The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
IMPORTANCE OF LORD VISHNU'S MUKKOTI EKADASI
మన సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీనినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. మూడు + కోటి = ముక్కోటి
ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఎదురుగా ఉన్న ద్వారాన్ని మూసేసి, ఉత్తర ద్వారాన్ని తెరిచి , ఆ ద్వారం నుండి స్వామి దర్శనాన్ని చేయిస్తారు. ఈ ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారమని అంటారు.
ఇలా ఉత్తర ద్వార దర్శనం చేయడం వెనుక స్వామివారి లీలావిశేషాలు ఉన్నాయి.
శ్రీ మహావిష్ణువు కృతయుగంలో మత్స్య,కూర్మ,వరాహ, నారసింహావతారాలను, త్రేతాయుగంలో రామచంద్ర అవతారాన్ని ధరించి ,ద్వాపరయుగంలో కృష్ణ అవతారంలో దర్శనమిచ్చిన స్వామి, కలియుగంలో విరజానదీ మధ్యభాగంలో, సప్తప్రాకార సంశోభితమైన పరమపదంతో సహా శ్రీ దేవి భూ దేవిల సమేతుడై, విష్వక్సేనాదులు తనను కొలుస్తూ ఉండగా, శేషపాన్పుపై అర్చావతారుడై వెలసిన దివ్యగాధను, ముక్కోటి విశదపరుస్తూ ఉంటుంది. ఇందు వెనుక ఆసక్తికరమైన కధ ఉంది.
పూర్వం ఒకానొక సమయంలో ఇంద్రుడు, తన గొప్పదనాన్ని అందరితోపాటు త్రిమూర్తులకు, అష్టదిక్పాల్కులకు తెలియచేయాలన్న ఉద్దేశ్యంతో ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు శ్రీ మహా విష్ణువు శ్రీ భూనీలా సమేతముగా, పరమశివుడు పార్వతీగంగా సమేతముగా, బ్రహ్మదేవుడు శ్రీ వాణీ సమేతముగా విచ్చేశారు. ఇక దిక్పాలకులు ,ముక్కోటి దేవతలు, సకలలోక వాసులు సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేసారు. వారి ఆగమనముతో స్వర్గలోకమంతా కోలాహలంగా ఉంది. అప్పుడు పార్వతిదేవి ఇంద్రునితో ," నీ సభలో అత్యంత ప్రతిభాశాలురైన నాట్యమణులున్నారని ఏర్పాటు చేస్తే, అది చూసి మేమంతా ఆనందిస్తాము కదా" అని అడుగగా ఇంద్రుడు తక్షణమే ఊర్వశి,మేనక,తిలోత్తమలను పిలిపించి నాట్య ప్రదర్శనలను ఇప్పించాడు. వారి నృత్యంతో అంతగా సంతృప్తి చెందని పార్వతీదేవిని చూసి ఇంద్రుడు వినయంతో ఒక్కసారి రంభ నృత్యం చూసి వారి అభిప్రాయాన్ని తెలియచేయమని కోరాడు.
అనంతరం సభావేదిక చేరుకున్న రంభ ముందుగా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, అనంతరం లక్ష్మీ నారాయణుల పాద పద్మములకు, వాణిపద్మజులను సేవించి, సభికులకు అభివందనం చేసి, సరస్వతీ భరతభూషణులను స్తుతించి నాట్యం మొదలు పెట్టింది. ఆమె నాట్యానికి సభికులంతా ముగ్ధులు అయ్యారు. రంభ నాట్యకౌసల్యాన్ని చూసి మెచ్చిన పార్వతీ దేవి నవరత్నఖచిత బంగారు గండపెండేరాన్ని,లక్ష్మీ దేవి బంగారు కడియాన్ని,సరస్వతి దేవి రత్న ఖచిత దండ కడియాన్ని, రంభకు బహూకరించారు. ఇంకా చాలా మంది దేవతలు రంభకు బహుమతులు ఇచ్చారు.
రంభ తన గౌరవాన్ని నిలబెట్టిందని తలచిన ఇంద్రుడు, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు రంభ ఇంద్రుని వలన తనకు పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించమని కోరింది. అది విన్న సభాసదులందరూ కరతాళధ్వనులతో తమ ఆమోదాన్ని తెలిపారు. ఆమె కోరిక తీరేందుకు ఇంద్రుడు సకల దేవతల సాక్షిగా రంభ సహితంగా నందన వనానికి వెళ్ళాడు.
ఈ వ్యవహారమంతా దేవగురు బృహస్పతికి నచ్చలేదు. ఆవేశాన్ని అణుచుకోలేకపోయిన దేవగురువు ,నేరుగా నందన వనానికి వెళ్ళి,సరస సల్లాపాలలో మునిగి ఉన్న ఇంద్రుని పైకి తన కమండలాన్ని విసిరిగొట్టాడు. అప్పటికీ అతని ఆవేశం చల్లారకపోవడంతో దేవేంద్రుని రత్నకిరీటం కిందకు పడేంతగా కొట్టాడు. ఇంద్రుడిని భూలోకంలో ఆటవిక బందిపోటుగా జన్మించమని శపించాడు. తన వలన ఇంద్రుని శపించవలదని రంభ కోరినప్పటికి బృహస్పతి వినకపోవడంతో, రోషావేశపూరితమైన రంభ దేవ గురువుని నీచ జన్మ ఎత్తమని శపిస్తుంది.
ఈ లోపు అటుగా వచ్చిన నారదుడు విషయాన్ని గ్రహించి, ముగ్గురుని త్రిమూర్తుల వద్దకు తీసుకొని వెళ్ళాడు. ఈ శాపాలు అందరు అనుభవించవలసిందే అని తెలిశాక, ఇంద్రుడు భోరున విలపించసాగాడు. దీనముగా వేడుకున్నాడు.
ఇంద్రుని దుఃఖాన్ని చుసిన కరుణాపూరితుడైన విష్ణుభగవానుడు అతనిని ఓదార్చి, తను భూలోకంలో అవతరించి శాపవిమోచనాన్ని ప్రసాదించగలనని చెప్పాడు. విష్ణువు మాటలు విన్న లక్ష్మీ దేవి " స్వామి గురువుశిష్యులు ఇద్దరు పరస్పర వివేకశూన్యులై శపించుకుంటే , ఆ శాపవిమోచనానికి మీరు భూలోకంలో అవతరించడం దేనికి...రామ అవతారంలో పడిన కష్టాలు చాలవా? " అని అడిగింది.
తాను ద్వాపరయుగాంతంలో దుర్వాసుని శాపంవల్ల బాధితురాలైన ఓ గొల్ల భామకు వరం ఇవ్వడమే కారణమని పేర్కొన్నాడు.
అలా శ్రీ మహవిష్ణువు భూలోక అవతార వెనుక చాల కథలు ఉన్నాయి...అందులో ఇది ఒకటి!
ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఎదురుగా ఉన్న ద్వారాన్ని మూసేసి, ఉత్తర ద్వారాన్ని తెరిచి , ఆ ద్వారం నుండి స్వామి దర్శనాన్ని చేయిస్తారు. ఈ ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారమని అంటారు.
ఇలా ఉత్తర ద్వార దర్శనం చేయడం వెనుక స్వామివారి లీలావిశేషాలు ఉన్నాయి.
శ్రీ మహావిష్ణువు కృతయుగంలో మత్స్య,కూర్మ,వరాహ, నారసింహావతారాలను, త్రేతాయుగంలో రామచంద్ర అవతారాన్ని ధరించి ,ద్వాపరయుగంలో కృష్ణ అవతారంలో దర్శనమిచ్చిన స్వామి, కలియుగంలో విరజానదీ మధ్యభాగంలో, సప్తప్రాకార సంశోభితమైన పరమపదంతో సహా శ్రీ దేవి భూ దేవిల సమేతుడై, విష్వక్సేనాదులు తనను కొలుస్తూ ఉండగా, శేషపాన్పుపై అర్చావతారుడై వెలసిన దివ్యగాధను, ముక్కోటి విశదపరుస్తూ ఉంటుంది. ఇందు వెనుక ఆసక్తికరమైన కధ ఉంది.
పూర్వం ఒకానొక సమయంలో ఇంద్రుడు, తన గొప్పదనాన్ని అందరితోపాటు త్రిమూర్తులకు, అష్టదిక్పాల్కులకు తెలియచేయాలన్న ఉద్దేశ్యంతో ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు శ్రీ మహా విష్ణువు శ్రీ భూనీలా సమేతముగా, పరమశివుడు పార్వతీగంగా సమేతముగా, బ్రహ్మదేవుడు శ్రీ వాణీ సమేతముగా విచ్చేశారు. ఇక దిక్పాలకులు ,ముక్కోటి దేవతలు, సకలలోక వాసులు సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేసారు. వారి ఆగమనముతో స్వర్గలోకమంతా కోలాహలంగా ఉంది. అప్పుడు పార్వతిదేవి ఇంద్రునితో ," నీ సభలో అత్యంత ప్రతిభాశాలురైన నాట్యమణులున్నారని ఏర్పాటు చేస్తే, అది చూసి మేమంతా ఆనందిస్తాము కదా" అని అడుగగా ఇంద్రుడు తక్షణమే ఊర్వశి,మేనక,తిలోత్తమలను పిలిపించి నాట్య ప్రదర్శనలను ఇప్పించాడు. వారి నృత్యంతో అంతగా సంతృప్తి చెందని పార్వతీదేవిని చూసి ఇంద్రుడు వినయంతో ఒక్కసారి రంభ నృత్యం చూసి వారి అభిప్రాయాన్ని తెలియచేయమని కోరాడు.
అనంతరం సభావేదిక చేరుకున్న రంభ ముందుగా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, అనంతరం లక్ష్మీ నారాయణుల పాద పద్మములకు, వాణిపద్మజులను సేవించి, సభికులకు అభివందనం చేసి, సరస్వతీ భరతభూషణులను స్తుతించి నాట్యం మొదలు పెట్టింది. ఆమె నాట్యానికి సభికులంతా ముగ్ధులు అయ్యారు. రంభ నాట్యకౌసల్యాన్ని చూసి మెచ్చిన పార్వతీ దేవి నవరత్నఖచిత బంగారు గండపెండేరాన్ని,లక్ష్మీ దేవి బంగారు కడియాన్ని,సరస్వతి దేవి రత్న ఖచిత దండ కడియాన్ని, రంభకు బహూకరించారు. ఇంకా చాలా మంది దేవతలు రంభకు బహుమతులు ఇచ్చారు.
రంభ తన గౌరవాన్ని నిలబెట్టిందని తలచిన ఇంద్రుడు, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు రంభ ఇంద్రుని వలన తనకు పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించమని కోరింది. అది విన్న సభాసదులందరూ కరతాళధ్వనులతో తమ ఆమోదాన్ని తెలిపారు. ఆమె కోరిక తీరేందుకు ఇంద్రుడు సకల దేవతల సాక్షిగా రంభ సహితంగా నందన వనానికి వెళ్ళాడు.
ఈ వ్యవహారమంతా దేవగురు బృహస్పతికి నచ్చలేదు. ఆవేశాన్ని అణుచుకోలేకపోయిన దేవగురువు ,నేరుగా నందన వనానికి వెళ్ళి,సరస సల్లాపాలలో మునిగి ఉన్న ఇంద్రుని పైకి తన కమండలాన్ని విసిరిగొట్టాడు. అప్పటికీ అతని ఆవేశం చల్లారకపోవడంతో దేవేంద్రుని రత్నకిరీటం కిందకు పడేంతగా కొట్టాడు. ఇంద్రుడిని భూలోకంలో ఆటవిక బందిపోటుగా జన్మించమని శపించాడు. తన వలన ఇంద్రుని శపించవలదని రంభ కోరినప్పటికి బృహస్పతి వినకపోవడంతో, రోషావేశపూరితమైన రంభ దేవ గురువుని నీచ జన్మ ఎత్తమని శపిస్తుంది.
ఈ లోపు అటుగా వచ్చిన నారదుడు విషయాన్ని గ్రహించి, ముగ్గురుని త్రిమూర్తుల వద్దకు తీసుకొని వెళ్ళాడు. ఈ శాపాలు అందరు అనుభవించవలసిందే అని తెలిశాక, ఇంద్రుడు భోరున విలపించసాగాడు. దీనముగా వేడుకున్నాడు.
ఇంద్రుని దుఃఖాన్ని చుసిన కరుణాపూరితుడైన విష్ణుభగవానుడు అతనిని ఓదార్చి, తను భూలోకంలో అవతరించి శాపవిమోచనాన్ని ప్రసాదించగలనని చెప్పాడు. విష్ణువు మాటలు విన్న లక్ష్మీ దేవి " స్వామి గురువుశిష్యులు ఇద్దరు పరస్పర వివేకశూన్యులై శపించుకుంటే , ఆ శాపవిమోచనానికి మీరు భూలోకంలో అవతరించడం దేనికి...రామ అవతారంలో పడిన కష్టాలు చాలవా? " అని అడిగింది.
తాను ద్వాపరయుగాంతంలో దుర్వాసుని శాపంవల్ల బాధితురాలైన ఓ గొల్ల భామకు వరం ఇవ్వడమే కారణమని పేర్కొన్నాడు.
అలా శ్రీ మహవిష్ణువు భూలోక అవతార వెనుక చాల కథలు ఉన్నాయి...అందులో ఇది ఒకటి!
