ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

GOD'S PUJA - GOMATHA PUJA - TELUGU BHAKTHI ARTICLE


TELUGU TIPS FOR MAINTAINING BEAUTIFUL NECK


NATURAL BEAUTY ANJALI IN SEQUEL MOVIE


WINTER SEASON HEALTHY MASSAGE TIPS


WINTER SEASON THROAT INFECTIONS - SYMPTOMS - CURE TIPS


TOLLYWOOD BEAUTY SURABHI MOVIE DHAMAKA


BOLLYWOOD MOVIE SULTAN - ANUSHKHA SHARMA ACTION SCENES PERFORMANCE


CHANGES IN BRAIN WITH COPD


SUGAR CREATES TENSION IN HUMANS


IMPROVE DAILY HABITS WITH EATING DRY FRUITS - BADAM


Miley Cyrus great american pop singer spents 17 crores for privacy home


TIPS TO TAKE RELAXATION FOOD ITEMS


BRIDAL BLOUSES COLLECTION



DESIGNER BLOUSES COLLECTION



GLAMOROUS NITYA MENON


STYLISH HOT BEAUTY DEEPIKA


SEXY BEAUTY SONAKSHI SINHA


BRAHMASRI CHAGANTI KOTESWARA RAO GARU'S MORAL MESSAGE ARTICLE


వశం చేసుకోవడం కాదు... వశవర్తులు కావడం నేర్చుకోవాలి..!

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు.

డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు-అన్నదానితో సంబంధం లేకుండా, సంపాదిస్తున్నాడా లేదా అదొక్కటే ప్రమాణంగా... అతి తక్కువకాలంలో ఎంత ఎక్కువ సంపాదించవచ్చన్న లక్ష్యంగా వెడుతున్నాడనుకోండి. వాడంత ప్రమాదకరమైన మనిషి మరొకడుండడు. అందుకే... మీరేం చేస్తున్నారన్నది కాదు, ఎలా చేస్తున్నారన్నది ప్రధానం. మన ఆర్షవాఙ్మయం అంతా ధర్మం గురించే మాట్లాడుతుంది. ధర్మం అంటే... నీవల్ల ఎంతమందికి ఉపయోగముంటున్నది, నీ బతుకు ఎంతమందిని బతికిస్తున్నదన్నది ఇందులో ముఖ్యం. ఇది సాధించాలంటే గురువు దగ్గర ఎప్పుడూ బుద్ధి శిక్షింపబడడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే శిష్యుడు’ అని అంటారు. బుద్ధి శిక్షింపబడడమంటే... గురువుకి వశవర్తి కావాలి. నేనుగా గురువుగారికి లొంగిపోతున్నాను - అని సంకల్పం చేసుకుని గురువుగా ఏ మాట చెబితే ఆ మాట శిరసా వహిస్తాను’ అన్నాడనుకోండి. అప్పుడతడు సమాజానికి పనికివచ్చేవాడవుతాడు.

‘నేను ఎవ్వరికీ లొంగను. నేననుకుంటే నా మాట నేనే వినను’ అన్నాడనుకోండి. వాడంత పనికిమాలినవాడు ఇంకొకడు ఉండడు. వాడిమాట వాడే వినకపోతే ఎవడికి పనికొస్తాడు? అంతకన్నా దౌర్భాగ్యమైన మాట మరొకంటుంటుందా? ఉండదు.
ఒక గుర్రం ఉంది. గొప్పగా దౌడు తీయగలదు. కొండలు, గుట్టలు కూడా ఎక్కగలదు. అది తనమీద ఎక్కి స్వారీ చేస్తున్న వ్యక్తిని క్షేమంగా తీసుకెడుతుంది. అలా తీసుకెళ్లగలిగిన దానినే ఉత్తమాశ్వం అంటారు. అది తన యజమానికి వశమైపోతుంది. ఏనుగు చాలా బలంగా ఉంటే, మావటివాడేమో బలహీనంగా ఉంటాడు. అది కట్టుకొయ్య దగ్గరకెళ్లి అక్కడ ఉన్న ఇనుప గొలుసులను తొండంతో తీసి మావటికి ఇచ్చి కట్టవలసిందని కాలు చాపుతుంది. నిజానికి ఏనుగు కదలకుండా ఉండలేదు. అది కదలకపోయినా కనీసం తొండమన్నా కదిలిస్తూనే ఉంటుంది. అరుణాచలం, వేంకటాచలం వంటి క్షేత్రాలకు వెళ్లి చూడండి. మావటి తన చేతిలో ఉన్న అంకుశాన్ని దాని రెండు ముంగాళ్ల వద్ద పెడతాడు. అంతే. అది దాటదు. కాలు ఎత్తుతుంది, కానీ వెనక్కి తీసుకుంటుంది తప్పితే అడుగు ముందుకు వేయదు. ‘నేను దాటను’ అని దానికది పెట్టుకుందా నియమం. నిజానికి అంకుశం సంగతి సరే, తొండంతో మావటిని తిప్పి విసిరివేయగల శక్తి ఉన్నా మావటికి తనకు తానుగా లొంగిపోయింది. కాబట్టే వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవమూర్తిని ఉరేగింపుగా తీసుకెడుతుంది. పండితులకు పెద్ద సత్కారం - గజారోహణం. దాని అంబారీ మీద కూర్చోబెడతారు.

