్వత కీర్తిని పొందిన – రంతిదేవుడు
“అతిధి దేవోభవ !” అన్నది మన సాంప్రదాయం. ఈ ప్రపంచంలో చిన్న చీమ నుంచి అన్ని ప్రాణుల్లో ఉన్నది దైవమే. ఎవ్వరి కడుపు నింపినా, దేవుడు తిన్నట్లే !జాతి, మత, కుల, భేదాలు లేకుండా, ‘ఆకలి’ అన్నవారికి అన్నం పెట్టాలి. ఆకలిగొన్నవాడు ఎవరైనా సరే, చివరికి దొంగ, హంతకుడు అయినా సరే, అన్నం పెట్టాలి. ఆకలి విషయంలో అపాత్రుడు ఎవరూ ఉండరు. అందరూ పాత్రులే !
‘నాకంటె వేరుగా ఏదియు లేదు’, ‘సమస్త ప్రాణుల హృదయంలో ఈశ్వరుడు వెలయుచున్నాడు.’ అను మాటలను కేవలం బుద్ధితో గ్రహించి, నోటితో వల్లించే వారు కాక స్వీయ అనుభవంతో ఆచరించి, తదనుగుణంగా జీవించే వ్యక్తులు మనక ఆదర్శం కావాలి. ఈ సందర్భంగా భాగవతంలోని రంతిదేవుని కథ గుర్తుకొస్తుంది. ‘జన సేవయే జనార్ధన సేవగా’ భావించిన రంతిదేవుడి కధను చెప్పుకుందాము.
రంతిదేవుడు ఒక మహారాజు. అమిత దానశీలి. రాజ్యాన్ని, సంపదను దానం చేసి, భార్యాపిల్లలతో అడవికి వెళ్ళాడు. దైవికంగా ఏది లభిస్తే దాన్ని తినటమే-అంతకు మించి ఆయన దేన్నీ కోరేవాడు కాడు, భవిష్యత్తవసరాల కొరకు, దేన్నీ దాచుకొనేవాడు కాడు.
ఒకసారి నలభై ఎనిమిది రోజులు తినటానికి గానీ, తాగటానికి గానీ ఏమీ లభించలేదు. నలభై తొమ్మిదవ రోజు ఏదో కొంత ఆహారం లభించింది. దాన్ని తినటానికి తాను, కుటుంబ సభ్యులు కూర్చొన్నారు. అంతలోనే ఒక బ్రాహ్మణ అతిథి వచ్చాడు. ఆహారాన్ని ఆయనకిచ్చాడు రంతి దేవుడు. అతన్ని ఆశీర్వదించి వెళ్లిపోయాడు అతిథి. మరికొంత సేపటికే ఒక శూద్రుడొచ్చాడు. రంతిదేవుడు ఆతని ఆకలి తీర్చాడు. ఆ శూద్రుడు వెళ్లిన వెంటనే ఒకడు కుక్కలను తీసుకొని వచ్చి తన ఆకలిని, ఆ కుక్కల ఆకలిని తీర్చమని కోరాడు. తన వద్ద మిగిలిన ఆహారంలో రంతిదేవుడు అతనికి, అతని కుక్కలకు ఇచ్చాడు. ఇక కేవలం కొంత పాయసం మాత్రమే మిగిలింది. దాన్ని తాగి ఆకలి మంటను ఆర్పటానికి సిద్ధపడింది ఆ కుటుంబం. అంతలోనే ఎంతో దీనావస్థలో నున్న ఒక చండాలుడొచ్చాడు. వాని పరిస్థితి గమనించిన రంతిదేవుడు తన వద్ద ఉన్న పాయసాన్నంతా అతనికిచ్చివేశాడు ”బ్రహ్మార్పణం” అంటూ. నేను ఈ రోజు నలుగురి ఆకలి తీర్చినందుకు సంతృప్తిగా ఉంది అనుకుంటూ, స్పృహ తప్పిపోతాడు రంతిదేవుడు. మరుక్షణమే దేవుడు అక్కడ ప్రత్యక్షమై అతనికి మోక్ష ప్రాప్తిని కలుగ జేస్తాడు.