6TH DAY PASURAMU
6 వ రోజు - స్థిత ప్రజ్ఞుల దశ
ఆండాళ్ తిరువడిగలే శరణం
పాశురము
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్
ఈ రోజు నుండి మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపబాలికలను లేపడం ప్రారంభిస్తుంది. మనకో సందేహం రావచ్చు. శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికేమో నిద్ర పట్టడంలేదు, వెంటనే శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంటే మరి కొందరెలా నిద్ర పోతున్నారని మనకు అనిపించవచ్చు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. భగవంతుని గుణాలు, ప్రేమ అనేవి ఒక మత్తు మందులాంటివి. అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కోలా పనిచేసి కొందరికి నిద్రమత్తులో ఉంచేట్టు చేసాయే తప్ప వారికి శ్రీకృష్ణ ప్రేమ తక్కువని కాదు అని గమనించాలి. పైగా వారు సాత్విక నిద్రలో ఉన్నారు, మన నిద్ర లాంటి తామసిక నిద్ర కాదు అని గుర్తించాలి.
శ్రీకృష్ణ పరమాత్మ రేండో అధ్యాయమంలో స్థితప్రజ్ఞుల గురించి చెప్పాడు. వారు ఎలా ఉంటారంటే అందరూ మేల్కొనే వద్ద వాల్లు పడుకొని ఉంటారు, అందరు పడుకొనే వద్ద వాల్లు మెలుకువగా ఉంటారు. సామన్యులు శారీరక సుఖాలలో మెలుకువై ఉంటారు. మరి ఏ జ్ఞానం లేకుండా ఉన్నది దేనిలో అంటే లోపల ఉండే మన విషయంలో, వెనకల ఉండి నడిపే వాడి విషయంలో జ్ఞానం శూన్యం. ప్రాపంచిక విషయాల్లో చాలా జ్ఞానం కల్గి ఉంటారు. మరి జ్ఞాణులేమో ప్రాపంచిక విషయాలు అంతగా పట్టించుకోకుండా, భగవంతుని విషయంలో జాగరూపులై ఉంటారు. ఆలోపల ఉండే గోపికలూ అట్లాంటివారే. అందుకే మనం వాళ్ళను మన తోడుపెట్టుకొని భగవంతుని దగ్గరకు వెలితే తప్ప భగవంతుడు మనకేసి చూడడు. అలా భగవంతుని విషయంలో నిమగ్ఞమై ఉన్న ఒక పది మంది గోపికలను లేపుతూ భగవత్ జ్ఞాన దషల్లోని ఒక్కొక్క స్థితిని మనకు చూపిస్తూ మన ఆండాళ్ తల్లి మనకున్న పొరల్ని తొలగిస్తుంది. అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహాన్ని పొందే యోగ్యత సంప్రాప్తిస్తుంది.
ఈ రోజు లేపే గోపబాలిక ఒక చిన్ని పిల్ల. చిన్నపిల్లలు మనసులో చేతల్లో ఒకేరకమైన భావం కల్గి ఉంటారు. అలాంటి ఒక గోపబాలికను లేపుతూ "పుళ్ళుం శిలమ్బిన కాణ్ " పక్షులు అరుస్తున్నాయ్ లేవవోయ్. భౌతిక జీవితంలోనైనా అంతరమైన జ్ఞాన జీవితంలోనైన పక్షుల అరుపులే మనల్ని రక్షించేవి. అంటే రెండు రెక్కల పక్షులు మనకు తెల్లవారడాన్ని సూచించినట్లే, జ్ఞానము దానికి ఉచితమైన ఆచరణ అనే రెండు రెక్కలతో ఆకాశము అంటే అంతటా వ్యాపించి ఉన్న భగవతత్వములో విహరించే మహానుభావుల పలుకులు, మనల్ని అజ్ఞానములోంచి బయటకు తెచ్చే పక్షుల అరుపులు అవే. అందుకే మనవాల్లు ఒక గుర్తుగా చెప్పారు.
లోపల గోపబాలిక వీళ్ళు చేసే అల్లరికి పక్షులు లేచి ఉంటాయి అని భావించినట్లుంది, మనవాళ్ళు రెండో గుర్తు చెప్పడం ప్రారంభించారు "పుళ్ళరైయన్ కోయిల్ వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో పిళ్ళాయ్! " ఆ ఊరిలో ఉండే పక్షిరాజు అయిన గరుత్మంతుని స్వామి - విష్ణు ఆలయంలో తెల్లని పిలుపు శంఖం ద్వని కుడా వినిపించడం లేదా ఓ చిన్నపిల్లా అని అంటుంది. అక్కడి దీప కాంతి శంఖం ఊదే వాడి బుగ్గలపై పడి శంఖం మెరుస్తుందని అండాళ్ తల్లి ఆలయ సన్నివేశాన్ని భావిస్తూ - తెల్లని పిలుపు శంఖం అని వర్ణిస్తుంది. శంఖం ఓంకారానికి సంకేతంగా పోలుస్తారు. లోపలుండే గోపబాలిక అది జాము జాముకు వినిపించే ధ్వని ఇంకా తెల్లవారలేదన్నట్లుగా భావించి ఇంకా నిద్ర లేవలేదు. "ఎళుందిరాయ్"- మేలుకో. మరి అండాళ్ తల్లి తాను ఎలా మేలుకొందో కొన్ని గుర్తులు చెబుతుంది. "మునివర్గ ళుం యోగిగళుం మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం ఉళ్ళం పుగుందు కుళిరుంద్" ముణులూ,యోగులూ మెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి-హరి-హరి అంటూ అనుకునే శబ్దం ఒక్కసారిగా పెద్దగావినిపించి మా చెవులను చేరి ఒక్కసారిగా లేచాం, నీకు వినబడలేడా! మరి వాల్లు మూడు సార్లు హరినామం ఎందుకు అన్నారో అండాళ్ తల్లి వివరిస్తుంది.
"పేయ్ములై నంజుండు" పూతన స్తనాలకు అంటి ఉన్న విషాన్ని ఆరగించాడు- దూదిపింజ నిప్పుపై పడి కాలిపోయినట్లు ఆమెను సంహరించాడు - వదలని వాడు కాబట్టే ఆయనను అచ్యుత అని అంటారు. ప్రకృతి మనకు ఇచ్చే "ఆహం-మన" అనే విషాలను హరించేవాడా - హరి అని జ్ఞానులు తలుస్తున్నారు.
"కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి" శ్రీ కృష్ణుని తల్లి యశోదమ్మ ఒక బండి క్రింద పడుకోబెట్టింది, ఒక అసురుడు బండిపై ఆవహించి శ్రీ కృష్ణుని సంహరించాటానికి చూసాడు. కపట శకటాసురున్ని కాలుజాచి సంహరించాడు. ఆయన పాదం అలాంటిది. ఈ శరీరం మనకు ఒక శకటం లాంటిది, పుణ్య-పాపాలు దాని చక్రాలవంటివి, మనల్ని నడిపించే పరమాత్మను దానిక్రింద పెట్టి ఆయన పాదాలను- చరణౌ శరణం ప్రపద్యే అంటే చాలు- మనకు అంటి ఉన్న పుణ్య-పాప సంపర్కాన్ని హరించువాడా - హరి.
"వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై ఉళ్ళత్తు క్కొండు" - ఆదిశేషువుపై సుకుమారంగా పవళించి ఉన్న జగత్తుకు బీజమైన స్వామి. అయిదు తలల ఆదిశేషువు - అయిదు రకాల జ్ఞానములను తెలియ జేస్తుంది. నేను వాడికి చెందిన వాన్ని, వాడు నన్ను తరింపచేయువాడు, వాన్ని చేరే సాధనం వాడి శరణాగతే, వాన్ని చేరితే కలిగే ఫలితం వాని సేవ, వాన్ని చేరకుండా ఉంచే ఆటకం వానియందు రుచిలేకుండుట అనే అయిదు జ్ఞానాలు కల్గి ఉండే వారి హృదయాల్లో ఉంటాడు స్వామి. ఇతరమైన వాటిపై రుచి హరింపచేసినవాడా- హరి. అంటూ మూడు సార్లు హరి అని పిలుస్తుంటే లేచామని తెలుపుతూ అండాళ్ తల్లి గోప బాలికను లేపింది.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం
UTTHARA DWARA DARSANAM - VYKUNTA EKADASI
వైకుంఠ ఏకాదశి...రోజున ....ఎందుకైంది అంత పవిత్రం ఈ రోజు? ఎందుకు పరమాత్మ ఉత్తర ద్వారంలోంచే రావాల్సి వచ్చింది, తూర్పు ద్వారం లేదా ? ఏ కారణం చేత ఉత్తర ద్వారం తెరువాల్సి వచ్చింది ?
ఈ విషయాన్ని మనకు శ్రీపాంచరాత్ర ఆగమ సంహితల్లో శ్రీప్రశ్నం అనే ఒక సంహిత ఒక అందమైన విషయాన్ని తెలియజేస్తుంది. ఒకనాడు భగవంతుడు సృష్టి చేద్దాం అని అనుకున్నాడు. సృష్టి అనేది ఆయన నేరుగా చేయడు. సృష్టి అనేది రెండు విడుతలుగా చేస్తాడు, కొంత తాను నేరుగా చేస్తాడు, మిగతాది ఒకరి ద్వారా చేయిస్తాడు. తాను మొదట ముడిపదార్థాన్ని తయారుచేసి ఇస్తాడు. దాన్ని తయారుచేసే విధానం ఇతరులకు రహస్యంగానే ఉంచుతాడట. దాన్ని తయారుచేసే విధానం వేదాల్లో ఉంటుంది, కానీ దాన్ని అర్థం చేసుకొవడం ఎవ్వరికీ రాదట. పాలకడలిలో పవలించి ఉన్న పరందాముడికి మాత్రమే తెలుసు ఆ రహస్యం. కావల్సిన భోగ, భోగ్య, భోగ ఉపకరన వస్తువులని తయారుచేసి, తన నాభిలోంచి బ్రహ్మగారిని బయటకు తీస్తాడు. అంటే సృష్టికి అవసరమైన పంచభూతాలని, కావల్సిన వస్తువులని తయారుచేసి, ఇకపై సృష్టి చేయడానికి బ్రహ్మగారిని నిర్ణయించుకుంటాడు. ఆయనకు వేదం చెప్పి సుర నర తిర్యక్ స్థావరాలను సృజింపజేస్తాడు. బ్రహ్మగారికి సంశయాలు ఏర్పడితే తొలగిస్తూ ఉంటాడు వేద ఉపదేశం ద్వారా. అయితే అప్పుడప్పుడు బ్రహ్మగారు పరాక్కు వల్ల వేదాన్ని కోల్పోతే తాను ఆయా పరిస్థితి బట్టి ఒక సారి చేపవలె, ఒక సారి హంసవలె , ఒకసారి గుఱ్ఱంవలే ఎన్నో రూపాలు దాల్చి వేద ఉపదేశం చేసాడు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక్కో కల్పం ఆరంభం అయినప్పుడు ఒక్కో సారి వేదోపదేశం చేస్తాడు పరమాత్మ. అయితే వేదాన్ని కొంత అశ్రద్దతో వింటే, జరిగే సృష్టిలో కొంత తప్పులు ఏర్పడుతాయి. బ్రహ్మ గారు చేసే అశ్రద్ద గురించి శ్రీసుఖ మహర్షి పరిక్షిత్తుతో చెబుతాడు భాగవతంలో. ఇట్లా బ్రహ్మగారికి వేద ఉపదేశం అనేది ఎన్నో సార్లు చేస్తాడు పరమాత్మ.
ఇట్లా ఒకసారి బ్రహ్మ గారు పరాక్కుతో విన్నాడట. అప్పుడు ఆయన చెవుల్లోంచి ఇద్దరు వచ్చారట. వారి పేర్లు మధు మరియూ కైతభ. విజ్ఞానాన్ని మనం చైతన్య మూర్తులని భావిస్తాం. బ్రహ్మ గారికి ఉపదేశం చేసిన వేదం మానవ అకృతి దాల్చి ఉన్న నలుగురు బాలరవలె ఉందట. ఆ నలుగురిని ఎత్తుకొని ఈ మధు కైతభ అనే అసురులు వెళ్ళిపోయారు. వారిని సముద్రంలో దాచి ఉంచారు. భగవంతుడు బ్రహ్మగారికి ఉపకారం చేయడానికి మశ్చ్య రూపం దాల్చి వారితో పోరాడాడు, అయితే వారు పుట్టింది సరియైన సృషి కార్యంలో కాదు, వారు అసురీ ప్రవృత్తి కల్గి ఉన్నారు. ఎంతకూ చావడం లేదు. అయితే ఇంత దెబ్బలాట ఎందుకు అని భగవంతుడు వారిని వేదాలను అందిస్తే ఒక వరం ఇస్తా అని చెప్పాడు. దానికి తోడు మరొక వరం వారే అడిగారు. అందుకు ఒప్పుకున్నాడు పరమాత్మ. మొదటి వరంగా భగవంతుణ్ణి తమకు మోక్షాన్ని ప్రసాదించమని అడిగారు. అసుర ప్రవృత్తి కలవారికి మోక్షం ఎలా వస్తుంది. మోక్షానికి ఒక మార్గం ఉంది. పరమపదానికి వెళ్ళాలంటే అర్చిరాది మార్గాల్లో ఇలా పన్నెండు లోకాలని దాటుతూ విరజానది దాటి ఐరంమదం అనే సరస్సులో అలంకరించుకొని కదా వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ పరమాత్మ ఏర్పర్చినవే కానీ నియమాలని ఆయన కూడా గౌరవిస్తాడు. మనం ఆడే ఆటల్లో నియమాల్ని మనమే పెట్టుకుంటాం, నియమాలని విడిచి ఆడే ఆటలో ఉత్సాహం అనేది ఉండదు. అట్లానే భగవంతుడు తాను ఏర్పచిన నియమాలని విస్మరించడు. కానీ ఈ అసురులు ఇద్దరూ మోక్షం కావాలనే కోరారు. అందుకు భగవంతుడు ఒక సులభమైన ఒక ఉపాయం