గాడిద వెనుక ఎవరైనా నిలబడితే కాళ్లతో తంతుంది. అలాంటిది అది దాని యజమానికి వశమైపోయిన తరువాత ఎంత బరువయినా మోస్తూ ఉపయోగపడుతుంది. కుక్కకు ఒక లక్షణం ఉంటుంది. పట్టెడన్నం పెడితే చాలు ఎంతగా వశమైపోతుందంటే యజమాని ఇంట్లో ఉన్నా లేకపోయినా, ఊరెళ్లినా ఇంటికి దొంగల బారి నుంచి కాపలా కాస్తుంది. కర్ర పెట్టి కొట్టినా, రాళ్లు విసిరినా మొరుగుతూనే ఉంటుంది. దూరంగా తరిమినా మొరగడం ఆపదు. యజమానికి వశవర్తి అయిపోయింది. ఎద్దు-దానికేమీ తెలియదు. బండి తెచ్చి కాడి పెకైత్తి దాని కిందకు రమ్మంటే మొదట మొరాయిస్తుంది. నాలుగు రోజులు బండికి కట్టిన తర్వాత రైతు ఎద్దులను తీసుకురాడు. అవి అటొకటి, ఇటొకటి పడుకుని ఉంటాయి. కాడి ఎత్తి పట్టుకుని వాటివంక చూస్తూ నోటితో చిన్న శబ్దం చేస్తాడు. అంతే! రెండూ లేచి వచ్చి మెడ దానికింద పెట్టేస్తాయి. ఎద్దు వశవర్తి అయింది. కాబట్టే రైతు దానిని కుటుంబసభ్యులలాగా ఆదరిస్తాడు. ఏరువాక పౌర్ణమి వస్తే పసుపు కుంకుమలతో పూజించి ప్రత్యేకంగా దానికి పాయసాన్ని వండి పెడతాడు.

లోకంలో నోరులేని ప్రాణులు కూడా వశవర్తులయ్యాయి కాబట్టే, సమాజానికి ఉపయోగపడుతున్నాయి. అటువంటిది ఒక మనిషి ‘నేను ఎవరి మాటా వినను, నామాట నేనే వినను’ అంటున్నాడంటే వాడు మనుష్య జన్మకు పనికొచ్చేవాడేనా? అందుకే తనంతటతానుగా వశపడాలి. ఎవరికి? ఎవరు తనకు హితైషులో, ఎప్పుడూ తన హితాన్ని కోరుతారో వారికి వశవర్తి కావాలని వేదం చెప్పింది. తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురికీ వశవర్తి కావాలి. అంటే ‘వాళ్లు చెప్పింది నాకు శిలాశాసనం’ అనుకోవాలి. వాళ్లేం చెప్పారో అది చేయాలి. అలా చేయాలంటే ఉండాల్సింది వినయం. అదెలా వస్తుందంటే ‘నాకు వీళ్లు దైవసమానులు. వాళ్లు నా హితం కోరి చెబుతారు. కాబట్టి నేను వాళ్ల మాట వినాలి’ అన్న సంకల్పంతో!

