The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
SAHASA VEERUDU - ANGRY YOUNG MAN - KIDS ACTION STORIES IN TELUGU
సాహస వీరుడు
అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక రాజు
ఉండేవాడు. ఆ రాజుకు పిల్లలు లేరు.
అందుకని రాణి ఎన్నో రోజులు ఉపవాసం ఉండి, ఎన్నో పూజలు చేసింది; ఎందరికో దాన ధర్మాలు చేసింది.
రాజు రాజ్యాన్ని ఎంతో చక్కగా, ధర్మ బద్ధంగా
పాలించాడు. ఒక రోజు ఆ రాజ్యానికి ఒక సాధువు వచ్చాడు. రాజు, రాణి సాధువు దగ్గరికి వెళ్ళారు. సాధువు ఆ దంపతులకు ఒక మామిడిపండు ఇచ్చాడు.
దీన్ని టెంకతో సహా తినెయ్యాలమ్మా, మరి ఎలా తింటావో నీ ఇష్టం!" అన్నాడు సాధువు.
రాణికి మామిడి పండ్లంటే ఇష్టమే; ఆమె దాన్ని తిన్నది- కానీ టెంకతో సహా తినమంటే ఎలాగ? అందుకని ఆమె తను పండుని తిని, టెంకని మటుకు రాజభవనంలోంచి
బయటికి విసిరేసింది.
అప్పటి నుండి తొమ్మిది నెలల తరువాత ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి 'సాహసవీరుడు' అని పేరు పెట్టారు వాళ్ళు. అతనుకూడా పేరుకు
తగ్గట్లే రకరకాల విద్యలు నేర్చుకున్నాడు. వాళ్ల
రాజ్యంలో అతన్ని మించిన యోధులు లేరు
అన్నట్లు తయారయ్యాడతను.
ఆలోగా, రాణి విసిరేసిన టెంక రాజ భవనం ప్రక్కనే మొలిచి, కాల క్రమంలో పెద్ద వృక్షమే అయ్యింది. దాని పళ్ళకు వింత శక్తి ఒకటి ఉన్నదని, త్వరలోనే అందరికీ తెలిసింది-
వాటిని తిన్నవాళ్లకు అమితమైన శక్తి లభిస్తుంది!
అయితే "ఆ చెట్టు పండ్లు దుర్మార్గుల పాలబడితే
ఎలాగ?" అని రాజుగారు దాని చుట్టూ కాపలా ఏర్పాటు చేసి, దాని పళ్ళు ఎవరికీ అందకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
అయితే ఒక నాడు రాజుగారి జైలులోంచి
తప్పించుకున్న దుర్మార్గుడొకడు ఆ చెట్టు
చుట్టూ ఏర్పరచిన సైనికులందరినీ ఏమార్చి,
చెట్టును చేరుకున్నాడు. గబగబా ఆ చెట్టు
కాయలు ఒక పదింటిని తినేశాడు కూడానూ.
దాంతో వాడికి విపరీతమైన శక్తి వచ్చేసింది. వాడి శరీరం కూడా బలంగా, సైనికుల బాణాలకు దెబ్బతిననట్లు మారిపోయింది.
దాంతో వాడు ఆ చెట్టుని కూకటి వేళ్లతో
సహా పెకలించేశాడు; సైనిక వలయాన్నంతా చిందరవందర చేసి, దొరికిన వాళ్లనల్లా చంపేసి, రాజ్యంలో భీభత్సం సృష్టించటం మొదలుపెట్టాడు.
రాజ్యంలో ఎవరికీ వాడిని ఎదిరించే ధైర్యం లేకపోయింది. అందరూ రాజ్యాన్ని విడిచి పారిపోవటం మొదలుపెట్టారు. సంగతి తెలిసిన సాహసవీరుడు రాజుగారిని కలిసాడు.
తాను ఆ రాక్షసుడిని ఎదిరిస్తానన్నాడు. రాజుగారు పుత్రప్రేమను ప్రక్కన పెట్టి "సరే" అని
అనుమతినిచ్చారు. సాహస వీరుడు గ్రంధాలను వెతికి, ఆ చెట్టు గురించిన రహస్యాన్ని తెలుసుకున్నాడు: ఆ కాయలు తిన్న వారికి అపరిమితమైన శక్తి వస్తుంది- కానీ,
వాటిని తిన్నవాళ్ళు నీళ్ళలోకి దిగితే మటుకు వాళ్ల శక్తి క్షీణిస్తుంది!'