వెతుకున్నాడు. వైకుంఠానికి ఉత్తరం వైపు ద్వారాలని తెరిపించి ఆయన వచ్చి వారిని స్వీకరించేందుకు ఒప్పుకున్నాడు. అసలు మోక్షాన్ని ఎవరు కోరుతారు. మన వాంగ్మయాలు, వేదాలు జీవుడు చేరాల్సిన ఒక ఆనంద స్థితి అనేది ఉంది అని చెబుతున్నాయి. భగవంతుడు చేసిన ఉపదేశాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. ఎన్ని చెప్పినా మనం మనమే. భగవంతుని నిత్య నిలయాన్ని చేరాలి అనే ద్యాస మనకు లేదు. ఒక్క జన్మ కాదు, కోట్ల జన్మలు ఆయన ఇస్తూనే ఉన్నాడు. మనం ఈ సంసార ప్రవాహంలోంచి బయట పడాలని కోరిక అంత కంటే లేదు. సర్వ వ్యాపి అయిన నారాయణుడు ఉండేది ఎంత దూరం మనకు, కానీ మనం ఆయన సొత్తు అని ఒప్పుకోం. అసురులైనప్పటికీ వారు కోరిన కోరిక సరియైనది అని భగవంతుడు ఎంతో సంతోషించాడు. విభువైన భగవంతునికి మనపై ఉండే ప్రేమ అంత. అందుకు వారు సంతోషించి వేదాలని తిరిగి ఇచ్చారు. వారు మరొక వరం కోరుకున్నారు. వారు కోరిన వరాన్ని చూస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. భగవన్! మామీద ఉండే దయ చేత మాకు ఇంత ఉపకారం చేస్తున్నావే, ఈ రోజు ఈ విషయాన్ని తలచుకున్నా, నీవు ఉత్తర ద్వారంలో వస్తుంటే చూస్తారో వారికి కూడా మోక్షాన్ని ఇవ్వు అని కోరారు. వారు అసురులైనప్పటికీ ఎంత ఉత్తములు అనేది తెలుస్తుంది. భగవంతుడి ముఖం వికసించింది. ఈ వైభవాన్ని తలచినా, భగవంతుణ్ణి ఉత్తర ద్వారంలోంచి వస్తుంటే చూసినా వారికి మోక్షం నిశ్చయం అని భగవంతుడు వరం ఇచ్చాడు.
అయితే పరమపదంలో ఉన్న స్వామిని మనం ఎట్లా చూడగలం. అయితే భగవంతుడు ఉండేది ఐదు స్థానాల్లో. పరమపదంలో ఆయనే ఉంటాడు. పాలకడలిలో ఆయనే ఉంటాడు. అవతారాల్లో ఆయనే ఉంటాడు. మనలో అంతర్యామిగా ఆయనే ఉంటాడు. ఈ నాలుగు స్థానాలు అందరికీ ఉపకరించవు. అతి సామాన్యులకు కూడా అందుబాటులోకి రావడానికే విగ్రహ రూపంలో ఉంటాడు. పరమపదంలోని స్వామికి అర్చా మూర్తికి తేడా లేదు అని పాంచరాత్ర ఆగమాలు తెలిపాయి. అందుకోసమే ఈ రోజు ఆలయాల్లో స్వామి ఉత్తర ద్వారం ద్వార బయటికి వచ్చి మండపంలో ఉన్న భక్తులని తీసుకొని తిరిగి ఉత్తర ద్వారం గుండానే లోనికి వెళ్తాడు. అట్లా వచ్చే స్వామిని సేవిస్తే చాలు. భూమి మీద మొదటగా అవతరించిన అర్చా మూర్తి అయిన శ్రీరంగనాథుడు కూడా బయటికి వచ్చి భక్తులని తరింపజేస్తాడు. అట్లానే అనేక స్థానాల్లో స్వామి వేంచేసి ఉన్నాడు అనేక ఆలయాల్లో, స్వామి ఉన్న గర్భాలయాన్ని పరమపదం అనే భావిస్తారు. స్వామి అర్చా రూపంలో వచ్చినా ఆయన పూర్ణత్వంలో లోటు ఉండదు. అట్లా వచ్చే స్వామిని సేవించుకుంటే చాలు తరించిపోతాం. దానికి తోడు ఆయన నామాల్ని పాడుతే ఆయనెంతో సంతోషిస్తాడు.
ఈ విషయాన్ని మనకు శ్రీపాంచరాత్ర ఆగమ సంహితల్లో శ్రీప్రశ్నం అనే ఒక సంహిత ఒక అందమైన విషయాన్ని తెలియజేస్తుంది. ఒకనాడు భగవంతుడు సృష్టి చేద్దాం అని అనుకున్నాడు. సృష్టి అనేది ఆయన నేరుగా చేయడు. సృష్టి అనేది రెండు విడుతలుగా చేస్తాడు, కొంత తాను నేరుగా చేస్తాడు, మిగతాది ఒకరి ద్వారా చేయిస్తాడు. తాను మొదట ముడిపదార్థాన్ని తయారుచేసి ఇస్తాడు. దాన్ని తయారుచేసే విధానం ఇతరులకు రహస్యంగానే ఉంచుతాడట. దాన్ని తయారుచేసే విధానం వేదాల్లో ఉంటుంది, కానీ దాన్ని అర్థం చేసుకొవడం ఎవ్వరికీ రాదట. పాలకడలిలో పవలించి ఉన్న పరందాముడికి మాత్రమే తెలుసు ఆ రహస్యం. కావల్సిన భోగ, భోగ్య, భోగ ఉపకరన వస్తువులని తయారుచేసి, తన నాభిలోంచి బ్రహ్మగారిని బయటకు తీస్తాడు. అంటే సృష్టికి అవసరమైన పంచభూతాలని, కావల్సిన వస్తువులని తయారుచేసి, ఇకపై సృష్టి చేయడానికి బ్రహ్మగారిని నిర్ణయించుకుంటాడు. ఆయనకు వేదం చెప్పి సుర నర తిర్యక్ స్థావరాలను సృజింపజేస్తాడు. బ్రహ్మగారికి సంశయాలు ఏర్పడితే తొలగిస్తూ ఉంటాడు వేద ఉపదేశం ద్వారా. అయితే అప్పుడప్పుడు బ్రహ్మగారు పరాక్కు వల్ల వేదాన్ని కోల్పోతే తాను ఆయా పరిస్థితి బట్టి ఒక సారి చేపవలె, ఒక సారి హంసవలె , ఒకసారి గుఱ్ఱంవలే ఎన్నో రూపాలు దాల్చి వేద ఉపదేశం చేసాడు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక్కో కల్పం ఆరంభం అయినప్పుడు ఒక్కో సారి వేదోపదేశం చేస్తాడు పరమాత్మ. అయితే వేదాన్ని కొంత అశ్రద్దతో వింటే, జరిగే సృష్టిలో కొంత తప్పులు ఏర్పడుతాయి. బ్రహ్మ గారు చేసే అశ్రద్ద గురించి శ్రీసుఖ మహర్షి పరిక్షిత్తుతో చెబుతాడు భాగవతంలో. ఇట్లా బ్రహ్మగారికి వేద ఉపదేశం అనేది ఎన్నో సార్లు చేస్తాడు పరమాత్మ.