మీకు పాఠాలు చెప్పే గురువు కూడా మీ కుటుంబసభ్యుడే అని గుర్తించండి. నేను, నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులతో పాటూ నా గురువుగారు కూడా కలిస్తేనే అది నా కుటుంబం అని భావన చేసుకోండి.
గురువుగారంటే కేవలం నాకు పాఠం చెప్పడం వరకే కాదు. ‘‘దీని తరువాత నా స్థాయిబట్టి నేనేం చేస్తే బాగుంటుంది, నేను ఏం చదవవచ్చు, నా మనస్తత్వం దేనికి సరిపోతుంది, గురువుగారూ, దయచేసి నాకు సలహా చెప్పండి’’ అనో, ‘‘సార్ ! నేను బాగా చదువుకోలేకపోతున్నాను. నాకు పాఠం అర్థం కావడం లేదు. దయచేసి నాకు ఇంకొక్కసారి చెప్పండి’’ అని మనసువిప్పి గురువుగారితోటి మీ కుటుంబసభ్యునిలా గౌరవించి మాట్లాడడం నేర్చుకోండి. ఆ వినయం అలవాటు పడిన నాడు, గురువుకి వశవర్తి అయిన నాడు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు.

మహాజ్ఞాని, తత్త్వవేత్త, రాజనీతిజ్ఞుడు, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారి పుట్టినరోజున అంటే సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం కదా.. ఆ రోజున ఎవరో బయటివాళ్లను తీసుకువచ్చి ఉపన్యాసాలు చెప్పించి, పూలదండలు వేయించాలని ఆయన చెప్పలేదు. ఆయన ప్రసంగాలు శ్రద్ధగా చదివితే ఆయన మనస్సేమిటో తెలుస్తుంది. ఆయన కోరుకున్నదేమిటంటే... ‘‘ఆ రోజున నాకు పూలదండ వేయవద్దు. మీకు పాఠాలు చెప్పే గురువుగారు కూడా మీ కుటుంబసభ్యుడే అని గుర్తించండి