రహస్యం తెలిసాక సాహసవీరుడికి చాలా సంతోషం వేసింది. అతను ఆ దుర్మార్గుడితో పోరాడుతూ వచ్చి, మెల్లగా అతన్ని సముద్రంలోకి నెట్టాడు. దాంతో ఆ
రాక్షసుడి శక్తి క్షీణించటం, అతను సాహస వీరుని
కత్తికి బలవ్వటం జరిగిపోయింది.
దుర్మార్గుడి కథ అట్లా అంతం కావటంతో అందరూ చాలా సంతోషించారు. మహిమలతో గొప్ప శక్తులు సంపాదించటం కంటే
స్వశక్తిమీద ఆధారపడటమే మంచిది. అంత ప్రమాదకరమైన చెట్టుని భద్రంగా ఉంచి కాపాడుకుంటూ రారాదు- దాన్ని ముందుగానే నాశనం చేసేసి ఉంటే సరిపోయేది. అయినా మనం చేయాల్సిన పనిని ఆ దుర్మార్గుడే చేసాడు- చెట్టును పెరికివేసి చాలా
మంచి పని చేశాడు! అన్నాడు సాహసవీరుడు,
సత్కారాలు అందుకుంటూ.
అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక రాజు
ఉండేవాడు. ఆ రాజుకు పిల్లలు లేరు.
అందుకని రాణి ఎన్నో రోజులు ఉపవాసం ఉండి, ఎన్నో పూజలు చేసింది; ఎందరికో దాన ధర్మాలు చేసింది.
రాజు రాజ్యాన్ని ఎంతో చక్కగా, ధర్మ బద్ధంగా
పాలించాడు. ఒక రోజు ఆ రాజ్యానికి ఒక సాధువు వచ్చాడు. రాజు, రాణి సాధువు దగ్గరికి వెళ్ళారు. సాధువు ఆ దంపతులకు ఒక మామిడిపండు ఇచ్చాడు.
దీన్ని టెంకతో సహా తినెయ్యాలమ్మా, మరి ఎలా తింటావో నీ ఇష్టం!" అన్నాడు సాధువు.
రాణికి మామిడి పండ్లంటే ఇష్టమే; ఆమె దాన్ని తిన్నది- కానీ టెంకతో సహా తినమంటే ఎలాగ? అందుకని ఆమె తను పండుని తిని, టెంకని మటుకు రాజభవనంలోంచి
బయటికి విసిరేసింది.
అప్పటి నుండి తొమ్మిది నెలల తరువాత ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి 'సాహసవీరుడు' అని పేరు పెట్టారు వాళ్ళు. అతనుకూడా పేరుకు
తగ్గట్లే రకరకాల విద్యలు నేర్చుకున్నాడు. వాళ్ల
రాజ్యంలో అతన్ని మించిన యోధులు లేరు
అన్నట్లు తయారయ్యాడతను.
ఆలోగా, రాణి విసిరేసిన టెంక రాజ భవనం ప్రక్కనే మొలిచి, కాల క్రమంలో పెద్ద వృక్షమే అయ్యింది. దాని పళ్ళకు వింత శక్తి ఒకటి ఉన్నదని, త్వరలోనే అందరికీ తెలిసింది-
వాటిని తిన్నవాళ్లకు అమితమైన శక్తి లభిస్తుంది!
అయితే "ఆ చెట్టు పండ్లు దుర్మార్గుల పాలబడితే
ఎలాగ?" అని రాజుగారు దాని చుట్టూ కాపలా ఏర్పాటు చేసి, దాని పళ్ళు ఎవరికీ అందకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
అయితే ఒక నాడు రాజుగారి జైలులోంచి
తప్పించుకున్న దుర్మార్గుడొకడు ఆ చెట్టు
చుట్టూ ఏర్పరచిన సైనికులందరినీ ఏమార్చి,
చెట్టును చేరుకున్నాడు. గబగబా ఆ చెట్టు
కాయలు ఒక పదింటిని తినేశాడు కూడానూ.
దాంతో వాడికి విపరీతమైన శక్తి వచ్చేసింది. వాడి శరీరం కూడా బలంగా, సైనికుల బాణాలకు దెబ్బతిననట్లు మారిపోయింది.