ఇట్లా ఒకసారి బ్రహ్మ గారు పరాక్కుతో విన్నాడట. అప్పుడు ఆయన చెవుల్లోంచి ఇద్దరు వచ్చారట. వారి పేర్లు మధు మరియూ కైతభ. విజ్ఞానాన్ని మనం చైతన్య మూర్తులని భావిస్తాం. బ్రహ్మ గారికి ఉపదేశం చేసిన వేదం మానవ అకృతి దాల్చి ఉన్న నలుగురు బాలరవలె ఉందట. ఆ నలుగురిని ఎత్తుకొని ఈ మధు కైతభ అనే అసురులు వెళ్ళిపోయారు. వారిని సముద్రంలో దాచి ఉంచారు. భగవంతుడు బ్రహ్మగారికి ఉపకారం చేయడానికి మశ్చ్య రూపం దాల్చి వారితో పోరాడాడు, అయితే వారు పుట్టింది సరియైన సృషి కార్యంలో కాదు, వారు అసురీ ప్రవృత్తి కల్గి ఉన్నారు. ఎంతకూ చావడం లేదు. అయితే ఇంత దెబ్బలాట ఎందుకు అని భగవంతుడు వారిని వేదాలను అందిస్తే ఒక వరం ఇస్తా అని చెప్పాడు. దానికి తోడు మరొక వరం వారే అడిగారు. అందుకు ఒప్పుకున్నాడు పరమాత్మ. మొదటి వరంగా భగవంతుణ్ణి తమకు మోక్షాన్ని ప్రసాదించమని అడిగారు. అసుర ప్రవృత్తి కలవారికి మోక్షం ఎలా వస్తుంది. మోక్షానికి ఒక మార్గం ఉంది. పరమపదానికి వెళ్ళాలంటే అర్చిరాది మార్గాల్లో ఇలా పన్నెండు లోకాలని దాటుతూ విరజానది దాటి ఐరంమదం అనే సరస్సులో అలంకరించుకొని కదా వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ పరమాత్మ ఏర్పర్చినవే కానీ నియమాలని ఆయన కూడా గౌరవిస్తాడు. మనం ఆడే ఆటల్లో నియమాల్ని మనమే పెట్టుకుంటాం, నియమాలని విడిచి ఆడే ఆటలో ఉత్సాహం అనేది ఉండదు. అట్లానే భగవంతుడు తాను ఏర్పచిన నియమాలని విస్మరించడు. కానీ ఈ అసురులు ఇద్దరూ మోక్షం కావాలనే కోరారు. అందుకు భగవంతుడు ఒక సులభమైన ఒక ఉపాయం వెతుకున్నాడు. వైకుంఠానికి ఉత్తరం వైపు ద్వారాలని తెరిపించి ఆయన వచ్చి వారిని స్వీకరించేందుకు ఒప్పుకున్నాడు. అసలు మోక్షాన్ని ఎవరు కోరుతారు. మన వాంగ్మయాలు, వేదాలు జీవుడు చేరాల్సిన ఒక ఆనంద స్థితి అనేది ఉంది అని చెబుతున్నాయి. భగవంతుడు చేసిన ఉపదేశాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. ఎన్ని చెప్పినా మనం మనమే. భగవంతుని నిత్య నిలయాన్ని చేరాలి అనే ద్యాస మనకు లేదు. ఒక్క జన్మ కాదు, కోట్ల జన్మలు ఆయన ఇస్తూనే ఉన్నాడు. మనం ఈ సంసార ప్రవాహంలోంచి బయట పడాలని కోరిక అంత కంటే లేదు. సర్వ వ్యాపి అయిన నారాయణుడు ఉండేది ఎంత దూరం మనకు, కానీ మనం ఆయన సొత్తు అని ఒప్పుకోం. అసురులైనప్పటికీ వారు కోరిన కోరిక సరియైనది అని భగవంతుడు ఎంతో సంతోషించాడు. విభువైన భగవంతునికి మనపై ఉండే ప్రేమ అంత. అందుకు వారు సంతోషించి వేదాలని తిరిగి ఇచ్చారు. వారు మరొక వరం కోరుకున్నారు. వారు కోరిన వరాన్ని చూస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. భగవన్! మామీద ఉండే దయ చేత మాకు ఇంత ఉపకారం చేస్తున్నావే, ఈ రోజు ఈ విషయాన్ని తలచుకున్నా, నీవు ఉత్తర ద్వారంలో వస్తుంటే చూస్తారో వారికి కూడా మోక్షాన్ని ఇవ్వు అని కోరారు. వారు అసురులైనప్పటికీ ఎంత ఉత్తములు అనేది తెలుస్తుంది. భగవంతుడి ముఖం వికసించింది. ఈ వైభవాన్ని తలచినా, భగవంతుణ్ణి ఉత్తర ద్వారంలోంచి వస్తుంటే చూసినా వారికి మోక్షం నిశ్చయం అని భగవంతుడు వరం ఇచ్చాడు.
అయితే పరమపదంలో ఉన్న స్వామిని మనం ఎట్లా చూడగలం. అయితే భగవంతుడు ఉండేది ఐదు స్థానాల్లో. పరమపదంలో ఆయనే ఉంటాడు. పాలకడలిలో ఆయనే ఉంటాడు. అవతారాల్లో ఆయనే ఉంటాడు. మనలో అంతర్యామిగా ఆయనే ఉంటాడు. ఈ నాలుగు స్థానాలు అందరికీ ఉపకరించవు. అతి సామాన్యులకు కూడా అందుబాటులోకి రావడానికే విగ్రహ రూపంలో ఉంటాడు. పరమపదంలోని స్వామికి అర్చా మూర్తికి తేడా లేదు అని పాంచరాత్ర ఆగమాలు తెలిపాయి. అందుకోసమే ఈ రోజు ఆలయాల్లో స్వామి ఉత్తర ద్వారం ద్వార బయటికి వచ్చి మండపంలో ఉన్న భక్తులని తీసుకొని తిరిగి ఉత్తర ద్వారం గుండానే లోనికి వెళ్తాడు. అట్లా వచ్చే స్వామిని సేవిస్తే చాలు. భూమి మీద మొదటగా అవతరించిన అర్చా మూర్తి అయిన శ్రీరంగనాథుడు కూడా బయటికి వచ్చి భక్తులని తరింపజేస్తాడు. అట్లానే అనేక స్థానాల్లో స్వామి వేంచేసి ఉన్నాడు అనేక ఆలయాల్లో, స్వామి ఉన్న గర్భాలయాన్ని పరమపదం అనే భావిస్తారు. స్వామి అర్చా రూపంలో వచ్చినా ఆయన పూర్ణత్వంలో లోటు ఉండదు. అట్లా వచ్చే స్వామిని సేవించుకుంటే చాలు తరించిపోతాం. దానికి తోడు ఆయన నామాల్ని పాడుతే ఆయనెంతో సంతోషిస్తాడు.