MAHA SIVA RATHRI MAHIMA - TELUGU TRADITIONAL FESTIVAL ARTICLES COLLECTION


శివరాత్రి మహిమ 

ఒక అడవిలో కిరాతుడు అతని భార్య ఉండేవారు. రోజు దేన్నో ఒకదాన్ని వేటాడి దాని మాంసంతో ఆహారం భుజించేవారు. ఒకరోజు తనభార్య పిలిచి ఏమయ్యో ఈరోజు విశేషం తెలుసా అనగా! తెలియదు ఏంటో చెప్పమన్నాడు. ఈనాడు మన పెళ్లిరోజు అంటూ కాలి బ్రోటనవేలు నేలకి వ్రాస్తూ సిగ్గుపడుతుంది. అరే మర్చిపోయానే? ఈరోజు నీకేమి కావాలో చెప్పు చేస్తాను అన్నాడు. రోజు ఆ పందిమాంసం , కోడి మాంసం తిని విసుగొచ్చింది మావ. ఈరోజు ఎలాగైనా జింక మాంసం తినాలని కోరికగా ఉందని సిగ్గుపడింది. అలాగేనని బయలుదేరుతుంటే ఆగమని చెప్పి. నువ్వు ఆకలికి అగలేవు కొద్దిగా బువ్వ తీసుకెళ్ళమని అన్నం మూటకట్టి, తోలు సంచిలో నీళ్ళు పోసి ఇచ్చింది. మామ అసలే శీతాకాలం. పోద్దుతక్కువ. కాబట్టి తొందరగా వచ్చేయమని జాగ్రత్తలు చెప్పి పంపింది. జింకని ఎలాగైనా పట్టుకోవాలనే తాపత్రయంతో అడవినంతా కలయదిరిగాడు. వేట కోసం ఎంతోదూరం వెళ్ళిపోయాడు. ఎక్కడా ఒక్క జింక కూడా కనబడలేదు. ఇక లాభంలేదని తిరుగు ప్రయాణమై వెనుదిరిగి వస్తుండగా ఈ లోపు చీకటిపడింది. దారి కనబడక చీకట్లో ఒక చెట్టు కనబడితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక రాయి ఉంటె దానిమీద కాలేసి చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు.
ఉదయం నుండి వేట తమకంలో ఆహారం ఏమీ తీసుకోకపోవడం వలన ఆకలి వేసి అన్నం తిందామని మూటకోసం చుస్తే కనబడలేదు. దారిలో ఎక్కడో పడిపోయి ఉంటుందనుకుని తోలుసంచిలో ఉన్న నీరు త్రాగి చేట్టుపైనే పడుకున్నాడు. శిశిరం కావడంతో చలికి వణుకుతూ అలానే పడుకున్నాడు. వణుకుతూ ఉండటంచేత తన దగ్గర ఉన్న నీరు వనికినప్పుడల్లా కొంచం కొంచం చెట్టుక్రింద ఉన్న రాయి మీద పడ్డాయి. ఆ చలిగాలిలో బిర్రబిగుసుకుని అలానే ఆ రాత్రి నిద్రలేకుండా పడుకున్నాడు. ఇంకోప్రక్క కిరాతుడి భార్య అడవిలో భర్తకి ఏమి జరిగిందో, అసలు ఏమైనా తిన్నాడో లేదో అనే ఆలోచనతో అన్నం మూట తెల్లారగానే కట్టుకుని బయలుదేరింది. కొంతదూరం ప్రయాణించాక కిరాతుడు చెట్టుమీద ఉండటం చూసి ఆ చెట్టు దగ్గరికి వెళ్లి భర్తని కేకవేసి పిలిచింది. కేక విని క్రిందికి దిగి తెచ్చిన అన్నం మూట చూసి, నిన్నటి నుండి ఏమి తినకపోవడం చేత బాగా ఆకలిమీద ఉండటం వలన వెంటనే పక్కన ఉన్న ఏరు దగ్గరికి దంత ధావన చేసుకోవడానికి భార్యని తీసుకుని ఏటి గట్టుకి వెళ్ళాడు. దంత ధావన చేసి, కాళ్ళు చేతులు కడుక్కొని తెచ్చిన సద్దిని తినాలని చుస్తే ఇంతలో కుక్క వచ్చి ఆ మూటలో అన్నం తినేసింది. కిరాతుడి భార్య అది చూసి పక్కనే ఉన్న కర్ర ఒకదానిని తీసుకుని కుక్కని కొట్టబోయింది. కిరాతుడు వెంటనే తన భార్యని ఆపి "తిననివ్వవే, పాపం అది కూడా సాటి ప్రాణే కదా" ఎంత ఆకలితో ఉందొ అని జాలిపడ్డాడు. భార్య ఆశ్చర్యపోయి! ఏంటి మావ రాత్రికి రాత్రి ఇలా మారిపోయావు. జంతువు కనబడితే ఊరుకునే వాడివి కాదుకదా! అని ప్రశ్నించింది. నిజమే కాని ఎందుకో జాలేస్తుందే వీటిని చూస్తుంటే. ఇన్నాళ్ళు అనవసరంగా సాటి ప్రాణులను చంపి తిన్నాం. ఇక నుండి కందమూలాలు, పళ్ళు తప్ప మాంసాహారం తినోద్దె అన్నాడు. నీమాట ఎప్పుడైనా కాదన్నానా మావ. నాకు కూడా అదే మంచిదనిపిస్తుంది. ఇక నుండి సాటి ప్రాణులని ప్రేమిద్దాం. అంటూ ఆనాటి నుండి మాంసాహారం మాని కేవలం కంద మూలాలు మాత్రమే తింటూ కాలం గడిపారు. కొన్నాళ్ళకి ఇద్దరూ మరణించారు.

మరణించిన తరువాత వీరిని యమభటులు వచ్చి వీరిని తన్నుకుంటూ తిట్టుకుంటూ తీసుకెళ్తుంటే దేవతలు వచ్చి వారిని ఆపి ఇతడిని మీరెందుకు తీసుకేళుతున్నారు? ఇతడు కైలాసానికి రావలసిన వాడు. ఎంతో పుణ్యం చేసుకున్నాడుఅందువల్ల ఇతను వెళ్ళాల్సింది కైలాసానికే గాని నరక లోకానికి కాదు అన్నారు. ఇతడు ఎన్నో హత్యలు, దొంగతనాలు, ఇంకెన్నో ఘోరాలు చేశాడు. కనుక ఇతనిని నరకానికే తీసుకెళ్ళాలి. మీరేమో స్వర్గానికంటున్నారు! ఇతడు చేసిన పుణ్యం ఏంటి తెలియజేయండి. ఇతడు మహాశివరాత్రి నాడు బిల్వాపత్రాలతో, నీటితో, రాత్రంతా జాగారం ఉండి శివలింగానికి అర్చన చేశాడు. కనుకనే ఇతనిని కైలాసానికి తీసుకెళ్ళాలి. ఏరోజు పూజించినా పూజించకపోయినా మహాశివరాత్రి నాడు తెలిసిగాని, తెలియకగాని శివలింగానికి అభిషేకం చేసి జాగారం చేస్తే వారు శివుని సాన్నిధ్యం చేరుకుంటారు. అని కిరాతుడిని కైలసానికి తీసుకెళ్ళిపోయారు...
ఇది శివరాత్రి శివునికి అర్చన చేసి జాగారం చేస్తే కలిగే ఫలం.