దాంతో వాడు ఆ చెట్టుని కూకటి వేళ్లతో
సహా పెకలించేశాడు; సైనిక వలయాన్నంతా చిందరవందర చేసి, దొరికిన వాళ్లనల్లా చంపేసి, రాజ్యంలో భీభత్సం సృష్టించటం మొదలుపెట్టాడు.
రాజ్యంలో ఎవరికీ వాడిని ఎదిరించే ధైర్యం లేకపోయింది. అందరూ రాజ్యాన్ని విడిచి పారిపోవటం మొదలుపెట్టారు. సంగతి తెలిసిన సాహసవీరుడు రాజుగారిని కలిసాడు.
తాను ఆ రాక్షసుడిని ఎదిరిస్తానన్నాడు. రాజుగారు పుత్రప్రేమను ప్రక్కన పెట్టి "సరే" అని
అనుమతినిచ్చారు. సాహస వీరుడు గ్రంధాలను వెతికి, ఆ చెట్టు గురించిన రహస్యాన్ని తెలుసుకున్నాడు: ఆ కాయలు తిన్న వారికి అపరిమితమైన శక్తి వస్తుంది- కానీ,
వాటిని తిన్నవాళ్ళు నీళ్ళలోకి దిగితే మటుకు వాళ్ల శక్తి క్షీణిస్తుంది!'
రహస్యం తెలిసాక సాహసవీరుడికి చాలా సంతోషం వేసింది. అతను ఆ దుర్మార్గుడితో పోరాడుతూ వచ్చి, మెల్లగా అతన్ని సముద్రంలోకి నెట్టాడు. దాంతో ఆ
రాక్షసుడి శక్తి క్షీణించటం, అతను సాహస వీరుని
కత్తికి బలవ్వటం జరిగిపోయింది.
దుర్మార్గుడి కథ అట్లా అంతం కావటంతో అందరూ చాలా సంతోషించారు. మహిమలతో గొప్ప శక్తులు సంపాదించటం కంటే
స్వశక్తిమీద ఆధారపడటమే మంచిది. అంత ప్రమాదకరమైన చెట్టుని భద్రంగా ఉంచి కాపాడుకుంటూ రారాదు- దాన్ని ముందుగానే నాశనం చేసేసి ఉంటే సరిపోయేది. అయినా మనం చేయాల్సిన పనిని ఆ దుర్మార్గుడే చేసాడు- చెట్టును పెరికివేసి చాలా
మంచి పని చేశాడు! అన్నాడు సాహసవీరుడు,
సత్కారాలు అందుకుంటూ.
KEY PERSON OF MAHABHARATHA - FULL STORY OF SHAKUNI IN TELUGU
శకుని
గాంధార రాజ్యము మహాభారత కాలములో భారత దేశమునకు పశ్చిమమున వున్నా రాజ్యము. ఇందు పుష్కలావతి ,తక్షశిల,పురుషపురములు ఇందలి ముఖ్య పట్టణములు. శ్రీరామా చంద్రుని తమ్ముడు భరతుడు ఈ భూభాగామునేలినట్లు ఐతిహ్యము.మహాభారత కాలానికి సుబలుడు గాంధార రాజు. ఆయనకు అచల,వృక్షక, వృహద్వల, సౌబల అన్న కొడుకులుంటారు. సౌబలుడే శకుని అని పెద్దలనగా విన్నాను.గాంధారి పెద్దది. శకుని అందరికన్నా చిన్నవాడు.
మహాభారత సమయములో, కురురాజుగా అభిషిక్తుడైన ధృతరాష్ట్రునికి భీష్ముడు పెళ్లి చేయాలనుకున్నాడు. ఈడు వచ్చిన యువకునికి పెళ్లిచేయాలనుకోవడంలో విశేషమేముంది కానీ, ఆ సమయంలో భీష్ముని ఊహల్ని ప్రధానంగా మరొకటి ఆక్రమించుకుంది. అప్పటికి కొన్నేళ్ళ క్రితమే కురువంశం ఆగిపోయే ప్రమాదం భయపెట్టింది. వ్యాసుని జోక్యంతో ఆ గండం గడిచింది. ఆ అనుభవం ఇప్పటికీ భీష్ముని ఆలోచనల్లో పచ్చిగానే ఉంది. కనుక ధృతరాష్ట్రుని పెళ్లిని మించి, ఆ పెళ్లితో కులం నిలిచే అవకాశమే అతనికి కొట్టొచ్చినట్టు కనిపించింది. విదురునితో ఆలోచనలను కలబోసుకున్నాడు. ఇక వధువు ఎవరన్న విషయానికి వస్తే, గాంధారరాజు సుబలుని కూతురు గాంధారి మంచి రూపమూ, లావణ్యమూ, శీలమూ, ఆభిజాత్యమూ కలిగిన కన్య అని బ్రాహ్మణుల ద్వారా విన్నాడు. పైగా వందమంది కొడుకులు కలిగేలా ఆమె వరం పొందిందని తెలిసి మరింత ముచ్చటపడ్డాడు. సుబలునితో మాట్లాడి రమ్మని కొంతమంది వృద్ధులను పంపించాడు.
