ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

DASARA FESTIVAL AVATHARS - SRI SWARNAKAVACHALANKRUTHA DURGA DEVI - 01-10-2016


నవరాత్రులు రేపటి నుండి ప్రారంభమూ......

విజయవాడలో దుర్గమ్మ మొదటి రోజున మనకి స్వర్ణకవచ అలంకృత దుర్గా దేవి గా దర్శనం ఇస్తుంది.

.....ఈ తొమ్మిది రోజులలో ఒకోక్క రోజు ఒకొక్క రూపములో మనము అమ్మని పూజిస్తాము..ఒకోక్క స్వరూపములో అమ్మ మనకి దర్శనము ఇస్తుంది...
విజయవాడలో దుర్గమ్మకి మొదటి రోజున స్వర్ణకవచ అలంకృతరూపముగా పూజిస్తాము...ఆ రూపము వెనుక ఉన్న కధ ను తెల్సుకుందాము.

దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు...ఆయన గొప్ప తపస్సు చేసాడు బ్రహ్మ గారి కోసము...బ్రహ్మ గారు ప్రత్యక్షమయ్యి..." ఏమి కావాలి నీకు అని అడగగా..."నాకు వేదములు అన్ని కూడా వశము కావాలి " అని అడిగాడు..."దేవతలను నేను జయించాలి " అని అన్నాడు...అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ గారు "తధాస్తు" అనగా వేదములు అన్నీ కూడా దుర్గముడు లోకి ప్రవేశిన్చాయి...బ్రాహ్మణులు అందరు వేదాలు మర్చిపొయారు...సంధ్యవందనాలులేవు...హవ్విసులు లేవు, ఙ్ఞాలు లేవు...యాగాలు లేవు.....దేవతలకి హవిస్సులు లేక ఆకలితో విలవిల లాడి పొయారు....నీటి చుక్క లేదు...తల్లి అనుగ్రహం లోపించి పోయింది...భూమండలం మీద అంతా వాతావరణం క్షీణి ంచిపోయింది...అందరు నాశనము అవుతుంటె ఆ దుర్గముడు చాలా సంతొషించాడు...హవిస్సులు లేక దేవతలు అందరు వృద్ధులు లాగా మారిపోయి, నీర్సపడిపోయారు.

అప్పుడు...దేవతలు అందరు కలిసి అమ్మని ప్రార్థన చేసారు....అప్పుడు అమ్మ ప్రత్యక్షమై, అమ్మ కరుణ ప్రసరించగానే, మళ్ళి అలా ప్రత్యక్షమైన తల్లిని చుసి అన్నములేక ఆకలిగా ఉంది , నిన్ను స్తుతి చెయ్యడానికి కుడా మాకు ఒపిక లేక ఉన్నాము అని దేవతలు అమ్మని ప్రాధేయపడగా.....అమ్మ అప్పుడు అందరికి " శాకాంబరి దేవిగ " కనిపించింది..అనంత హస్తాలతో...
అసలు పృథ్వి శాకాంబరి దేవి కాదా....అలా అమ్మ ఆ రూపము దాల్చి అందరికి...పళ్ళు, కాయగూరలు...అన్ని ఇచ్చింది.....మళ్ళి హోమాలు, ఙ్ఞాలు, యాగాలు మొదలు అయ్యాయి....

ఎంటి నీరసపడిపొయిన బ్రహ్మాండం అంతా మళ్ళీ చిగురించుకుంది అని దుర్గముడు ఆలోచన చెయ్యగా.....అమ్మ అందరికి అన్నం పెడ్తోంది అని దుర్గముడుకి తెలిసింది...అప్పుడు అమ్మ ఆ రాక్షసుడితో యుద్ధం చెయ్యలెదు..ముందు అందరికి రక్షణ చక్రం వేసి... .అప్పుడు పదకొండు రోజులు యుద్ధం చేసి...దుర్గముడి కన్నులు తీసి...అందరిని కాపాడుతు .....వేదములు తన లోనుండి...మళ్ళి ఆవిర్భావం అయ్యేటట్లు చేసి......దేవతలకు వాటి రక్షణ కార్యము అప్ప చెప్పింది ...అందుకే ఆ రక్షణ కవచం తో అమ్మ అందరిని కాపాడింది కనుక .....నవరాత్రుల్లో...అమ్మని మొదటి రోజున..." స్వర్ణకవచ అలంకృత" రూపములో పూజిస్తాము.