నీతి : కుల, మత, జంతు వివక్ష లేకుండా, తాను ఆకలితో ఉన్నా , ప్రాణాలు పోతున్నా లెక్కచెయ్యక రంతిదేవుడు చేసిన త్యాగం చరిత్రలో అతని పేరును శాశ్వతంగా నిలిపింది. దానగుణంతో దైవాన్నే నేలకు దించాడు రంతిదేవుడు. మనం కూడా, అన్నం తినేముందు కనీసం ఒక్కరి ఆకలైనా తీర్చే ప్రయత్నం చెయ్యాలి.
“అతిధి దేవోభవ !” అన్నది మన సాంప్రదాయం. ఈ ప్రపంచంలో చిన్న చీమ నుంచి అన్ని ప్రాణుల్లో ఉన్నది దైవమే. ఎవ్వరి కడుపు నింపినా, దేవుడు తిన్నట్లే !జాతి, మత, కుల, భేదాలు లేకుండా, ‘ఆకలి’ అన్నవారికి అన్నం పెట్టాలి. ఆకలిగొన్నవాడు ఎవరైనా సరే, చివరికి దొంగ, హంతకుడు అయినా సరే, అన్నం పెట్టాలి. ఆకలి విషయంలో అపాత్రుడు ఎవరూ ఉండరు. అందరూ పాత్రులే !
‘నాకంటె వేరుగా ఏదియు లేదు’, ‘సమస్త ప్రాణుల హృదయంలో ఈశ్వరుడు వెలయుచున్నాడు.’ అను మాటలను కేవలం బుద్ధితో గ్రహించి, నోటితో వల్లించే వారు కాక స్వీయ అనుభవంతో ఆచరించి, తదనుగుణంగా జీవించే వ్యక్తులు మనక ఆదర్శం కావాలి. ఈ సందర్భంగా భాగవతంలోని రంతిదేవుని కథ గుర్తుకొస్తుంది. ‘జన సేవయే జనార్ధన సేవగా’ భావించిన రంతిదేవుడి కధను చెప్పుకుందాము.
రంతిదేవుడు ఒక మహారాజు. అమిత దానశీలి. రాజ్యాన్ని, సంపదను దానం చేసి, భార్యాపిల్లలతో అడవికి వెళ్ళాడు. దైవికంగా ఏది లభిస్తే దాన్ని తినటమే-అంతకు మించి ఆయన దేన్నీ కోరేవాడు కాడు, భవిష్యత్తవసరాల కొరకు, దేన్నీ దాచుకొనేవాడు కాడు.
ఒకసారి నలభై ఎనిమిది రోజులు తినటానికి గానీ, తాగటానికి గానీ ఏమీ లభించలేదు. నలభై తొమ్మిదవ రోజు ఏదో కొంత ఆహారం లభించింది. దాన్ని తినటానికి తాను, కుటుంబ సభ్యులు కూర్చొన్నారు. అంతలోనే ఒక బ్రాహ్మణ అతిథి వచ్చాడు. ఆహారాన్ని ఆయనకిచ్చాడు రంతి దేవుడు. అతన్ని ఆశీర్వదించి వెళ్లిపోయాడు అతిథి. మరికొంత సేపటికే ఒక శూద్రుడొచ్చాడు. రంతిదేవుడు ఆతని ఆకలి తీర్చాడు. ఆ శూద్రుడు వెళ్లిన వెంటనే ఒకడు కుక్కలను తీసుకొని వచ్చి తన ఆకలిని, ఆ కుక్కల ఆకలిని తీర్చమని కోరాడు. తన వద్ద మిగిలిన ఆహారంలో రంతిదేవుడు అతనికి, అతని కుక్కలకు ఇచ్చాడు. ఇక కేవలం కొంత పాయసం మాత్రమే మిగిలింది. దాన్ని తాగి ఆకలి మంటను ఆర్పటానికి సిద్ధపడింది ఆ కుటుంబం. అంతలోనే ఎంతో దీనావస్థలో నున్న ఒక చండాలుడొచ్చాడు. వాని పరిస్థితి గమనించిన రంతిదేవుడు తన వద్ద ఉన్న పాయసాన్నంతా అతనికిచ్చివేశాడు ”బ్రహ్మార్పణం” అంటూ. నేను ఈ రోజు నలుగురి ఆకలి తీర్చినందుకు సంతృప్తిగా ఉంది అనుకుంటూ, స్పృహ తప్పిపోతాడు రంతిదేవుడు. మరుక్షణమే దేవుడు అక్కడ ప్రత్యక్షమై అతనికి మోక్ష ప్రాప్తిని కలుగ జేస్తాడు.