ధృతరాష్ట్రుడు పుట్టంధుడు. అయినాసరే, సుబలుడు భీష్ముని కోరికను కాదనే అవకాశం లేదు. ఎందుకంటే, రాజు ధృతరాష్ట్రుడే కానీ, రాజ్యరక్షకుడు భీష్ముడే. అతడు పరాక్రమవంతుడే కాక, కాశీ రాజు కూతుళ్లను రాక్షసవివాహ పద్ధతిలో ఎత్తుకు వెళ్ళి, తన తమ్ముడు విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి చేసిన చరిత్ర అతనికి ఉంది. కనుక ఆ ప్రతిపాదనకు ఒప్పుకుని మర్యాద నిలుపుకోవడమే మంచిదని సుబలుడు అనుకొని ఉండవచ్చు. దాంతో, ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చితి’నని బంధువుల మధ్య ప్రకటించినాడు. గాంధారి ఆ మాట విని తండ్రి మాటపై గౌరవముతో ధృతరాష్ట్రుని తన భర్తగా భావించింది. ఈ కళ్ళతో ఇక పరపురుషుని చూడరాదనుకుని నేత్రపట్టం కట్టుకుంది. ఓ రోజున సోదరుడైన శకుని గాంధారినీ, గొప్ప సంపదనూ వెంటబెట్టుకుని హస్తినాపురానికి విచ్చేయుటతో గాంధారీ-ధృతరాష్ట్రుల వివాహం వైభవంగా జరిగిపోయింది.చక్రవర్తుల సంబంధమగుటచే శకుని హస్తినలోనే నిలిచి పోయెను. ఇంకొక విషయము ఇక్కడ వున్నది . శకుని గాన్దారికన్నా చాల చిన్నవాడు. తోడుగా ఉండుటకు కూడా వుండిపోయి ఉండవచ్చును.
ఇక్కడ ఒకచిన్న ప్రస్తాపన. గాంధార రాజైన సుబలుడు ఆస్థాన జ్యోతిష్యులతో తన కుమార్తెకు పెళ్ళయిన తక్షణమే వైద్యము వచ్చునని ఎరిగినవాడై ముందామెను ఒక మేకపోతుకు కట్టి దాని చంపినపిమ్మట ధృతరాష్ట్రునికిచ్చి పెళ్ళిచేసెనని ప్రతీతి. కౌరవ పాండవులు బాల్యమందు మాత్సర్యముచే కౌరవులు 'రండా పుత్రు' లని తిడితే పాండవులు వారిని 'ముండాపుత్రు'లన్నారనీ ఆ కోపముతో వయసు వచ్చిన తరువాత దుర్యోధనుడు గాన్దారము పై యుద్ధము ప్రకటించి సుబలుని అతని కుమారులందరినీ చెరసాలలోబంధిస్తే,వారికి వేసే తిండి మెతుకులు అన్నీ కలిపి శకునికి పెట్టి వారు మరణిచినారనీ సుబలుడు చనిపోతూ తన వెన్నెముక లోని ఎముకలతో పాచికలు తయారుచేసుకొని శకునిని వుంచుకొమ్మన్నాడని, దుర్యోధనుని వినాశము కోరినవాడై ఆ పాచికలతో ధర్మరాజును ఓడించి ఆ తరువాత వచ్చే యుద్ధములో దుర్యోధనుని పాండవులు మట్టుపెడతారని ఊహించియే అట్లు చేసినాడని ఒక ప్రచారముంది. దీని మూలములు భారతము నందు కనిపించవు. పైగా సుబలుడు తన పరివారముతో రాజసూయమునకు వచ్చినాడని, యాగము ముగిసిన తరువాత గౌరవంగా అతనిని ధర్మజుడు సాగానంపినాడని భారతమున కలదు. భారత యుద్ధములో సుబలుని వారసులు కౌరవుల పక్షమున పోరాడినారని కూడా యున్నది.