DASARA FESTIVAL AVATHARS - SRI BALATHRIPURA SUNDHARI DEVI - 02-10-2016


శరన్నవరాత్రుల ఉత్సవాల్లో రెండవ రోజు దుర్గమ్మ బాలాత్రిపురసుందరిగా దర్శనము ఇస్తుంది. అమ్మవారిని ఈనాడు బాల త్రిపుర సుందరి అలంకారంతో పూజిస్తారు. త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది.
త్రిపుర సుందరిదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షొడస విద్యకు ఈమే అధిష్టాన దేవత.కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు.
త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ, అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవిడేమో త్రిపుర సుందరి దేవి.....అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు...ఆది దంపతులు...వారి తత్వము కూడా అటువంటిది.
త్రిపుర సుందరి అంటే " మనలోని ముడు అవస్థలూ...జాగృత్త్ , స్వప్న , సుషుప్తి!
ఈ ముడు అవస్థలు ...లేద పురములకు బాల అధిష్ఠాన దేవత! 
ఈ ముడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింప చేస్తు ...."బాలగా.."....అమ్మవారు వినొదిస్తుంది. మానవుడు ఎన్ని జన్మలు ఎత్తినా సరే..
, ఈ ముడు అవస్థలులోనే తిరుగుతు ఉంటాడు. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.
అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది....ఆవిడ ఆత్మ స్వరూపురాలు....ఆవిడను పూజిస్తే....ఙ్ఞానము కలిగి .. ...తానె శివ స్వరూపము తో...చైతన్యము ప్రసాదించి...మోక్షమునకు...అనగా పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది...ఈ కరుణా మయి..
సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపుర సుందరిదేవి భక్తుల పూజలు అందుకుంటోంది. 
ఈ రోజు రెండు నుండి పది సంవత్సరములు లోపు కలిగిన బాలికలను అమ్మవారి స్వరూపముగా పూజ చేసి కొత్త బట్టలు పెట్టాలి. 