నీతి : కుల, మత, జంతు వివక్ష లేకుండా, తాను ఆకలితో ఉన్నా , ప్రాణాలు పోతున్నా లెక్కచెయ్యక రంతిదేవుడు చేసిన త్యాగం చరిత్రలో అతని పేరును శాశ్వతంగా నిలిపింది. దానగుణంతో దైవాన్నే నేలకు దించాడు రంతిదేవుడు. మనం కూడా, అన్నం తినేముందు కనీసం ఒక్కరి ఆకలైనా తీర్చే ప్రయత్నం చెయ్యాలి.
TELUGU PURANA KATHALU - PURANA TELUGU STORIES COLLECTION - TELUGU PURANA STORY OF DHADHICHI MAHARISHI - GREAT SAGE DHADHICHI
దధీచి మహర్షి
‘కోటి గ్రంథాల సారాంశాన్ని నేను అర్ధశ్లోకంలోనే చెప్పగలను. అదేమిటంటే- పరులకు ఉపకారం చేయడం పుణ్యం, పరులను పీడించడం పాపం‘ అన్నాడు కవి కులగురువు కాళిదాసు. ‘పరోపకారార్థమిదమ్ శరీరమ్‘ అన్నది ఈ వేదభూమిలో నిత్యం ప్రతిధ్వనించే రుషివాక్కు. మనిషికి అమ్మ ఒడిలాంటి ప్రకృతి కూడా పరోపకారతత్వానికి ప్రతీకే. దాహార్తిని తీర్చే సెలయేరు, వూరటనిచ్చే చిరుగాలి, ఛత్రమై నిలిచే చెట్టునీడ- ప్రకృతి ప్రసాదితాలైన ఇవన్నీ తమ ఉనికి పరుల మేలుకేనని చాటుకుంటున్నవే. ‘శరీరం కరిగిపోయే మంచు… అశాశ్వతం’ అని భావించి, స్వసుఖాలకంటే సామూహిక శ్రేయానికే పాటుపడటం సత్పురుషులకు సహజాలంకారం. పరోపకారమే పరమావధిగా తమ జీవిత ప్రస్థానం సాగించిన మహనీయులు ప్రజల గుండెల్లో భగవత్ స్వరూపులుగా కొలువై ఉంటారు. అటువంటి గొప్ప మహర్షి అయిన దధీచి కధ ఈ రోజు చెప్పుకుందాము.
దధీచి మహర్షి గొప్ప తపశ్శాలి. అయన భార్య గభస్తిని మహా పతివ్రత. దధీచి బ్రహ్మజ్ఞాని, మహతపస్వి, శక్తి సంపన్నుడు. ఒకసారి దేవదానవుల మధ్య జరిగిన యుద్ధంలో రాక్షసులు దేవతలకు అంతుచిక్కని విద్య నేర్చుకుని దాని సాయంతో దేవతల ఆయుధాలను తస్కరించడం మొదలుపెట్టారు. దధీచి ఆశ్రమం శత్రువులను కూడా సఖ్యపరచు శాంతి వనము. అందువల్ల దేవతలు తమ ఆయుధాలను దధీచి మహాముని వద్ద దాయడం మంచిదనే అభిప్రాయానికి వచ్చారు.
దేవతలకి భయ౦ వేసి దధీచి మహర్షిని కలిసారు. “ మహర్షీ మా అస్త్రాల్ని రాక్షసులు ఎత్తుకుపోకు౦డా మీ దగ్గర దాచి పెట్ట౦డి! అన్నారు. ఆయన అ౦దుకు అ౦గీకరి౦చాడు. చాలా కాల౦ గడిచి పోయి౦ది. దేవతలు తిరిగి వచ్చి తమ అస్త్రాల్ని తీసికెళ్ళలేదు. మహర్షికి వాటిని కాపలాకాసే పనివల్ల, తపస్సు చేసుకునే సమయం దొరకట్లేదు. అందుకే, మహర్షి ఇ౦క వాటిని దాచలేక మి౦గేశాడు.