శకుని జన్మనామము సౌబలుడని విన్నాను.ఇది కూడా సుబలుని కుమారుడైనందువల్ల నేమో. శకుని గాంధారికన్నా బాగా చిన్నవాడు అని ముందుగానే చెప్పుకోన్నాము.దుర్యోధనునికన్నా బహు కొద్ది సంవత్సరములు పెద్దవాడు అయివుండవచ్చు. అందువల్లనే అతని సహవాసము దుర్యోధనునితో ఎక్కువ బావయైన ధృతరాష్ట్రునితో తక్కువ.బావను చేరి తన మాట వినిపించిన ఉదంతమేదియు భారతమున కానరాదు. సార్వభౌమత్వము పై కామము,తనను అది చేరనందువల్ల క్రోధము అదే సర్వస్వమన్న మోహము తో నున్న దుర్యోధనునకు, మదించిన దుశ్శాసనుడు,తాను పొందిన రాజ్యము దానినిచ్చిన సార్వభౌమునికి తానే సన్నిహితునిగా ఉండాలన్న లోభము కలిగిన కర్ణుడు,తనకు దక్కినస్థానము వేరెవరికీ దక్క కూడదనుకొన్న శకుని దుర్యోధనుని ఆవహించియుండగా అతనికి బంధ విముక్తి బొందె వదిలితేనే కదా. కావున అన్ని విధములైన కుతంత్రములలో మొదలు శకుని పిదప కర్ణుడు ఆపై తందానా తానాకు దుశ్శాసనుడు, చచ్చేవరకు అంటిపెట్టుకొనే ఉండిపొయినారు.
మయ సభలో జరిగిన అవమానమునకు ప్రతీకారముగా జూదమాడి తాను రాజ్యాన్ని సంపాదించి పెడుతానని శకుని దుర్యోధనునితో అంటాడు. సభా పర్వములోని 20,21,22 శ్లోకాలు ఏమితెలుపునంటే 'దుర్యోధనా! జూడమాడుటలో నాకు ఎవరూ సాటి రారు. మీ తండ్రిని ఒప్పించి ధర్మరాజుతో జూదమునకు ఏర్పాటు చేయి.ధర్మజుని రాజ్యలక్ష్మిని సంపూర్తి గా నీకు స్వాధీనమొనర్తు'నని శకుని ఒప్పించినాడు. ఇక్కడే మనకర్థమౌతుంది. శకునికి ధృతరాష్ట్రునివద్ద కానీ, మిగిలిన కురు వృద్ధ ,గురు వృధ్ధ బాంధవుల వద్ద కానీ ఎటువంటి పరపతీ లేదని. దుర్యోధనుడు అందరినీ ఒప్పించుటలో కృతకృత్యుడైనాడు. ఇక శకుని జూదములొ గెలుచుటయే ఆలస్యము.
ఆచార విధానాలు రెండు విధములు. ఒకటి శిష్ఠాచారము రెండవది వామాచారము. ధర్మరాజుది శిష్టాచారమైతే శకునిది వామాచారము. పాచికల విషయములో 'అక్షహృదయ'మను విద్య శిష్టాచారమునకు సంబంధించినదైతే 'పాశాధిష్ఠాత్రీ' అనునది వామాచారమునకు సంబంధించిన విద్య. జూదమాడే సమయమునకు ధర్మ రాజుకు 'అక్షహృదయము' తెలియదు కానీ శకునికి 'పాశాధిష్ఠాత్రి' సమగ్రంగా తెలుసు. అందుకే అతను, దుర్యోధనుని చేత, మొదటి సారి మాత్రమే పందెము పెట్టించినాడు. తరువాత వరుస విజయములచేత పందెము పెట్టించే అవసరమే కలుగలేదు శకునికి. ( ఈ విషయమును బ్ర.శ్రీ.వే. మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి ద్వారా తెలుసుకొన్నది. ) ఇంతటి ఘాతుకమును తలపెట్టిన శకుని ప్రాణములను యుద్ధములో తీసెదనని ప్రతిన పూనుతాడు సహదేవుడు.
ధర్మజుడు ఈ అక్షహృదయమనే విద్యను అరణ్య వాసములో వున్నప్పుడు బృహదశ్వుడు అను మహర్షి అనుగ్రహముతో నేర్చుకొంటాడు కానీ ఆ తరువాత ఈ ఆట ఆడే అవసరము ధర్మరాజుకు ఏర్పడలేదు.
