The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
SANKRANTHI FESTIVAL ARTICLE BY Bramhasri Samavedam Shanmukha Sarma
ఆంగ్లమాసం ప్రకారం సంక్రాంతి జనవరి నెలలో 14 లేక 15 తేదీలలో సూర్యగమనము ననుసరించి వస్తుంది. పుష్యమాసమున వచ్చు సంక్రాంతి మూడురోజుల పండుగలాగ జరుపుకొంటారు. మొదటిరోజున ప్రాతఃకాలమున భోగిమంటలతో ఈ పండుగ నారంభిస్తారు. ఆడపిల్లలు ఇళ్ళలో బొమ్మలకొలువులు ఏర్పరుస్తారు. ముత్తయిదువులనాహ్వానించి వారి ఆశీర్వాదమును పొందుతారు. రెండవరోజు ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఈ రోజున దానాదులను ఆచరిస్తారు. మూడవరోజు కనుమను పశువుల పండుగగా జరుపుకొనుట ఆచారంగా వస్తున్నది.
ఒక బీజమును నాటినపుడు అందుండి మొలక బయటకు వస్తుంది. అప్పటినుండి దానికవసరమగు రక్షణను నాటిన వారు కల్పించగా, అది ఏపుగా పెరిగి మనకవసరమైన పుష్పాలను గాని, కాయలు గాని ఇవ్వగలదు. అదిచ్చిన ఫలితమును చూచి మన కృషి ఫలించినదనే సంతృప్తి తప్పక ఉంటుంది కదా. అలాగే దంపతులు కూడ పుట్టిన పిల్లలను వారి పోషణకు తగినవి సమకూర్చుతూ జాతకర్మాదులను తీర్వహించి విద్యాబుద్ధులను నేర్పి పెంచినపుడు పైన చెప్పినట్లు తీగలు, చెట్లకు జ్వలె వారున పెంచిన వారికా ఆనందమును, తృప్తిని కలిగించాలి కదా. ఏ చెట్టుకాని, తీగకాని, తగిన శక్తిని గ్రహించిన తరువాత నా జీవితం నాదే అన్నట్లుండదు. పెంచిన వారి పట్ల కృతజ్ఞతతో ముందు చెప్పినట్లు కృతజ్ఞతా భావంతో తలలు వంచి అందుబాటులో ఉంటాయి. అలాగే పిల్లలు కూడా పెంచిన వారిపట్ల కృతజ్ఞతా భావంతో, వినయవిధేయలతో ఉండాలి.
ఇది అలవడాలంటే శాస్త్రాలలో చెప్పినట్లు వానిపై నమ్మకముండి, వాటిలో చెప్పినట్లు ఆయా కాలాలకు సంబంధించిన విధులను నిర్వర్తించాలి. తన కుటుంబానికి సుఖశాంతులను కలుగజేయాలి.
ఒకవేళ ఇవన్నీ చేయలేకపోయిన దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రమున చెప్పినట్లు నడచుకోవాలి. నాకే మంత్ర యంత్రములు తెలియవు. నిన్ను స్తుతించటం తెలియదు. ఆహ్వాన ధ్యానములును తెలియవు. నీ స్తుతి కథలు తెలియవు. నీ ముద్రలు తెలియవు. వ్యాకులతతో ఉన్నప్పుడు విలపించటం తెలియదు. కానీ మాతా! క్లేశమును హరింపజేసే నీ అనుసరణం మాత్రమే నేనెరుగుదును-అనాలి.
కాబట్టి నీవేమి చేయలేని స్థిిలో నున్నప్పుడు కనీసం ఆ దేవిననుసరించుటయైనా చేయాలి.