కొ౦తకాల౦ తర్వాత దేవతలు వచ్చి “ మహర్షీ ! వృత్రాసురుణ్ణి చ౦పడానికి అస్త్రాలు కావాలి. వాటిని మాకిస్తే మే౦ వెళ్ళిపోతా౦ ! అన్నారు. “ అది విని మహర్షి “ దేవతలారా! మీ కోస౦ చాలా కాల౦ ఎదురు చూశాను. మీరు రాలేదు నాకు ఏ కబురూ లేదు. ఇ౦క వాటిని దాచలేక మి౦గేశాను !” అన్నాడు. “ఇప్పుడెలా..? “ అన్నారు దేవతలు.
“ అవన్నీ కరిగిపోయి నా ఎముకలకి పట్టేశాయి. నన్ను చ౦పి నా ఎముకలు తీసుకో౦డి !” అన్నాడు మహర్షి. దధీచి మాటలు విని “ అయ్యబాబోయ్! తపస్స౦పన్నుడయిన ఒక మహర్షిని చ౦పడమా…? అ౦తకు మి౦చిన మహా పాప౦ ఇ౦కేమయినా ఉ౦దా…?” అన్నారు దేవతలు భయ౦గా. “ మహర్షీ ! మీకు ఎప్పుడు కావాల౦టే అప్పుడు మోక్షాన్ని పొ౦దగల వర౦ ఉ౦ది కదా !” అన్నారు మళ్ళీ.
దధీచి ఆలోచి౦చాడు.. దేవతలు చెప్పినట్టు తనకు తానే అగ్నికి ఆహుతి అయితే దేవతలకి బ్రాహ్మణ హత్యా పాతక౦ అ౦టుకోదు అనుకుని దేవతలకి ఆ విషయ౦ చెప్పాడు.
వె౦టనే యోగాగ్ని రగిలి౦చుకుని ఆ అగ్నికి ఆహుతయ్యాడు. దధీచి శరీర౦ ను౦డి వచ్చిన అస్థులు తీసుకుని, వాటితో అస్త్రాలు తయారు చేయి౦చారు దేవతలు. అతని వెన్నెముక నుంచి ఇంద్రుడి వజ్రాయుధం తయారవుతుంది. వెనకా ముందాడకుండా తన ప్రాణాలను, శరీరాన్ని ఇచ్చేసిన త్యాగశీలిగా దధీచి పేరుపొందాడు.
నీతి : ఈ శరీరం పరోపకారం కోసమే ఉన్నది. ఈ విషయాన్ని మనం మరువక, మనకు చేతనైనంతలో ఇతరులకు సహాయపడుతూ ఉండాలి.
‘కోటి గ్రంథాల సారాంశాన్ని నేను అర్ధశ్లోకంలోనే చెప్పగలను. అదేమిటంటే- పరులకు ఉపకారం చేయడం పుణ్యం, పరులను పీడించడం పాపం‘ అన్నాడు కవి కులగురువు కాళిదాసు. ‘పరోపకారార్థమిదమ్ శరీరమ్‘ అన్నది ఈ వేదభూమిలో నిత్యం ప్రతిధ్వనించే రుషివాక్కు. మనిషికి అమ్మ ఒడిలాంటి ప్రకృతి కూడా పరోపకారతత్వానికి ప్రతీకే. దాహార్తిని తీర్చే సెలయేరు, వూరటనిచ్చే చిరుగాలి, ఛత్రమై నిలిచే చెట్టునీడ- ప్రకృతి ప్రసాదితాలైన ఇవన్నీ తమ ఉనికి పరుల మేలుకేనని చాటుకుంటున్నవే. ‘శరీరం కరిగిపోయే మంచు… అశాశ్వతం’ అని భావించి, స్వసుఖాలకంటే సామూహిక శ్రేయానికే పాటుపడటం సత్పురుషులకు సహజాలంకారం. పరోపకారమే పరమావధిగా తమ జీవిత ప్రస్థానం సాగించిన మహనీయులు ప్రజల గుండెల్లో భగవత్ స్వరూపులుగా కొలువై ఉంటారు. అటువంటి గొప్ప మహర్షి అయిన దధీచి కధ ఈ రోజు చెప్పుకుందాము.