శ్రీ మాత్రే నమః


DASARA FESTIVAL AVATHARS - SRI GAYATHRI DEVI - 03-10-2016


విజయవాడ లో అమ్మవారు మూడవ రోజున గాయత్రి దేవిగా దర్శనము ఇస్తుంది.
సకల వేద స్వరూపం గాయత్రి దేవి ! భారత దేశములో వేద కాలం నుండి ఆసేతు హిమాచల పర్యంతం, ఉపాశ్యా దైవం శ్రీ గాయత్రి పరదేవత. అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ తల్లి ! ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖములతో , శంఖం ,చక్రం, గద, అంకుశం ధరించి దర్శన్మిస్తుంది. ఆది శంకరులు గాయత్రి దేవిని అనంత శక్తి స్వరూపిణి గా అర్చించారు.
ప్రాతః కాలంలో గాయత్రిగాను, మధ్యాన్న కాలంలో సావిత్రి గాను ఈమే ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది.
ఈమే వేదాలకు తల్లి కనుక వేదమాత అని, జగదంబికా అని, సర్వజనులకు సృష్టి, స్తిథి , సమ్హార కర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను గాయత్రి పరదేవతకు అవయవాలుగా వర్ణించారు. శృతి గాయత్రి స్వరూపాన్ని " అగ్నిర్ముఖం, బ్రహ్మ శిరః, విష్ణు హృదయం, రుద్రశికః" అని చిత్రించింది. ముఖం లో అగ్ని, శిరస్సు లో బ్రహ్మ , హృదయంలో విష్ణువు , శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.ఇట్టి మహిమాన్వితమైన , సర్వొత్కృష్టమైన దేవతను బ్రహ్మాది దేవతా శ్రేష్టులు, వేదాధిష్ఠాన దేవతలైన పురుషులను, ఈ అమ్మను త్రికాల సంధ్యలలో భక్తి తో ఉపాసిస్తు ఉంటారు అని చెప్తోంది దేవి భాగవతం.
గాయత్రి...అంటే ....ప్రాణ శక్తిని రక్షించేది...
లలిత సహస్రనామ స్తోత్రం లో.."గాయత్రి వ్యాహౄతి సంధ్యా నిజబృంద నిషేవితా..." 
గాయత్రి అనగానే అందరు గాయత్రి మంత్రము అని అనుకుంటారు కాని అది శాస్త్రము పైన ఎక్కువ అవగాహన లేని వారి మాట...
అస్సలు గాయత్రి అంటే...సంధ్యా సమయములో ఆరధించే శక్తి పేరు గాయత్రి.....శాస్త్రం ప్రకారం సంధ్యా సమయములో మనము ఆరాధించే శక్తి పేరు గాయత్రి..ఇది ఇక్కడ ప్రధానము...శాస్త్రము ప్రతిపాదించిన జగదంబ శక్తిని త్రిసంధ్యలలో ఉపాసన చేస్తే అదే గాయత్రి !
అస్సలు మనము సంధ్యా సమయములో ఏ మంత్రము పఠిస్తే అదే గాయత్రి అవుతుంది...మంత్రోపదేశం జరిగిన వారు సంధ్యవేళలో ఆ మంత్రాన్ని జపిస్తే అదే గాయత్రి...మంత్రోపదేశం జరగని వారు....ఎదైన స్తోత్రము లలితా సహస్రనామం అలాంటివి చదివినా గాయత్రి అవుతుంది..అలాగ త్రిసంధ్యలలో చెయ్యాలి...అలాగే ఉపనయనం అయిన వారు తప్పనసరిగా గాయత్రి జపం త్రిసంధ్యలలో చేసి తీరాలి...

ఈ గాయత్రి మంత్రము మూడుపాదాలకు కలదై , ఇరవై నాలుగు అక్షరాలతో, ఇరవై నాలుగు తత్వాలకు సంకేతముగా భాసిస్తు జపధ్యానాదులతో తనని స్మరించే వారిని రక్షిస్తోంది.
గాయత్రి మంత్రంలోని మొదటి పాదం ఋగ్వేదం నుండి, రెండో పాదం యజుఋవేదం నుండి, మూడవ పాదం సామవేదం నుండి గ్రహించబడి ' ఓం ' కారంలోని అకార, ఉకార, మకారములకు ప్రతిరూపముగా భాసిస్తున్నాయి.
గాయత్రి అంటే ఙ్ఞానస్వరూపిణి....ఆవిడ వేద మాత.......విద్ అనే ధాతువు నుండి వేదము అనే శబ్దము వచ్చింది...అంటే ఙ్ఞానరూపిణి అయిన అమ్మవారిని ఆరధన చేస్తాము..గాయత్రి ఉపాసన లో ...మన శ్వాస తో ఆ మంత్రాన్ని ఉపాసించడం...అంటే మనలోని ప్రాణ శక్తిని ఉపాసన చెయ్యడము...సూర్యుడి మండలం లో శక్తిని ధ్యానిస్తు సాధన చెయ్యాలి..అదే గాయత్రి అవుతుంది..మౌనముగా జపించుకోవాలి ఇలాంటి మంత్రాలు...సబ్ద మంత్రాన్ని మౌనముగా జపిస్తేనె దాని ఫలితము...
ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది . సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి.
బ్రహ్మ ఙ్ఞానము కలుగుతుంది. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజొవంతం అవుతుంది. 
గాయత్రీ మంత్ర జపం చతుర్వేద పారయణ ఫలితాన్ని ఇస్తుంది.