THIRUPPAVAI 29TH DAY PASURAMU IN TELUGU
తిరుప్పావై (శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు ఉన్) 29వ పాశురము
మార్గ శీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతి పై వర్షము నకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము . పెద్దల సంతృప్తికి తామూ స్నానము ఆచంరింతుమనియు, ఆ వ్రతమునకు పర అను వాద్యము కావలేననియు, బయలుదేరి శ్రీ కృష్ణుని చేరి , ఆ పర నిచ్చి తమకావ్రతమును పుర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను , పరమాన్న భోజనమును చేయింపుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి. కాని వారి హృదయగతమగు అభిప్రాయము మాత్రము అది కాదు . శ్రీ కృష్ణునితో కలసి మరి ఎడబాటు లేకుండా వానికి కింకర్యము చేయవలెనని కాంక్షిస్తున్నారు. స్నానమను చోట భగవదత్ప్రాప్తి యనియు పరయను చోట భగవత్ కైంకర్యము అనేది పరమ పురుషార్దము అని అభిప్రాయము వచ్చునట్లు వారిమ్తవరకు మాట్లాడుతున్నారు.
శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్
పొత్తామరైయడియే పోత్తుం పొరుళ్ కేళాయ్;
పెత్త మ్మేయ్ త్తుణ్ణు ఙ్కులత్తిల్ పిఱంద నీ
కుత్తేవ లెఙ్గ్ ళై క్కొళ్ళామల్ పోకాదు;
ఇత్తైప్పఱై కొళ్వా నన్ఱుకాణ్; గోవిందా ;
ఎత్తైక్కు మేళేళు పిఱ్ విక్కుం, ఉందన్నో
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శెయ్ వోం,
మత్తై నఙ్కా మఙ్గళ్ మాత్తే లో రెంబావాయ్
తాత్పర్యము:
బాగా తెల్లవారకముందే నీ వున్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి, బంగారు తామరపువ్వులవలె సుందరములు, స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ఫ్రయోజనమును వినుము, పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీనుండి పఱను పుచ్చుకొని పోవుటకు వచ్చినవారముకాము. ఏనాటికిని ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములయిన కోరికలేవియు లేకుండునట్లు చేయుము.
ఈ రోజు ఆండాళ్ తన వెంట ఉన్న గోపీ జనాలతో తను ఏం కోరి వచ్చిందో నీరూపించిన రోజు. మన వాళ్ళు మేం పరిశుద్దులమై వచ్చాం అని గతంలో రెండు సార్లు చెప్పారు, మేం ఏ ఇతర ఫలితాలు కోరి రాలేదు, ఏ ఉపాయాలు కూడా వాళ్ళ వద్ద లేవని నిన్న చెప్పారు. ఈరోజు స్వామి ముందర తమ ఆర్తిని ఆవిష్కరిస్తున్నారు. మేం రావడం సాధన కాదు, మా ఆర్తిని చూసైనా అనుగ్రహించాలని అనిపించటం లేదా అని అంటున్నారు. "శిత్తమ్ శిఱుకాలే" ఇంకా చీకటి తొలగని తెల తెల వారే సమయంలో "వంద్" మేం నీ దగ్గరికి వచ్చాం. మాలో ఆర్తి పెంచినది నీవే కదా, ఎంత కాలం నీవు చేసిన ఫలితమో ఇన్నాళ్ళకు మాకు ఈ జ్ఞానం కల్గింది. ఇది నీవు చేసిన కృపేకదా. "ఉన్నై చ్చేవిత్తు" అన్ని నీవు చేసినవాడివి, శభరి లాంటి వారికి నీవే వెళ్ళి అనుగ్రహించావు. కానీ మేం చేయాల్సి వస్తుంది. మేం నిన్ను సేవిస్తున్నాం. మనకున్న జ్ఞానంతో ఒక్క సారి మేం నీవాడమని చెప్పగల్గుతే, ఇది రాగ ప్రయుక్తం. "ఉన్ పొత్తామరై యడియే పోట్రుం" నీ పద్మాలవంటి ఆ దివ్యమైన పాదాలకు మంగళం పాడుతున్నాం.