దధీచి మహర్షి గొప్ప తపశ్శాలి. అయన భార్య గభస్తిని మహా పతివ్రత. దధీచి బ్రహ్మజ్ఞాని, మహతపస్వి, శక్తి సంపన్నుడు. ఒకసారి దేవదానవుల మధ్య జరిగిన యుద్ధంలో రాక్షసులు దేవతలకు అంతుచిక్కని విద్య నేర్చుకుని దాని సాయంతో దేవతల ఆయుధాలను తస్కరించడం మొదలుపెట్టారు. దధీచి ఆశ్రమం శత్రువులను కూడా సఖ్యపరచు శాంతి వనము. అందువల్ల దేవతలు తమ ఆయుధాలను దధీచి మహాముని వద్ద దాయడం మంచిదనే అభిప్రాయానికి వచ్చారు.
దేవతలకి భయ౦ వేసి దధీచి మహర్షిని కలిసారు. “ మహర్షీ మా అస్త్రాల్ని రాక్షసులు ఎత్తుకుపోకు౦డా మీ దగ్గర దాచి పెట్ట౦డి! అన్నారు. ఆయన అ౦దుకు అ౦గీకరి౦చాడు. చాలా కాల౦ గడిచి పోయి౦ది. దేవతలు తిరిగి వచ్చి తమ అస్త్రాల్ని తీసికెళ్ళలేదు. మహర్షికి వాటిని కాపలాకాసే పనివల్ల, తపస్సు చేసుకునే సమయం దొరకట్లేదు. అందుకే, మహర్షి ఇ౦క వాటిని దాచలేక మి౦గేశాడు.
కొ౦తకాల౦ తర్వాత దేవతలు వచ్చి “ మహర్షీ ! వృత్రాసురుణ్ణి చ౦పడానికి అస్త్రాలు కావాలి. వాటిని మాకిస్తే మే౦ వెళ్ళిపోతా౦ ! అన్నారు. “ అది విని మహర్షి “ దేవతలారా! మీ కోస౦ చాలా కాల౦ ఎదురు చూశాను. మీరు రాలేదు నాకు ఏ కబురూ లేదు. ఇ౦క వాటిని దాచలేక మి౦గేశాను !” అన్నాడు. “ఇప్పుడెలా..? “ అన్నారు దేవతలు.
“ అవన్నీ కరిగిపోయి నా ఎముకలకి పట్టేశాయి. నన్ను చ౦పి నా ఎముకలు తీసుకో౦డి !” అన్నాడు మహర్షి. దధీచి మాటలు విని “ అయ్యబాబోయ్! తపస్స౦పన్నుడయిన ఒక మహర్షిని చ౦పడమా…? అ౦తకు మి౦చిన మహా పాప౦ ఇ౦కేమయినా ఉ౦దా…?” అన్నారు దేవతలు భయ౦గా. “ మహర్షీ ! మీకు ఎప్పుడు కావాల౦టే అప్పుడు మోక్షాన్ని పొ౦దగల వర౦ ఉ౦ది కదా !” అన్నారు మళ్ళీ.
దధీచి ఆలోచి౦చాడు.. దేవతలు చెప్పినట్టు తనకు తానే అగ్నికి ఆహుతి అయితే దేవతలకి బ్రాహ్మణ హత్యా పాతక౦ అ౦టుకోదు అనుకుని దేవతలకి ఆ విషయ౦ చెప్పాడు.
వె౦టనే యోగాగ్ని రగిలి౦చుకుని ఆ అగ్నికి ఆహుతయ్యాడు. దధీచి శరీర౦ ను౦డి వచ్చిన అస్థులు తీసుకుని, వాటితో అస్త్రాలు తయారు చేయి౦చారు దేవతలు. అతని వెన్నెముక నుంచి ఇంద్రుడి వజ్రాయుధం తయారవుతుంది. వెనకా ముందాడకుండా తన ప్రాణాలను, శరీరాన్ని ఇచ్చేసిన త్యాగశీలిగా దధీచి పేరుపొందాడు.
నీతి : ఈ శరీరం పరోపకారం కోసమే ఉన్నది. ఈ విషయాన్ని మనం మరువక, మనకు చేతనైనంతలో ఇతరులకు సహాయపడుతూ ఉండాలి.