MAHASHIVARATHRI FESTIVAL 07-03-2016 - SPECIAL TELUGU ARTICLE ABOUT STORY AND IMPORTANCE - SIVA RATHRI MAHATYAM


శివ రాత్రి మహత్యం.

శివరాత్రి మహత్యమును తెలుపు కథలు స్కంథ పురాణమునందును లింగపురాణము నందును పెక్కు కలవు. ఈ కథ లింగపురాణము లోనిది.

ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు కబుర్లాడు కొంటూన్నారు. "దేవదేవేశ! పాపం భూలోకములోని మానవులు ప్రారబ్ద కర్మలతో పెక్కు బాధలను అనుభవిస్తున్నారు. ఇటువంటివారికి కఠినమయిన నియమనిష్ఠలు లేకుండా యఙ్ఞయాగాదులు జపతపఫలములు లేని సులభతరమైన ఒక వ్రతమును తెలిపి వారికి శక్తిని ముక్తిని కలుగునట్లు చేయుము" అని పార్వతి అన్నది.

అప్పుడు శివుడు పార్వతితో యిలా అన్నాడు."దేవి! శివరాత్రివ్రతము అనునది ఒకటి ఉంది. సర్వయఙ్ఞములకు సమానమయినది. ఉత్తమోత్తమయినది. ముక్తి ప్రదమైనది. దాని కథ చెబుతాను.

పూర్వము ఒక పర్వత ప్రాంతమున ’వ్యాథు’ డనే వేటగాడు ఉండేవాడు. అతను ప్రతి ఉదయము అడవికి వేటకు వెళ్ళి సాయంకాలానికి ఏదో ఒక ’మృగము’ ను చంపి ఇంటికి తెచ్చేవాడు. దానితో అతని కుటుంబము పొట్టనింపుకుంటూ ఉండేది.

ఒకరోజు అతను ఎప్పటిలా అడవికి వెళ్ళాడు. అడవి అంతా తిరిగినా అతనికి ఒక్క ’మృగము’ కంటపడలేదు. వట్టి చేతులతో యింటికి వెళ్ళటానికి మనసొప్ప లేదు. అయినా చేసేది లేక యింటికి బయలు దేరాడు. దారిలో అతనికి ఒక తటాకము కనబడింది. "ఏ మృగమైన నీరు త్రాగటానికి ఈ తటాకము దగ్గరకు రాకపోతుందా" అనే ఆశతో ఒక చెట్టుపైకి ఎక్కికూర్చున్నాడు. తటాకము వైపు చూస్తూ, అడ్డుగా ఉన్న కొమ్మలను విరిచి, ఆకులను దూసి క్రింద పడవేసి, చలికి ’శివ-శివ’ అనుకుంటూ తటాకము వైపు చూస్తూ కూర్చున్నాడు.

మొదటి జామునకు ఒక పెంటిలేడి నీరు త్రాగటానికి ఆ తటాకము దగ్గరకు వచ్చింది. వేటగాడు ఆనందముతో బాణము విడువబోయినాడు. "వ్యాథుడా! నన్ను చంపకు " అని మానవ గొంతుతో ఆ లేడి యిలా అన్నది. "నేను గర్భిణిని. నీకు అవథ్యను. నా వలన నీ కుటుంబానికి సరిపడు భోజనము లభించదు. కాబట్టి నన్ను వదులు.యింకొక "పెంటిజింక" కాసేపటిలో ఇక్కడకు వస్తుంది. దాన్ని చంపు. లేకపోతే నేను వెళ్ళి బిడ్డను కని దాన్ని బంధువులకి అప్పగించి వస్తాను " అంది. "సరే" అన్నాడు వేటగాడు.

రెండవ జామునకు పెంటిజింక కనిపించింది. మొదటి జింకే అనుకున్నవేటగాడు బాణము వేయబోగా ఆ జింక భయపడుతూ మానవ కంఠంతో "ఓ ధనుర్దారుడా! ముందు నా మాట విను. తరువాత నన్ను చంపవచ్చు.నేను విరహముతో కృశించిపోయి ఉన్నాను. నాలో మేదోమాంసములు లేవు.నన్ను చంపినా నీకు నీ కుటుంబానికి సరిపోను. కాసేపటికి బాగాబలిసిన "మగజింక" ఇక్కడకు వస్తుంది. దానిని చంపు. అలా కాకపోతే నేనే తిరిగి వస్తాను " అన్నది. సరేనన్నాడు.