DASARA FESTIVAL AVATHARS - SRI ANNAPURNA DEVI - 04-10-2016



రెపటి రోజున విజయవాడ ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ మనకి అన్నపుర్ణాదేవిగా దర్శనం ఇస్తుంది.

పరమశాంతి స్వరూపిణిగా చిరు మందహాసంతో, ప్రశాంతతను కలిగించే ఆ దుర్గమ్మను ఒక్కసారి దర్శించి మనం మనసారా ధ్యానిస్తే చాలు, ఎన్నో జన్మల పాపాల నుండి మనకి విముక్తి లభిస్తుంది.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, వేద వేదాంత వనవాసినీ అయిన శ్రీ కనకదుర్గా అవతారమునకు పూర్వం జగన్మాత శాకాంబరీ దేవిగా అవతరించిందని దేవి భాగవతం, మార్కండేయ పురాణం, దుర్గా సప్తశతి పురాణాలలో విశేషంగా చెప్పబడింది.
శాకాంబరీ అంటే వివిధ శాకములనే ( అనగా రకరకాల కూరగాయలు మరియు ఆకు కూరలు) వస్త్రాభరణాలుగా ధరించిన తల్లి అని అర్ధం.
పూర్వం భూలోకంలో వర్షాలు లేక పంటలు పండక అనావృష్టి సంభవించింది. తాగడానికి చుక్క నీరు దొరకక ప్రజలు అల్లాడురున్న సమయంలో వారి బాధలను చూడలేని మునీశ్వరులు జగన్మాతను అనేక విధాలుగా స్తుతించగా, వారి కోరిక మేరకు జగదీశ్వరీ " ఓ మునులారా..నేను అయోనిజనై అవతరించి, నూరు కన్నులతో చల్లని చూపులు ప్రసరిస్తూ..ముల్లోకాలను కాపాడుతాను. అప్పుడు ఈ చరాచర సృష్టిలోని జనులు నన్ను " శతాక్షి దేవిగా" కొల్చుకుంటారు.
ఆ విధంగా నేను " శతాక్షి దేవిగా" కీర్తించబడుతాను. ఆ తరువాత నాదేహం నుండి శాకములను పుట్టించి, ప్రజల ఆకలిని తీరిస్తూ, మరలా వర్షాలు కురిపిస్తూ జగతిని సస్యశ్యామలంగా, సుభీక్షముగా మార్చి కాపాడుతాను" అని జగదంబ అభయమిచ్చింది.
దేవి యొక్క దేహాన్ని శాకములుగా మార్చింది. కనుక ఆ తల్లి "శాకంబరీ" నామంతో కీర్తి పొందింది.
లోక కల్యాణార్ధం ఆదిశక్తిగా, అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణగా, శాకములను ( కాయగూరలను) ప్రసాదించే జగమునేలే ఆ జగన్మాతకే చెల్లింది.
శాకంబరీగా అవతరించిన తరువాత విశ్వకల్యాణార్ధం దుర్గముడు అనే రాక్షసుణ్ణి వధించడం వలన నేను " దుర్గా దేవిగా" మహిషాసురుణ్ణి సమ్హరించాక ఆ దుర్గా దేవి కీలుడి కిచ్చిన మాట ప్రకారం మహిషాసుర మర్ధినీ స్వరూపంతో ఇంద్ర కీలద్రి పై ఆవిర్భవించింది. 
నీలమేఘ శ్యామంతో సుమనోహరంగా సర్వాంగ సుందరంగా అభయ, వరద హస్తంతో చిరుమందహాసంతో శోభిల్లుతూ పద్మంలో ఆశీనురాలై వివిధ ఫలపుష్పాదులతో పాటు, కూరగాయల సమూదాయాన్ని ధరించి అఖిల లోకాశ్చర్యమైన సౌందర్యంతో కోరిన వారికి కొంగు బంగారంగా, జీవుడికి ఆకలి, దప్పిక తీర్చే సకల సంపదలకూ మూలమైన శక్తులు ఆ చల్లని తల్లి కనుసైగల్లోనే సంచరిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి.
అందుకే శాకంబరీ దేవికి అంత విశిష్టత ఏర్పడింది.