HEALTH BENEFITS WITH BEET ROOT IN TELUGU
బీట్ రూట్ గురించి పూర్తి వివరణ
************************** ******
బీట్ రూట్ రూట్ శాస్త్రీయ నామము " beta vulgaris" . ఆకులు , దుప , రెండు తినేందుకు వాడతారు . టేబుల్ షుగర్ తయారీలో బీటు దుంపను వాడుదురు . "batanins " అనే పదార్ధము తో పేస్టు , జాం , ఐస్ క్రీం వంటి వాటి కలర్ ను ఇంప్రూవ్ చేయడానికి పనివచ్చును . శక్తినిచ్చే శాకందుంపల్లో బీట్రూట్ది ప్రత్యేక స్థానం. ఇది కనులకు ఇంపుగా కనిపించడమే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. ఎనీమియాతో బాధపడేవారు రోజూ ఒక కప్పుడు బీట్రూట్ రసం తాగితే త్వరగా కోలుకుంటారు.
ఆకృతిని బట్టి దీనిలో ఎన్నో రకాలు ఉన్నాయి . యూరప్ లోని మెడిటరేనియన్ ప్రాంతం లేదా పశ్చిమ ఆసియా ప్రాంతానికి చెందినదిగా భావిస్తారు . గత రెండువేల సంవత్సరాలుగా కూరగా వాడుతున్నారు . ప్రాచీన గ్రీకులు , రోమన్లు కూరగాయగా వాడినట్లు చెప్తారు . అక్కడ నుండి ఇంగ్లండ్ , ప్రాన్స్ , జర్మనీ లకు రొమన్ల ద్వారా చేరింది . మనదేశం లో అన్ని ప్రదేశాలలో విసృతం గా సాగుచేస్తున్నారు .
వైద్య పరంగా
************
1 . డయాబెటిక్ లివర్ ను కాపాడును ,
2 . కొలెస్టిరాల్ ను తగ్గించును ,
3 . మలబద్దకం ను నివారించును ,
4 . బీట్ రూటు రసము రక్తపోటును తగ్గించు .
5 . బోరాన్ ఎక్కువగా ఉన్నందున "aphrodisiac "గా సెక్స్ హోర్మోన్స్ ఎక్కువచేయును .
6 . కొంతవరకు కాన్సర్ నివారణ కు ఉపయోగ పడును .
అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? అయితే బీట్రూట్ రసాన్ని తాగండి. ఎందుకంటే ఇది అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందులోని నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్ ఆక్సైడ్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువు రక్తనాళాలను విప్పారేలా చేసి రక్తపోటు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. కాబట్టి రోజూ 250 మి.గ్రా. పచ్చి బీట్రూట్ రసాన్ని తాగితే మేలు జరుగుతుంది. బీట్రూట్లో కేవలం నైట్రేట్లు మాత్రమే కాదు.. విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలూ దండిగా ఉంటాయి. శరీరం క్యాల్షియాన్ని వినియోగించుకోవటంలో తోడ్పడే సైలీషియా సైతం ఉంది. బీట్రూట్కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్కు పేద్దపేగుల్లో క్యాన్సర్తో పోరాడే లక్షణం ఉంది.
పోషకాలు : 100 గ్రాములలో
************************** *
మాయిశ్చర్ ----87.7 శాతము , ప్రోటీన్లు -------1.7 %, ఖనిజాలు -----0.8%, పీచు --------0.9% కార్బోహైడ్రేట్స్ -8.8%, కాల్సియం ----18 మి.గ్రా. శాతము , ఫాస్పరస్ -----55 మి.గా %, ఇనుము -----1.0 మి.గా%, జింక్ --------0.2% , థయామిన్---0.04%, రిబోఫ్లేమిన్---0.09%, నియాసిన్----0.4 మి.గా %, విటమిన్ సి --10% , కాలరీస్ -----43 కేలరీలు ,
సౌందర్యానికి రూట్ విటమిన్ బి దండిగా ఉండే బీట్రూట్ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడారకుండానూ చూస్తుంది. వీటిల్లోని బీటేన్ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది. రోజుకి ఓ చిన్న గ్లాసుడు బీట్రూట్ రసం తాగితే రక్తపోటు తగ్గటానికి దోహదం చేస్తుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్రూట్ తోడ్పడుతుంది. గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది కూడా. హార్ట్ బీట్ రూట్ సహజంగా లభించే పండ్లూ కాయగూరలూ తినడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తారు పోషకాహార నిపుణులు. అలాంటి వాటిలో బీట్రూట్ ఒకటి.
దీని లాభాలు ఎన్నో తెలుసా ?
************************** *
బీట్రూట్లో నైట్రేట్ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్ ఆక్సైడ్లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.
బీట్రూట్ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుందనీ, దీనివల్ల అనవసర ఆందోళనను దూరం చేసుకోవచ్చనీ ఇటీవల ఓ పరిశోధనలో తేలింది.
క్రీడాకారులు బీట్రూట్ జ్యూస్ తాగి పరిగెత్తినపుడు తక్కువ ఆక్సిజన్ తీసుకుంటారు. అందువల్ల త్వరగా అలసిపోరు.
ఓ తాజా పరిశోధన ప్రకారం రోజుకి 400మి.లీ. చొప్పున రెండ్రోజులు బీట్రూట్ జ్యూస్ తాగిన వృద్ధుల్లో మెదడు భాగంలో రక్త ప్రసరణ వేగం పెరిగి ఆలోచనల్లో చురుకుదనం కనిపించింది.