"ఎం కించిత్ పురుషాదమం కటిపయ గ్రాణేశం అల్పార్దకం సేవాయ" ఈ లోకంలో అల్పమైన పురుషార్దం కోసం వాడి కున్న కొంత ఆస్తి చూసి వాడే నాయకుడని చుట్టూ, మరియు వీల్ల వాల్ల చుట్టూ తిరుగుతారే జనం ఎంత ఆశ్చర్యం కదా. "నాదేన పురుషోత్తమే త్రిజగతామే ఏకాధిపే చేతసా సేవ్యె సస్య పదస్య దాసరీ సురే నారాయణే తిష్టతి" సమస్త జీవులకు నాథుడై ఉన్న ఆ పురుషోత్తముడు ఆయన కదా, ఆయన ముల్లోకాలను నడిపేవాడు, చేతులు కట్టుకున్నా సరే ఒక్క సారి మనస్సులో నీవాడనని తెలిపినా ఆయన పరమ పదాన్ని ఇస్తాడు అని కులశేఖర ఆళ్వార్ చెప్పినట్లుగా, మేం నీ పాదాలను పాడటనికి వచ్చాం అని చెప్పారు.
ఆయన ఏం విననట్టుగా సుదీర్గమైన ఆలోచనలో పడి ప్రేమతో వీళ్ళకేసి చూస్తున్నాడు. "పొరుళ్ కేళాయ్" మేం ఎందుకు స్తుతిస్తున్నామో వినవయ్యా అంటూ ఆయనను తట్టి పాటం చెబుతోంది గోదా. ఆండాళ్ తల్లికి పాటం చెప్పడం అలవాటు కదా. ఆయనకీ పాటం చెప్పగలదు. "పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు" మొదట పశువులని మేపి అవి తిన్నాకగాని మేం తినేవాళ్ళం కాదు. నీకు మా స్వరూపం తెలియదా. మరి నీవేమి చేస్తున్నావు! మాకు ఆహారం నీ సేవయే, అది మాకు లభించాకే, ఆ తర్వాతే కదా నీవు ఆహారం తినాలి, "నీ కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు" నీ ఆంతరంగిక సేవకై మమ్మల్ని స్వీకరించవలసిందే. ఏదో వ్రత పరికరాలు అని అన్నారు ఇదిగో అని అక్కడ పెట్టాడు. "ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!" మేం ఎదో అడగాలని వాటిని అడిగాం, మేం కోరేవి ఇవికాదు. కేవలం మాట పట్టుకొని చూస్తావా, మా మనస్సులో ఏం ఉందో తెలియదా అని అడిగారు. నాకేం తెలియదు, నేను మీ గొల్లల్లో ఒకడినే కదా అని అన్నాడు శ్రీకృష్ణుడు.
"ఎత్తెక్కుం" ఎల్లప్పటికీ, ఈ కాలం ఆ కాలం అని కాదు, సర్వ దేశముల యందు, సర్వ అవస్తల యందు, "ఏరేర్ పిఱవిక్కుం" ఏడేడు జన్మలలో కూడా "ఉన్ తన్నో డుత్తోమేయావోం" నీతో సంబంధమే కావాలి. కాలాధీనం కాని పరమపదంలో ఉన్నామాకు నీ సంబంధమే ఉండాలి "ఉనక్కే నాం అట్చెయ్ వోం మత్తై నం కామంగళ్ మాత్త్" కేవలం నీ ఆనందం కోసమే మా సేవ అంకితమై ఉండాలి. తెలియక ఏదైన లోపం ఉంటే నీవే సరిదిద్దాలి, మాపై భారం వెయ్యవద్దు.