మూడవజాము అయింది. వేటగాడు ఆకలితో జింక కోసము ఆతృతగా చూస్తున్నాడు.బలిసిన మగజింక రానేవచ్చింది. వేటగాడు దాన్ని చూసిన వెంటనే అల్లెత్రాడు లాగి బాణము విడువబోవునంతలో మృగము వేటగాడిని చూసి, తన ప్రియురాలినికూడా వాడే చంపి ఉంటాడని తలచింది.అయినా అడిగితే సందేహము తీరి పోతుందని " ఓ మహాసత్త్వుడా రెండు పెంకిజింకలు ఇక్కడకు వచ్చినవా!? అవి ఎటు పోయినవీ? వానిని నీవు చంపితివా" అని ప్రశ్నించెను. వేటగాడు దాని మాటలకు మునుపటి వలనే ఆశ్చర్యపడిరెండు "తిరిగి వస్తానని ప్రతిఙ చేసి వెళ్ళాయి.నిన్ను నాకు ఆహారంగా పంపాయి" అన్నాడు. "సరే అయితే! నేను ఉదయం నీ యింటికి వస్తాను.నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి, బంధుమిత్రులతో అనుమతి పొంది నేను మళ్ళీ వస్తాను" అని అనేక ప్రమాణాలు చేసి వెళ్ళింది.

యింతలో యింకొక హరిణి (జింక) తన పిల్లలతో వచ్చింది. "వ్యాధుడా! నేను పిల్లతో వచ్చాను. దీన్ని యింటి దగ్గర వుంచి త్వరగా వస్తాను అంది.

ఈ విధంగా నాలుగు జాములు గదిచిపోయాయి. సూర్యోదయమయింది. వ్యాదుడు జింక కొరకు ఎదురుచూస్తూ దిక్కులు వెతకసాగడు. కొంతసేపటికి నాలుగు జింకలు వచ్చాయి. "’ నేను సిద్దంగా ఉన్నాను నన్ను చంపు’ అంటే ’నన్ను చంపు’ అని నాలుగు జింకలు వ్యాదుని ఎదుట మోకరిల్లాయి.

మృగముల సత్యనిష్ఠకు వ్యాధుడు ఆశ్చర్య పడ్డాడు. వాటిని చంపుటకు అతని మనసు అంగీకరించలేదు. తన హింసావృత్తి మీద తనకే అసహ్యమేసింది. "ఓ మృగములారా ! మీరు మీ నివాసములకు వెళ్ళిపొండి. నాకు మీ మాంసము అక్కర్లేదు. కానున్నది కాకమానదు. ఈ విధంగా మృగాలను వేటాడి బందించి చంపి నాకుటుంబాన్ని పోషించుకోవటం పరమనికృష్టంగా తోస్తోంది. చేసిన పాపము చేశాను. ఇక తిరిగి ఈ పాపము చేయను.ధర్మములకు దయ మూలము. దయ చూపుటకూడ సత్యపలమే " అన్నాడు.

వ్యాధుని మాటలకు ఆకాశంలో దేవ దుందుభులు మ్రోగాయి.పూలవాన కురిసింది. దేవదూతలు మనోహరమయిన విమానములో వచ్చి " ఓ మహాసత్త్వుడా! ఉపవాసము , జాగరణ, శివరాత్రి ప్రభావమున నీ పాపము నశించింది. నీ వెక్కి కూర్చున్నది బిల్వ వృక్షము. నీకు తెలియకుండానే జాము జామునకు బిల్వదళాలను త్రుంచి క్రింద ఉన్న ’స్వయంభూలింగము’ను పూజించావు." అంటూ వారందరిని సశరీరంగా స్వర్గానికి తీసుకెళ్ళారు.

ఈ కథను పరమేశ్వరుడు పార్వతిదేవికి చెప్పి ’దేవి! ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. కనిపించు మిగిలిన మూడు నక్షత్రములలో ముందున్నవి జింక పిల్లల్లు వెనుకకున్నది మృగి. ఈ మూడింటిని మృగశీర్షమంటారు. వాటి వెనుక ఉజ్జ్వలంగా ఉన్నది వేటగాని నక్షత్రము. శివరాత్రితో సమానమయిన మరియొక వ్రతము లేదు’ అని తెలిపెను.