పరుగు వేగాన్ని పెంచే బీట్రూట్
పరుగు పోటీలో పాల్గొనేవారి వేగాన్ని, సామర్థ్యాన్ని బీట్రూట్ పెంచుతుంది. ఎందుకంటే ఇందులో నైట్రేట్లు ఉండటమేనని అమెరికాలోని లూయిస్ విశ్వవిద్యాలయ అధ్యయనం తెలిపింది. అధ్యయనం కోసం పరిశోధకులు ఆరోగ్యంగా ఉన్న 11 మంది స్త్రీ, పురుషులను ఎంపిక చేసుకున్నారు. వ్యాయామానికి గంట ముందు కాల్చిన బీట్రూట్లో కొద్ది భాగాన్ని తినాలని వారికి చెప్పారు. బీట్రూట్ తిన్న తర్వాత గంటకు సగటున వీరు 12.3 కిలోమీటర్లు ట్రెడ్ మిల్పై పరుగెత్తారు.
**************************
బీట్ రూట్ రూట్ శాస్త్రీయ నామము " beta vulgaris" . ఆకులు , దుప , రెండు తినేందుకు వాడతారు . టేబుల్ షుగర్ తయారీలో బీటు దుంపను వాడుదురు . "batanins " అనే పదార్ధము తో పేస్టు , జాం , ఐస్ క్రీం వంటి వాటి కలర్ ను ఇంప్రూవ్ చేయడానికి పనివచ్చును . శక్తినిచ్చే శాకందుంపల్లో బీట్రూట్ది ప్రత్యేక స్థానం. ఇది కనులకు ఇంపుగా కనిపించడమే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. ఎనీమియాతో బాధపడేవారు రోజూ ఒక కప్పుడు బీట్రూట్ రసం తాగితే త్వరగా కోలుకుంటారు.
ఆకృతిని బట్టి దీనిలో ఎన్నో రకాలు ఉన్నాయి . యూరప్ లోని మెడిటరేనియన్ ప్రాంతం లేదా పశ్చిమ ఆసియా ప్రాంతానికి చెందినదిగా భావిస్తారు . గత రెండువేల సంవత్సరాలుగా కూరగా వాడుతున్నారు . ప్రాచీన గ్రీకులు , రోమన్లు కూరగాయగా వాడినట్లు చెప్తారు . అక్కడ నుండి ఇంగ్లండ్ , ప్రాన్స్ , జర్మనీ లకు రొమన్ల ద్వారా చేరింది . మనదేశం లో అన్ని ప్రదేశాలలో విసృతం గా సాగుచేస్తున్నారు .
వైద్య పరంగా
************
1 . డయాబెటిక్ లివర్ ను కాపాడును ,
2 . కొలెస్టిరాల్ ను తగ్గించును ,
3 . మలబద్దకం ను నివారించును ,
4 . బీట్ రూటు రసము రక్తపోటును తగ్గించు .
5 . బోరాన్ ఎక్కువగా ఉన్నందున "aphrodisiac "గా సెక్స్ హోర్మోన్స్ ఎక్కువచేయును .
6 . కొంతవరకు కాన్సర్ నివారణ కు ఉపయోగ పడును .
అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? అయితే బీట్రూట్ రసాన్ని తాగండి. ఎందుకంటే ఇది అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందులోని నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్ ఆక్సైడ్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువు రక్తనాళాలను విప్పారేలా చేసి రక్తపోటు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. కాబట్టి రోజూ 250 మి.గ్రా. పచ్చి బీట్రూట్ రసాన్ని తాగితే మేలు జరుగుతుంది. బీట్రూట్లో కేవలం నైట్రేట్లు మాత్రమే కాదు.. విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలూ దండిగా ఉంటాయి. శరీరం క్యాల్షియాన్ని వినియోగించుకోవటంలో తోడ్పడే సైలీషియా సైతం ఉంది. బీట్రూట్కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్కు పేద్దపేగుల్లో క్యాన్సర్తో పోరాడే లక్షణం ఉంది.
పోషకాలు : 100 గ్రాములలో
**************************
మాయిశ్చర్ ----87.7 శాతము , ప్రోటీన్లు -------1.7 %, ఖనిజాలు -----0.8%, పీచు --------0.9% కార్బోహైడ్రేట్స్ -8.8%, కాల్సియం ----18 మి.గ్రా. శాతము , ఫాస్పరస్ -----55 మి.గా %, ఇనుము -----1.0 మి.గా%, జింక్ --------0.2% , థయామిన్---0.04%, రిబోఫ్లేమిన్---0.09%, నియాసిన్----0.4 మి.గా %, విటమిన్ సి --10% , కాలరీస్ -----43 కేలరీలు ,
సౌందర్యానికి రూట్ విటమిన్ బి దండిగా ఉండే బీట్రూట్ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడారకుండానూ చూస్తుంది. వీటిల్లోని బీటేన్ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది. రోజుకి ఓ చిన్న గ్లాసుడు బీట్రూట్ రసం తాగితే రక్తపోటు తగ్గటానికి దోహదం చేస్తుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్రూట్ తోడ్పడుతుంది. గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది కూడా. హార్ట్ బీట్ రూట్ సహజంగా లభించే పండ్లూ కాయగూరలూ తినడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తారు పోషకాహార నిపుణులు. అలాంటి వాటిలో బీట్రూట్ ఒకటి.
దీని లాభాలు ఎన్నో తెలుసా ?
**************************
బీట్రూట్లో నైట్రేట్ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్ ఆక్సైడ్లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.
బీట్రూట్ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుందనీ, దీనివల్ల అనవసర ఆందోళనను దూరం చేసుకోవచ్చనీ ఇటీవల ఓ పరిశోధనలో తేలింది.
క్రీడాకారులు బీట్రూట్ జ్యూస్ తాగి పరిగెత్తినపుడు తక్కువ ఆక్సిజన్ తీసుకుంటారు. అందువల్ల త్వరగా అలసిపోరు.
ఓ తాజా పరిశోధన ప్రకారం రోజుకి 400మి.లీ. చొప్పున రెండ్రోజులు బీట్రూట్ జ్యూస్ తాగిన వృద్ధుల్లో మెదడు భాగంలో రక్త ప్రసరణ వేగం పెరిగి ఆలోచనల్లో చురుకుదనం కనిపించింది.
పరుగు వేగాన్ని పెంచే బీట్రూట్
పరుగు పోటీలో పాల్గొనేవారి వేగాన్ని, సామర్థ్యాన్ని బీట్రూట్ పెంచుతుంది. ఎందుకంటే ఇందులో నైట్రేట్లు ఉండటమేనని అమెరికాలోని లూయిస్ విశ్వవిద్యాలయ అధ్యయనం తెలిపింది. అధ్యయనం కోసం పరిశోధకులు ఆరోగ్యంగా ఉన్న 11 మంది స్త్రీ, పురుషులను ఎంపిక చేసుకున్నారు. వ్యాయామానికి గంట ముందు కాల్చిన బీట్రూట్లో కొద్ది భాగాన్ని తినాలని వారికి చెప్పారు. బీట్రూట్ తిన్న తర్వాత గంటకు సగటున వీరు 12.3 కిలోమీటర్లు ట్రెడ్ మిల్పై పరుగెత్తారు.
Subscribe to:
Posts (Atom)