ఇలా వ్రతం ఆచరించిన అందరికి ఫలితం లభించింది. శ్రీకృష్ణ సమాగమం లభించింది, దీనికి సహకరించిన వారికి కోరినవి లభించాయి. ఈ రోజు పురుషార్థం పొందిన రోజు. ఈ రోజు స్వామి గోదాదేవిని రప్పించుకొని మానవ కన్యగా ఉన్న ఆమెను తాను విగ్రహరూపంలోనే వివాహమాడాడు. గోదాదేవి కోరిన వైభోగాన్ని పొందిన రోజు కనక "భోగి" అంటారు.
మార్గ శీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతి పై వర్షము నకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము . పెద్దల సంతృప్తికి తామూ స్నానము ఆచంరింతుమనియు, ఆ వ్రతమునకు పర అను వాద్యము కావలేననియు, బయలుదేరి శ్రీ కృష్ణుని చేరి , ఆ పర నిచ్చి తమకావ్రతమును పుర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను , పరమాన్న భోజనమును చేయింపుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి. కాని వారి హృదయగతమగు అభిప్రాయము మాత్రము అది కాదు . శ్రీ కృష్ణునితో కలసి మరి ఎడబాటు లేకుండా వానికి కింకర్యము చేయవలెనని కాంక్షిస్తున్నారు. స్నానమను చోట భగవదత్ప్రాప్తి యనియు పరయను చోట భగవత్ కైంకర్యము అనేది పరమ పురుషార్దము అని అభిప్రాయము వచ్చునట్లు వారిమ్తవరకు మాట్లాడుతున్నారు.
శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్
పొత్తామరైయడియే పోత్తుం పొరుళ్ కేళాయ్;
పెత్త మ్మేయ్ త్తుణ్ణు ఙ్కులత్తిల్ పిఱంద నీ
కుత్తేవ లెఙ్గ్ ళై క్కొళ్ళామల్ పోకాదు;
ఇత్తైప్పఱై కొళ్వా నన్ఱుకాణ్; గోవిందా ;
ఎత్తైక్కు మేళేళు పిఱ్ విక్కుం, ఉందన్నో
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శెయ్ వోం,
మత్తై నఙ్కా మఙ్గళ్ మాత్తే లో రెంబావాయ్
తాత్పర్యము:
బాగా తెల్లవారకముందే నీ వున్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి, బంగారు తామరపువ్వులవలె సుందరములు, స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ఫ్రయోజనమును వినుము, పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీనుండి పఱను పుచ్చుకొని పోవుటకు వచ్చినవారముకాము. ఏనాటికిని ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములయిన కోరికలేవియు లేకుండునట్లు చేయుము.
ఈ రోజు ఆండాళ్ తన వెంట ఉన్న గోపీ జనాలతో తను ఏం కోరి వచ్చిందో నీరూపించిన రోజు. మన వాళ్ళు మేం పరిశుద్దులమై వచ్చాం అని గతంలో రెండు సార్లు చెప్పారు, మేం ఏ ఇతర ఫలితాలు కోరి రాలేదు, ఏ ఉపాయాలు కూడా వాళ్ళ వద్ద లేవని నిన్న చెప్పారు. ఈరోజు స్వామి ముందర తమ ఆర్తిని ఆవిష్కరిస్తున్నారు. మేం రావడం సాధన కాదు, మా ఆర్తిని చూసైనా అనుగ్రహించాలని అనిపించటం లేదా అని అంటున్నారు. "శిత్తమ్ శిఱుకాలే" ఇంకా చీకటి తొలగని తెల తెల వారే సమయంలో "వంద్" మేం నీ దగ్గరికి వచ్చాం. మాలో ఆర్తి పెంచినది నీవే కదా, ఎంత కాలం నీవు చేసిన ఫలితమో ఇన్నాళ్ళకు మాకు ఈ జ్ఞానం కల్గింది. ఇది నీవు చేసిన కృపేకదా. "ఉన్నై చ్చేవిత్తు" అన్ని నీవు చేసినవాడివి, శభరి లాంటి వారికి నీవే వెళ్ళి అనుగ్రహించావు. కానీ మేం చేయాల్సి వస్తుంది. మేం నిన్ను సేవిస్తున్నాం. మనకున్న జ్ఞానంతో ఒక్క సారి మేం నీవాడమని చెప్పగల్గుతే, ఇది రాగ ప్రయుక్తం. "ఉన్ పొత్తామరై యడియే పోట్రుం" నీ పద్మాలవంటి ఆ దివ్యమైన పాదాలకు మంగళం పాడుతున్నాం.