DASARA FESTIVAL AVATHARS - SRI KATYAYANI DEVI - 05-10-2016


నవరత్రుల ఉత్సవాలలో రేపు దుర్గమ్మ ఆరవరూపంగా 'కాత్యాయని' రూపములొ దర్శనం ఇస్తుంది.
అమ్మవారి ఈ రూపాన్ని తలంచుకుని నమస్కరించినంత మాత్రన్న, వెంటనే కటాక్షిస్తుంది, త్వరగ ప్రసన్నురాలై కరుణించే తల్లి.
'కత' నామకుడైన మహర్షి కుమారుడు కాత్య మహర్షి . ఈ మహర్షి పేరునే కాత్య గోత్రము ప్రసిద్ది చెందినది . ఆ కాత్యగోత్రజుడైన కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించిందని , అందువల్ల ఈమే కాత్యాయనిగా పేరుగాంచిందని ఒక ప్రతీతి .
ఒకానొక సమయంలో మహిషాసురుడనే రాక్షసుడు బలగర్వంతో ముల్లోకాలను బాధిస్తుండగా , అతని పోరు తో వేసారినట్టి దేవతలు మరియు మునులు కలిసి వానిదుశ్చర్యలను బ్రహ్మదేవునికి విన్నవించుకోగా బ్రహ్మ వారందరినీ వెంటబెట్టుకొని హరిహరులున్న చోటకు వచ్చి శరణువేడి ప్రార్థించాడు . అప్పుడు హరిహరులు ముఖప్రదేశాలనుంచి కోటి సుర్యకాంతులతో గొప్ప తేజస్సు వెలువడింది . దేవతలంత తమతమ దివ్యశక్తులను ఆ తేజస్సు నందు ఆవహింపజేశారు . ఆ మహాతేజస్సు స్త్రీ ఆకృతిపొంది మహాశక్తిగా అవతారం చెందింది .
ఆ మహాశక్తి మొదట కాత్యాయన మహర్షిచేత పూజలందుకొని సప్తమి , అష్టమి , నవమి దినాలలో ఆ మహర్షి ఇంట నిలిచి దశమినాడు లోకకంటకుడైన మహిషాసురుని సంహరించింది . కాత్యాయన మహర్షి ఇంట వేలసినందుకు ఈమె కాత్యాయనిగా ప్రసిద్ది పొందింది .
కాత్యాయని రూపం దేదీప్యమానం . ఈమె దేహకాంతి బంగారు ఛాయతో తళతళలాడుతుంటుంది . ఈమె చతుర్భుజి , నాలుగు చేతులు కలిగి ఉంటుంది. ఇరుచేతులయందు వరదాభయ ముద్రలు కలిగి ,ఇరు చేతులలో ఒకచేత ఖడ్గం ,ఒకచేత పద్మం ధరించి శోభిల్లు తుంటుంది .
కాత్యాయనీ వ్రతం అమోఘఫలదాయకం . కోరిన వరుని భర్తగా పొందటానికి అవివహితులైన నవయువతులు ఈ కాత్యాయని మాతను పూజించి వ్రతాన్ని చేయడం పురాణకాలం నుంచి వస్తున్న సంప్రదాయం .
ఈ దేవి శార్దూల వాహన . శరన్నవరాత్రుల్లో ఆరవరోజైన షష్ఠి రోజున ఉత్సవముర్తిగా ఈ కాత్యాయని దేవిని అలంకరిస్తారు .
పరిపూర్ణ విశ్వాసంతో ఉపాసించిన వారికి ఈ మాత సులభంగా ప్రసన్నమౌతుంది . ఈ దేవిని పుజించేవారికి రోగభయంగాని , శత్రుభయంగాని , సంతాపంగాని ఉండదు . సమస్త విధాలుగా ఈ తల్లీని శరణుజొచ్చిన వారికి కోటి జన్మాల పాపాలను కూడా నశింపజేస్తుంది .