రాయభారము విఫలమగుటతో ఇరువైపులా యుద్ధమునకు సిద్ధమౌతారు. భీష్ముడు శరతల్పగతుడౌతాడు. ద్రోణుడు విగతుడౌతాడు కర్ణుడు సైన్యాధ్యక్షుడౌతాడు. 17వ రోజున యుద్ధము భీకరంగా జరుగుతూ వుంటుంది. ఆ మహాసంగ్రామములో సహదేవుడు శకునికి ఎదురౌతాడు .
శకుని కుతంత్రుడే కానీ కువీరుడు కాదు. అతడు సహదేవుడితో తలపడి పది బాణములు అతడి శరీరంలో గ్రుచ్చుతాడు. ఆ దెబ్బకు సహదేవుడు మూర్ఛిల్లగా అది చూసి భీముడు శకుని ముందున్న గాంధార సైన్యమును నాశనం చేయసాగుతాడు. అది చూసి కౌరవసేనలు పారి పోగా సుయోధనుడు ధైర్యం చెప్పి వారిని ముందుకు పురికొల్పుతాడు .సహదేవుడు మూర్ఛ నుండి తేరుకుని శకుని మీద పది బాణములు ప్రయోగించి అతడి విల్లు ఖండించుతాడు. శకుని వేరొక విల్లు తీసుకొని సహదేవుడి మీద శరవర్షం కురిపించఉతాడు. శకుని కుమారుడైన ఉలూకుడు సహదేవ, భీమసేనుల మీద బాణవర్షం కురిపించగా సహదేవుడు కోపించి ఒకే ఒక బల్లెము విసిరి ఉలూకుడి తల ఖండించుతాడు. తన కుమారుడు తన కళ్ళ ముందే చనిపోవడం చూసి చలించిన శకుని ఆగ్రహోదగ్రుడై సహదేవుడి మీద మూడు బాణములు వేయగా సహదేవుడు ఆ మూడు బాణములను ఖండించి శకుని విల్లు విరిచి వేస్తాడు. శకుని మహా కోపంతో సహదేవునిపై కత్తిని, గధను, బల్లెమును ప్రయోగించాడు.సహదేవుడు వాటిని మధ్యలోనే ఖండించగా అది చూసి శకుని తన రధ రక్షకులతో సహా అక్కడి నుండి పారి పోతాడు. సహదేవుడు అతడిని నిలువరించి " ఓ గాంధార రాజా ! రాజ ధర్మం విడిచి ఇలా పారి పోవడం నీవంటి సుక్షత్రియునకు తగదు.
నాడు జూదం ఆడిననాడు చూపిన చాతుర్యం ఇప్పుడు చూపు. నీవు ఆడించిన మాయా జూదంకు ఫలితం చూసావు కదా సర్వనాశనం అయింది. నాడు జూదంలో ఓడి పోయి తలలు వంచుకున్న మా కోపాగ్ని జ్వాలలల ఫలితం చూచితివి కదా! మమ్ము అవమానించినందుకు సుయోధనుడు తన వారందరిని పోగొట్టుకుని అనుభవిస్తున్నాడు. ఆ సుయోధనుడు చూస్తుండగా నీ తల తెగి నేలను ముద్దాడేలా కొడతాను " అని అంటూ సహదేవుడు శకుని రధాశ్వములను, కేతనమును, విల్లును ఖండించగా అది చూసి శకుని అత్యంత భయంకరమైన శక్తి ఆయుధమును సహదేవుడి మీద విసిరుతాడు. సహదేవుడు ఆ శక్తి ఆయుధమును ఖండించి రెండు చేతులలో రెండు బల్లెములను తీసుకొని అత్యంత వేగంగా శకుని మీద వేసి అతడి తల ఖండించి వేస్తాడు. శకుని తల నేల పడగానే శరీరం కూడా నేల మీదకు వాలిపోతుంది.
మహాభారత యుద్ధానికి కారణ భూతుడైన గాంధార రాజు శకుని సహదేవుడి చేతిలో మరణించాడు.ఆ విధంగా సహదేవుడు తన ప్రతిజ్ఞ నేరవేర్చుకొంటాడు.