"ఎం కించిత్ పురుషాదమం కటిపయ గ్రాణేశం అల్పార్దకం సేవాయ" ఈ లోకంలో అల్పమైన పురుషార్దం కోసం వాడి కున్న కొంత ఆస్తి చూసి వాడే నాయకుడని చుట్టూ, మరియు వీల్ల వాల్ల చుట్టూ తిరుగుతారే జనం ఎంత ఆశ్చర్యం కదా. "నాదేన పురుషోత్తమే త్రిజగతామే ఏకాధిపే చేతసా సేవ్యె సస్య పదస్య దాసరీ సురే నారాయణే తిష్టతి" సమస్త జీవులకు నాథుడై ఉన్న ఆ పురుషోత్తముడు ఆయన కదా, ఆయన ముల్లోకాలను నడిపేవాడు, చేతులు కట్టుకున్నా సరే ఒక్క సారి మనస్సులో నీవాడనని తెలిపినా ఆయన పరమ పదాన్ని ఇస్తాడు అని కులశేఖర ఆళ్వార్ చెప్పినట్లుగా, మేం నీ పాదాలను పాడటనికి వచ్చాం అని చెప్పారు.
ఆయన ఏం విననట్టుగా సుదీర్గమైన ఆలోచనలో పడి ప్రేమతో వీళ్ళకేసి చూస్తున్నాడు. "పొరుళ్ కేళాయ్" మేం ఎందుకు స్తుతిస్తున్నామో వినవయ్యా అంటూ ఆయనను తట్టి పాటం చెబుతోంది గోదా. ఆండాళ్ తల్లికి పాటం చెప్పడం అలవాటు కదా. ఆయనకీ పాటం చెప్పగలదు. "పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు" మొదట పశువులని మేపి అవి తిన్నాకగాని మేం తినేవాళ్ళం కాదు. నీకు మా స్వరూపం తెలియదా. మరి నీవేమి చేస్తున్నావు! మాకు ఆహారం నీ సేవయే, అది మాకు లభించాకే, ఆ తర్వాతే కదా నీవు ఆహారం తినాలి, "నీ కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు" నీ ఆంతరంగిక సేవకై మమ్మల్ని స్వీకరించవలసిందే. ఏదో వ్రత పరికరాలు అని అన్నారు ఇదిగో అని అక్కడ పెట్టాడు. "ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!" మేం ఎదో అడగాలని వాటిని అడిగాం, మేం కోరేవి ఇవికాదు. కేవలం మాట పట్టుకొని చూస్తావా, మా మనస్సులో ఏం ఉందో తెలియదా అని అడిగారు. నాకేం తెలియదు, నేను మీ గొల్లల్లో ఒకడినే కదా అని అన్నాడు శ్రీకృష్ణుడు.
"ఎత్తెక్కుం" ఎల్లప్పటికీ, ఈ కాలం ఆ కాలం అని కాదు, సర్వ దేశముల యందు, సర్వ అవస్తల యందు, "ఏరేర్ పిఱవిక్కుం" ఏడేడు జన్మలలో కూడా "ఉన్ తన్నో డుత్తోమేయావోం" నీతో సంబంధమే కావాలి. కాలాధీనం కాని పరమపదంలో ఉన్నామాకు నీ సంబంధమే ఉండాలి "ఉనక్కే నాం అట్చెయ్ వోం మత్తై నం కామంగళ్ మాత్త్" కేవలం నీ ఆనందం కోసమే మా సేవ అంకితమై ఉండాలి. తెలియక ఏదైన లోపం ఉంటే నీవే సరిదిద్దాలి, మాపై భారం వెయ్యవద్దు.