TELUGU BHAKTHI SLOKAM - SARVA MANGALA MANGALYE AND ITS MEANING IN TELUGU
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే
ప్రతి పదార్థము: సర్వమంగళ మాంగళ్యే = శుభకరమైన వాటన్నింట శుభకరమైనది /మంగళకరమైనది (సర్వమంగళ నామము చేత మంగళ స్వరూపురాలైనది); శివే = శివ సతి అయిన శక్తి లేదా పార్వతి; సర్వ = అన్ని; అర్థ = అర్థములను (ధర్మ+అర్థ+కామ+మోక్ష అను చతుర్విధ పురుషార్థములు); సాధికే = సాధించినది; శరణ్యే = శరణము/ఆశ్రయము కల్పించేది; త్రంబకి = త్రి + అంబకి = మూడు కన్నులు గలవాని దేవేరి, అనగా పార్వతి; దేవి = దేవి/దేవత; నారాయణి = పార్వతి; తే = నీకు; నమః = నమస్కారము/ప్రణామము; అస్తు = అగు గాక.
తాత్పర్యము: మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ, ఓ! దుర్గాదేవీ, ఓ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే
ప్రతి పదార్థము: సర్వమంగళ మాంగళ్యే = శుభకరమైన వాటన్నింట శుభకరమైనది /మంగళకరమైనది (సర్వమంగళ నామము చేత మంగళ స్వరూపురాలైనది); శివే = శివ సతి అయిన శక్తి లేదా పార్వతి; సర్వ = అన్ని; అర్థ = అర్థములను (ధర్మ+అర్థ+కామ+మోక్ష అను చతుర్విధ పురుషార్థములు); సాధికే = సాధించినది; శరణ్యే = శరణము/ఆశ్రయము కల్పించేది; త్రంబకి = త్రి + అంబకి = మూడు కన్నులు గలవాని దేవేరి, అనగా పార్వతి; దేవి = దేవి/దేవత; నారాయణి = పార్వతి; తే = నీకు; నమః = నమస్కారము/ప్రణామము; అస్తు = అగు గాక.
తాత్పర్యము: మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ, ఓ! దుర్గాదేవీ, ఓ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.
TELUGU CHILDRENS POETRY BY SRI VETURI PRABHAKARA SASTRY - KANCHIKI POTHAVA KRISHNAMMA SONG LYRIC IN TELUGU
బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి.
.
కంచికి పోతావా కృష్ణమ్మా!
ఆ - కంచి వార్తలేమి కృష్ణమ్మా?
కంచిలో ఉన్నది అవ్వ;
ఆ - అవ్వ నాకు పెట్టు బువ్వ.
బువ్వ ఉన్నదిగాని కృష్ణమ్మా,
నీకు - పప్పు ఎక్కడిదోయి కృష్ణమ్మా?
కోమటి యింటిది అప్పు;
ఆ - అప్పు నాకు పెట్టు పప్పు.
పప్పు ఉన్నదిగాని కృష్ణమ్మా,
నీకు - కూర యెక్కడి దోయి కృష్ణమ్మా?
దొడ్లోను ఉన్నది బీర;
ఆ - బీర నాకు పెట్టు కూర.
కూర ఉన్నదిగాని కృష్ణమ్మా;
నీకు - నెయ్యి యెక్కడిదోయి కృష్ణమ్మా?
కోమటి అక్కెమ్మ చెయ్యి;
ఆ - చెయ్యి నాకుపోయు నెయ్యి.
నెయ్యి ఉన్నదిగాని కృష్ణమ్మా;
నీకు - పెరుగు ఎక్కడిదోయి కృష్ణమ్మా?
ఉన్నయింటి యిరుగుపొరుగు,
ఆ - పొరుగు నాకుపోయు పెరుగు.
బువ్వ తిందువుగాని కృష్ణమ్మా;
నీకు - ఆ వూళ్ళోపనియేమి కృష్ణమ్మా?
అక్కడ ఉన్నది అమ్మ,
నేను - మొక్కివత్తును కామాక్షమ్మ.
.
కంచికి పోతావా కృష్ణమ్మా!
ఆ - కంచి వార్తలేమి కృష్ణమ్మా?
కంచిలో ఉన్నది అవ్వ;
ఆ - అవ్వ నాకు పెట్టు బువ్వ.