DASARA FESTIVAL AVATHARS - SRI LALITHA THRIPURA SUNDARI DEVI - 06-10-2016


ఇంద్రకీలాద్రి పై అమ్మవారు రేపటి రోజున లలిత త్రిపుర సుందరి దేవి గ దర్శనం ఇస్తుంది.

“ ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశమ్ ఆకర్ణదీర్ఘ నయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్ ‘’

త్రిపురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టానదేవతగా లలిత త్రిపురసుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీ దేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దార్రిద్య దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వర్యాభీష్టాలను ఈమె సిద్ధింపజేస్తుంది. ఈమె శ్రీవిద్యా స్వరూపిణి. సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు (ముతైదువలు) ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈనాడు అమ్మవారిని యధా శక్తితో పూజించి, కుంకుమార్చన చెయ్యాలి మరియు లలితా అష్టోత్తరంతో పూజించాలి. మాంగల్యభాగ్యం కోరుతూ సువాసినులను పూజ చెయ్యాలి. శ్రీమాత్రే నమః


DASARA FESTIVAL AVATHARS - SRI SARASWATHI DEVI - 08-10-2016


“ ఘంటాశూల హలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జెర్దధతీం ఘనాంత విలసచ్ఛీతాంశు తుల్య ప్రభామ్ గౌరీదేహ సముద్ఛవాం త్రిజగతామాధారాభూతాం మాహా పూర్వా మత్ర సరస్వతీ మనుభజే శుంభాది దైత్యార్దినీమ్”

శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది. చదువుల తల్లి సరస్వతీ రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయ ముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు మొదలైన లోకోత్తర చరిత్రులకు ఈమె వాగ్వైభవాన్ని వరంగా ఇచ్చింది. ఈమెను కొలిస్తే విద్యార్థులకు చక్కని బుద్ధి వికాసం జరుగుతుంది. త్రిశక్తి స్వరూపాల్లో ఈమె మూడో శక్తిరూపం. సంగీత,సాహిత్యాలకు అధిష్టాన దేవత. సకల జీవుల జిహ్మాగ్రంపై ఈమె నివాసం ఉంటుంది.

DASARA FESTIVAL AVATHARS - SRI DURGA DEVI - 09-10-2016


శ్రీ దుర్గా దేవి:

“ విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిః కరవాలఖేట విలద్దస్తా భిరాసేవితాం ! హసైశ్చక్రగదాసిఖేట విసిఖాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే ‘’

దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుడ్ని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడ్ని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు ఈ అమ్మనామాన్ని జపిస్తే తొలగిపోతాయి. ఆరాధకులకు ఈమె శీఘ్ర అనుగ్రహకారిణి. ఎర్రనిబట్టలు పెట్టి ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణ చెయ్యాలి. “ ఓం దుం దుర్గాయైనమః ‘’ అనే మంత్రం పఠించాలి. పులగాన్నం నివేదన చెయ్యాలి. దుర్గా, లలిత అష్టోత్తరాలుపఠించాలి.


YOU DIDN'T BOUGHT YOUR NOSE AND EARS FOR SURGERY POOR SURPANAKA


UNBELIEVABLE FACTS ABOUT HUMAN BODY


మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు:

* మన కడుపులో ఉండే ఆమ్లము (acid) రేజర్ బ్లేడ్ లను కూడా కరిగించగలదు.