ఇలా వ్రతం ఆచరించిన అందరికి ఫలితం లభించింది. శ్రీకృష్ణ సమాగమం లభించింది, దీనికి సహకరించిన వారికి కోరినవి లభించాయి. ఈ రోజు పురుషార్థం పొందిన రోజు. ఈ రోజు స్వామి గోదాదేవిని రప్పించుకొని మానవ కన్యగా ఉన్న ఆమెను తాను విగ్రహరూపంలోనే వివాహమాడాడు. గోదాదేవి కోరిన వైభోగాన్ని పొందిన రోజు కనక "భోగి" అంటారు.
AVA NUNE OIL TIPS - HEALTH BENEFITS WITH OIL
ఆరోగ్యానికి ఆవ నూనె
ఆవాలతో ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్నాయి కాబట్టే వాటిని తాలింపులో విరివిగా వాడుతూ ఉంటాం. అలాంటి ఆవాల నుంచి తీసిన ఆవనూనెని వంటల్లో వాడటం వల్ల కలిగే ప్రయోజనం రెండింతలు ఉంటుంది. అందుకే ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో ఆవనూనె ఎక్కువగా వాడతారు.
* న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్
ఆవనూనె - 100గ్రా, కెలోరీలు - 884
మొత్తం కొవ్వు - 153ు, దీన్లో శాచురేటెడ్ ఫ్యాట్ - 12గ్రా (60ు)
పాలీ శాచురేటెడ్ ఫ్యాట్ - 21గ్రా, మోనో శాచురేటెడ్ ఫ్యాట్ - 59గ్రా
• ఆవాల నుంచి 2 నూనెలు
ఆవాలను ఒత్తి వాటి నుంచి కొవ్వుతో కూడుకున్న ‘వెజిటబుల్ ఆయిల్’, నీళ్లతో కలిపి నూరి ‘ఎసెన్షియల్ ఆయిల్’- ఇలా రెండు రకాల నూనెలు తయారు చేస్తారు. మొదటిది వంటల్లోకి, రెండవది సౌందర్య సాధనాల్లోకి ఉపయోగిస్తారు. వెజిటబుల్ ఆయిల్ కాస్త ఘాటుగా ఉంటుంది. అందుకే అందరూ ఈ నూనెను వంటల్లో వాడటానికి ఇష్టపడరు. అయితే దీన్లోని ఒమేగాఆల్ఫా3, ఒమేగాఆల్ఫా6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటిఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.
• ఆరోగ్యపరమైన ప్రయోజనాలు
వంటల్లో ఆవనూనె వాడకం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ నూనె వాడకం వల్ల బ్యాడ్ కొలెస్టరాల్ తగ్గి గుడ్ కొలెస్టరాల్ పెరుగుతుంది. అలాగే ట్రైగ్లిసరైడ్స్, రక్తంలోని కొవ్వు నిల్వలు కూడా తగ్గుతాయి. ఫలితంగా స్థూలకాయం దరి చేరదు.
ఆవనూనె వాడకం వల్ల మూత్రపిండాల సమస్యలకి దూరంగా ఉండొచ్చు.
ఈ నూనె వాడకం వల్ల హైపర్ థైరాయిడ్ రాకుండా ఉంటుంది.
ఆవనూనెను ఆహారంతో తీసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు దరి చేరవు.
జీర్ణవ్యవస్థతో సంబంధం ఉన్న చిన్నపేగు, జీర్ణాశయం, పెద్ద పేగుల్లో బ్యాక్టీరియాలను హరిస్తుంది.