బువ్వ ఉన్నదిగాని కృష్ణమ్మా,
నీకు - పప్పు ఎక్కడిదోయి కృష్ణమ్మా?
కోమటి యింటిది అప్పు;
ఆ - అప్పు నాకు పెట్టు పప్పు.
పప్పు ఉన్నదిగాని కృష్ణమ్మా,
నీకు - కూర యెక్కడి దోయి కృష్ణమ్మా?
దొడ్లోను ఉన్నది బీర;
ఆ - బీర నాకు పెట్టు కూర.
కూర ఉన్నదిగాని కృష్ణమ్మా;
నీకు - నెయ్యి యెక్కడిదోయి కృష్ణమ్మా?
కోమటి అక్కెమ్మ చెయ్యి;
ఆ - చెయ్యి నాకుపోయు నెయ్యి.
నెయ్యి ఉన్నదిగాని కృష్ణమ్మా;
నీకు - పెరుగు ఎక్కడిదోయి కృష్ణమ్మా?
ఉన్నయింటి యిరుగుపొరుగు,
ఆ - పొరుగు నాకుపోయు పెరుగు.
బువ్వ తిందువుగాని కృష్ణమ్మా;
నీకు - ఆ వూళ్ళోపనియేమి కృష్ణమ్మా?
అక్కడ ఉన్నది అమ్మ,
నేను - మొక్కివత్తును కామాక్షమ్మ.
TIPS TO AVOID FOOD STUFF WHICH HARMS TO HEALTH
ఆహారంలో avoid చేయాల్సినవి.....
విలైనంత వరకు గుర్తుంచుకొని ఇవన్నీ ఆహారములో నిషేదిన్చాల్సినవట ....
1. తేనే (honey) మరియు నెయ్యి (gee) కలిపి తినకూడదు. ఆ రెండిటి కలయిక విషపూరితం అయినది. Don't mix honey and ghee it is poisonous.
2. పెరుగు (curd) లేక చల్ల ను (butter milk) అరటి పండు తో కలిపి తినకూడదు. Done eat banana with curd or buttermilk.
3. అన్నాన్ని (rice) పండ్లతో (fruits) కలిపి తినకూడదు. అలా తినడం వల్ల పండ్లలోని minerals తగ్గిపోతాయి. Don't eat fruits with rice u loose minerals.
4. కూరగాయలతో (vegetables) కలిపి వెన్నె (cheese) కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. Don't eat cheese with vegetables. If so it is dangerous.
5. చేపల కూర (fish curry) తిన్నవెంటనే పాలు (milk) కానీ, పెరుగు (curd) కానీ తినకూడదు. అలా తింటే కుష్టి రోగం వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. Don't drink milk or curd after fish curry if so u will get leporsy.
6. లావుగా ఉన్నవారు బియ్యం (rice) తో వండివి కాకుండా గోధుములతో (wheat) ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిది..
Fat people instead of rice they should have wheat products.
7. ఆస్తమా (asthma) రోగులు టమోటా (tomato), గుమ్మడికాయ (pumpkin), ముల్లంగి (radish) వారు తీసుకొనే ఆహారంలో వాడకూడదు. అలాగే వారు తల మీద ఎక్కువ తేమను కూడా ఉంచుకోవడం మంచిది కాదుasthma people shouldn't suppose to eat tomato, radish , pumpkin and their hair should not be wet.
8. మొలలు (piles) ఉన్నవారు గుడ్లు (eggs), మాంసం (meat) తినకూడదు. Piles people - don't eat eggs, meat.
9. నెయ్యిని రాగి (copper) పాత్రలో ఉంచి తినకూడదు. Don't use ghee if it is in copper vessel.
10. పొద్దునే bed coffee తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు. పొద్దునే మంచి నీరు తాగిన తరువాత త్రాగవచ్చు . Early in the morning bed coffee is not good instead drink water.
11. అల్సర్ (ulcer) వ్యాదితో భాద పడుతున్నవారు కారాన్ని తినకూడదు. Ulcer people don't eat spicy food.
13. చర్మ వ్యాధులు (skin diseases) ఉన్నవారు పొట్ల కాయ (snake guard), పల్లీలు (pea nuts), ఎండు చేపలు (dry fish), చిక్కుడు కాయలు (Broad beans) తినకూడదు. Skin diseases people- don't eat snake guard, pea nuts, dry fish, broad beans.