PUJA RESULTS OF LORD PANCHAMUKHA ANJANEYA SWAMY


పంచముఖ హనుమాన్‌ బొమ్మను మీ ఇంట్లో ఉంచితే కలిగే ఫలితాలు !

శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో ఆంజనేయస్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలను జ్యోతిష్య నిపుణులు ఇలా చెబుతున్నారు.

మీ ఇంట్లో ఏ దిక్కున హనుమంతుడి బొమ్మను ఉంచాలంటే..?

► తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు.

► దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.

► పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.

► ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.

► ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.
ఇక.. శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. అలాగే ఆంజనేయ స్వామికి "శ్రీరామజయం" అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్‌పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.

పంచముఖాలు ఐదు దిక్కులు వాటి వివరాలు !
హనుమంతుడు శ్రీరాముడికి పరమభక్తుడు, హనుమంతుడు భక్తసులభుడు, హనుమంతుడి కరుణాకటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి భజన చేస్తే చాలు భజన చేస్తున్న ప్రదేశంలో హనుమంతుడు ఏదో ఒక అవతారంలో ఉంటాడు అని వేదపండితులు తెలియజేస్తున్నారు. అలాగే ఆంజనేయస్వామి నవ అవతారాలలో దర్శనం ఇస్తాడు.

ఆంజనేయస్వామి నవావతరాలు ప్రసన్నాంజనేయస్వామి, వీరాంజనేయస్వామి, వింశతి భుజ ఆంజనేయస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి, అష్టాదశ భుజ ఆంజనేయస్వామి, సువర్చల ఆంజనేయస్వామి, చతుర్భుజ ఆంజనేయస్వామి, ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి మరియు వానరాకార ఆంజనేయస్వామి.
ఆంజనేయస్వామి నవావతారాలలో పంచముఖ ఆంజనేయస్వామి శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించాడు. పంచముఖాలు ఐదు దిక్కులను దృష్టిని సారించి ఉండగా ఆ ముఖాలలోని వివరాలు ఈ విధంగా చెప్పబడ్డాయి.

VAJRALA DONGA TELUGU MORAL STORY


నమ్మకద్రోహం

దేవీపురం జమీందారు దగ్గర మల్లయ్య నగదు వ్యవహారాలు చూసేవాడు. ఓసారి జమీందారు అతనికి వంద వజ్రాలు ఇచ్చి జాగ్రత్త చేయమన్నాడు. ఓరోజు రాత్రి దివాణంలో దొంగ ప్రవేశించి వజ్రాలు దొంగిలించాడు. మర్నాడు మల్లయ్య వచ్చి చూసేసరికి ఒకటే వజ్రం కనిపించింది. దొంగ హడావుడిలో దాన్ని వదిలేశాడని అర్థమైన మల్లన్నకి దురాశ పుట్టింది. వెంటనే దాన్ని తన తలపాగాలో దాచేసి, ఏమీ ఎరగనట్టు జమీందారు దగ్గరకు వెళ్లి చోరీ సంగతి చెప్పాడు. జమీందారు వెంటనే రక్షక భటులను నలుమూలలా పంపించాడు. కాసేపటికే ఆ దొంగ దొరికి పోయాడు. భటులు వాడిని జమీందారు దగ్గరకు తీసుకు వచ్చి సోదా చేస్తే వజ్రాల సంచీ కనిపించింది. అయితే అందులో 99 మాత్రమే ఉన్నాయి.

'ఏదీ మరో వజ్రం? బయటకి తియ్‌' అంటూ జమీందారు గద్దించాడు. ఆ దొంగ వణికి పోతూ 'నేను సంచీ విప్పి చూస్తే వజ్రాలు కనిపించాయి. వాటిని సంచీలో వేసుకుని పారిపోయానేగానీ, ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు' అన్నాడు.

ఆ సమాధానం విన్న మల్లన్నకి వణుకు పుట్టింది. వెంటనే దొంగ దగ్గరకి వెళ్లి వాడి చెంప మీద కొట్టి 'నిజం చెప్పకపోతే వూరుకునేది లేదు' అంటూ దబాయించాడు. ఆ వూపులో అనుకోకుండా మల్లన్న తలపాగా కిందపడి వందో వజ్రం బయటకి దొర్లింది. జమీందారు సంగతంతా గ్రహించి, 'ఇద్దరూ దొంగలే. చెరో వంద కొరడా దెబ్బలు కొట్టి తరిమేయండి' అన్నాడు కోపంగా.