BEAUTIFUL RED BLACK STYLISH PARTY WEAR SALWAR SUIT
Rs. 1,399 by DharMee Creations. Click here to buy:http:// www.craftsvilla.com/ catalog/product/view/id/ 2186303/s/ hiba-stylish-beautiful-part y-wear-salwar-suits/
Brahmasri Chaganti Koteswara Rao Gari Godavari Pushkaralu 2015 Telugu Article about the formalities to the performed while going to Pushkaralu
సనాతన సంప్రదాయంలో స్నానం అత్యంత ప్రధానమైన ఆచారం. భగవంతుడి విభూతిని సంతరించుకోవటానికి అత్యంత ప్రధానమైన ఉపకరణం. అందుకే స్నానం చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. పుష్కర స్నానానికి
ఇంటి నుంచి బయలుదేరే సమయంలో..
‘‘సర్వదా సర్వదేదేశూ పాపుత్వాం భువనేశ్వరీ మహామాయా జగత్ధాత్రీ సచ్చిదానంద రూపిణీ’’ అని అమ్మవారికి నమస్కారం చేసి బయలుదేరాలి. పుష్కర స్నానం ఆచరించడానికి వెళ్తున్న మాకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా చూడు తల్లీ అనేది ఈ ప్రార్థన ఉద్దేశం. ఇంటి నుంచి బయల్దేరేటప్పుడే చిటికెడు మృత్తిక (మట్టి)ను ఓ కాగితంలో చిన్న పొట్లం కట్టి వెంట తీసుకెళ్లండి.
ఇక నదిలోకి దిగిన తర్వాత వీలైతే కూర్చోవాలి. నీళ్లు తీసుకొని, శిరస్సు మీద మూడు పర్యాయాలు.. పుండరీకాక్ష అంటూ చల్లుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి. ఇంటి నుంచి తెచ్చిన మృత్తికను చేతిలో ఉంచుకుని..
పిప్పలాదాత్సముత్పన్నే
కృత్యేలోక భయంకరి
మృత్తికాంతేమయాదత్తా
మహారార్ధం ప్రకల్పయ
అన్న శ్లోకం చదివి ఆ మట్టిని నదిలో వదిలివేయాలి. ఆ తర్వాత నదిలోపలికి ప్రవేశించి- మూడుసార్లు తల మునిగేటట్లు స్నానం చేయాలి. పుష్కర స్నానం చేసే సమయంలో పక్కవారితో మాట్లాడకూడదు. శ్రీమాత అనే నామస్మరణ చేస్తూ గోదావరి స్నానం చేయాలి. గోదావరిని భ్రమరాంబగా, కనకదుర్గగా.. ఇలా 108 రూపాలతో కొలుస్తారు. ఈ నామాలను ఎటువంటి దోషాలు లేకుండా జపం చేస్తూ స్నానం చేస్తే చాలా మంచిది. ఇక గోదావరికి చేసే పూజలో- గంధము, అక్షతలు అనే రెండు ఉపకరణాలను తప్పనిసరిగా వాడాలి. ఇంటి దగ్గర చందనం అరగదీసి.. దానిని తమలపాకులో పెట్టుకొని స్నానం చేసే సమయంలో పట్టుకువెళ్తే చాలా మంచిది. ఇదే విధంగా మంచి బియ్యాన్ని తీసుకొని- దానిని స్నానానికి వెళ్తే ముందురోజు ఆవుపాలు, ఆవునేయి, పసుపులతో కలిపి ఉంచాలి. ఆ అక్షతలను తీసుకువెళ్లి గోదావరికి సమర్పిస్తే ఆమె సంతోషిస్తుంది.
మన సనాతన సంప్రదాయం ప్రకారం గోదావరిని భ్రమరాంభగా కొలుస్తారు. ఆదిగురువు శంకరులు భ్రమరాంభాష్టకంలో ఈ విషయాన్ని వెల్లడిస్తారు. ఇక స్నానం పూర్తయిన తర్వాత దేవతలకు, పితృదేవతలకు తర్పణం ఇచ్చి, అర్ఘ్యం ఇవ్వాలి. ఇక్కడ పిండ ప్రదానం చేసేవారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. పిండప్రదానం చేసిన తర్వాత ఇంటికి వచ్చే ముందు స్నానం చేసి రావాలి. స్నానం చేసినప్పుడు నియమాలను పాటించటంతో పాటుగా.. కొన్ని పనులను చేయకూడదు. స్నానం చేసే సమయంలో ఎటువంటి పరిస్థితుల్లోను నీటిని కాలితో కానీ చేతితో కాని తన్నకూడదు. ఆటలు ఆడకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో-మలమూత్ర విసర్జన చేయకూడదు. దిగంబర స్నానం కూడా నిషిద్ధమే. వీటిన్నిటినీ పాటిస్తూనే పుష్కర స్నానం చేయాలి.