• వంటకాల్లో ఇలా వాడాలి
* ఈ నూనెను నేరుగా కాకుండా పొగలొచ్చేవరకూ వేడిచేసి చల్లార్చి వాడాలి. వేడి చేయటం ఇష్టంలేని వాళ్లు ఆవనూనెను నెయ్యి, వేరుశనగ నూనెలతో కలిపి కూడా వాడొచ్చు.
* కూరలు, పకోడీలాంటి వేపుళ్లు, పచ్చళ్ల తయారీకి ఉపయోగించొచ్చు.
ఆవాలతో ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్నాయి కాబట్టే వాటిని తాలింపులో విరివిగా వాడుతూ ఉంటాం. అలాంటి ఆవాల నుంచి తీసిన ఆవనూనెని వంటల్లో వాడటం వల్ల కలిగే ప్రయోజనం రెండింతలు ఉంటుంది. అందుకే ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో ఆవనూనె ఎక్కువగా వాడతారు.
* న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్
ఆవనూనె - 100గ్రా, కెలోరీలు - 884
మొత్తం కొవ్వు - 153ు, దీన్లో శాచురేటెడ్ ఫ్యాట్ - 12గ్రా (60ు)
పాలీ శాచురేటెడ్ ఫ్యాట్ - 21గ్రా, మోనో శాచురేటెడ్ ఫ్యాట్ - 59గ్రా
• ఆవాల నుంచి 2 నూనెలు
ఆవాలను ఒత్తి వాటి నుంచి కొవ్వుతో కూడుకున్న ‘వెజిటబుల్ ఆయిల్’, నీళ్లతో కలిపి నూరి ‘ఎసెన్షియల్ ఆయిల్’- ఇలా రెండు రకాల నూనెలు తయారు చేస్తారు. మొదటిది వంటల్లోకి, రెండవది సౌందర్య సాధనాల్లోకి ఉపయోగిస్తారు. వెజిటబుల్ ఆయిల్ కాస్త ఘాటుగా ఉంటుంది. అందుకే అందరూ ఈ నూనెను వంటల్లో వాడటానికి ఇష్టపడరు. అయితే దీన్లోని ఒమేగాఆల్ఫా3, ఒమేగాఆల్ఫా6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటిఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.
• ఆరోగ్యపరమైన ప్రయోజనాలు
వంటల్లో ఆవనూనె వాడకం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ నూనె వాడకం వల్ల బ్యాడ్ కొలెస్టరాల్ తగ్గి గుడ్ కొలెస్టరాల్ పెరుగుతుంది. అలాగే ట్రైగ్లిసరైడ్స్, రక్తంలోని కొవ్వు నిల్వలు కూడా తగ్గుతాయి. ఫలితంగా స్థూలకాయం దరి చేరదు.
ఆవనూనె వాడకం వల్ల మూత్రపిండాల సమస్యలకి దూరంగా ఉండొచ్చు.
ఈ నూనె వాడకం వల్ల హైపర్ థైరాయిడ్ రాకుండా ఉంటుంది.
ఆవనూనెను ఆహారంతో తీసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు దరి చేరవు.
జీర్ణవ్యవస్థతో సంబంధం ఉన్న చిన్నపేగు, జీర్ణాశయం, పెద్ద పేగుల్లో బ్యాక్టీరియాలను హరిస్తుంది.
• వంటకాల్లో ఇలా వాడాలి
* ఈ నూనెను నేరుగా కాకుండా పొగలొచ్చేవరకూ వేడిచేసి చల్లార్చి వాడాలి. వేడి చేయటం ఇష్టంలేని వాళ్లు ఆవనూనెను నెయ్యి, వేరుశనగ నూనెలతో కలిపి కూడా వాడొచ్చు.
* కూరలు, పకోడీలాంటి వేపుళ్లు, పచ్చళ్ల తయారీకి ఉపయోగించొచ్చు.
Subscribe to:
Posts (Atom)