అది విన్న మల్లన్న మొండిగా, 'ఇది అన్యాయం. 99 వజ్రాల దొంగకి, ఒకటి తీసుకున్న నాకూ శిక్ష ఒకటేనా?' అని ఎదిరించాడు.

జమీందారు ఒక్క క్షణం ఆలోచించి 'సరే. నువ్వన్నట్టే శిక్ష మారుస్తాను' అంటూ దొంగవైపు తిరిగి, 'నువ్వు ఎన్ని దొంగిలించావు?' అని అడిగాడు.

'తొంభై తొమ్మిది' అన్నాడు దొంగ.
'అయితే నీకు 99 కొరడా దెబ్బలు' అన్న జమీందారు, ఆపై మల్లన్న వైపు తిరిగి, 'నువ్వు ఎన్నో వజ్రం దొంగిలించావు?' అని అడిగాడు.

'వందోది' అన్నాడు మల్లన్న. 'అయితే వందో దెబ్బ నీకు' అన్నాడు జమీందారు. అమ్మయ్య అనుకున్నాడు మల్లన్న.

భటులు ముందుగా దొంగకి తొంభై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టారు. మల్లన్న వెంటనే 'ఆ వందోది నాకు వేసేయండి' అన్నాడు. జమీందారు నవ్వి, 'వందో దెబ్బ తినాలంటే మొదట తొంభైతొమ్మిదీ భరించాలి కదా? కీలకమైన బాధ్యతలో ఉంటూ నమ్మకద్రోహం చేసిన నువ్వు ఆ దొంగ కన్నా ప్రమాదకారివి' అన్నాడు. మల్లన్న తెల్లబోయి మొత్తం వంద కొరడా దెబ్బలూ తిన్నాడు.

Cervical Spondylosis: Causes, Symptoms, & Treatment - NECK PAIN - HOMEO TREATMENT


LORD SRINIVASA MARRIAGE


DREAM BEAUTY SMILE LOOKS


Safflower HEALTH BENEFITS - KUSUMA NOONE MEDICINAL USAGE


MEDICINAL HEALTH BENEFITS WITH EATING GUAVA FRUIT REGULARLY


MOBILE MAZAKAA


MEDICINAL BENEFITS WITH ALOE VERA


DREAM HOUSE NEAR A LAKE


ANNAMAYYA JOLA PATA LYRICS IN TELUGU


అన్నమయ్య జోల పాట.!
.
జోఅచ్యుతానంద జోజో (రాగం: నవరోజు) (తాళం: ఖండచాపు)
జోఅచ్యుతానంద జోజో ముకుంద
రావె పరమానంద రామ గోవింద
నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ
పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు
అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే
గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి
చెల్లునా మగనాండ్ర జెలిగి యీశాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి
రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను
మాపుగానే వచ్చి మా మానములను
నీపాపడే చెఱిచె నేమందుమమ్మ
ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతులబట్టి
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి
అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార
గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి
అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి
హంగుగా తాళ్ళపా కన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల....
.
https://www.youtube.com/watch?v=TobCFwDWmDE

MEANING OF SWAMI AYYAPPA


అయ్యప్ప స్వామి చరిత్ర !
అయ్యప్ప (Ayyappa) హిందూ దేవతలలో ఒకడు. ఈయనను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది.
అయ్య (=విష్ణువు),
అప్ప smile emoticon శివుడు)
అని పేర్ల సంగమం తో ‘అయ్యప్ప’ నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. బరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే “కుళతుపుళ”లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. “అచ్చన్ కోవిల్”లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు.

LOVE U DEAR


PROBLEMS WITH HIGH HEELS TO WOMEN


A TRIBUTE TO MAHANATI SAVITHRI


Haniya Designers BLOUSES COLLECTION-7





Haniya Designers BLOUSES COLLECTION-6




BRIDAL BLOUSES COLLECTION BY Haniya Designers




BEAUTIFUL KIDS DESIGNER LEHANGA CHOLI FLORAL BLACK DRESS


Haniya Designers BLOUSES COLLECTION-5