ఇంటి నుంచి బయలుదేరే సమయంలో..
‘‘సర్వదా సర్వదేదేశూ పాపుత్వాం భువనేశ్వరీ మహామాయా జగత్ధాత్రీ సచ్చిదానంద రూపిణీ’’ అని అమ్మవారికి నమస్కారం చేసి బయలుదేరాలి. పుష్కర స్నానం ఆచరించడానికి వెళ్తున్న మాకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా చూడు తల్లీ అనేది ఈ ప్రార్థన ఉద్దేశం. ఇంటి నుంచి బయల్దేరేటప్పుడే చిటికెడు మృత్తిక (మట్టి)ను ఓ కాగితంలో చిన్న పొట్లం కట్టి వెంట తీసుకెళ్లండి.
ఇక నదిలోకి దిగిన తర్వాత వీలైతే కూర్చోవాలి. నీళ్లు తీసుకొని, శిరస్సు మీద మూడు పర్యాయాలు.. పుండరీకాక్ష అంటూ చల్లుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి. ఇంటి నుంచి తెచ్చిన మృత్తికను చేతిలో ఉంచుకుని..
పిప్పలాదాత్సముత్పన్నే
కృత్యేలోక భయంకరి
మృత్తికాంతేమయాదత్తా
మహారార్ధం ప్రకల్పయ
అన్న శ్లోకం చదివి ఆ మట్టిని నదిలో వదిలివేయాలి. ఆ తర్వాత నదిలోపలికి ప్రవేశించి- మూడుసార్లు తల మునిగేటట్లు స్నానం చేయాలి. పుష్కర స్నానం చేసే సమయంలో పక్కవారితో మాట్లాడకూడదు. శ్రీమాత అనే నామస్మరణ చేస్తూ గోదావరి స్నానం చేయాలి. గోదావరిని భ్రమరాంబగా, కనకదుర్గగా.. ఇలా 108 రూపాలతో కొలుస్తారు. ఈ నామాలను ఎటువంటి దోషాలు లేకుండా జపం చేస్తూ స్నానం చేస్తే చాలా మంచిది. ఇక గోదావరికి చేసే పూజలో- గంధము, అక్షతలు అనే రెండు ఉపకరణాలను తప్పనిసరిగా వాడాలి. ఇంటి దగ్గర చందనం అరగదీసి.. దానిని తమలపాకులో పెట్టుకొని స్నానం చేసే సమయంలో పట్టుకువెళ్తే చాలా మంచిది. ఇదే విధంగా మంచి బియ్యాన్ని తీసుకొని- దానిని స్నానానికి వెళ్తే ముందురోజు ఆవుపాలు, ఆవునేయి, పసుపులతో కలిపి ఉంచాలి. ఆ అక్షతలను తీసుకువెళ్లి గోదావరికి సమర్పిస్తే ఆమె సంతోషిస్తుంది.
మన సనాతన సంప్రదాయం ప్రకారం గోదావరిని భ్రమరాంభగా కొలుస్తారు. ఆదిగురువు శంకరులు భ్రమరాంభాష్టకంలో ఈ విషయాన్ని వెల్లడిస్తారు. ఇక స్నానం పూర్తయిన తర్వాత దేవతలకు, పితృదేవతలకు తర్పణం ఇచ్చి, అర్ఘ్యం ఇవ్వాలి. ఇక్కడ పిండ ప్రదానం చేసేవారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. పిండప్రదానం చేసిన తర్వాత ఇంటికి వచ్చే ముందు స్నానం చేసి రావాలి. స్నానం చేసినప్పుడు నియమాలను పాటించటంతో పాటుగా.. కొన్ని పనులను చేయకూడదు. స్నానం చేసే సమయంలో ఎటువంటి పరిస్థితుల్లోను నీటిని కాలితో కానీ చేతితో కాని తన్నకూడదు. ఆటలు ఆడకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో-మలమూత్ర విసర్జన చేయకూడదు. దిగంబర స్నానం కూడా నిషిద్ధమే. వీటిన్నిటినీ పాటిస్తూనే పుష్కర స్నానం చేయాలి.
Subscribe to:
Posts (Atom)