* మనం రోజుకి సగటున 40 నుండి 100 వెంట్రుకలు కోల్పోతున్నాం.

* మన ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి.

తర్వాత అవి రాలిపోయి వాటి స్థానంలో వేరేవి పెరుగుతాయి

* ఒక్క అంగుళం చర్మం మీద 3 కోట్లకు పైగా బాక్టీరియా ఉంటుంది.

* రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఓ సాధారణ ట్రక్ ని 30 కిలో మీటర్ల వరకు నడిపించవచ్చు.

* లేవకుండా ఒక మనిషి నిద్రించిన రికార్డు 11 రోజులు.

* 90 శాతం కి పైగా జబ్బులు స్ట్రెస్ వల్లనే అని తేలింది.

* శరీరం నుండి తల వేరు చేసినా.. తల 15 సెకన్ల వరకు స్పృహ కోల్పోదు.

* మీరు పడుకునే గది ఎంత చల్లగా ఉంటె... మీకు పీడ కలలు వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి.

* నిద్రించే సమయంలో మన వాసనా పీల్చే భావం పనిచేయదు.

* మనవ శరీరం లో ఉన్న DNA మరియు అరటిపండులో ఉన్న DNA 50 శాతం కలుస్తాయి.

* మనం తిన్నది అరగడానికి మన శరీరంలో ఏవైతే సహాయ పడతాయో... చనిపోయిన 3 రోజులకి అవే మనల్ని తినడం మొదలపెడతాయి.

* గుండె పోటు వల్ల చనిపోయే వారిలో 20 శాతం మంది సోమవారం నాడే చనిపోతారు.

* 7 గంటల కన్నా తక్కువ నిద్రిస్తే.. త్వరగా చనిపోతారు.

* వెలి ముద్రలు ఉన్నట్టే.. నాలుక ముద్రలు కూడా ఒకరితో ఒకరికి పోలిక లేకుండా ఉంటాయి.

* ఒకవేళ మన కళ్ళు కెమెరా అయితే.. 576 మెగా పిక్సెల్స్ ఉన్న కెమెరాలా ఉండేది.

* మనిషి కన్నుని తయ్యారుచేయాలంటే కొన్ని లక్షల కోట్లు కర్చవుతుందట.

* మన నోరు 100 కోట్లకు పైగా రుచులను గుర్తించగలదు.

* మీకు 60 ఏళ్ళు వచ్చే సరికి నోటిలో ఉండే టేస్ట్ బడ్స్ సగానికి పైగా చనిపోతాయి.

* మీకు ఎంత ఎక్కువ IQ ఉంటె.. అన్ని కలలుగంటారు.

* మన కాళ్ళ గోర్లకన్నా చేతి గోర్లు 4 రెట్లు త్వరగా పెరుగుతాయి.

* చింపాంజీ శరీరం పై ఉన్నన్ని వెంట్రుకలే మన శరీరం పై కూడా ఉంటాయి. కాకపోతే మనవి చాలా సన్నగా ఉంటాయి.

* మన శరీరం 30 నిమిషాలలో ఉత్పత్తి చేసే వేడితో 114 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు.

* మన చర్మం నిమిషానికి 50000 సెల్స్ ని వదిలేస్తుంది. అంటే జీవిత కాలంలో అది 18 కిలోలనమాట.

* మీ బెడ్ పై ఉండే దుమ్ములో సగానికి పైగా మీ చర్మందే.

* మన బ్రెయిన్ 25 వాట్స్ విద్యుత్త్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ తో ఓ బుల్బ్ ని వెలిగించవచ్చు.

* మీకు 40 ఏళ్ళు వచ్చే వరకు మీరు ఎదుగుతూనే ఉంటారు.

* మన బ్రెయిన్ పగటి పూటకన్నా రాత్రి పూటనే చురుకుగా పనిచేస్తుంది.