14. నువ్వుల నునేతో (sesame oil) తో గోధుమ wheat కి చెందినవి చెయ్యకూడదు. Don't use Wheat and sea same oil together.
15. మోకాళ్ళ నొప్పులతో (arthritis) ఉన్నవారు మాంసం (meat), గుడ్లు( eggs) తో చేసిన వంటలు తినకూడదు. Arthritis people don't eat meat and eggs.
వీలైనంత వరకు గుర్తుంచుకొని పాటించండి.. ఆరోగ్యం బాగా చూసుకోండి. ఆరోగ్యమే మహా భాగ్యం కదా!! Pls Remember the above points and take necessary steps. Health is wealth.
విలైనంత వరకు గుర్తుంచుకొని ఇవన్నీ ఆహారములో నిషేదిన్చాల్సినవట ....
1. తేనే (honey) మరియు నెయ్యి (gee) కలిపి తినకూడదు. ఆ రెండిటి కలయిక విషపూరితం అయినది. Don't mix honey and ghee it is poisonous.
2. పెరుగు (curd) లేక చల్ల ను (butter milk) అరటి పండు తో కలిపి తినకూడదు. Done eat banana with curd or buttermilk.
3. అన్నాన్ని (rice) పండ్లతో (fruits) కలిపి తినకూడదు. అలా తినడం వల్ల పండ్లలోని minerals తగ్గిపోతాయి. Don't eat fruits with rice u loose minerals.
4. కూరగాయలతో (vegetables) కలిపి వెన్నె (cheese) కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. Don't eat cheese with vegetables. If so it is dangerous.
5. చేపల కూర (fish curry) తిన్నవెంటనే పాలు (milk) కానీ, పెరుగు (curd) కానీ తినకూడదు. అలా తింటే కుష్టి రోగం వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. Don't drink milk or curd after fish curry if so u will get leporsy.
6. లావుగా ఉన్నవారు బియ్యం (rice) తో వండివి కాకుండా గోధుములతో (wheat) ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిది..
Fat people instead of rice they should have wheat products.
7. ఆస్తమా (asthma) రోగులు టమోటా (tomato), గుమ్మడికాయ (pumpkin), ముల్లంగి (radish) వారు తీసుకొనే ఆహారంలో వాడకూడదు. అలాగే వారు తల మీద ఎక్కువ తేమను కూడా ఉంచుకోవడం మంచిది కాదుasthma people shouldn't suppose to eat tomato, radish , pumpkin and their hair should not be wet.
8. మొలలు (piles) ఉన్నవారు గుడ్లు (eggs), మాంసం (meat) తినకూడదు. Piles people - don't eat eggs, meat.
9. నెయ్యిని రాగి (copper) పాత్రలో ఉంచి తినకూడదు. Don't use ghee if it is in copper vessel.
10. పొద్దునే bed coffee తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు. పొద్దునే మంచి నీరు తాగిన తరువాత త్రాగవచ్చు . Early in the morning bed coffee is not good instead drink water.
11. అల్సర్ (ulcer) వ్యాదితో భాద పడుతున్నవారు కారాన్ని తినకూడదు. Ulcer people don't eat spicy food.
13. చర్మ వ్యాధులు (skin diseases) ఉన్నవారు పొట్ల కాయ (snake guard), పల్లీలు (pea nuts), ఎండు చేపలు (dry fish), చిక్కుడు కాయలు (Broad beans) తినకూడదు. Skin diseases people- don't eat snake guard, pea nuts, dry fish, broad beans.
14. నువ్వుల నునేతో (sesame oil) తో గోధుమ wheat కి చెందినవి చెయ్యకూడదు. Don't use Wheat and sea same oil together.
15. మోకాళ్ళ నొప్పులతో (arthritis) ఉన్నవారు మాంసం (meat), గుడ్లు( eggs) తో చేసిన వంటలు తినకూడదు. Arthritis people don't eat meat and eggs.
వీలైనంత వరకు గుర్తుంచుకొని పాటించండి.. ఆరోగ్యం బాగా చూసుకోండి. ఆరోగ్యమే మహా భాగ్యం కదా!! Pls Remember the above points and take necessary steps. Health is wealth.
Subscribe to:
Posts (Atom)