* ఒక సంవత్సరంలో 15000 కలలుగంటారట.

* మీరు వింటున్న మ్యూజిక్ కి తగ్గట్టుగా మీ గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది.

FIRST TASTE - BLIND EYES - EXTRA CARE CARTOONS IN TELUGU




PICTORIAL RANGOLI ART


BRIEF INFORMATION ABOUT SRI PURUHUTIKA SHAKTHI PEETAM, Pithapuram (Andhra Pradesh)



అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన పురుహూతికా శక్తి పీఠం పిఠాపురం నందు కలదు . 
పురుహూతికా అమ్మవారి గుడి కుక్కుటేశ్వర స్వామి గుడిలో ఈశాన్యభాగంలో ఉంది.

పురుహూతికా అమ్మవారి గుడి చిన్నదైననూ అష్టాదశ శక్తిపీఠాల శిల్పాలు చెక్కపడి చాలా అందంగా ఉంటుంది. పురుహూతికా విగ్రహం నాలుగు చేతులు కలిగి ఉంటుంది.
ఆ నాలుగు చేతులలో విత్తనాల [బీజాలు] సంచి , గొడ్డలి [పరశువు], కమలం, మధుపాత్ర ఉంటాయి.
PURUHUTIKA DEVI, Pithapuram (Andhra Pradesh)
Pithapuram is formerly called as Pithikapuram / Pushkara kshetram in Puranas and Tantras.
The temple of Puruhutika devi is located within the temple campus of Kukkuteswara swamy.
Kukkuteswara swamy temple is present in the outskirts of the Pithapuram village towards Kakinada. It is a big temple. Just entering in to the temple we'll see a pond which is called as Padagaya sarovaram (Pada Gaya Sarovar). Pilgrims will take holy bath in this pond. Main temple of Kukkuteswara swamy is present towards the right side of the pond. Puruhutika devi temple is present in the North-East corner of the Kukkuteswara swamy temple. It is constructed facing South. Puruhutha temple is small but looks very nice with the carvings of Ashtadasa Shakti peethas on it's walls.
Idol of Puruhutika devi
The idol of Puruhuthika devi has four hands. They contain bag of seeds (Beeja), axe (Parashu), lotus (Kamala) and a dish (Madhu patra) from lower-right to lower-left in order.
Previously there were two sects of Upasakas in Pithapuram worshiping Puruhootika devi. The first one calling her as Puruhootha Lakshmi (Meditating on Kamala and Madhu patra) and worshiping in Samayachara and the second one calling her Puruhoothamba (Meditating on Parashu and Beeja) and worshiping in Vamachara. There is also a tale that the original statue of Puruhutika devi was buried under the temple which was worshiped by them.
History: Once Indra has cheated Ahalya (wife of Gautama maharshi) in the form of Gautama and was cursed by the Maharshi. Indra lost his testes and got the symbols of Yoni all over his body. He felt very sad and prąyed Gautama a lot. Finally the Rishi accepted and told that the Yoni symbols will look like eyes, so that Indra will be called as Sahasraksha there after. But Indra lost his testes. He wanted to regain them. He left his kingdome, came to Piithika puri and did Tapasya for Jaganmata. After a long time Jaganmata appeared before him and blessed him with wealth and testes. Indra was very happy and prąyed her as Puruhutika devi (One who was worshiped by Indra).
After a very long time Jagadguru Sripada vallabha took birth in Pithapuram. He too worshiped Puruhutika devi and realized his self. He is an incarnation of Dattatreya.


STOP ONE HUNDRED LESS MY DEAR SON



GODDESS SRI KANAKA DURGA DEVI - DASARA FESTIVAL SPECIAL TELUGU ARTICLE


DASARA FESTIVAL ARTICLE - GODDESS ANNAPURNA DEVI


DASARA FESTIVAL CREATIVE SIMPLE MUGGULU




FESTIVAL LIGHTS DESIGNER KOLAM ART